కేయురాణి న భూషయంతి పురుషం, హారాన చంద్రోజ్జ్వలా,
న స్నానం, న విలేపనం, న కుసుమం, నాలంకృతా ముర్ధజా,
వాణ్యేకా సమలంకరోతి పురుషం, యా సంస్కృతాధార్యతే,
క్షీయంతే ఖిల భూషణాని సతతం, వాగ్భూషణం భూషణం,
భర్తృహరి చెప్పిన సుభాషితం ఇది. ఎంత చక్కగా చెప్పాడో చూసారా? ఒక వ్యక్తికీ
చంద్రుని కాంతి, అంటే వెన్నెలతో సమానమైనటువంటి బంగారు ఆభరణాలు, స్నానం
చేసి, ఒంటికి లేపనాలు పూసుకోవటం, శిరోజాలు చక్కగా దువ్వుకొని పూవులు
ముడుచుకోవడం ఇటువంటి వన్నీ అలంకరణలు కావు, ఇవన్ని కొద్ది రోజులలో నశించేవే,
కానీ శాశ్వతమైన భూషణం, సంస్కారం కలిగిన మాట ఒక్కటే అని ఈ సుభాషితం యొక్క
అర్ధం.
ఇది దాదాపుగా మనం అందరం చిన్నతనంలో చదువుకొన్న పద్యమే.
కానీ దీనిని ఆచరించడమే కష్టం. ఒక మనిషిని చూడగానే అతని వస్త్రాలంకరణ, అతని
బాడీ లాంగ్వేజ్ చూసి మనం మొట్టమొదట ఒక అభిప్రాయం ఏర్పరచుకొన్నా, అతని మాట ,
పలకరింపు వినగానే అతని యొక్క వ్యక్తిత్వాన్ని అంచనా వెయగలము. అంటే మన మిద
ఎదుటివారికి ఒక అభిప్రాయాన్ని కలిగించేది మాట.. ..
కొంతమంది
ఉంటారు.ఒకటే చెప్పిందే చెప్పి మన తలకాయలు తినేస్తారు. కానీ అందులో విషయం
ఉండదు. ఇంకొంతమంది మాట్లాడితే ఆత్మస్తుతి, పరనింద తప్ప వేరే పనికొచ్చే
విషయం ఉండదు. మన గొప్ప అవతలి వాళ్ళు చెప్పుకోవాలి కానీ, మనమే చెప్పుకుంటే
బాగోదు కదా. అలాగే, ఎదుటి వారిలోనూ, మంచి, చెడు రెండూ ఉంటాయి. చెడు గురించి
చెప్పుకోవచ్చు కానీ, అదేపనిగా వారిలోని చెడు గుణాలే చెప్తూ పోతే
వినేవాళ్ళకి కూడా విసుగు పుడుతుంది.
కొంత మంది మనం ఒక విషయం
మాట్లాడుతుంటే, వాళ్ళు వేరే టాపిక్ తెస్తారు.మధ్యలో. వింటున్న వాళ్ళకి ఎ
టాపిక్ మిద స్పందించాలో తెలియకుండా. ఇది కూడా మంచి పధ్ధతి కాదు. అలాగే
కొంతమంది స్నేహితులు కానీ, బంధువులు కానీ కలిసినపుడు అక్కడ లేని వాళ్ళ
గురించి మాట్లాడుకోవడం కూడా చాల హేయమైన విషయం. అలాగే పిల్లల గురించి, భార్య
/ భర్త గురించి గొప్పలు చెప్పుకోవటం కూడా నలుగురిలో విమర్సలకు తావిచ్చే
విషయం.
ఇంకా కొంతమంది ఏదైనా పెళ్ళిళ్ళు , పేరంటలలో ఆందరూ
కలిసినపుడు ఎవరో ఒకరిని కానీ, ఆ ఫంక్షన్ లో జరుగుతున్న కార్యక్రమాల గురించి
కానీ ఒకటే విమర్శిస్తూ ఉంటారు. వారు తమ ఉనికిని తెలుపుకొవటానికి అలా
చేస్తుంటారు. కానీ అది ఇవతలి వాళ్ళకి ఎంత irritation గ ఉంటుందో గ్రహించరు.
కొంతమందికి నలుగురిలో ఉన్నపుడు అవతలివారిని చిన్నబుచ్చడం, లోకువగా
మాట్లాడడం సరదా. వారు స్నేహితులైనా, బంధువులైనా అంతే. ముఖ్యంగా ఆస్తి,
అంతస్తు విషయాలలో, పిల్లల చదువులు , ఉద్యోగాల విషయాలలో ఇటువంటివి
జరుగుతుంటాయి. కానీ వారు గమనించుకొనిది ఒక్కటే. నలుగురిలో ఉన్నపుడు ఆందరూ
వారి మాటలు విని సమర్ధించినా, తరువాత వారితో మాట్లాడడానికి ఇష్టపడరు.
మనం మాట్లాడుతున్నాము అంటే వినేవాళ్ళకి వినసొంపుగా వుండాలి. మళ్లీ మళ్లీ
మాట్లాడాలి అని వారు అనుకోవాలి. మరి బిగ్గరగా కాకుండా, మరి మెల్లగా కాకుండా
ఒక నిర్దిష్టమైన స్వరంలో మాట్లాడాలి. అలాగే ఎదుటివారికి చక్కగా
అర్ధమయ్యేలా మరి స్పీడుగా కాకుండా, మరి నెమ్మదిగా కాకుండా, క్రమ పద్ధతిలో
మాట్లాడాలి. మనం మాట్లాడే విషయం అందరికి ఆమోదయోగ్యంగా ఉండాలి. సూటిగా,
స్పష్టంగా ఉండాలి. మన మాటల్లో పరుష పదాలు కానీ, పరుష వాక్యాలు కానీ
దొరలకూడదు. మన మాటలు అవతలి వారిని ఎట్టి పరిస్తితులలొను నొప్పించకూడదు.
కాలు జారితే తీసుకోగలము కానీ, మాట జారితే తీసుకోలేము అని ఉరికే అన్నారా?
శరీరానికి నొప్పి కలిగితే మందు వేయొచ్చు. కానీ, మాట వల్ల మనసు
విరిగిపోతుంది. అటువంటి మనసు నొప్పించె మాటలు ఎప్పుడు మాట్లాడకూడదు. మన
గురించి, మన మాట గురించి ఆందరూ సంతోషంగా చెప్పుకోవాలి.
ఈ
సృష్టిలో భగవంతుడు సకల ప్రాణికోటి లోను మనిషికి మాత్రమే మాట్లాడే శక్తిని
ఇచ్చాడు. అలాగే ఆలోచించే మెదడు కూడా మనకే ఇచ్చాడు. స్పందించే మనసును కూడా
ఇచ్చాడు. మనం ఏమి మాట్లాడాలో ఏమి మాట్లాడ కూడదో మెదడుతో అలోచించి , మనసుతో
స్పందించి, మన మాటను సద్వినియోగం చేసుకుందాము.