Monday 14 September 2015

విదురనీతి 44

కొన్నిసార్లు తను నమ్మిన విలువలకి భిన్నమైన పనులు చేయాల్సిరావడము అనివార్యమవుతుంది. మనిషి ఆశించినది ఆశించినట్లుగా జరగదు. తాను చేయాలనుకున్న పనులకి భిన్నమైన పని చేయాల్సివస్తుంది. ప్రతిచోట తను తలచిన విషయాన్ని ఆమోదించే సమ్యమనం సమాజానికి కానీ, మనుషులకు కానీ ఉండకపోయే సందర్భాలుంటాయి. అయితే ఇతరులకు అపకారం జరగనంతవరకు తను నమ్మిన పనిని చేయడం తప్పుకాదు.  ఎదుటివారికి సత్యాల్ని విశదం చెత్యలేకున్నా తన ఆత్మ ముందు తను నిజాయితీగా ఉంటే మంచిది. ఇతరులకు సాద్యమైనంత ఎక్కువ ఉపకారం, తక్కువ అపకారం జరిగే విధంగా మన పనులు ఉండాలి. అంతరాత్మ సాక్షిగా వ్యవహరించేందుకు ప్రయత్నించాలి. ఎందుకంటే ఒక మనిషికి దీక్షాదక్షతలతో పాటు నిజాయితీగా ఉండటం, అవిశ్రాంతంగా పరిశ్రమించడమే ప్రధానం.

మనోనిగ్రహమూ, సయ్తపరాయణత్వమూ, ధర్మపాలన నిరతీ, జీవితానికి అవశ్యమైనవి అని నేను విన్నాను. పురుషుడు హృదయకవాటం తెరచి ధైర్యంగా ప్రియాప్రియాలను సమదృష్టితో చూదగలగాలి. ఇతరులు నిందించినా తిరిగి నిందించకూడదు. అందువలన ఎదుటివారి క్రోధం వారినే హరిస్తుంది. ఆ క్రోధం వారి పుణ్యాన్ని కూడా నశింపచస్తుంది. పరులను అవమానించరాదు. మనను గురించి ఎవరైనా పరుషంగా భాషిస్తూంటే అకారణంగా మనను నిందిస్తుంటే వాడు మన పుణ్యఫలాన్ని పెంపొందిస్తున్నాడని సంతోషించాలి. వాస్త్రం ఏరంగు నీటిలో ముంచబడితే ఆ రంగునే పొందుతుంది. అదే విధంగా సజ్జనుడైన వానిని దుర్జనుడు సేవిచి సజ్జనుడౌతాడు. మహాతపస్వి అయి ఉండి కూడా చోరునీ, మూర్ఖుని సేవిస్తే ఆ తపస్వి కూడా మూరుఖుడే అవుతాదు. పరిసరాలు, పరిజనులూ తమ ప్రభావాన్ని ప్రసరింపచేస్తూంటారు.

ఇతర్ల విషయంలో పరుష ప్రసంగాలు చెయ్యనివాడు, ఇతరులచేత అవమానితుడై కూడా ప్రతీకారాన్ని తలపెట్టనివాడూ, ఏ అవమానమూ పొందికూడా ఇతరులపై ప్రతీకారచర్యలకు ఆలోచించనివాడూ, స్వర్గానికి వస్తున్నప్పుడు దేవతలు వానికి స్వాగతం పలుదుతారు. మౌనం కంటే సత్ధర్మం ఇంకొకటి లేదు. ప్రియభాషణం ద్వితీయ స్థానము. సత్యంతో పాట్ అది ప్రియంగా ఉంటే, ధర్మసమ్మతం అయితే, ఆ వాక్కు సర్వవిధాలా ఉత్తమమైనది.

(ఇంకా ఉంది )

విదురనీతి 40
మన ప్రతి ఆలోచనా, ప్రతి చర్యా స్వార్ధంతో కూడుకున్నది. "నేను", మీద ఆధారపడి ఉంటున్నాం. కాబట్టే హింస లేకుండా జీవించలేకపోతున్నాం. స్వార్ధరహితంగా ఆలోచించినప్పుడే హింసలేకుండా చేసుకోగలం.
స్వార్ధం ఉండడం మంచిదే కాని అది పరిమితి మించకూడదు. పరిమితి మించిన స్వార్ధం హిన్సకు దారితీస్తుంది. స్వార్ధం లేకపోతే జీవితం ప్రశాంతంగా గడుస్తుంది.
దయ అంటే శత్రువునైనా ఆపదలఒ ఉంటే కాపాడటం, క్షాంతి: అంటే ఎవడైనా తనకు దు:ఖం కలిగిస్తే, మనసులో గాని, బయటగాని వాడిపై కోపం లేకుండా ఉండటం.
గుణవంతుల గుణాలను వెల్లడి చేయకుండా ఉండాటం అసూయ. శౌచం అంటే పతితుల సొమ్మును గ్రహించకుండా ఉండటం, తిన తగని పదార్ధాలను తినకుండా ఉండటం.
శరీరాన్ని అలసటకు గురిచేసే తప్పుడు పనులకు దూరంగా ఉండటం, అనాయాసమైఅతే, నింధించబడే పనులను విడచి ప్రశస్తమైన పనులు చెయ్యటం మంగళదాయకం.
మనలో చాలామంది ఎవరికి వాళ్ళమే అధికులమనే అహంకారంతో ఉంటారు. ఈ అహంకారం వలన ఏ కార్యమూ సానుకూలంగా జరగదు. కార్యం సానుకూలమవ్వాలంటే ప్రతివ్యక్తీ ముఖ్యంగా వినయం, విధేయత అలవరచుకోవాలి.
(ఇంకా ఉంది )
విదుర నీతి 39
అన్నం జీవనాధారం. దేహానికి, శరీర మనుగడకు ముఖ్యమైన, ప్రాథమికమైన, ప్రముఖమైన ఇంధనం. మానవుడు జీవించాలంటే ఆహారం కావలి. ఆహారం ద్వారా మాత్రమే శరీరం శక్తివంతమౌతుంది. తేజోవంతమఔతుంది. శరీరం ఆరోగ్యంగా, బలంగా ఉండాఅలంటే సరిపోయే తగు ఆహారము లభించాలి. దేహం బలిష్టంగా ఉంటేనే ధర్మకార్యాలు చేయగలుగుతాము. చతుర్విధ పురుషార్ధాలు సాధించగలుగుతాము. ఆ దర్మకార్యాలతోనే స్వయం సమృధ్ధినీ, అభివృధ్ధిని, సమాజ పురోభివృధ్ధినీ ప్రోత్సహించగలుగుతాము. అందుకే అన్నం అత్యంత ప్రధానమైనది. అన్నముంటేనే దేహముంటుంది. దేహముంటేనే ధర్మసాధన సాధ్యమౌతుంది.
కోరిక దుర్వినియోగానికైతే అది రాక్షసమౌతుంది. సద్వినియౌగ నిమిత్తమైనది దైవికమైన కోరిక అవుతుంది. దేహాన్నినిలబెట్టుకునేందుకు ఆహార పానీయాలు స్వీకరించాలన్న కోరిక ఉండాలి. అది దైవసంభవమైనది. కేవలం జిహ్వచాపల్యం కోసం ఆహారపానేఅయల మీదకు మనస్సు పోనీయరాదు.
అధికముగా భుజించు వానికి, బొత్తిగా బుజింపని వానికి అట్లే అధికముగ నిద్రించువానికి, ఎల్లప్పుడూ మేలుకొని ఉండువానికి మేలు కలుగదు. అధికముగా భోజనం చేస్తే శరీరం మత్తుగా ఉంటుంది. నిద్ర ఆవహిస్తుంది. కడుపు బరువుగా ఉంటుంది. దేహ భావనను వదిలిపెట్టడం అసాధ్యమవుతుంది. అదే విధంగా పూర్తిగా ఆహారం మానేసిన పక్షంలో శరీరం బలహీనమై, క్షీణీంచిపోతుంది. అప్పుడు దేనిమీదా ఏకాగ్రత కుదరదు.
(ఇంకా ఉంది )
విదురనీతి 38
అతిథిసేవ:
అతిథి అనగా తిథి, వార నియమాలు లేకుండా ఇంటికి వచ్చినవడు, అంటే ముందస్తు సమాచారం లేకుండా హఠాత్తుగా మన ఇంటికి వచ్చినవాడన్నమాట. అతిథిని దైవంగ భావించి సగౌరవంగా సేవించి సాగనంపడం భారతీయ సనాతన సంస్కృతిలో భాగం. ఇది పెద్దల ఆచరణ ద్వారా తరువాతి తరాలకు అందుతున్న సంస్కార భాగ్యం.
అతిథికి ఎదురువెళ్ళి స్వాగతం పలికి ఇంటిలోనికి తీసుకురావాలి. అభిమానం గౌరవం మేళవించి అతిథి యోగక్షేమాలు ప్రశ్నించాలి. కుటుంబ సభ్యులందరికీ అతిథిని పరిచయం చేసి పిల్లలచే మ్రొక్కించి వారి దీవెనలను స్వీకరింప చేయాలి. కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు అందించాలి. ఆ తరువాత సుఖాసీనుణ్ణి చేయాలి. ప్రయాణపు శ్రమ పోగొట్టాలి. చల్లని నీళ్ళు అందించి దాహం తీర్చాలి. అతిథికి స్నానం ఏర్పాట్లు చూడాలి. స్నానానంతరం అతిథికి ఏకాంతతను సమకూర్చాలి. ఆయన అధ్యాత్మిక భావనలకు తగు ఏకాంత వాతావరణం కల్పించాలి.
శక్తిమేరకు కాలానుగుణంగా దొరికే ఫలాలతో మధుర భక్ష్య భోజ్యాలతో అతిథికి అన్నం పెట్టాలి. ఇంటి ఇల్లాలు అన్నపూర్ణాదేవియై అతిథికి ఆప్యాయంగా వడ్డిస్తూ ఆదరంతో మెలగాలి. అతిథికి ఇష్టమైన పదార్థాలేవో గ్రహించి వడ్డించాలి. సన్యాసులకు మౌనంగాను, మిగిలినవారికి ఆహ్లాదకరమైన సంతోషదాయకమైన సంభాషణలతోనూ ఎలాంటి తర్క వితర్కాలకు తావివ్వని విధంగా భోజనం పెట్టాలి.
భోజనానంతరం శయ్యను ఏర్పాటు చేయాలి. కాస్సేపు సుఖనిద్ర పోనీయాలి. ఆ సమయంలో యజమాని కూడా భోజనం పూర్తి చేసుకొని వచ్చి అతిథి తమ ఇంటికి వచ్చిన పనేమిటో, తాను చేయగలిగిందేమిటో అడిగి తెలుసుకుని శక్త్యానుసారం అతిథి కోర్కెను తీర్చాలి. సంతుష్టుడై ఇల్లు వదిలివెళ్ళే అతిథి, ఆతిథ్యం ఇంచ్చిన ఇంట్లో పుట్టెడు భోగభాగ్యాలు వదిలివెళతాడని పెద్దల నమ్మకం.
(ఇంకా ఉంది)
విదురనీతి 42

విదురుడు ఇంకా ఇలా చెప్తున్నాడు

శుభకర్మల వల్ల లక్ష్మి ప్రభవించి, ధర్మంతో వర్ధిల్లి, చాతుర్యంలో  విస్తరించి సమ్యమనంతో సురక్షితమౌతుంది. బుధ్ధీ, కులీనతా, దమమూ, శాస్త్రజ్ఞానమూ, పరాక్రమమూ, మితభాషిత్వమూ, దానమూ, కృతజ్ఞతా అనే గుణాలు పురుషుని కీర్తిని వృధ్ధిపొందిస్తాయి. ఎదుటి వ్యక్తిని గౌరవించడం అన్నిటికంటే ఉత్తమమైన గుణం. సత్పురుష సాంగత్యంవలన ఈ గుణసంపదలు  లభిస్తాయి. తపో, యజ్ఞ, దాన అధ్యయనాదులు సజ్జన సాంగత్యమువలననే కలుగుతాయి. సజ్జనులు సత్యవ్రతంతో, మృదుస్వభావంతో, కోమల హృదయులై, ఇంద్రియ నిగ్రహంతో చరిస్తారు. ఉత్తములు దయ,క్షమ, నిర్లోభము, సత్యము ను అనుష్టిస్తారు. దాన హోమ పూజ ప్రాయశ్చిత్తాది ఇహలోక కర్మలను  నిర్వహించేవాడు పురోభివృధ్ధి గాంచుతాడు. వివాహము , స్నేహము,  వ్యవహారము, సమానులతోనే సాగించాలి. సద్గుణసంపన్నుల మార్గంలో పోయేవాడు నీతివంతుడు, శాస్త్రవిశారదుడవుతాడు.

క్రోధము, తొందరపాటు, పురుషార్ధం లేకపోవడము, అసత్యభాషణము, దు:ఖ కారణాలు. హితులక్షేమం కోసం యుధ్ధం చెయ్యనివాడూ, ఆదరించినవారి మీద కోపం చూపేవాడూ, వివేకం లేనివాడూ, పరులయందు దోషాలను చూసేవాడూ, దయలేనివాదూ, అధికంగా భాషించేవాడూ, ఈ విశ్వంలో పేరుప్రఖ్యాతులు పొందలేరు. వేషాడంబరం లేకుండా ఆత్మస్తుతి చేసుకోకుండా, కోపం వచ్చినా కఠినంగా మాట్లాడకుండా ఉండేవాడు సర్వులకూ ఆదరణీయుడు అవుతాడు. గర్వంలేనివాడూ, హీనంగా ప్రవర్థించనివాడూ,  శాంతించిన శత్రుత్వాన్ని ప్రకోపింప చెయ్యనివాడూ, ప్రమాదాలు పైన పడుతున్నా, అనుచింతంగా ప్రవర్తించన్వాడూ, పరుల దు:ఖానికి సంతోషించనివాడూ, దానం చేసిన తరువాత బాధపడనివాడూ, సత్పురుషులలో శ్రేష్ఠులుగా  ఖ్యాతి చెందుతారు. దేశవ్యవహార అవసరాదులూ, జాతి ధర్మాలూ తెలిసిన వారికి ఉత్తమ-అధమ వివేకం కలుగుతుంది.

పురోభివృధ్ధి కోరేవారు గతాన్ని మరచిపోరాదు. అప్పుడే హృదయంలో మహోన్నతభావం ఉదయిస్తుంది. అంతేకాక తన పురోగతికి ఏఏ ఆటంకాలున్నాయో అవన్నీ నశింపచేసుకుంటాడు.
 
(ఇంకా ఉంది)
విదురనీతి 41
పొరపాటు చేయటం అనేది మానవస్వభావం. ఆ పొరపాటును తెలుసుకొని ఇక ముందు అలాంటి పనులు చేయనని, దృఢంగా అనుకుని మంచి మార్గంలో నడవడమే జ్ఞానమున్న వ్యక్తి ఆచరింపదగిన ధర్మం. అదే ప్రాయశ్చిత్తం. పాపంచేసిన వ్యక్తి దానినుండి బైటపడడానికి మార్గాలు ఉన్నాయి. చేసిన తప్పును దాచకుండా ఉన్నది ఉన్నట్లు ఇతరులతో చెప్పడం వలన, జరిగిన దానిని గుర్తించి ఖేదపడడం వలన దోషవిముక్తి కలుగుతుంది.
కోరికలు మనిషిని మానవత్వం నుంచి దానవత్వానికి దిగజారుస్తాయి. మనస్సును అదుపులో పెట్టుకోవడానికి సంతృప్తియే ఏకైక మార్గం.
మానవుడు వ్యక్తి పురోభివృధ్ధికీ, సంఘ పునరుజ్జీవనానికీ దారితీసేలక్షణాలు కలిగి ఉండాలి. అవి ఏమిటంటే ఉత్సాహంతో కూడిన క్రియాసీలత, మొక్కవోని ధైర్యం, శక్తి ఉత్సాహాలు, వీటన్నింటికీ మించి పరిపూర్ణమైన విధేయత ముఖ్యం. ఎవరైతే సద్గుణాలు అలవరచుకుని తన జీవన గమనాన్ని మలుచుకుంటారో వారు వినయ విధేయతల వలన అందరికీ ఆదర్శప్రాయులవుతారు.
ఇవి ఒక్క ధృతరాష్ట్రునికే కాదు, మానవజన్మ ఎత్తిన ప్రతివారు తెలుసుకోదగ్గవి. ఆచరించి తరించదగ్గవి. చెప్పేటప్పుడు వినక, ఆనక చెప్పేవారు లేరని ఏడవడం తగదు. కాలమాన పరిస్థితులను బట్టి, బాధ్యతలు, బరువులు పెరుగుతుండటమో, మారుతుండటమో జరుగుతున్నాయి. కానీ, కాలం మారడం లేదు. ధర్మం మీరడం లేదు. అందుకనే విచక్షణను ప్రసాదించిన పరమాత్మ, వివిధ మార్గాలతో ధర్మప్రబోధం, ప్రకాశం చేస్తూ తరించమంటున్నాడు. అందుకే దీనిని మహామహుడైన పరిపూర్ణ ధర్మస్వరూపమైన యమధర్మరాజు, తరించే జ్ఞానవిజ్ఞానాలు ప్రసాదించిన దివ్య విదురునిగా ప్రకాశం, తత్వసారాంశం గ్రహిస్తే మనం ధన్యులం.
(ఇంకా ఉంది )

Friday 11 September 2015



క్షిప్రం భవతి ధర్మాత్మా
శశ్వచ్చాంతిం నిగచ్చతి:
కౌతేయ!ప్రతిజానీహి
న మే భక్త ప్రణశ్యతి||
"నన్నాశయించినవాడు శీఘ్రంగా ధర్మబుధ్ధి గలవాడవుతున్నాడు. శాశ్వతమైన శాంతిని పొందుతున్నాడు. ఓ అర్జునా! న భక్తుడు ఎన్నటికీ చెడడు" అని శ్రికృష్ణుని అభయవచనం.


శ్రీకృష్ణుడు మధురకు వెళ్ళీన తర్వాత యశోద రాధ దగ్గరకు వెళ్ళీంది. రాధ ధ్యానమగ్నయై ఉంది. నేను ఆద్యాశక్తిని. ఏదైనా వరం కోరుకో అంది రాధ. " మనోవాక్కాయ కర్మలచే శ్రీకృష్ణునే సేవించునట్లు అనుగ్రహించు, ఈ కళ్ళతో కృష్ణ్ భక్తులను దర్సించునట్లు , మనస్సుతో అతనిని మాత్రం ధ్యానించునట్లు, ఈ లానుక ఎల్లప్పుడూ అతని నామగుణకీర్తన చేయునట్లు" వరము ఇమ్మంది యశోద.
ఇంతకన్నా మానవమాత్రులమైన మనకు మాత్రం వేరే ఏమి కోరికలు ఉంటాయి? యశోద మనకు అందరికీ చక్కని మార్గం చూపింది.


సత్పురుషుల సహవాసం జనులకు సత్యవాక్కులను నేర్పుతుంది. బుధ్ధిమాంద్యమును తొలగిస్తుంది. గౌరవాన్ని కలిగిస్తుంది. పాపములను నశింపచేస్తుంది. కీర్తిని పెంచుతుంది. బుధ్ధిని వికసింపచేస్తుంది. సత్సంగము సకల కార్యాలను సాధిస్తుంది.
****మహమ్మద్, క్రీస్తు, బుద్ధుడు, అందరూ మంచివాళ్ళే.. అయితే నీకేమిటి ప్రయోజనం? నీవు మంచివాడివి కానప్పుడు నిన్నెవ్వరూ రక్షించలేరు.
****సాధారణ వ్యక్తి తొంభై శాతం శక్తియుక్తులను వృధా చేసుకొంటాడు. మనసుపై అదుపు సాధించినవాడు తప్పుచేయడు. విజేతకు, పరాజితునికి ఉన్న ముఖ్య బేధం ఇదొక్కటే.


మతం మనిషిని సక్రమ మార్గంలో నడిపించేందుకు రూపొందించబడిన విధానం.మనిషిలో ఉన్న దైవత్వాన్ని మరవకుండా, ఇతరులలో కూడా దైవత్వాన్ని చూడగిలిగే నైతిక ఆద్యాత్మిక విలువలను ప్రసాదించినది హిందూ ధర్మం. మతానికి సంబంధించిన అసలు అర్ధం మరచిపోయి, అది తమ సొంత ఆస్తిగా, తాము చెప్పిందే వేదంగా కొందరు ప్రవర్తించి మతానికి చెడ్డపేరు తెస్తున్నారు.
మానవత్వాన్ని మరచిపోయి, పశువాంచలు పేరుకుపోతున్నాయి. ధన, వస్తు వాహనాల వ్యామోహంలో పడి భగవంతుడిని , ఆయన చూపిన మార్గాన్ని మరచిపోయారు. సామాన్యుడిలా జీవించడంలో ఆనందముంది. కోరికల మీద నియంత్రణ ఏర్పరుచుకోవడంలో తృప్తి కలుగుతుంది. తృప్తి పొందిన ఆత్మ సక్రమమైన మార్గంలో పయనిస్తుంది. స్వచ్చమైన ఆలోచన కలిగి ఉంటుంది. అదే అసలైన మత సారాంశం.
(స్వామి శివానంద )
భగవంతుని శక్తిని గుర్తించి మోకరిల్లటం,గుర్తించక ధిక్కరించడం అనేది వారి వారి మానసిక పరిపక్వత మీద ఆధారపడి ఉంటుంది. తనని నమ్మని వారిని నమ్మించడం కోసం భగవంతుడు తన విశ్వరూపాన్ని వారి ముందు ప్రత్యేకంగా ప్రదర్శించటం జరగదు. ఇది భగవంతునికే కాదు, ఆయన తత్వాన్ని మన మధ్య ప్రచారం చేసే మహాపురుసులకు వర్తిస్తుంది.
శంకరాచార్య, రామానుజాచార్యుల మొదలుకొని ఏ తత్వభోధకుడు తన గొప్పతనాన్ని చాటుకునే ప్రయత్నం చేయలేదు. వారిలోని విజ్ఞానాన్ని, వారు వెతికిన కొత్త మార్గాన్ని ఇతరులు గమనించి వారిని మహాత్ములుగా పూజించారు. అదే విధంగా భఘవత్ బోధన చేస్తున్నవారు నేటి సమాజంలో కూడా ఉన్నారు. వారిని గుర్తించి, ఆదరించాల్సిన బాద్యత సమాజానిది. మనం గుర్తించినంత మాత్రాన నిజానికి వారికి పొయేదేం లేదు. వారి బోధనలు వినలేకపోవటం ద్వారా మనమే దురదృష్టవంతులుగా మిగిలిపోతాం.
అన్ని ఆశ్రమాలలోకి గృహస్థాశ్రమం ఉత్తమమైనది. గృహస్తు ద్వారానే ఇతర ఆశ్రమస్థులకి ఆహారం లభిస్తోంది. సామాజిక సాంస్కృతిక సంపద కాపాడబడేది గృహస్థు వల్లనే. పరస్పర సహకారం. చ్చిపుచ్చుకోవడం వీటి ద్వారా సామాజిక బంధం దృఢమయ్యేది గృహస్థాశ్రమం వల్లనే.
1. అపరిగ్రహ (ఇతరులనుంది ఉచితంగా ఏమీ స్వీకరించకపోవడం ), 2. సహనం. 3. విశాలభావం. $. ఇంద్రియనిగ్రహం. 5. చిత్తశుధ్ధి, 6. మనోనిఘ్రహం 7. లౌకికజ్ఞానం, 8. తాత్విక ఆలోచన, 9. సత్యమైన జీవితం 10. కోపం లేకపోవడం అనే పది గుణాలు ఉన్న గృహస్థు మహాత్ముడే.
నిత్యజీవితంలో పవిత్ర హృదయంతో ధర్మాచరణ చేసే గృహస్థు ఏ యోగికీ, జ్ఞానికీ తీసిపోడు. దేవునియందు ఏకాగ్రమైన భక్తి ఉన్న గృహస్థుకి భగవంతుని అభయము. ఆశ్రయం ఉంటాయి. భగవంతుని యందు విశ్వాసముంచి, ప్రతికర్మా ఆయనకే అర్పించి, అతిథి అభ్యాగతులను సేవించే కుటుంబీకుడు, దైవానికి ఎంతో ప్రీతిపాత్రుడు. గృహస్థుకి ఇంద్రియభోగాలు లక్ష్యం కాకూడదు.

సద్గురు వాణి...
మనమందరం బిచ్చగాళ్ళమే. మనమేపని చేసినా దానికి ప్రతిఫలం కోరుతూ ఉంటాం. మనమందరం వర్తకులం. మనకు జీవితంలో వ్యాపారదృష్టి, సుగుణాలలో వ్యాపార దృష్టి, మతంలో వ్యాపారదృష్టి, చివరికి ప్రేమలో కూడా వ్యాపారదృష్టేకదా!
మనం చిక్కుకుంటాము.. ఏ విధంగా? మనమిచ్చేదాని వల్ల కాదు. మనమాశించేదాని వల్ల. ప్రెమకు ప్రతిఫలంగా దు:ఖం సంప్రాప్తమవుతుంది. అది మనం ప్రేమించడం వల్ల కాదు. ప్రేమకు ప్రతిఫలంగా ప్రేమకోసం ఎదురుచూడడంవల్ల.
ఆశలేని చోట దు:ఖం లేదు. కోర్కె నుండే ఆశ నుండే సమస్త దు:ఖాలు పుడుతున్నాయి. ఆశలు జయాపజయాల నియమాలకు బధ్ధపడినవే..నిజమైన విజయంలోనూ, నిజమైన సౌఖ్యం లోనూ గల రహస్యమిది. ఎవరు ప్రతిఫలమాశించరో, ఎవరు సంపూర్ణంగా నిస్వార్ధులో వారు ఆందరికంటే అధిక విజయవంతులు.
ప్రతిఫలమాశించవద్దు. నువ్వియ్యవలసిందేదో ఇచ్చివేయి. అది తిరిగి నీ దగ్గరకు వస్తుంది. కానీ ఆ తలంపు నీకిప్పుడు వద్దు. అది వేయింతలై మళ్ళీ నీకు దక్కుతుంది.కానీ నీ దృష్టి దానిమీద ఉండదూడదు. ఇవ్వడానికి నీకు శక్తి ఉండాలి. నువ్వీయాలి. అంతటితో అది సరి. జీవితమంతా ఇవ్వడమే అని తెలుసుకోవాలి.
సూర్యుడు సముద్రమ్నుంది నీటిని గ్రహిస్తున్నది. మనకు వర్షరూపంలో తిరిగి ఇవ్వడానికే. పుచ్చుకోవడనికి, ఇచ్చివేయడానికి నీవు ఒక యంత్రం మాత్రమే. ఇచ్చివేయడానికే నీవు పుచ్చుకుంటావు కనుక ప్రతిఫలం కోరకు.


విదురనీతి 37
ధర్మం గా నిడిచేవారు, కోపం లేనివారు, జితేంద్రియులు, శుచులు,శీలము, విద్య కలవారు వీరిని పాత్రులు అంటారు. దాతకి అటువంటి లక్షణాలు కలవాడు దొరికితే అదృష్టంగా బావించి దానం చేయాలి. ధనము అవసరమయి ఇబ్బంది పడే సజ్జనులు కూడా పాత్రులుగా పరిగణించవచ్చు. అపాత్రుడు అంటే వ్యసనపరుడు, అధర్మపరుడు, అల్పబుధ్ధులు కలవాడు...అలాంటివాడికి దానం చేస్తే వాడు చేసిన పాపాల్లో భాగం దాతకి కూడా వస్తుంది. అందుకే అపాత్రదానం చేయకూడదు అని అర్ధం.
కూడబెట్టిన ధనం ఇతరుల పాలగును. అంతేగాక దానమీయకపోతే వైరాగ్యం అలవడకుండా సంసార బంధనం లోనే చిక్కుకుంటారు. బాహ్య వస్తువులను త్యజించలేని వాడు అంత:శత్రువులైన కామక్రోధాదులను ఎలా జయించగలడు?
"దానం చేయడం కర్తవ్యం" అనే బావంతో ప్రత్యుపకార భావన తలంపక కురుక్షేత్రాది పుణ్యప్రదేశాలలో సూర్యగ్రహణాది పుణ్యకాలాల్లో విద్యాతపస్సంపన్నులకు అర్పింపబడే దానాన్ని సాత్విక దానమంటారు. ప్రత్య్పకారం ఆశించీ, స్వర్గఫలం ఆషిచో, లేక ఇష్టంలేకుండా ఇచ్చే దానాన్ని తాజసిక దానమంటారు. అపవిత్ర స్థానాలలో, అశౌచాది స్థితిలో అయోగ్యులైన వారికి, వేశ్యాలోలురకూ, ఆటపాటలతో కాలక్షేపం చేసేవారికీ, తిరస్కార పూర్వకంగా చేసేదానిని తామసిక దానం అంటారు.
దానం చేయాలంటే ధనమే అక్కర్లేదు. మనసుంటే చాలు. పాత్ర ఎరిగి, ప్రత్యుపకారం ఆశించకుండా అవతలివారికి చేసే ఏ సాయమైనా దానంకిందకే వస్తుంది. దీన్నే ఉపకారం అని అనవచ్చు కానీ, ఉపకారానికి, దానానికి తేడా ఉంది దానం చేసే శక్తి కొందరిలోనే ఉన్నా, ఉపకారం చెయ్యగల సమర్ధత మారం అందరిలోను ఉంటుంది. సమస్యలతో కొట్టుమిట్టాడేవాడికి ఒక ఉపయోగ పడే సలహా ఇచ్చినా అది ఉపకారమే అవుతుంది. ఆపన్నులకు నేనున్నాను అని ధర్యం చెప్పడం, ఉపకారం చేసేవారికి సాయం చేయడం, ఫలనా వారు ఉపకారాలు చేస్తారు అని చెప్పడం, అక్షర జ్ఞానం కలిగించడం , వృధ్ధులకు వికలాంగులకు చేయూతనివ్వడం ఇలాంటివన్నీ ఉపకారాల క్రిందకే వస్తాయి.
చెట్లు, నీళ్ళు, గాలి, భూమిని సృష్టించిన దేవుడు, మనుషులకు వివేకాన్ని ఇచ్చాడు. ఆ వివేకం ద్వారా "పరోపకారం ఇదం శరీరం" అని తెలుసుకోవాలి. భగవంతుడు అనుకొన్నదాన్ని మనుజులు చేస్తే, వారు భగవంతునికి ఇష్టులు అవుతారు.
(ఇంకా ఉంది )
విదురనీతి 36
శీల సంపద:
ఆధ్యాత్మిక జ్ఞానానికి శీలం ముఖ్యమని కేనోపనిషత్తు చెబుతుంది. పుస్తకజ్ఞానం వల్లనో, పాండిత్యం వల్లనో ఆధ్యాత్మిక జ్ఞానసంపదలభించదు. మానవుడు శీలవంతుడు అనిపించుకోవాలంటే మంచి చెడు, ధర్మ-అధర్మ విచక్షణ కలిగి నడచుకోవాలి. విచక్షణ కలిగిన హృదయంలోనే ఆధ్యత్మికతకు చోటు వుంటుంది. ఎవరిలో కల్లాకపటంలేదో, ఎవరికి వక్రబుధ్ధిలేదో వారికే ఆధ్యాత్మికత సాధ్యమట.
బ్రహ్మసాక్షాత్కారమంటే పరిపూర్ణమైన, శాశ్వతమైన ఆనందాన్ని పొందడం. ఇంద్రియాలను తృప్తిపరిచే అల్పవిషయాలు తాత్కాలిక, అశాశ్వతమైన ఆనందాన్ని మాత్రమే ఇస్తాయి. స్వార్ధబుధ్ధిని విడనాడినపుడే అమనసు నిర్మలమవుతుంది. మానవునికి ధార్మిక చింతన అవసరం. వాక్కు గోవు కంటే పవిత్రమైనది. మంచి వాక్కు వలన శీలము, సంపదలు కలుగుతాయి. దానము వలన భోగము కలుగుతుంది. వృధ్ధులకు సేవ చేయుటవలన బుధ్ధిమంతులవుతారు. అహింస వలన దీర్ఘాయువు సిధ్ధిస్తుంది.
పద్మాలు సూర్యుని చేత ప్రకాశమైనట్టు, మనిషి ఉత్తమగుణాల చేత ప్రకాశవంతుడై కీర్తికాయుడవుతాడు. శాస్త్రీయ కర్మలను, లౌకిక కర్మలను నీవు భుజిచు వానిని, నీవాచరించే తపఒ, దాన హోమకర్మలను నాకర్పించు. ఇలా చేస్తే కర్మబంధనాల నుండి విడివడి జీవన్ముక్తిని పొందుతావు. ఇది శ్రీకృష్ణుని ఉవాచ.
దానధర్మములతో పాటు త్యాగము కూడా అవసరం. శిభి చక్రవర్తి, బలి తమకు ప్రాణం పోతుందని తెలిసి కూడ సత్యానికి, ధర్మానికి కట్టుబడి త్యాగశీలురైనారు. మనం ఇతరులకు ఏది ఇస్తే, అదే తిరిగి భగవంతుడు మనకు ప్రసాదిస్తాడు. ఈ ధార్మిక సూత్రాన్ని మనం ఎప్పుడూ మరచిపోకూడదు. అందుకే మనం పరులకు ఏమి ఇచ్చినా మంచివి, ఉపయోగపడేవే ఇవ్వాలి. మనకు అక్కరలేనివి ఇతరులకు ఇస్తే అది దానం కింద లెక్కలోకి రాదు. అది ధర్మం కూడా కాదు.
ధర్మంగా సంపాదించిన ధనం పాత్రులైనవారికే దానం చేయాలి కాని, అపాత్రులకు చేయకూడదు. పాతుర్లకు ఇవ్వకపోయినా, అపాత్రులకిచ్చినా కీడు లభిస్తుంది.
(ఇంకా ఉంది )
విదుర నీతి 35
కొందరికి ఎప్పుడూ దు:ఖమే. దు:ఖం వాళ్ళ జీవితంలో ఒక భాగం. ఎందుకంటారా? వాళ్ళెపూడూ ఈర్ష్య, అసూయలతో రగిలిపోతూ ఉంటారు. పరహితం గిట్టదు. దీనంగా ఉంటారు చూడడానికి. వాళ్ళ మీద వాళ్ళకే జాలి, సానుభూతి, ఎంతౌన్నా లేదనో, సరిపోదనో, అసంతృప్తితో అల్లలాడుతుంటారు. వాళ్ళకి ఎప్పుడూ అసంతృప్తే ఎప్పుడూ పరగడుపే. అస్తమానూ కోపంతో ఉంటారు. శాంతంగా ఉండడం చాతకాదు. పైగా నిత్యశంకితులు. అందరిమీదా అనుమానం. అన్నిటిమీదా అనిమానం. ఈఅ అవలక్షణాలకు తోడు, ఇతరుల సొమ్ముమీద బ్రతికేయాలని నీచ స్వభావం. ఇక చెప్పేదేముంది? వీళ్ళు పనికిమాలిన వాళ్ళను సహాయకులుగా నియమించుకొని, వారి సలహాలు వింటుండడం వలన పాలకులుగా పాడైపోతారు.
గారం చేయడం వలన కొడుకు పాడైపోతాడు. కొరగాని కొడుకువల్ల కులం చెడిపోతుంది. చెడ్డవాళ్ళని సేవించడం వల్ల మనుషుల్లో మంచితనం పోతుంది. త్రాగితే సిగ్గుపోతుంది. భర్యాభిడ్డలకు దూరంగా, దేశంకాని దేశంలో ఏళ్ళ తరబడి ఉంటే ప్రేమానురాగాలు సన్నగిల్లుతాయి. దుడుకుతనం వలన సజ్జన స్నేహం చెడుతుంది. అవినీతివల్ల ఐశ్వర్యం పోతుంది. అజాగ్రత్త వలన పరాకు వలన డబ్బు పోతుంది. ఈ మాట విదురుడు పదే పదే చెపుతాడు.
గోవులు, సేన, వ్యవసాయం, భార్య, విద్య, స్నేహం అనే ఆరింటిని జాగ్రత్తగా కాపాడుకోవాలిట. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా చెడిపోతాయట. గోవులకు మంచి గ్రాసాన్ని , పుష్టికరమైన పదార్ధాలను పెట్టి రక్షించుకోవాలి. అయోగ్యుల, సేవించరాని వారి సేవ చేయకుండా ధర్మపరుల్ని ఉత్తముల్ని సేవించాలి. సరైన పెత్తనంతో వ్యవసాయాన్ని రక్షించుకోవాలి. భార్య పట్ల ప్రేమకలిగి ఉండి ఆవిడ అచ్చట ముచ్చట తీరుస్తూ ఆమెను దగ్గర చేసుకోవాలి. అబ్యాసంతో విద్యను పెంపొందించుకోవాలి. ఎంత ఐశ్వర్యం ఉన్నా, ఎంత అధికారం ఉన్నా, మంచి స్నేహితులుండటం నిజంగా గొప్ప. సజ్జనస్నేహాన్ని నిలుపుకోవటానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉండాలి. ఎందుకంటే ఆస్నేహం అమృతసమానం కాబట్టి.
(ఇంకా ఉంది )
విదురనీతి 34
చేయాల్సినవి--చేయకూడనివి.
వట్టి వదరుబోతుల్ని, వాజమ్మల్ని, పొల్లు మాటలు, చచ్చు మాటలు మాట్లాడే వాళ్ళని, అబద్ధాలు చెప్పేవాళ్ళని శీలం లేని వాళ్ళని, నీతిలేని వాళ్ళని, దగాకోరుల్ని, గుణహీనుల్ని, గద్దెనెక్కిస్తే, ప్రజలు పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు అని విదురుడు హెచ్చరించాడు. అవసరకాలంలో ఆపద సమయంలో ఆదుకోని రాజును తక్షణమే వదిలేయాలని కూడా విదురుడు చెప్పాడు. ఒక్క రాజే కాదు, అలా తక్షణం వదిలించికోవలసిన జాబితా ఒకటి ఇచ్చాడు ఆయన.
"గు" అంటే చీకటి, "రు" అంటే నిరోధించడం. అజ్ఞానాంధకారాన్ని తొలగించాల్సినవాడు, జ్ఞానాన్ని కలిగించాల్సిన వాడు గురువు. సర్వార్ధాలను చెప్పవలసిన వాడు, బోధ చేయల్సినవాడు గురువు. అలాంటివాడు నేను నా ధర్మాన్ని నిర్వర్తించలేను అంటే కుదరదు. అలాంటి వారిని వదిలించుకోవాలి.
అంతేకాక, యజ్ఞ యాగాది క్రతువులు చేయని ఋత్విక్కును, ఎప్పుడూ అప్రియాలు పలికే ఆలిని, ఊరొదిలి వెళ్ళటానికి ఇష్టపడని పశులకాపరిని, వెంటనే వదిలించుకోవలిట. అలా చేయకపోతే, వారిని వారి ధర్మాలు నిర్వర్తించడంలో అడ్డుకున్నవాళ్ళం అవుతాము. దాని ఫలితం మనమె అనుభవించాలిట. సరీయిన మనుషులను, సరి అయిన వృత్తిలో నియమించి, వారు ఆ వృత్తుల్ని సక్రమంగా నిర్వహిస్తున్నదీ లేనిదీ ఎప్పటికప్పుడు గమనిస్తుండాలి. దీన్నే కార్యనిర్వహణ అంటారు.
మనిషై పుట్టాక వదిలిపెట్టకూడని గుణాలు ఆరు ఉన్నాయి. అవి 1. సత్యాన్నే పలకడం, 2. దానబుధ్ధి లకిగియుండటం, 3. సోమరితనం లేకుండా ఉండటం, 4. అసూయ లేకుండా ఉండటం 5. ఓర్పు, 6. ధైర్యం కలిగి యుండడం. ఇవి విడువరానివి, మరువరానివి.
(ఇంకా ఉంది )
విదురనీతి 33
అహమే మూలం:
"అన్నింటికి మంచి ఆలఒచనలే మూలం. మొట్టమోదటిది ఇతరులనుండి ఆశించడం కంటే ఇతరులకు ఇవ్వడంలోనే ఎక్కువ ఆనందం ఉంటుంది. ఇది గుర్తిస్తే, ఎవరిమీద ఎటువంటి ద్వేషభావం, కోపం ఉండదు." అన్నాడు విదురుడు.
అదెలా సాద్యం? అని అడిగాడు ధృతరాష్ట్రుడు.
"ఎటువంటి విపరీత పరిస్థితులలోనయినా కృంగిపోకూడదు. ఇతరుల సానుభూతి కోసం వెంపర్లాడకూడదు. మనో నిబ్బరాన్ని కోల్పోకూడదు. మన మనోస్థైర్యమే అన్ని సద్గుణాలకు ఆలంబన అవుతుంది. కోపం, అహంకారం వల్ల పరాజితులం అవుతామని తెలుసుకోవాలి. అహమే అన్ని అవలక్షణాలకు మూలం. అహంవల్ల ఇతరులను ప్రేమించలేము. ఇతరులు చెప్పింది సహనంతో వినలేము. ఇతరుల పట్ల దయగా ఉండలేము. కనుక మొట్టమొదట పోగొట్టుకోవలసినది అహమే". వివరించాడు విదురుడు.
(ఇంకా ఉంది)
విదురనీతి 32
కార్యసిధ్ధి ఎలా ఉండాలి?
ఒక కార్యాన్ని మనం చేపట్టి దాన్ని సిధ్ధింపచేసుకునే ప్రయత్నం లో పొందే ఫలితం ఉభయతారకంగా ఉండాలి. ఏకపక్షంగా ఉండరాదు.
ఉదాహరణకు, పక్వం కాని ఫలాన్ని కోయడం వల్ల అది తినడానికి రుచిగా ఉండకపోవడమే కాక దానిలోని విత్తు మరో చెట్టు పుట్టడానికి కూడా ఉపయోగపడకుండాపోతుంది. ఇలాంటి కార్యం చేయడం వల్ల తనకూ ప్రయోజనం ఉండదు. ఇలాంటి కార్యం సరైంది కాదు. కార్యసిధ్ధికి మనం కొన్ని ముఖ్యమైన విషయాలను దృష్టిలో ఉంచుకోవాలని మహాభారతంలో విదురుడు ధృతరాష్ట్రునికి ఈ విధంగా చెప్తున్నాడు.
పూలతోటను ఎంతో శ్రధ్ధతో పెంచి పెద్దచేసిన తోటమాలికి పూలు ఎలాగ కోయాలో తెలుసు. అతడు నేర్పుగా పూలను కోస్తాడే తప్ప, కొమ్మలు విరచడమో, రెమ్మలు తుంచడమో, మొగ్గలను చిదమడమో చేయడు. చెట్టుకు ఎలాంటి హానీ జరుగకుండా తన పని తాను చేస్తూ చెట్టుకు చేటు లేకుండా ఉభయతారకంగా పనిచేస్తాడు.
అలాగే తేనెటీగ కూడా తోటంతా తిరిగి, వివిధ రకానైన పూలమీద వాలి వాటిలోని మకరందాన్ని అతినేర్పుగా తీసుకుంటుందే తప్ప, పూలకేలాంటి హానీ చేయకుండా, ఉభయ తారకంగా "ఫలదీకరణ" జరగడానికి కూడా తోడ్పడుతుంది. అలాగే మనం కూడా ఏదైనా ఎదుటివాడికి హాని జరుగకుండా ఉండేలా నడుచుకుంటూ అతని మనసు రంజింపచేస్తూ మనకార్యం సిధ్ధింపచేసుకోవాలే కాని, బొగ్గులకోసం ఎవరైనా కల్పవృక్షాన్ని మొదలంటా నరుక్కుంటారా? అని విదురుడు ధృతరాష్ట్రునికి నీతిబోధ చేస్తాడు.
ఇక్కడ అర్ధం...పాండవులు కల్పవృక్షాలవంటి వారు. వారితో ఎవరైనా విరోధం తెచ్చుకుంటారా? నీవె మధ్యవర్తిగా ఉండి ఈ కార్యాన్ని ఉభయతారకంగా ఉండేలా చేయవచ్చు కదా! మహాబలులైన భీమార్జునులు తలచుకొంటే చేయలేని పనిలేదు. వారి అండ నీకెంతో అవసరం కూడాను. వారు న్యాయసమ్మతంగా వారికి రావలసిన రాజ్యభాగాన్ని కూరుతున్నారే తప్ప, మీకెలాంటి హాని చేయాలని తలపెట్టలేదు కదా!ఇటువంటప్పుడు నీవు పెద్దవాడిగా ఈ కార్యాన్ని ఇరుపక్షాలకు మేలు కలిగేలా చేయక, వారి రాజ్యాన్ని వారికివ్వక, మౌనంగా హితోక్తులు వింటున్నావు అని విదురుడు అంటాడు.
(ఇంకా ఉంది )
విదురనీతి 31
మానవ స్వభావం గురించి విదురుడు చెప్తున్న సంగతులు ఇలా ఉన్నాయి.
ప్రతిమన్సిహికి ఒక స్వభవం ఉంటుంది. అది మనుషుల మానసిక దృక్పథాని, వారు సమయాన్ని గడిపే తీరును కలబోస్తే తయారవుతుంది. ఒక మనిషి స్వభావమే మంచి చెడుల్ని నిఋనయిస్తుంది. ఒకసారి రూపుదిద్దుకున్న స్వభావాల్ని మార్చడం అంత సులువు కాదు. కనుకనే ఎవరికైనా ఒక మూర్తిమత్వం ఏర్పడే దశలోనే నిర్దిష్ట స్వభావం రూపెందేలా ప్రయత్నించాలి.
ఖమాగుణంలో ఎందరో చరిత్రలో మానవత్వానికి ప్రతీకలుగా నిలిచిపోయారు. అనాదిగా శాస్త్రాలు, వేదాలు మనిషి శాంతియుత సహజీవనంతో మెలిగేందుకు ఉద్భోదలు, ఉపదేశాలు చేసాయి. వాటిలో కొన్ని:
1. సహాయం చేసినవారికి తిరిగి సహాయం చేయడం కాదు, అపకారం చేసినవాడికే మేలు చేయాలి.
2. శాంతాన్ని మించిన తపస్సు లెలదు. సంతోషానికి సమానమైన సుఖం లేదు. తృష్ణను మించిన అనారోగ్యం లేదు, కరుణను మించిన ధర్మం లేదు.
3.తమకన్నా బలవంతుణ్ణి, భయం వలన క్ష్మిస్తారు. సహచరుణ్ణి లోకనిందకు భయపడి, సాటివాడనే దృష్టి తో క్షమిస్తారు. తనకన్నా బలహీనుడు చేసే తప్పిదాలను క్షమించే మనిషి, మనిషి కాదు, మహనీయుడే! అని గ్రహించాలి.
(ఇంకా ఉంది )
విదుర నీతి 30
పాపపుణ్యాల గురించి మన రోజూ చాలా మాటలు వింటూ ఉంటాం. మనకు నచ్చిన పనికి పుణ్యమనీ, నచ్చని పనికి పాపమనీ పేర్లు పెట్టి తృప్తిపడుతుంటాం. సత్యం, అహింస, పరోపకారం,న్యాయం, ధర్మం, ప్రేమ, ఇల్లంటివన్నీ పుణ్యకార్యాలకు ప్రేరణ గుణాలనీ, అసత్యం, అపకారం, అధర్మం, హింస ఇలాంటివన్నీ పాపకార్యాలకు ప్రేరక లక్షణాలనీ నిర్వచిస్తాం. అన్ని తెలిసీ, పాపమే చేస్తుంటాం. ప్రవచనం విన్న కాసేపు మనస్సు నిర్మలంగా ఉంతుంది. మంచినే ఆలోచిస్తుంది. పుణ్యమ చేయాలనిపిస్తుంది. ఒకసారి తెలియక పొరపాటున తప్పటడుగు వేసినప్పటికీ ఇది తప్పు అని తన అంతరాత్మతో తెలుసుకుని, భవిష్యత్తులో ఆ తప్పును మరోసారి చేయని వాడే నీతిమంతుడు. తాను చేసిన తప్పును ఇతరుల ముందు వ్యక్తీకరించి ప్రాయశ్చిత్తం చేసుకుంటే మనిషి పవిత్రుడవుతాడని శాస్త్రాలు చెబుతున్నాయి. ఎందరో మహానుభావులు ఈ సూత్రాన్ని పాటించి పావనులై లోకానికి ఆదర్శవంతులైనారు. పదేపదే తప్పు చేస్తూ పాపకూపంలో కూరుకుపోయేవాణ్ని ఎవరూ రక్షించలేరు. తాను చేస్తున్న తప్పుల్లో పాలుపంచుకునేవారంతా "నీ పాప ఫలితాన్ని నీవే అనుభవించు" అని దూరంగా వెళ్ళిపోతారు. అప్పుడు అతని పశ్చాత్తాపానికి హద్దుండదు.
(ఇంకా ఉంది )
విదుర నీతి 29
పాపపుణ్యాల విచక్షణ :
మానవులు ఎలాంటి పుణ్యకార్యాలనూ చేయడానికి ఇష్టపడరు. కాని పుణ్యఫలాన్ని మాతం ఆశిస్తారు. పాపఫలితాన్ని ఆశించరు. కాని పాపకార్యాలను మాత్రం ప్రయత్నపూర్వకంగానే చేస్తారు.--అని ధర్మ నీతి శాస్త్ర నిర్వచనం.
ఇంతకీ పాపం అంటే ఏమిటి? పుణ్యం అంటే ఏమిటి?
" పరోపకారాయ పుణ్యాయ, పాపయ పరపీడనం"..అంటే, ఇతరులకు చేసిన మేలు పుణ్యం అనీ, ఇతరులను పీడించడం వలన పాపం సంక్రమిస్తుంది అనీ శాస్త్రవచనం.
పూర్వజన్మల్లో చేసిన పాపదోషాలవల్లనే ఈ జన్మలో శారీరక, మానసిక వ్యాధులు వచ్చి పీడిస్తున్నాయి అని మనం గ్రహించాలి. పాపం వలననే దు:ఖాలు వస్తాయి. పాపము లేనప్పుడు ఆనందం కలుగుతుంది. ఏకొంచెం దు:ఖం కలిగినా అది పాప ఫలమే కాక వేరొకటి కాదు. పాపదోషం అనుభవించితే తప్ప పోదు.
అడవుల్లో ఉన్నపుడు, యుధ్ధంలో శత్రువుల మధ్య, నీటి మధ్య, అగ్నిమధ్య ఉన్నపుడు, సముద్రంలో సాగుతున్నపుడు, పర్వత శిఖరాలను ఎక్కుతున్నప్పుడు, నిద్రలో, అజాగ్రత్తలో , సంకటపరిస్థితులలో మానవుడిని తాను పూర్వ జన్మలో చెసిన పుణ్యాలే కాపాడుతాయి.
"ఒరులేయని యొనరించిన
నరవర యప్రియము తన మనంబునకగుదాన్
ఒరులకు నవి సేయకునికి
పరాయణము పరమధర్మ పధములకెల్లన్"
"ఇతరులు తనయందు ఏ విధంగా ప్రవర్తిస్తే, తన మనస్సు కలత చెందుతుందో అదే విధమైన ప్రవర్తనను ఇతరుల యందు నీవు కలిగియుండకుండుటే అన్ని ధర్మములలోకి కూడా ఉత్తమమైన ధర్మము". అని విదుర వాక్కు.
పుణ్యం చేయడం చేతకాకున్నప్పటికీ ఈ ధర్మాన్ని ఆచరిస్తే చాలు.
ఈ లోకంలో పుణ్యం కాని, పాపం కాని, ఇతరుల నుంచి మనం తీసుకోలేము. తాను చేసిన పాపకర్మవల్లనే దు:ఖం కలుగుతుంది. తాను చేసిన పుణ్య కర్మ వల్లనే సుఖము కలుగుతుంది. ఈనాడు నవ్వుతూ చేసిన పాపకర్మకి రేఉ ఏడుస్తూ దు:ఖాన్ని అనుభవించకతప్పదనే సత్యాన్ని మన గ్రహించాలి.
(ఇంకా ఉంది )
విదుర నీతి 28
8. ఈ మూడింటిపట్ల మమకారం కలిగి ఉండు!
1. ఈశ్వరుడు 2. సదాచారము 3. పేదలు
9. ఈ మూడింటిని హృదయమండు ఉంచుకో!
1. దయ 2. క్షమ 3. వినయము
10. ఈ మూడు వ్రతాలు పాటించు !
1. పరస్తీని మోహించకుండుట. 2. పర ధనము పట్ల ఆసక్తి లేకపోవుట 3. అసహాయులకు సేవ చేయుట.
11. ఈ ముగ్గురిని పోషించడం నీకర్తవ్యం గా భావించు!
1. తల్లితండ్రులు 2. భార్యాబిడ్డలు 3. దు:ఖమునందున్నవారు.
12. ఈ ముగ్గురిపట్ల ప్రత్యేక శ్రద్ధ చూపు !
1. వితంతువు 2.అనాధలు 3. నిరాధారులు
13. ఈ మూడింటిని లెక్క చేయవద్దు!
1. ధర్మాన్న్నిపాటించే సమయంలో కలిగే కష్టాన్ని. 2. పరుల కష్టాన్ని తోల్గించునపుదు కలుగు ధన నష్టాన్ని 3. రోగికి సేవ చేయునపుడు పొందే శరీర కష్టాన్ని.
14. ఈ మూడింటిని మర్చిపో !
1. నీవు ఇతరులకు చేసిన సాయం 2. ఇతర్లు నీకు చేసిన కీడు 3. దబ్బు, గౌరవం, సాధనల వల్ల సమాజంలో నీకు కలిగిన ఉన్నత స్థితిని
15. ఈ మూడు విధాలుగా మారకు
1. కృతఘ్నుడు 2. డాంబికుడు 3. నాస్తికుడు.
(ఇంకా ఉంది )
విదురనీతి 27
మనం వైరం, ద్వేషం, శత్రుత్వం, తిరస్కారం, ప్రతీకారాలను పంచితే, అవే ఎన్నోరెట్లు అధికంగా మనకు తిరిగి సంక్రమిస్తాయి. ఒకవేళ తీర్థయాత్రలన్నీ చేసినా, జపతపాలు చేసినా లోలొని కర్కశత్వం, కాఠిన్యం, నిర్దయం మనలో తొలగిపోకుంటే ఆ యాత్రలూ, జపతపాలన్నీ, బహిర్గతంగా ఉంటాయే తప్ప మన హృదయంలో వాటి ఫలితాలతో పవిత్రమొందదు.
కామం వల్ల గానీ, భయం వల్ల కానీ,లోభం వల్ల కానీ, ప్రాణాలను రక్షించుకోవడానికి కానీ, ధర్మాన్ని విడనాడరాదు. ధర్మం నిత్యమైనది. సుఖదు:ఖాలు అనిత్యాలు. జీవాత్మ నిత్యం కానీ దాని కారణభూతమైన ఉపాధులు మాత్రం అనిత్యం.
కామం లోభం మనిషిని పతనదిశవైపు మళ్ళిస్తాయి. దేహాన్ని సుఖపెట్టడమే జీవిత ప్రమావధిగా భావించేవాడు ఆత్మ సంతృప్తినిచ్చే కార్యాలను నెరవేర్చలేడు. దేవుడిచ్చిన స్వేచ్చను దుర్వినియోగం చేసినవాడు చివరకు చింతించకమానడు. విశాల దృక్పథం, ఔదార్యం వంటి సుగుణాలను అలవరచుకుంటే వ్యక్తిత్వం పరిణతి చెందుతుంది. పరిణతి చెందిన వ్యక్తిత్వానికి దు:ఖమన్నదే ఉండదు. అటువంటి వారికి ఆత్మసాక్షాత్కార భాగ్యం తప్పక కలుగుతుంది.
మహాత్ములు పలికిన ఈ పలుకుల లోని హితాన్ని అవగాహన చేసుకుని, ఆ భావాన్ని మనసులో ప్రతిష్టించుకుని తదనుకుణంగా నడచుకోవాలి. అలాంటి కొన్ని మంచి మాటలు.
1. ఈ మూడు విషయాలలో జాగ్రత్తగా ఉండు:
1. నిన్ను నీవు పొగడుకొనుట 2. పరనింద 3. పరుల దోషాన్ని ఎంచుట.
2. ఈ మూడింటిని ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకో..
1. ఈశ్వర స్మరణ 2. పరులను గౌరవించుట 3. నీలోని దోషాలను కనిపెట్టుట.
3. ఈ మూడింటిని ఆచరించు!
1. సత్యము 2. అహింస 3. ప్రేమతత్వము
4. ఈ మూడింటికి దూరంగా ఉండు!
1.ఇతరుల గురించిన చర్చ, 2. వాద వివాదాలు , 3 నాయకత్వం.
5. ఈ ముగ్గురి పట్ల దయతో ఉండు!
1. అబల 2. పిచ్చివాడు, 3. దారితప్పిన వాడు.
6. ఈ మూడింటి పట్ల దయతలచవద్దు!
1.పాపము 2. కామేంద్రియము 3. నాలుక
(ఇంకా ఉంది )
విదురనీతి 26
మానవసేవ చేసినా, మాధవసేవ చేసినా చిత్తశుధ్ధి, నిస్వార్ధం, ఫలాపేక్ష రహితంగా చెయాలి. అప్పుడే అది నిజమైన సేవ అవుతుంది. అది నిజమనిన మంచితనమని కూడా అనిపించుకుంటుంది. మంచిగా జీవెంచాలే తప్ప మంచివాడిగా నటించకూడదు. మన అంతశ్శత్రువులతో నిత్యం పోరాడుతూవాటిని జయించాలి. ఈ పోరాటంలో అనేక కష్టాలు ఎదురఔతాయి. నష్టాలు కలిగినా పోరాటాన్ని ఆపకుండా ప్రయత్నంచాలి.
కనబడని శత్రువు.
మనకు కాని వారందరూ శత్రువులే అంటుంది ధర్మశాస్త్రం. శత్రుసమూహంలో కంటికి కనబడేవారు బాహ్య శత్రువులు. కనబడకుండా మనల్ని అంతమొందించే మరో వర్గం అంతశ్శత్రువులు. అదృశ్యరూపంలో మనలోనే ఉంటూ మట్టుపెట్టే మహా శత్రువు కోపం.
కొపం బహుచెడ్డ గుణం. కోరికలు తీరనప్పుడు కోపం వస్తుంది. కోపం వచ్చినప్పుడు వివేకం నశిస్తుంది. ఆ వెంటనే మనసు అదుపు తప్పుతుంది. మాట్లాడే భాషలో మర్యాద లోపిస్తుంది. సత్ప్రవర్తన కొరవడుతుంది. ఈ కారణంగా వ్యాకులత, అశాంతి, హింస మొదలైన వినాశకర భావాలు ఉత్పన్నమవుతాయి. మిత్రులను, సన్నిహితులను, అన్నదమ్ములను, చివరికి తల్లితండ్రులను సైతం లెక్కచేయక ఎంతటి అఘాయిత్యానికైనా పాల్పడేలా చేస్తుంది ఈ గుణం. కోపం కారణంగా హృదయం నిప్పుల కుంపటై మనసు మనిషికి దూరమై పోతుంది. క్రోధావేశ పూరితుడు ధర్మ భ్రష్టుడవుతాడు అని ధర్మ శాస్త్రాల వాక్కు.
ఆసక్తి, శ్రధ్ధ, ఇంద్రియ నిగ్రహం కలవాడు జ్ఞానాన్ని పొందుతాడు. అచిరకాలంలోనే పరం ఆధ్యాత్మిక శాంతినీ పొందుతాదు. జ్ఞాన సముపార్జన జరగాలంటే, విచక్షణను చక్కగా వినియొగించుకోవాలి. సత్యమైనద్--అసత్యమైనదీఇ, శాశ్వతమైనదీ-అశాశ్వతమైనదీ , తగినదీ-తగనిదీ వంటి వాటి మధ్య వ్యత్యాసాన్ని తెలిపేది విచక్షణ. మనం ఎంత చక్కగా విచక్షణను ఉపయోహించుకుంటే అంత చక్కగా జ్ఞానవతులం అవుతాం. విచక్షణ నోరు నొక్కితే అంతా అపసవ్యమే. అప్పుడు శాశ్వత సుఖానికి బదులు శాస్వత దు:ఖాన్ని పొందుతాం.
(ఇంకా ఉంది )
విదుర నీతి 25
మదం:
మదం అంటే విపరీతమైన హద్దులు లేని అహంకారం. ఈ గుణం కల్గిన వారు వయోవృద్ధుల్ని, మేధావులను సైతం లెక్కచేయరు. అధికారం మదం కల్గినవాడికేమాతం అర్హత లేకున్నా, అనుభవంలేకున్నా తన క్రిందివారిపై పెత్తనం చెలాయిస్తాడు. వీరు ఎదుటివారిని తనకంటే తక్కువచేసి, వారిపై తమ పెత్తనం చలాయించుటకు, దుర్మాగ్రపు పనులు, దురాలోచనలు చేస్తారు. ఎంతటి నీచానికి అయినా పాల్పడుతారు. ఈ అహంకారము వలన ఎదుటివారిపై అసూయ పెరిగి, ఎదుటివారు తనకంటే ఉన్నత స్థితిలో ఉండుట, ఓర్వలేక, ఎదుటివారి నాశనమును కోరుకుంటూ ఉంటారు. చివరికి తామే నాశనమవుతారు. ఇది మరచి సత్యం, ధర్మం విడిచి,మదమెక్కి తమ జీవితములు అంధకారము చేసికొంటున్నారు. జ్ఞాని అయినవాడు ఉన్నతంగా (అహం విడిచి) ఎదుగుతున్నాడు.
మాత్సర్యం:
అనగా అసూయ. ఇది చాలా ప్రమాదకరమైనది. మాత్సర్యము వలన మానవుడు తనలోని మానవత్వాన్ని కోల్పోయి అశాంతితో ఆ జీవితాన్ని గడపడం జరుగుతుంది.
ఈ ఆరు దుర్గుణములు మాన జీవిత వికాసమునకు మానవజాతి శాతిమయ జీవనానికి అవరోధములు. మానవుడు జన్మించిన తర్వాత తన పెరుగుదలలో బాల్యమ్నుండి యౌవన దశకు, యౌవనం నుండి గృహస్థాశ్రమం, తర్వాత వృధ్ధాప్య దశకు చేరుకొని, చివరకు స్వర్గ, నరక ప్రాప్తి పొందుతాడు. ఆయా దశలలో సత్వ గుణముతో ఈ అరిషడ్వర్గములను జయించి, పుణ్యఫలాన్ని అధికం చేసుకొంటే, మోక్షప్రదమైన స్వర్గమును, లేదా నరకమును పొందుతారు.
మానవులంతా సత్వ , రజో, తామస గుణాలలో ఏదోఒకదానికి వశులై ఉంటారు. ఆయా గుణాలను అనుసరిస్తూ ప్రవర్తిస్తారు తప్పితే మరో రకమైన ప్రవర్తనను కలిగిఉండరు. విద్యావంతులమనుకునే వారు, మేధావులుగా తమను తాము పరిగణీంచేవారూ సైతం తమ తమ స్వభావాలకు విరుధ్ధంగా ప్రవర్తించలేరు. గుణం ఒకసారి స్థిరపడిన తర్వాత కొత్త దృక్కోణం అలవరచుకోవడం ఎవరికైనా కష్టమే. ఆధ్యాత్మికంగా ఎంతో ముందంజ వేసామనుకునేవారు సైతం లోలోపల కొన్ని ప్రత్యేక గుణాలకు లోబడిఉంటారు. ఏ కొద్దిమందో సత్యశోధనపట్ల ఆసక్తి చూపుతారు.
(ఇంకా ఉంది )
విదురనీతి 24
జీవితంలో ఉన్నతిని సాధించాలి అనుకునే వ్యక్తి ముందు అరిషడ్వర్గాలను జయించాలి. అరి అంటే శత్రువు, ఈ ఆరురకములైన శత్రువులు మనలో దాగుండి మన ప్రగతికి అవరోధం కల్పిస్తాయి. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు అనే ఈ దుర్గుణాలను అరిషడ్వర్గాలు అంటారు. ఇవి ఏరకంగా మానవుని దహింపచేస్తాయో చూద్దాం.
1. కామము:
ఇది అరిషడ్వర్గములలో మొదటిది. దీనిని కోరిక అనే అర్ధంలో గ్రహించవచ్చును. మానవుడు కోరిక వల్లే దు:ఖితుడై నాశనమౌతాడు. ఎవరైతే ధర్మార్ధములను విడనాడి కామార్ధమును అనుసరించునో అట్టివారు ఆపదలకు గురికాక తప్పడు. మితిమీరిన శారీరిక వాంచను కూడా కామం అంటారు. కామంతో కళ్ళు మూసుకుపోయినవాడికి భయంగాని, సిగ్గు గాని ఉండదు. పూర్వాపరాలు స్ఫురణకు రావు. మంచీచెడులను ఆలోచించడు. ఈ కామం పశుత్వాన్ని ఆపాడించి కౄరత్వాన్ని కలిగిస్తుంది.
2.క్రోధం:
ఉత్తములకు క్షణమే కోపం ఉంటుందనీ, మధ్యములకు ఒకటీ రెండు ఘడియలు కాలం కోపం ఉంటుందనీ, అదములకు ఒక రాత్రి, ఒక పగలు కోపం ఉంటుందనీ, చండాలునికి మాత్రం మరణించేదాకా శాశ్వతంగా కోపం ఉంటుందనీఈ పైశ్లోకం అర్ధము. పెద్దల అభిప్రాయం.
3. లోభం:
లోభగుణమున్నవార్కి తృప్తి ఉండదు. తృప్తిలేనివారి మనస్సును ఆశ ఆక్రమించుకొని, అది అత్యాశగా పరిణమించి, అనర్ధాలకు దారితీసి, పేరాశగా మారి, నిరాశతో సంతృప్తిని హరించివేస్తుంది.
4. మోహం:
మోహము అంటే, వ్యామోహం చేందడం. తనకు కనిపించిన ప్రతిది తనకు స్వంతం కావాలని దానికొరకు విపరీతమైన తాపత్రయపడటం, దురాలోచనలు చేయడం వంటివి మోహము అంటారు. ఈ స్థితిలో మానవుడు మానసిక స్థితి బాగాలేక తన జీవితమును దు:ఖమయం చేసుకొంటున్నాడు.
( ఇంకా ఉంది )
విదురనీతి 23
తమోగుణము గురించి విదురుడు ఈవిధంగా చెప్తున్నాడు.
మంచి చెడులను తెలుసుకోలేని అజ్ఞానం, మూర్ఖత్వం, మోహం, చపలత్వం, బుధ్ధిహీనత, ఇతరులను పీడించే దుష్టస్వభావం, తప్పుడు భ్రమ, సోమరితనము వంటి తమోగుణాలతో జీవుని ఆత్మ బంధింపబడుతోంది. 
తమోగుణము కలవారు భూత ప్రేత గణాలను ఆరాధిస్తారు.
దానం: తిరస్కరించదగినదియై, దానమునకు తగని సందర్భమునందు, అర్హులు కానివారికి ఇవ్వబడే దానం "తామసదానం" అనబడుతుంది.
2. త్యాగం: ఇక్కడా త్యాగమంటే మానవుడు తాను చేయవలసిన సత్కార్యాలను విడిచిపెట్టుట, వేదాలు, మహాత్ములు తెలిపినటువంటి సత్కార్యాలను నిర్వర్తించకపోవడం వగైరా అవివేకాన్ని, అలసత్వాన్ని తెలియచేస్తుంది.
3. జ్ఞానం.: ఏజ్ఞానమైతే ఒక్కదానియందే సమస్తమూ ఉన్నట్లుగా భావించి, దానియందే ఆసక్తి, మనసు కలది అగుతున్నదో అట్టిజ్ఞానం తామస జ్ఞానం.
4. కర్త: ఆత్మస్థైర్యం లేనివాడు,, మూఢుడు, నమ్రతలేనివాడు కుత్సితుడు, ఇతరుల జీవితాలను చెరచుటలో ఆసక్తి కలవాడు, వ్యసనపరుడు మొదలైన వారలు తామసకర్తలు.
5.బుధ్ధి: అజ్ఞానముతో పూర్తిగా నిండి అధర్మమును ధర్మముగా, మానవుడు తెలుసుకోదగిన, ఆచైంచదగినా వాటినన్నిటినీ అందుకు విరుధ్ధముగా తలచుచున్నదో ఆ బుధ్ధి తమోగుణప్రధానమైనదిగా చెప్పబడుతుంది.
6. ధైర్యము: దుష్ట స్వభావం కలవాడు తన గుణాలను ఏ ధైర్యముతో విడువడో అట్టి ధైర్యము తామస ధైర్యము.
జీవుని లొని ఆత్మ సత్వ, రజో, తామస అనే మూడు గుణాలచేత బంధింప బడుతోంది. ఎవరిలో ఏ గుణము అభివృధ్ధిలో ఉంటే అందుకు తగినట్లుగానే వారి కార్యకలాపాలు ఉంటాయి.
మోహం, కోపం, లోభం, అనే ఈమూడు నరకానికి మూడు దారుల్లాంటివి . మనిషి వ్యక్తిత్వాన్ని ఇవి సంకుచితపరుస్తాయి. మోహం బారిన పడిన మానవుదు దానిని తృప్తి పరిచే ప్రయత్నంలో లోబానికి, అందులో విఫలమైతే అసహనానికి, కోపానికీ గురవుతాడు. మానవుని ఆత్మ భౌతిక బంధాల నుండి విముక్తి చెందకుండా ఈ మూడు అడ్డుపడుతుంటాయి.
కనుక సజ్జనుడు ఈ మూడింటి విషయంలో సర్వదా అప్రమత్తుడై మెలగాలి. ఆధ్యాత్మికానందానుభూతిని పరిపూర్ణంగా పొందాలంటే కూడ ఈ మూడింటికి హృదయంలో చోటివ్వకూడదు. అపుడే మనిషి తన జీవితంలో నియమనిబంధనలు పాటించి, సత్కర్మలనే ఆచరిస్తాడు. తద్వారా మోక్షప్రాప్తి పొందుతాడు. నాలుగు
ఆశ్రమాలలోని వైదిక ధర్మాలను వ్యక్తి తన జీవితంలో ఆచరించినపుడు ఆధ్యాత్మికంగా సంపూర్ణ అనుభూతిని అతడు పొందగలుగుతాడు.

విదుర నీతి 22
సాధకుల దృష్టిలో రెండే కులాలున్నాయి. ఒకటి భక్తిశృధ్ధలు, వినమ్రత కలవరు.(దైవీ స్వభావం ) రెండు అవి లేని వారు.(ఆసురీ స్వభావం ). ఇద్దరికీ సరిపోదు. అంటే దైవీస్వభావం కలవరు ఆసురీస్వభావం కలవారిని చులకనగా చూసి వెలివేస్తారని కాదు. దైవీ స్వభావులంటే 'సర్వభూత హితే రతా:' (వారు సర్వజీవుల శ్రేయస్సునికాంక్షించి వారి శ్రేయస్సు కొరకు పాటుపడువారూ అని అర్ధం. దైవీ స్వభావం వారు సత్వగుణ ప్రధానులు. తమ చెడునడతతో అకారణంగా ఇతరులను కష్టాలకు గురిచేసేవారు చెడ్డవారు. ప్రతిపనిని ఫలాపేక్షతో చేసే స్వార్ధ పరులు మూఢులు. నాగరికులై ఉండి ధర్మాన్ని పాటించనివారు నరాధములు. ఎంతో విజ్ఞానవంతులై ఉండి కూడా కేవలం భౌతిక వాదానికే కట్టుబడి దేవుని పట్ల అవిధేయత చూపువారు జ్ఞానశూన్యులు. మానవత్వం లోపించి రాక్షస ప్రవృత్తిలో ప్రవర్తిస్తూ దేవునిపట్ల భయభక్తులు బొత్తిగా లేనివారు అసురులు వీరెన్నడూ ఎన్నటికీ, ఎప్పటికీ భగవానుని కృపకు పాత్రులు కాలేరు.
అమాయకులను త్వరగా మార్చగలం కాని తెలివైనవారిని త్వరగామార్చలేం. అమాయకుల మనస్సు శుధ్ధిచేయబడిన వ్యవసాయ క్షేత్రం వలె ఉంటుంది. తెలివైన వారికి అది పూర్తిగా కలుషితమై ఉంటుంది. కాబట్టి ఇంద్రియములు చైతన్యవంతంగా ఉండడం వలన మనిషి మానసికంగాబలహీనమవుతాడు. అటువంటి ఇంద్రియములను కరిగించి, మనసును సమూలంగా శుధ్ధిచేయడానికి సాధన అవసరం. పొలంలో పంటలు పండిస్తారు. అందులో ఏ పంట పండిస్తామన్నది మన చేతిలో ఉంది. నేలను దున్నకుండా, నీరు పెట్టకుండా, ఎరువులు వెయ్యకుండా వదిలేస్తే అందులో కలుపుమొక్కలు పెరుగుతాయి. అలాగే మన శరీరం సాధన లేకుండా వదిలేస్తే చెడు అలవాట్లతో అది నాశనమైపోతుంది.
ప్రతివ్యక్తికీ స్వభావం వాస్తవంగా నిర్మలమే. కాని కామక్రోధాదులచే అది మలినమైపోతుంది. అన్నీ మనం అనుకున్నవి జరుగవు. జీవితంలో ఎన్నో కష్టనష్టాలను చూడవలసి వస్తుంది. అనేకమంది జీవితంలో జరిగే మంచి చెడులకు పొంగిపోవడం, కృంగిపోవడం మనం చూడవచ్చు. ఇక్కడితో ఆగిపోదు. మన దు;ఖాలకు కారణమనవారిపై పగద్వేషాలను పెంచుకుంటాం. మనకి అపజయం కల్గినపుడు లోపం మనలోనే ఉన్నా ఎదుటివారిని నిందిస్తాం.
సత్యము, జ్ఞానము, తపస్సు, ధృతి, మౌనము, ధర్మము, ధైర్యము మొదలనీవి సాత్విక గుణలక్షణాలుగా చెప్తారు. ఆత్మస్తుతి చేయకుండుట, ఢంబాచారము లకుండుట, తోటి ప్రాణులను బాధించకుండుట, సహనము, బాహ్యాంతర శుచి కలిల్గియుండుట, చిత్తచాంచల్యము లేకుండుట, మనో నిగ్రహం కలిగి ఉండుట, అహంకారం లేకుండుట, ఎల్లప్పుడు ఇష్టానిష్టముల ప్రాప్తి యందు సమభావము కలిగి యుండుట, మొదలైనవి ఆత్మజ్ఞానుల లక్షణాలు.
ఈ గుణాలున్నవారు ఆత్మజ్ఞానులు, బ్రహ్మనిష్టులు, పరమభక్తులై ఉంటారు. సత్వగుణమువల్ల నిత్య అనిత్య వస్తు వివేకజ్ఞానము కలుగుతుంది. సత్వగుణము అభివృధ్ధిలో ఉండగా మరణించిన వారు ఉత్తమ్జానులు చేరుకున లోకమును చేరుకుంటారు. వివిధ విషయాలలో సాత్వికత ఇలా ఉంటుంది.
శ్రధ్ధ : శాస్త్రాలు చదువకున్నా ఉత్తమ ఆలోచనలు కలిగి ఆచరణలో ఆ ప్రకారం నడచుకున్నవాడు శ్రేష్టుడు. ఇటువంటి శ్రద్ధ్ధ సాత్విక శ్రధ్ధ అవుతుంది.
2. సాత్వైకాహారం: ఆయుష్షుని, ఆరోగ్యాన్నీందించే ఆహారమే సాత్వికాహారం.
3. సాత్విక య్జము. ప్రతిఫలాపేక్ష లేకుండా శాస్త్రోక్తముగా ఏ యజ్ఞము చేసిననౌ అది సాత్విక య్జమే.
4. సాత్వికదానం: ప్రయుపకారము చేయలేనివారికి ఇచ్చు దానము , ప్రతిఫ్లాపేక్ష లేకుండా చేసే దానము
5.సాత్విక జ్ఞానము: ఏ జ్ఞానము సర్వజీవరాశులయందు ఆత్మను నాశనరహితముగా, ఒకటిగా చూచుచున్నదో, ఆ జ్ఞానము సాత్వికజ్ఞానము.
6.సాత్విక ధర్యం: మనసు తప్పుడు మార్గంలో పయనించకుండా ఉంచగలుగుతున్నదే సాత్విక ధైర్యము.
7. సాత్విక బుధ్ధి: ఏ బుధ్ధి బంధహేతువగు కర్మమార్గమును, మోక్షహేతువగు నివృత్తి మార్గమును, కర్తవ్యాకర్తవ్యములను, భయాభయములను, సంసార బంధమును, సంసార నివృత్తిని ఉన్నది ఉన్నట్లుగా ఎరుగుతున్నదో దానిని సాత్విక బుధ్ధిగా చెప్పబడుతుంది.
(ఇంకా ఉంది)
విదుర నీతి 21
నిగ్రహం వలన కలిగే ప్రయోజనాల గురించి విదురుడు ఇలా చెప్తున్నాడు.
మనోనిగ్రహం మహాదుర్లభం అనునది అక్షర సత్యం. చెడు ఉద్దేశ్యాలున్న వాడికే కాక మంచి ఉద్దేశ్యాలు ఉన్నవాడికీ మనసును నిగ్రహించుకోవలసిన అవసరం ఎంతో ఉంటుంది. మనిషిలోని స్వార్థగుణం, అహం, అసూయ, దు"ఖ వంటి గుణాలే కాక మంచితనం, పరోపకారబుధ్ధి, త్యాగగుణం, సంతోషం వంటివి కూడ వ్యక్తి నిగ్రహాన్ని కోల్పోయేలా చేస్తుంటాయి. మొదట తెలిపిన వాటివల్ల మనవల్ల ఇతరులకు నష్టం కలిగితే, రెండవరకం గుణాల వల్ల మనమే మోసఓవచ్చు. అందువలన ఏ సమయంలోనైనా మానసిక నిగ్రహం కలిగి ఉండాలి. మనలో మనం తర్కించుకుని ఉచితమనుకున్నదానినే ఆచరించాలి. అంతేతప్ప ఏ స్వార్ధ ప్రలోభానికో, అమాయకత్వానికో లోను కాకూడదు. మన స్వార్ధబుధ్ధివలన ఇతరులు కష్టాలపాలు కాకూడదు. అలాగే ఇతరులు తమ స్వార్ధానికి మనలను ఉపయోగించుకోకుండా అప్రమత్తులమై ఉండాలి.
నిగ్రహం అలవరచుకున్నవారు పొరపాట్లు చేయరు. అట్టివారి జీవితం ఎటువంటి ఒడిదుడుకులకు లోనుకాకుండా సాఫీగా సాగుతుంది. యోగామొదలైన వాటివలన కలిఫే విశ్రాంతి తాత్కాలిక ప్రయోజనకరమే. నిజమైన నిగ్రహం మనతర్కబుధ్ధివలనే సాధ్యపడుతుంది. చక్కని వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నపుడు వాస్తవంగా నిగ్రహం సాధ్యపడుతుంది. నిగ్రహం చూపడం అంటే లోపలి భావాలను పైకి కనిపించకుండా అణచివేయడం కాదు. సత్యాన్ని గ్రహించే శక్తిని మన వ్యక్తిత్వం కలిగి ఉండడం.
ఈ ప్రపంచాన్నే జయించి 'మానవోత్తముడూ కావటానికి ఎవరైనా 12 గుణాలను అలవరుచుకోవాలి.
1.జ్ఞానము --తెలియనిది తెలుసుకోవడం.
2. సత్యము -- విశ్వహితమైన యదార్ధము పలుకుట.
3. దమము-- మనోనిగ్రహము.
4. శృతము-- ఆధ్యాత్మిక శాస్త్రము వినుట లేదా మంచి మాటలు వినుట.
5. అమాత్వర్యము --జీవుల యందు ద్వేషము లేకుండుట.
6.హ్రీ: -- అకార్యము చేయుటకు సిగ్గుపడుట.
7. తతిక్షా --శీతోష్ణాది ద్వందములను సహించుట.
8. అనసూయ -- అసూయ లేకుండుట.
9. యజ్ఞము -- అగ్నిష్టోమాది మహాయజ్ఞములు.
10. దానము --పాత్రత ఎరిగి అవసరమైన వారికి దానము చేయుట.
11. ధృతి-- ఇంద్రియ నిగ్రహము
12. శమము -- అంతరింద్రీ నిఘ్రహము.
ఈ లక్షణాలన్నీ కలిగినవారిని జితేంద్రియులు అనడంలో తప్పులేదు.
విదుర నీతి 20
ఏ మనిషికయినా తనను తాను తెలుసుకోవడానికి మించిన ఆత్మజ్ఞానం మరేదీ లేదు. ఇది లోపించడం వల్లనే మనుషులు అసంతృప్తితో, అశాంతితో అలమటిస్తారు. సమాజమలోనే కాదు, మనిషిలోనూ వైరుధ్యాలుంటాయి. చాలామందికి తమకు ఏం కావాలో తమకే తెలియని స్థితిలో బ్రతుకుతుంటారు. తాను ఏమిటి? తన సామర్ధ్యం ఏమితి? తను ఏలంటి లక్ష్యాల్ని ఎంచుకోవాలి? అందుకు అనుసరించాల్సిన మార్గాలేమిటి? అనే నిర్ధారణకు రాలేరు. ఇందుకు ఎంతో వివేచన ఉండాలి. మంచీచెడుల పట్ల అవగాహన ఉండాలి. ఇతరులకు వీలయినంద తక్కువ కీడు, ఎక్కువ మేలు జరిగే విధంగా వ్యవహరించాలన్న తలపు ఉండలి. తమని తాము సరిదిద్దుకోవడానికి సదా సంసిధ్ధంగా ఉండాలి. అందుకు అంతరాత్మని ప్రమాణంగా తీసుకోవాలి. ఆత్మకు విధేయంగా ఉండాలి. ఆత్మవంచనకు మించిన పిరికితనం మరోటి లేదని గ్రహించాలి. ప్రతిరాత్రి ఆత్మావలోకనం చేసుకోవాలి. తప్పయినా, ఒప్పాయినా అంతరాత్మ ముందు అంగీకరించాలి. బుకాయింపులు, సమర్ధనలు, అబద్ధాలు అవసరమే లేదు. నిజాల్ని నిర్భయంగా చెప్పాలి. తన ప్రవర్తనలో, వ్యవహార సరళిలో అపసవ్యతలుంటే సరిదిద్దుకోవాలి. ఆత్మకు జవాబుదారీగా ఉండాలి. ఇదంతా తాను ఏమిటో తెలుసుకున్న మనిషికి మాత్రమే సులువవుతుంది. తనని తాను తెలుసుకోలేని వ్యక్తి ఆత్మవంచనకీ పరవంచనకీ కూడా పాల్పడతాడు. ఆత్మజ్ఞానం తనకీ, ఇతరులకీ మేలు చేస్తుంది. మనిష్ ప్రవర్తనకి శోభనిస్తుంది.
సత్ప్రవర్తన మానవుని అన్నివిధాలా రక్షిస్తుంది. అందులో సంశయమేమీ లేదు. సత్ప్రవర్తన లేని మానవుడు మానవుడు కాదు. సత్ప్రవర్తన వలన సుఖము, లాభము, కీర్తి, శాంతి, జ్ఞానం, త్యాగం, దైవానుగ్రహం లభిస్తాయి. శాంతి, త్యాగం, దయ ఈ మూడు గుణములు మానవుడు పాటింపదగిన త్రిగుణములు.
ఉద్యోగపర్వంలో ఒకచోట భీష్ముడు "నాకు మీరు, పాండవులు ఒక్కటే. వాళ్ళ రాజ్యభాగం వాళ్ళకిస్తే మంచిది. కీర్తి స్వర్గం కలిగిస్తుంది. వాళ్ళకు రాజ్యమిస్తే నీకు కీర్తి కలుగుతుంది". అన్నాడు. ద్రోణాచార్యులు కూడా భీష్ముడు చెప్పినట్టు చెయమని, వాళ్ళ రాజ్యభాగం తీసుకోవడం ఇంద్రుడీ కూడా చేతకాదనీ, అన్నడు. కర్ణుడు మీ ముసలి వాళ్ళ మాటలు రాజులకు మేలు కలిగించేవి కావు అన్నాడు. విదురుడు ధృతరాష్ట్రుడితో "నీకు భీష్మ ద్రోణులను మించి నీ హితవు కోరేవారు ఎవ్వరూ లేరు" అన్నాడు.
(ఇంకా ఉంది)
విదుర నీతి 19
విదురుడు ఇంకా ఇలా చెప్తున్నాడు. సమస్త కోరికల నుంచి విడుదల పొందాలి. ఏ ఒక్క కోరిక మిగిలిఉన్నా, వాటి వాసలను నిన్ను మళ్ళీ లౌకిక ప్రపంచంలోకి లాగేస్తాయి అని శ్రీకృష్ణుడు భోదించాడు. ఈ ప్రపంచికం నుంచి ఎప్పుడు విముక్తి పొందగలం? ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడే. మానసికంగా అన్నింటినీ వదులుకుని నీవు నీవుగా మిగిలిన ఆక్షణమే నీ దృష్టి మారిపోతుంది. సమదృష్టి కలుగుతుంది. ఎన్నెన్నో దానధర్మాలు, పూజలు, ప్రార్ధనలు చేసినా లభించని వర్తమాన స్థితి ఒక్క క్షణంలో సిధ్ధిస్తుంది. మనిషిని పరిపూర్ణుడిని చేస్తుంది. లోకంలోని ఆనందం అంతా పాదాక్రాంతమవుతుంది. మానవుడు ఆశలకు లోబడకూడదు. సర్వ దు:ఖములకు ఆశయే మూలకారణం. నిరాశ లేదా వైరాగ్యం అన్నిటికంటే గొప్ప సుఖముని ఇచ్చును. ఆ శ ఏ రీతిగా సర్వదు:ఖములకు కారణమగుచున్నదో అదే విధంగా వైరాగ్యం సకల సుఖములకు కారణమగుచున్నది.
మానవుని యొక్క ఆభరణం రూపం. రూపం యొక్క ఆభరణం గుణం. గుణం యొక్క ఆభరణం జ్ఞానం, జ్ఞానం యొక్క ఆభరణం క్షమ. ఇది కల్గిన వారు సర్వత్రా శ్రేష్టులుగా చెప్పవచ్చును.
శ్లో: సత్యం మాతా పితా జ్ఞానం ధర్మో భ్రాతా దయా సఖా
శాంతి:పత్నీ క్షమా పుర: షడేతే మమ బాంధవా ||
ఆత్మ బంధువులు ఆరుగురున్నారు మనకు. అవి సత్యం, జ్ఞానం, ధర్మం, దయ, శాంతి, క్షమాగుణం. తల్లిని ఎంతగా ప్రేమిస్తామో సత్యాన్ని అంతగా ప్రేమించాలి. తండ్రిని ఆరాధించినట్లే జ్ఞానాన్ని సంపాదించాలన్న తృష్ణను కలిగి ఉండాలి. ధర్మాన్ని లోదరునిగా ఎంచాలి. దయను ప్రియనేస్తంగా భావించాలి. శాంతిని భార్యలా, క్షమను పుత్రునిలా భావిస్తూ ఆ గుణాలతో మమేకం కావాలి. పరిపక్వమైన వ్యక్తిత్వం అంటే అదే! ఆప్తులవల్ల కూడ ఒక్కోసారి మన మనసుకు బాధకలుగుతుంటుంది. అంత మాత్రావ వారిని మనం ప్రేమించకుండా ఉండలేం! అలాగే పై గుణాలవల్ల అప్పుడప్పుడు కొంత నష్టమో, కష్టమో కలిగినా సంతోషంతో స్వీకరించాలి తప్ప వాటిని వదులుకోవాలని భావించకూడదు. సన్మార్గాలు అనేవి ఎప్పుడూ మనలను పరీక్షించేవి, రక్షించేవీను. ఆ పరీక్షలకు తట్టుకుని నిలబడగలిగే మానసిక ధృడత్వాన్ని మనలో పెంపొందించుకోవాలి. చెక్కుచేదరని ధృఢ సంకల్పంతో ముందుకు సాగాలి. అప్పుడు ఎవరైనా మన తీరుతెన్నుల్ని విమర్శించినా, ఏగతాళి చేసి మాట్లాడినా వాటి ప్రభావం మనపై పడదు. ఇతరుల విమర్శల వెనుక ఒక్కోసారి వారి అన్జానమో, స్వార్ధపూరిత మనస్తత్వమో ఉంటుంది. కనుక ఇతరుల విమర్శలకు కాకుండా ఆత్మవిమర్శకే అధిక ప్రాధాన్యతను ఇవ్వాలి.
స్థితప్రజ్ఞుడు తాను ఓడటానికి ఒప్పుకోడు. పగపెట్టుకోనదు. పగను త్రిప్పికొట్టడు. నిందలయందును, పొగడ్తలయందును సమమగు స్వభావముతో ఉంటాదు. అట్టి నరుడు శోకమ్మొందడు. సంతోషమును పొందడు. (ఇట్టి స్థితిలో పురుషునకు సుఖమే తప్ప దు:ఖము ఉండదు).
(ఇంకా ఉంది)
విదుర నీతి 18
సత్యం గురించి విదురుడు ఇలా చెప్పనారంభించాడు. " సత్యం రూపం ఒక్కటే. దానికి భిన్న రూపాలుండవు. సత్యాన్ని విశ్వసించడానికి ఎంతో ధైర్యం ఉండాలి. అసత్యం చాలా ప్రియంగా ఉంటుంది. అది నమ్మదగినది కాదు దానివలన ప్రయోజనం లేదు. అయినా లోకం అసత్యానికై ఎగబడుతుంది. సత్యానికి పై పై మెరుపులుండవు. సత్యం నిగూఢమయినది. నిత్యమినది. కాకులు నల్లగా ఉంటాయి. ఇది లోకసత్యం. తెల్లకాకులను చూసి ఆనందించేవారూ ఉంటారు. కాకి తెల్లగా ఉండడం వలన అది దానివలన సాధించిందేమిటి? లోకానికి ఒరిగేదేవిటి? ఏదీ లేదు. ఒక వింత. అంతే. సత్యానికి ఆడంబరత్వం ఉండదు. సర్వకాలాల్లోనూ ఒక తీరుగానే ఉంటుంది. అది సర్వజన హితమైనది. సత్యాన్ని తెలుసుకోవడం కష్టం. అసత్యం అందుకు విరుధ్ధం. లోకం ఎంత మూఢమైనది? అసత్యం మీదనే ప్రపంచం మోజు చూపుతుంది. అసత్యవాదుల పలుకులు ఆడంబరంగా ఉంటే, సత్యవాదులు మితంగా మాట్లాడతారు. సత్యం రత్నం వంటిది. అందుకే పరీక్షించి మరీ నిర్ధారించాలి. సత్యరక్షణానికి తక్కువ మాట్లాడాలి".
మానవుడు నిర్వర్తించవలసిన విధుల గురించి విదురుడు ఇల్లా చెప్పాడు. "సుఖదు:ఖాలు మానవులందరికీ వద్దన్నా వెంటవచ్చే తోడునీడలు. ఇందులో ఏ ఒకటి వచ్చినా రెండవది పోతుంది. రెండూ అనిత్యాలే. దీన్ని మానవుడు గ్రహించాలి. భగవంతుణ్ణి నమ్మి నీ విధి నిర్వర్తిస్తూ ఉండు. సదా ఈశ్వరెచ్చనుసారంగా వర్తిస్తూ ప్రతి విషయాన్ని నీధర్మంగా, కర్తవ్యంగా ప్రవర్తించు. భవిష్యత్తు గురించి ఎన్నడూ దిగులుపడకు. నీపట్ల, నీవారిపట్ల, పిల్లలపట్ల, మిత్రుల, బంధువులపట్ల ఇరుగుపొరుగు పట్లా ఇలాగే నడుచుకో. ఔదార్యం కలిగి, నీతిపరుడవై, సక్రమమార్గంలో సత్యమార్గాన ప్రవర్తించడం జన్మ ధన్యతకు మార్గం. "
సత్యం భాషంచకుండా అసత్యాన్ని పలికే వక్తకు కలిగే స్థితి ఏమిటో విదురుడు ఇలా వివరిస్తున్నాడు. సవతులు గల స్త్రీకి, ద్యూతంలో ఓఖిన జూదరికీ, జ్భారవాహకుడికీ, రాత్రి వేళల ఏస్థితి కలుగుతుందో, అన్యాయ నిర్ణయాలు చేసేవారికీ అదేస్థితి కలుగుతుంది. గోవు కొరకు, పశువు కొరకు, అశ్వము కొరకు, మనుష్యుని కొరకు అనృతమాడేవాడు క్రమంగా ఐదు, పది, నూరు వేయి, తరాల వరకూ నరకంలో ఉంటాడు. స్వర్ణం కోసం అసత్యం పలికేవాడు బూతభవిష్యత్ఫలాలను కోలొపోతాడు. భూమి కోసం స్త్రీ కోసం అనృతమాడేవాడు తననే సర్వనాశనం చేసుకుంటాడు".
కనుక మహారాజా! ఇందులోని విధివిధానాలను విన్నారు కదా...అందుచేత మీరు మీ కుమారులకోసం, స్వార్ధాన్ని విడనాడండి. మనస్సుని నిర్మలం చేసుకోండి. అసత్యమాడకండి. అసత్యమాడి సర్వనాశనానికి దారి తీయకండి.
(ఇంకా ఉంది )
విదురనీతి 17
ప్రతిజీవి ఆత్మజ్ఞానం కలిగేవరకు కర్మలు చేస్తూనే ఉండాలి. నిరపేక్ష భావంతో (ఫలితం మీద దృష్టి లేకుందా ) చేసే కర్మలు సర్వపాపాలను దూరం చేస్తాయి. ఆమజ్ఞానంకలిగిన వ్యక్తికి ఆత్మాల్నందం కల్గుతుంది. అప్పుడు కలిగే బ్రహ్మభావం అంతా ఈశ్వరమయమేనన్న బుధ్ధిని ప్రసాదిస్తుంది. ఇక అప్పుడు ఏ బంధానికి తావుండదు. దేహాభిమానులకు చిత్తశుధ్ధి కలుగడానికి ఈ కర్మలు ప్రారంభించబడ్డాయి. ఇవి ప్రేరేపించబడి నియమిత ధర్మంగా కర్మలు చేస్తే, చిత్తం నిర్మలమవుతుంది. నిష్కామదృష్టి ఏర్పడి ఆత్మానందం పొందగల్గిన గమ్యం సునాయాసంగా చేరుకోగలుగుతాము. అది అనుభవించే ఆనందమే తప్ప కలనేము, వినలేము, అందుకే పెద్దలు ఇలా చెప్పారు. కోరికలు అజ్ఞానం కల్గించి వివేకాన్ని నాశనం చెయ్యడమే కాక, పురుగులా మొదలంట తొలిచేస్తాయి. కామంవలన క్రఒధం, క్రఒధంవలన మోహం, ఇలా అరిషడ్వర్గాలు ఆరూ ఒకదాని వెంట ఒకటి వారిని లోబరచుకొంటాయి. మందబుధ్ధులు ఈ హెచ్చరికలను విన్నా, తలకెక్కించుకోక, కోరికలకు బానిసై, కామంతో స్త్రీ సుఖానికై పరితపిస్తూ, పతనానికి దారిచేసుకుంటారు. వీరు నరకానికి అలంకారప్రాయులు. సంసారతాపత్రయాలకు, శారీరిక సుఖాలకు నిరంతరం పడే వ్యధే "మృత్యువు." దీనికి తగులుకున్నవాడు ప్రతిక్షణం చస్తూనే ఉంటాడు. ఈదేహం నశించేది అజ్ఞానం వలన. ఇది నశిస్తే, మృత్యువు నశించినట్లే. ఉదాహరణకు యోగులు వారి సాధనలో అనాయాసంగాకొన్ని శక్తులను పొందుతారు. అరి అవసరం కోసం, ఆపధ్ధర్మం కోసం. అలా కాక, తన శక్తులను గొప్పగా ప్రదర్శించేవాడు త్వరలో పతనమవుతాడు. చెవిటి , మూగ, జడుడువలే, ఉన్మత్తునివలే ప్రదర్శించేవారిని మహాత్ములంటారు. వారు ఈ జీవుల అదృష్టాన్ని బట్టి, ఈ లోకంలో సంచరిస్తూ, అన్యాయులను, అనాధలను, కర్మభ్రష్టులను, జన్మభ్రష్టులను...సమయ సందర్భాలను బట్టి తరింపచేస్తూ ఉంటారు.
జ్ఞాని చేయవలసిన పని బ్రహ్మజ్ఞాన్నన్ని గురించి ధ్యానించడమే. తెలుసుకోవడం వేరు, తెలుసుకుని తరించడం వేరు.సత్యాన్ని గ్రహించినవాడు జ్ఞాని. అనుభవించినవాడు బ్రహ్మజ్ఞాని. మృత్యువు వీరి దరికి చేరలేదు. వీనికి మృత్యువు, నరకమనేది వుంటాయని కూడా తెలియని, దివ్యావస్థలో ఉంటాదు. ఏవికారము లేని వాడు, నిర్మలుడు, సంశయరహితుని బ్రాహ్మణుడంటారు. ఇతడు పరబ్రహ్మ స్వరూపాన్ని గ్రహించి, జగత్తు "మిధ్య" అని తెలుసుకుని "జ్ఞానసిధ్ధి" పొంది, తాను తరించడమే కాక, ఇతరులను కూడా తరింపచేయగల సమర్ధుడౌతాడు.
బుధ్ధిని ప్రకోపించే, ప్రేరేపించే ఇంద్రియాలను జయించి, మనసును తన స్వాధీనంలో ఉంచుకున్నప్పుడు లబించే దానిని "విద్య" అంటారు. దీనిని అనుష్టించిన వారిని "విద్వాంసులు" గా లోకం గుర్తించి, గౌరవిస్తుంది. విద్య నెప్పుడు బ్రహ్మచర్య నియమంతో గురువుల శుశ్రూష చేస్తూ ఒక ఉపాసనగా పొందాలి. ఈ జగత్తును శాశ్వత పరబ్రహ్మమని తలచిననాడే బ్రహ్మజ్ఞానం పొందగల్గుతాము. కాబట్టి మహారాజా! నీవు సర్వశంకలు విడిచిపెట్టి, ఆ వ్యాసమహాముని ఆశీస్సులు పొంది, ధర్మపధాన్ని అనుష్టించి, ధర్మమూర్తివై చరించు." అని విదురుడు ధృతరాష్ట్రునికి బోధించాడు.
(ఇంకా ఉంది )
విదురనీతి 16
పెద్దలు పిల్లలను లాలన చెయ్యలి. పిల్లలు పెద్దల పట్ల వినయ విధేయతలు కల్గిఉండాలి. ప్రతి ఇంట ఇదిముఖ్యం. స్త్రీలను లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. వారిని సదా రక్షిస్తూ గౌరవించాలి. అంత:పుర రక్షణ గృహ యజమానిది. ఇంటి మంచి చెడుల బాధ్యత ఇల్లాలిది. దాత అందరికీ ఆరాధ్యుడవుతాడు. మంచిగా మాట్లాడేవారు మహనీయులఔతారు. సత్యవాక్పాలన వలన లభించే కీర్తి, శాశ్వతం. ఆచంద్రార్కం నిలుస్తుంది. మన ఆలోచన, బుధ్ధిని బట్టే మన సుఖసంతోషాలుంటాయి. తల్లిని, శిష్యులను, సేవకులను, తన ఇంటిని జాగ్రత్తగ సమ్రక్షించుకోవాలి. మనసులు, ఆలోచనలు ఏకమై ఏకరీతిన సాగేవరితో స్నేహం సర్వత్రా హర్షణీయం. నాస్తికుడు, ఏడుపుగొట్టువాడు, సోమరి వద్ద లక్ష్మీదేవి ఉండమన్నా ఉండదు. చదువురాని వాడు, రాజులేని రాజ్యం, సంతానం లెని స్త్రీ ల యొక్క జీవితాలు వ్యర్ధం. అసంతృప్తి, ఆత్మస్తుతి, సేవాదృక్పధం లేకపోవడం, అనాలోచిత కార్యాలు, అనవసర ఆర్భాటం మనుషులకు అసలైన శత్రువులు. సోమరితనం, మద, మోహ, చపలత్వ, ధూర్త, స్వార్ధ, అనవసర అసందర్భ ప్రసంగాలు అసలు పనికిరావు.
మృత్యువును ప్రాణీకోటికి ప్రాణాంతకంగా చెబుతారు. దీనికి రూపం లేదు. ఎలాగ మనల్ని ఎప్పుడు కబళిస్తుందీ చెప్పలేము. జీవుడుకామ, క్రోధ, లోభ, మద, బోహ మత్సరములనే ఆసురీప్రవృత్తులకు లొంగి, అందులో శ్ళేష్మమలో పడ్డ ఈగలాగ కొట్టుకుంటూ ఉక్కిరిబిక్కిరి అవుతున్నాదు. దానినే మృత్యువు అని చెప్పవచ్చు. ఈ కామక్రోధాది అర్షడ్వర్గములతో ఎటువంటి బంధనం లేని వ్యక్తిని "బ్రహ్మజ్ఞాని" అంటారు. అతడు బ్రహ్మ భావంతో ఆ రూపమొంది ఆనందిస్తున్నాడు. ఈభావం కల్గినవాడు "మృతుడు" దాడు. అతనికి మృత్యువేలేదు. అలాగని తామరాకుమీద బీటిబొట్టు వలె ఉండి తరించడం "తత్సుమము" అయితే ఎందుకు కొరగాని వాడు "తద్భవమై" సంసారా తాపత్రయాలకు తహతహ లాడుతూ ఊర్ధ్వలోకాల బదులు, అధోలోకాలకు దారిచేసుకుంటున్నాడు. అందుకని, జ్ఞానం కలిగించే విషయాలు వినాలి. ఆ జ్ఞానంపై మనసును నిల్పి ఏకదృష్టితో, నిశ్చలమూర్తిగా ధ్యానం చెసుకుంటూ పరమ ప్రశాంతంగా ఉండాలి. ఈ ఆత్మ నిత్యచైతన్య స్వరూపంతో, బంధరహితమై బ్రహ్మానందమొందుతూ, నిత్యనిర్మల ప్రశాంత పరిశుధ్ధమై, ఆ పరబ్రహ్మలో లీనమీ ఆత్మానందం పొందుతుంది. ఇది అనుబవానికే తప్ప వర్ణనకు వీలు కాదు. ఇది సత్కర్మల వలననే సాధ్యము, లభించే అదృష్టము.
(ఇంకా ఉంది)