Monday 12 October 2015

విదురనీతి 52

ఉత్తముల లక్షణాలు:

ఉత్తమజనులు తమదగ్గరున్న సంపదలు కేవలం తమకు, తమ కుటుంబం కోసం మాత్రమే అనుకోరు. ఉదారబుధ్ధితో తమ సంపద్లను ఆపదలో చిక్కుకున్నవారి కోసమూ వినియోగిస్తారు. కుటుంబం అంటే తమ ఇంట్లో నివ్సించే నలుగురు లేదా అయిదుగురు అని భావించకపోవడమే అందుకు కారణం. తనది వసుధైకకుటుంబమనే భావనతో వరు జీవిస్తూ ఉంటారు.

పండ్లతో నిండిన చెట్ల కొమ్మలు కోసుకునేవారి సౌకర్యం కొరకు వంగి ఉంటాయి. నీటితో నిండిన మేఘాలు భూమి దగ్గరలోనే వేలాడుతుంటాయి. అలాగే ఉత్తములు గర్వాన్ని దరిచేరనీయకుండా, తమ సంపదలను పరోపకారానికై వెచ్చిస్తారు. "ఉత్తముల సంపదలు సమస్యల వలయంలో చిక్కుకున్నవారి దు:ఖాన్ని ఉపశమింపచేయడమే లక్ష్యంగా వినియోగపడుతుంటాయి " అన్నది ప్రాచీన సూక్తి.

ఎవరూ ప్రార్ధించకుండానే సూర్యుడు పద్మాల్ని, చంద్రుడు కలువల్ని వికసింపచేసినట్లు, సముద్రంలోని రత్నాలు, మనయపర్వతానికి చెందిన చందనవనాలు, వింధ్య పర్వత పరిసరాల్లోని ఏనుగులు జనుల ఉపయోగం కొరకే ఉన్నట్లు, సత్పురుషుల సంపదలూ పరోపకారం కొరకే అధికంగా వినియోగమవుతాయి. వారు వారి సంపదను జ్ఞానన్ని, ఇత్రుల రక్షణ, పోషణలకై, సమాజాభివృధ్ధికై ఉపయోగిస్తారు. జనులందరూ సుఖసంతోషాలతో ఆరోగ్యంతో సర్వశుభాలతో జీవనాన్ని కొనసాగించాలని, ఎవరికీ ఎటువంటి దు:ఖాలు, నష్టాలు, కష్టాలు కలగరాదని కాంక్షించడం పరోపకారుల లక్షణం.

ఉపకారాన్ని మించిన ధర్మం లేదు. అపకారాన్ని మించిన పాపం లేదు. ఎవరు పరోపకారం కొరకు పాటుపడతారో వారి జీవితమే సఫలమైనట్లు అని బ్రహ్మాండపురాణం కూడా ప్రబోధిస్తుంది. ఈ సత్యాన్ని గుర్తించి మానవులందరూ పరోపకారులై జీవించాలి.

(ఇంకా ఉంది )
విదురనీతి 51
జీవిత పరమార్ధం:
తాను చనిపోయిన తరువాత కాలగర్భంలో కలిసిపోకుండా తన గురించిన జ్ఞాపకాలు,జనం మధయలో మరపురాని గుర్తులుగా ఉండిపోతాయనీ చరిత్రలో తాను కీర్తిశేషుడిగా మిగిలిపోతాననీ ప్రగాఢమైన నమ్మకం కలిగిన మనిషి మరణ సమయంలోనూ ఆనందంగానే ఉంటాడు. జీవితం శాశ్వతం కాదు. యౌవనమూ అంతే. ధనం ఎప్పుడూ అస్థిరమే. భార్య, బిడ్డలు శాశ్వతంగా ఉండిపోరు. ఈలోకంలో శాశ్వతంగా నిలిచేవి తాను చేసిన ధర్మం, సంపాదించినా కీర్తి మాత్రమే...
చందనం, తగరం, మల్లిక వంటి పుష్పాల సువాసన గాలివాటంగా వస్తుంది. పరిసరాలను పరిమళభరితం చేస్తుండి. గొప్పవారూ, సుగుణవంతుల కీర్తి ప్రచండవయువుల్ని సైతం చీల్చుకుని సర్వవ్యాప్తి అవుతుంది. వారి కీర్తి విశ్వమంతటా వ్యాపించి కలకాలం నిలచిఉంటుంది.
నరజన్మ లభించడమే ఎంతో అదృష్టం అనుముంటే ఆ జన్మను సార్ధకం చేసుకోవాలంటే, కొన్నిఉత్తమ లక్షణాలను కలిగి ఉండవలసిందేనని ఘంటాపథంగా చెప్పుకోవచ్చు. మానవ జన్మా ఆత్మ, బుధ్ధి, శరీరం అనే మూడు ప్రధాన అంశాలను కలిగి ఉంటుంది. శరీరం జంతువులకు కూడా ఉంటుంది. కానీ బుధ్ధి కలిగిఉన్న ప్రాణి మానవుడు మాత్రమే. అందువలన బుధ్ధితో ఆలోచించి, ఆత్మావలోకనం చేసుకుంటూ మానవుడు జీవనం సాగించాలి.
(ఇంకా ఉంది )
విదురనీతి 50
మనిషికి తాను పరిష్కరించుకోలేని సమస్యలు ఎదురయ్యే పరిస్థితులు రావచ్చు. తనలోని అన్ని శక్తి యుక్తులు ఉపయోగించినా ఆ క్లిష్ట సమస్య పర్ష్కారం కాకపోవచ్చు. అలాంటి స్థితిలో దైన్యం ఆవహిస్తుంది. నడిసముద్రం మధ్య చిక్కుకుని తీర కనిపించని రీతిలో కుంగిపోయే పర్స్థితులు ఎదురవుతుంటాయి. సరిగ్గా ఇలాంటి దీనస్థితిలో దైవం ఆధారమవుతాడు.
శరణాగతి అంటే అహంకార నాశనం. అది భగవత్ కృపతోనే సాధ్యం. సకల కార్యాలను ఒక భగవత్ శక్తి నడుపుతోంది. అందువల్ల మనం దనికి లోబడి ఉండట ఉత్తమం. ఎంతెంత వినయంగా ఉంటామో అంతంత శుభం కలుగుతుంది.
చేసిన మేలు మరిచిపోవడం మహాపాపం. పాపకార్యాలైన గోహత్యకు, సురాపానానికి, దొగతనానికి, వ్రభంగానికి సత్పురుషులు ప్రాయశ్చిత్తం చేప్పారు కాని, కృతఘ్నతకు ప్రాయశ్చ్చిత్తం లేదని బ్రహ్మ శాసనం. కృతఘ్నుడి మాంసాన్ని కుక్కలు కూడా ముట్టుకోవని భారతం చెప్తుంది.
త్రికరణ శుధ్ధి:
మనం మనస్సుతో ఏమి ఆలోచిస్తున్నామో వాక్కుతో అదే మాట్లాడాలి. వాక్కుతో ఏం మాట్లాడుతున్నామో కర్మ ద్వారా అదే చేసి చూపించాలి. ఆ శుభకర్మ ఫలితాలను సర్వత్రా దర్శించాలని సనాతనులు ప్రబోధించారు. త్రికరణ శుధ్ధిగా మనోవాక్కాయ కర్మలతో పవిత్రంగా ఉండాలని ఋషులు ఉపదేశించారు.
ఆచరణ చాలా ముఖ్యం. ఏది మనం ఇతరులకు ఉపదేశిస్తున్నామో అదే మనం నిశ్చయంగా ఆచరించి ఇతరులకు చూపించాలి. అప్పుడే పరులకు మనమీద విశ్వాసం, గౌరవం ఏర్పడతాయి. సమాజంలో అధికులు చెప్పడమే కాని, ఆచరించడం లేదు. లోకంలోకి మన ప్రవేశం, నిష్క్రమణం రెండూ మధురంగా ఉండాలి అంటే జీవనం, మరణం దేనికదే ఇతరులకు మార్గదర్శనం చేసేవిధంగా ఉండాలి. జీవన విలువలు తెలిసి సన్మార్గంలో నడిచేవారికి అద్ ఒక అద్భుత వరంలా కనిపిస్తుంది. జీవితంలో సత్యాన్ని, ధర్మాన్ని ప్రేమించని వారికి ఈ జీవితం ఒక నరకంగా కనిపిస్తుంది.
కన్ను, ముక్కు, జిహ్వ, చెవి, చర్మము ఈ అయిదు ఇంద్రియముల సముదాము తలతో పుట్టినదగు మనస్సును లాగుచుండును. అట్టి దీనికి లోబడినవానికి, శుక్ల పక్షమున చంద్రుడు వృధ్ధినొందిన విధముగా ఆపదలు వృధ్ధినొందును.
జీవితకాలము అతిస్వల్పము. తెలిసికొనవలసిన ధర్మములు పెక్కు కలవు. ఆచరించవలసిన సాధనలు అనేములు ఉన్నవి. విఘ్నములు లెక్కలేనన్ని వచ్చి పడుచున్నవి. ఇట్టి స్థితిలో జీవుడు ఎంత త్వరితముగ తన లక్స్యమును సాధింపగలడో అంత శ్రేయస్కరం.
మృత్యువు ప్రతినిముషము జీవుని కబళీంచుటకై పక్కనే వేచియున్నది. వార్ధక్య, రోగము మొదలయినవి హుంకరించుచు మీదపడబోతున్నవి. కావున వాని వలన అపకారము కలుగకపూర్వమే, మృత్యువు దాపురించకమునుపే ఇంద్రియముల శక్తి ఉడుగకమునుపే వైరాగ్య శమదమాది సాధనలను అబ్యసించి స్వస్వరూపానుభవమును పొందవలసియున్నది.
(ఇంకా ఉంది )
మాట-మౌనం
పంచేంద్రియాలు కలిసి మనస్సును విషయాదుల వైపుకు తిప్పుతాయి. అప్పుడు ఏర్పడే భావపరంపర మఔనాన్ని భంగపరుస్తుంది. అనుద్కే మౌనం అలంకారప్రాయమూ కాదు. అంగీకారమూ కాదు. ంపరుషపదజాలాన్ని నియంత్రించే మౌనం పరిపూర్ణత కలిగిన ఆలోచనా విధానానికి తొలిమెట్టు. దాన్నుచి సాత్వికత ఏర్పడుతుంది. సాత్విక స్వభావం మంచి చెడులను నిర్దేశిస్తుంది. ప్రమాదరహితంగా చరించే విధాన్నాన్ని సూచిస్తుంది. ముందు చూపును కలిగి ఉంటుంది. భవిష్యత్తును ఊహించగలుగుతుంది. కారణాకారణాలను తృటిలో విశ్లేషించగలుగుతుంది. మనోఫలకంపై దృశ్యాదృశ్యాలను ఆవిష్కరింపచేసే శక్తిని పొందగలిగి ఉంతుంది. అందుకే యోగులు, ఋషులు, మౌనధారణ కలిగి ఉంటారు
మౌనాన్ని అభ్యసించాలి. అధ్యయనం చెయ్యాలి. దైనందిన జీవితం ఆటుపోట్లకు ఆలవాలం. ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు, సందిగ్ధావస్థలో ఉన్నప్పుడు, విరుధ్ధవిషయాలను చర్చిస్తున్నప్పుడు మౌనం గట్టున పడవేసే ఆయుధం. ప్రశాంతమైన పరిసరాలు మౌనధారణకు తోడ్పడతాయి. అయితే అవసరమైన వేళల్లో మౌనధారణ అగచాట్లు తెస్తుంది. మౌనం దివ్యాయుధం. సందర్భ శుధ్ధిగా ప్రయోగించినప్పుడే అది లక్ష్యాన్ని భేదిస్తుంది.
(ఇంకా ఉంది )
విదుర నీతి 48
మాట-మౌనం
సమయం చూసి మాట్లాడాలి. నొరుంది కదా అని అనవసర, అసందర్హ ప్రసంగాలెప్పుడు చెయ్యకూడదు.
మౌనం వచించడంవల్ల భద్రత, శుభం కలుగుతాయి. వర్షాకాలంలో కప్పలు బెకబెకమని అరుస్తున్నప్పుడు కోకిలలు మౌనంగా ఉండడమే మంచిది. కోకిల వసంతకాలంలో కమ్మగ పాడుతుంది. వర్షాకాలం రాగానే కప్పల సంఖ్య పెరుగుతుంది. అవి బెకబెకమని కర్ణ కఠోరంగా అరుస్త్యాఇ. ఆ సమయంలో కోకిల కమ్మగా పాడినా ఎవరికీ వినిపించదు. అందుకని వానాకాలంలో కోకిల మౌనంగా ఉండటమే మంచిది. మనుష్యులకైనా ఇదే సూత్రం వర్తిస్తుంది.
కొందరు మూర్ఖులు తాము చెప్పేది తప్పైనా ఒప్పుకోక అడ్డదిడ్డంగా వాదిస్తుంటారు. అటువంటి వారికి ఎంత చెప్పినా ఏది మంచో, ఏది చెడో అర్ధంకాదు. తెలుసుకునే ప్రయత్నం కూడా చెయ్యరు. అటువంటి సమయంలో మౌనం వల్లనే భద్రత, రక్షణ, శుభం కలుగుతాయని విజ్ఞులు గమనించాలి.
మనం మన కర్మేంద్రియముల ద్వారా మన కర్మలు నిర్వర్తించుతున్నాము. ఏమీ మాట్లాడకుండా ఉండటమే కాదు. ఏమీ ఆలోచించకుండా ఉండటం కూడా మౌనమే. ఎటువంటి ఆలోచనలు లేకపోవడంతో మెదడుకు కూడా కాస్త విశ్రాంతి దొరికి కొత్త శక్తిని సంపాదించుకుంటుంది. దాని చురుకుదనం పెరుగుతుంది. మౌనం కూడా ఒకరకంగా ధ్యానమే...కాబట్టి కాసేపు మౌనంగా ఉండటం వల్ల ఏకాగ్రత సాధించడానికి కావలసిన నైపుణ్యం దొరుకుతుంది. ఆలోచనల పట్ల నియంత్రణ సాధించగలుగుతాము. ఒక స్పష్టత ఏర్పడుతుంది. జరుగుతున్న విషయాల పట్ల సదవగాహన కలుగుతుంది. పరిణతి కలిగిన ఆలోచలనకు ఆస్కారం ఉంటుంది. ఆధ్యాత్మిక పురోగతి సాధించడానికి మౌనం రాచమార్గమని గ్రహించాలి.
మౌనం ఆత్మశక్తిని పెంచుతుంది. మౌనధారణ సంస్కారవంతమైన భూషణం. పరిణతి చెందిన మనస్తత్వానికి ఆలోచనాపరిధికి అది నిదర్శనం. చలించే భావసముదాయం వాచకంగా పెదవులు ద్వారా బహిరంగమౌతుంది. సంభాషణ, లేదా చర్చ గాడి తప్పే గడ్డు సమస్యలు ఎదురైనప్పుడు మౌనం కవచంలా కాపాడుతుంది.
(ఇంకా ఉంది)
విదురనీతి 54

ఒకవ్యక్తి దీనావస్థలోను, దయనీయమైన స్థితిలోను ఉంటే , ఆ దు:ఖాన్ని తనదిగా భావించి, ఊహించుకొని ఆవహించుకొని అనుభవించి పడే తపనే 'సానుభూతి"  అవుతుంది. అటువంటి సానుభూతి కోసం కష్టాల్లో ఉన్నవారు, దు:ఖంలో పరితపించేవారు దీనాతిదీనావస్థలో ఉన్నవారు ఎదురుచూస్తుంటారు. కనీసం ఓ సానుభూతి వచనం కోసం ఎదురుతెన్నులు చూస్తారు.

తన కు:హాన్ని పంచుకునేవారు పదిమంది ఉన్నారని తెలిసినప్పుడు ఆ బాధితునికి ఊరట కలుగుతుందట. ఓదార్పు వలన అతనికి దైన్యం తరుగుతుంది. ధైర్యం పెరుగుతుంది. మనోబలం చేకూర్చుతుంది. ఆత్మవిశ్వాసం, ఆతంస్థైర్యం రెట్టింపవుతుంది. సానుభూతి, సత్వప్రవృత్తి, పరగతమై సుఖ దు:ఖాదె భావనలచే కరుణ్త్వం పెరుగుతుందని పెద్దలు చెబుతారు. ధృతరాష్ట్రుడు ఆశిస్తున్నదీ ఇదే!

పండితుల సంగమము వలన విద్య లభిస్తుంది. విద్య వలన వినయము లభిస్తుంది. వినయమువలన లోకానురాగము లభిస్తుంది. లోకులు తనను అభిమానించుచున్నప్పుడు సర్వము సిధ్ధిస్తుంది. అధర్మ మార్గమున పొందిన ధనముతో ఏ లొసుగు కప్పిపుచ్చినా అది దాగనే దాగదు. దానివలన తక్కినది కూడా చేల్లాచెదరగును. నీకొడుకులు సధ్ధర్మమగు పనిని చేయటంలేదు. న్యాయము తప్పిన మార్గమున సుఖము పొందగోరుచున్నారు. కనుక ఇది విపరీతము, ప్రమాదకారి అని విదురుడు స్పష్టంగా చెబుతున్నాడు.

అసూయకలవాడు, ఆయువుపట్టులందు హింసించువాడు, అప్రియములు పలుకువాడు, పగపెట్టువాడు, మోసకాడు--అగు వీరు పాపము చేసిన వెనువెంటనే తగుఫలితమును పొందుతారు. అసూయ లేనివాడు, ప్రజ్ఞను పెంపొందించగోరు వాడు, మంచి పనులను ఎల్లవేళల చక్కగా చేయువాడు గొప్ప సుఖమును పొందుదురు. అందరకు ఇష్టులగుదురు.

రాత్రి సుఖముగా ఉండు ఏర్పాటును పగటియందే చేసికొనవలయును. నావాకాలమున సుఖముగానుండు ప్రయత్నమును తక్కిన యెనిమిది నెలల ముందు చేయవలయును. ముసలితనమునందు సుఖమునకై పడుచుదనముననే ప్రయత్నించవలయును. చనిపోయిన తరువాత సుఖమును, కీర్తిని బొందుటకై జీవితమంతయు ప్రయత్నించవలయును.

(ఇంకా ఉంది )

విదుర నీతి 53

ఇంద్రియ విషయ సుఖములకు లోబడువారు తపస్సును చేయలేరు. పరమాత్మ సుఖమును గాంచజాలరు. దేహసుఖమును లక్ష్యమందుచుకొనని ధీరులు మాత్రమే ఏకాగ్ర చిత్తంతో దైవ సామ్రాజ్య పట్టాభిషిక్తులు కాగలుగుతారు. ఇంద్రియములను అదుపున పెట్టుకొని, మనస్సును చెదరిపోనీక, వికారములు పొందినపుడు చక్కగా శిక్షించుచు, పరీక్షించి పనులు చేయు ధీరుని లక్ష్మీదేవి అంటిపెట్టుకుని ఉంటుంది. (నిగ్రహము లేని నీవు కొడుకులు ఆడించినట్లు ఆడుచున్న కారణమున లక్ష్మి నీయందు నిలువదని విదురుని సూచన)

రాజా! పురుషునకు శరీరము రథము, మనస్సును, వశమైన ఇంద్రియములు దానికి గుర్రములు. ఏమరుపాటులేక, నేర్పుగలవాడై తనకు లొంగిన ఆ మంచి గుర్రములతో ధీరుడు రథికుని వలె సుఖముగ ప్రయాణించును.

సాధువులను ఎవరు నిందించెదరో వారు తమను తామే దూషించుకొనువారగుదురు. ఎటులనగా ఆ కాశములోనికి ఎవరైనా బూడిదను ఎగురవేసినచో అది వచ్చి వారి తలమీదనే పడును కదా!

అధమజనులకు బ్రతుకుతెరువు లేకపోవుట భయము. మధ్యములకు చావు భయము. ఉత్తములగు నరులకు అవమానములంటే కహాభయము.

త్రాగుడు, మదము మొదలగు మదములన్నింట్లో ఐశ్వర్య మదము అన్నింటికన్న మిన్న. ఐశ్వర్యముచే పొగరెక్కినవాడు మొత్తముగా పతనము చేందాక కానీ తెలివినొందడు. ఐశ్వర్యము, ధనము, అధికారము అను వానివలన కలిగిన మదము తక్కిన పాపములకెల్ల మించిన పాపమని తెలుసుకోవాలి.  పరస్త్రీ వ్యామోహం, జూదం, తాగుడు, వేట, కఠినంగా మాట్లాడటం, కఠినంగా ప్రవర్తించడం, డబ్బు కుర్వ్యయం చేయటం ఇవి సప్తవ్యసనాలుగా మన పెద్దలు పరిగణీంచారు. వ్యసనం మానవునికి చిత్తసమ్యమనం లేకపోవడం వల్లనే వస్తుంది. ఈ సప్తవ్యసనాల వల్ల నశించిపొయినవారి గురించిన కథలు చరిత్రలో ఎన్నెన్నో...

(ఇంకా ఉంది )

Tuesday 6 October 2015

విదురనీతి 47

చిత్తప్రసన్నత

మానసిక ఒత్తిళ్ళనుంచి దూరంగా ఉండాలంటే మనసును ప్రసన్నంగా, శాంతంగా ఆరోగ్యంగా ఉంచడం నేర్చుకోవాలి. మనిషి మరణ ధర్మానికి ఎదురీదలేడు. అందుకే కర్తవ్యమనే జ్యోతినందుకొని ముందుకు సాగిపోవాలి. సృష్టి ధర్మాన్ననుసరించి కాలధర్మముంటుంది. ఎవరికోసం ఏదీ ఆగదు. కాలచక్రం తిరిగిపోతూ ఉంటుంది. ఈ కాలగతిలో మనం సుఖంగా బ్రతుకుతూ, ఇతరులకు  ప్రశాంతంగా బ్రతకనివ్వాలి.

ముళ్ళ మధ్యలో ఉండి కూడా పువ్వు వికసిస్తుంది. అలాగే మనం కూడా కష్టసమయంలో కూడా చిరునవ్వును విడవకూడదు. సంతోషం లేకపోతే, ప్రశానతతలేదు. ప్త్రశాంతత లేకపోతే మనశ్శాంతి లేదు. మనశ్శాంతి లేకపోతే సరియైన జీవనయాత్ర లేదు. అందుకే ముళ్ళ మధ్య పుష్పాన్ని వేదం ప్రమాణంగా చూపిస్తుంది. ఈ సంసారమనే యాత్రలో మనకు సుఖదు:ఖాలతో మిళితమైన ఎన్నో అనుభవాలు ఎదురవుతాయి. వాటిని మనసులోనికి రానీయకుండా ఆత్మధైర్యంతో ఎదుర్కొని ప్రసన్నంగా జీవించే అలవాటు చేసుకోవాలి. మానసికంగా మనిషి నలిగిపోతే, దానికి వైద్యశాస్త్రంలో కూడా మందు లేదు.


దీనులైనవారికి మాత్రమే ధనాన్ని దానం చెయ్యాలి. యౌవనాన్ని భార్యకు మాత్రమే అంకితం చెయ్యాలి. యజమాని కోసం పనిచెయ్యడంలో ప్రాణాన్ని సైతం త్యాగం చెయ్యాలి. ఎవరైనా సరే, భగవంతుని సన్నిధిలో ఒక పని చేస్తానని నిశ్చయించుకుని ఆ పనికి కట్టుబడి ఉండాలి. అలా నిశ్చయించుకోవలసిన కర్తవ్యాలలో కొన్ని:

ఎవరికి పడితే వారికి డబ్బుని దానం చెయ్యకూడదు. అర్హులు, పాత్రులైనవారికే దానం చెయ్యాలి. కొందరు విలాసాలకై యాచన చేస్తారు. దొరికిన డబ్బుతో జూదగృహాలకూ, పానశాలలకూ వేశ్యావాటికలకూ వెళ్తారు. అటువంటివారికి కాకుండా నిజంగా దీనస్థితిలో ఉన్నవారికి దానమిచ్చిన ధనం సద్వినియోగమవుతుంది అంటుంది శాస్త్రం.

ప్రతి పురుషుడూ భార్యకు ద్రోహం చెయ్యనని ప్రతిజ్ఞ చెయ్యాలి. చేసిన ప్రతిజ్ఞను నిలుపుకోవాలి. యౌవనం భార్యకే అంకితం చెయ్యాలి తప్ప పరస్త్రీలతో, వేశ్యలతో గడపరాదు. అలా చెయ్యడం వలన ధర్మం, అర్ధం కామ కూడా నశిస్తాయి. విధినిర్వహణలో యజమానికి హితకరమైన పనే చేయ్యలి, ప్రాణాన్ని సైతం లెక్కచేయక విధిని నిర్వర్తించాలి తప్ప యజమాని చెప్పిన పనిని ఎల ఎగ్గొడదామా అని ఆలోచించకూడదు. విధి నిర్వహణలో కష్టాలు ఎదురైతే వెనుకంజ వెయ్యకూడదు. ఈ నిర్ణయాలను తీసుకోవడం అందరికీ శ్రేయోదాయకం.
విదురనీతి 46

కోరికలు మనిషిని మానవత్వం నుంచి దానవత్వానికి దిగజారుస్తాయి. మనస్సును అదుపులో పెట్టుకోవడానికి సంతృప్తి ఓ చక్కని మార్గం.

ఈలోకంలో త్వరగా అంతరించిపోతున్న అంశం 'తృప్తి". మానవుడికి తృప్తి అనేది లేకపోవడం వల్లనే లోకంలో శాంతి సుఖాలు కరువవుతున్నాయి. కోరికలు అనంతం. కోరుకున్నవి ఎన్ని ఇచ్చినా ఇంకా ఏదో కావాలంటారు. ఒక కోరిక తీరగానే మరో కొత్తకొరిక పుట్టుకొస్తుంది. ఈ కోరికలకు అదుపు లేకపోతే జీవితం నాశనమవుతుంది. పురాణేతిహాసాలలో ప్రతినాయకుల ద్వారా మనకు అందించిన సందేశం అదే. ఎందరెందరో మహామహులు సైతం తృప్తిలో ఉండే ఆనందాన్ని తెలుసుకోలేక పతనం చెందారు. ఆధ్యాత్మిక జీవన విధానంలో తృప్తిగురించి  పదేపదే ప్రస్తావించడానికి కారణం అదే.సుఖాల సంపదలమీదే మోజు పెంచుకుని వాటి కోసమే జీవిస్తే చివరికి అసంతృప్తి మిగులుతుంది. తృప్తిలేని మనుషులకు ఈ లోకమంతా అందించినా ఇంకా ఏదో లోటు కంపిస్తుంది. అందిన దానితో తృప్తిపడటం అలవాటు చేసుకోవాలి.

జీవహింస, దొంగతనము, పరదారాగమనము, పిసినారితనము, పరుషవచనము, అసత్యవచనము, అసందర్భ ప్రేలాపనము, జీవద్రోహచింత, ఇతరుల మేలుకు సహకరింపకుండుట, శాస్త్రముల యందు ద్వేషము అను ఈ పది పాపకార్యములు త్రికరణశుధ్ధిగా విడిచిపెట్టేయాలి. దర్మార్ధ కార్యక్రమముల కొరకు నిరంతరము ప్రయత్నము జరుగుతున్న చోట నివాసముండాలి. వాస్తు లోప భూయిష్టమైన ఇంటిలో నివాసముండకూడదు. ఇతరులకు అపకారము కలిగించి ధనమును సంపాదించరాదు. ధర్మపధ్ధతిలో సంపాదించిన ధనమే మనదగ్గర నిలుస్తుంది. అట్లు సంపాదించిన ధనమును తాను అనుభవించుచు, పాత్రత నెరిగి దానము చేసినవాడు ఇహపరములందు సుఖములను పొందును.

(ఇంకా ఉంది )