tag:blogger.com,1999:blog-46479618139693284572024-02-07T18:22:00.895-08:00సంస్కృతిAnonymoushttp://www.blogger.com/profile/04022717604315986029noreply@blogger.comBlogger459125tag:blogger.com,1999:blog-4647961813969328457.post-8463926836543016452017-06-07T04:28:00.001-07:002017-06-07T04:28:07.892-07:00<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
ఈ గ్రూపు లో రాధిక శ్రీ గారు, శివరామకృష్ణ గారు తొలిప్రయత్నం లోనే చక్కటి చిత్రాలు గీసేస్తున్నారు. వాళ్ళు ఏమి వెయ్యాలనుకుంటున్నారో, ఆ బొమ్మలు అలాగే వస్తున్నాయి. అదేం చిత్రమో, నాకు ఎప్పుడూ అలా వచ్చేవి కావు..భయపడకండి..వాళ్ళని చూసి నేను బొమ్మలు వేయనని సభా (గ్రూపు) ముఖంగా మీ అందరికీ మాట ఇస్తున్నాను.సరే, మన "భావుక" బాపు గారు రామకృష్ణ వంగల గారు బాపు బొమ్మలని అచ్చుగుద్దినట్టు వేసేస్తున్నారనుకోండి..(వారు ఈమధ్య కనబడడంలేదు. తెలిసినవాళ్ళెవరైనా ఆయన క్షేమసమాచారాలు కనుక్కొని, గ్రూపులో పోస్ట్ చేయవలసినదిగా సూచన). చిన్నప్పటి నుండి మా అక్క బొమ్మలు చాలా బాగా వేసేది, పెన్సిల్ స్కెచ్ లూ, పెయింటింగులూ అన్నీ, అందరూ మెచ్చుకునేవారు....ఆ బొమ్మల్లో ముఖకవళికలు చక్కగా ఉండేవి..శివాజిని గీస్తే అచ్చం శివాజీలాగే ఉండేది..ఆ స్పూర్తితో నేను కూడా గీసేద్దామని డిసైడ్ అయ్యాను. ఓ బొమ్మ వేసా....మొట్టమొదట మా అక్కకే చూపించా...ఇది ఏంటే, అని అడిగింది....అప్పుడేం గీసానో నాకు కూడా ఇప్పుడు గుర్తు లేదు కాని, ఆ బొమ్మ చూడగానే మా అక్క మొహంలో ఎక్స్ప్రెషన్స్ మాత్రం బాగా గుర్తున్నాయి.అది ఒక జంతువు బొమ్మ..దాన్ని ఫలానా అని గుర్తుపట్టడానికి ఇంట్లో వాళ్ళకి కొంచెం టైం పట్టింది...మొదట్లో ఎంతో క్లారిటీ తో వేసాను కానీ, చూడగా, చూడగా నాకు కూడా అది, కోతా, కుక్కా, పిల్లా, సింహమా, అసలు సాధుజంతువా, కౄరమృగమా అన్నది అర్ధం కాలేదు. ఇలా కాదని ఓ వారం గేప్ ఇచ్చి (ఇంట్లోవాళ్ళు తేరుకోవడానికి ఆమాత్రం టైం కావాలిగా) ఈసారి మనిషి బొమ్మ, ఒన్లీ మొహం ఒక్కటే వేసి చూపించా,..ఈసారీ మా అక్కకే...భలే వేసావే, మన తెలుకుల పైడమ్మని (మా ఇంటికి గానుగ నూనె తెచ్చేదిలెండి) ఒకట్రెండు సార్లు చూసినా చక్కగా వేసావు అంది సంతోషంగా....నాకు నోట్లోంచి మాట రాలేదు...మెల్లగా నోరు పెగల్చుకుని, అది పైడమ్మ బొమ్మ కాదక్కా...స్మితా పాటిల్ బొమ్మ అన్నా.....మా అక్క కిందపడబోయి నిలదొక్కుకుంది. ఆఖరికి, ఇద్దరికీ చుట్టరికం ఏమన్నా ఉందేమో కనుక్కుందాం ఉండు అని పక్కకి వెళ్ళిపోయింది....కాసేపటికి కానీ అది వ్యంగ్యం అని నాకు అర్ధం కాలేదు....ముందు చిన్న చిన్న బొమ్మలు ప్రాక్టీస్ చేయవే ...పోర్ట్రయిట్ లు తరువాత వేద్దువుగాని అంది...ఆహా....అంత చిన్న చిన్న వాటినుంచి మొదలెట్టడం ఎలాగా..పరువు తక్కువ అని మొత్తానికి చిత్రకళకి స్వస్తి పలికాను....దేశానికి నీ వంతు సాయం నువ్వు చేసావు సుమీ అని ఓ వంకర నవ్వు నవ్వింది...ఇదీ నా చిత్రకళాభ్యాసం కథ...<br />
<br />
నేను కూచిపూడి నేర్చుకుంటాను మొర్రో అని మొత్తుకుంటే కాదు సంగీతం నేర్చుకో అన్నారు ఇంట్లోవాళ్ళు.. అయితే వీణ నేర్పించండి అన్నా (ఇప్పుడు వసంతశ్రీ గారికి పోటీ అయ్యుండేదాన్ని ) కాదు, నీ గొంతు బాగుంటుంది, గాత్రం నేర్చుకో అన్నారు.....నా ప్రాణానికి పట్టుబడితేనా, అదేమిటో ఇప్పటికీ స్వరస్థానాలు అన్నీ ఒకలాగే ఉంటాయి నాకు. ఎప్పుడూ ఎందుకొచ్చిందిరా దేవుడా అనుకుంటూనే క్లాసులో కూర్చునేదాన్ని.. అయితే ఒకవిషయం ఇక్కడ గమనించాలి..సొంతంగా స్వరం పాడలేకపోయినా, మాస్టారు చెప్పినది అచ్చుగుద్దినట్టు పాడేసేదాన్ని....చిలక పలికినట్టు.. ఇంటర్మీడియెట్ లో చేరాకా మా క్లాసులో అమ్మాయి సినిమా పాటలకి కూడా రాగాలు చెప్పేసేది....ఇప్పుడు మన గ్రూపులో కృష్ణమూర్తిగారు చెప్తున్నట్టు...అది విన్నాక, నాకే తొందరగా జ్ఞానోదయం అయింది....శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటే ఆ విధంగా నేర్చుకోవాలి, నాకు ఇంకో రెండు జన్మలు ఎత్తితేనే కానీ పట్టుబడదు అని....ఈలోపు మా అక్క పెళ్ళి అయి వెళ్ళిపోవడం, మా నాన్నగారికి వేరే ఊరు ట్రాన్స్ఫర్ అవ్వడం....నా సంగీతసాధన అటకెక్కడం జరిగినాయి...బతుకుజీవుడా అని సంగీత సరస్వతికి ద్రోహం చేసే పాపం ఈజన్మకి అంటుకోకుండా నన్ను నేను కాపాడుకోగలిగాను...<br />
<br />
నా తొలివంట ప్రయోగం గురించి, లలితసంగీతం గురించి, హిందీ పాటలగురించి, సిలోన్ రేడియో ముచ్చట్ల గురించి మరోసారి....)<br />
<br />
may 30 2016<br />
<br />
గమ్యం లేని బాటసారులు<br />
ఎంతోమంది అనామకులు ఈ లోకంలో..<br />
లక్షలుగా.. కోట్లుగా...<br />
పుట్టినందుకు బతుకుతున్నారు ..<br />
బ్రతకడానికి తింటున్నారు..<br />
తినడం కోసమే బతుకుతున్నారు..<br />
విశ్వమంతా వ్యాపించిన<br />
కోటానుకోట్ల జీవరాశులతో పాటే వీరూను...<br />
చీమల్లా, దోమల్లా, మిడతల్లా..<br />
ఏ ప్రయోజనమూ లేకుండా. .<br />
ఏ లక్ష్యమూ , ఏ ఆశయమూ లేకుండా. ..<br />
గాలికి ఎగిరే ఎండుటాకులు..<br />
గమ్యం లేని బాటసారులు. .<br />
నిలువెల్లా నిస్సారం, నిర్లిప్తత,<br />
ముందు చూపు లేని అసమర్థత..<br />
రోజు కు ఇరవైనాలుగు గంటలు. .<br />
నెలకు ముప్పై రోజులు. .<br />
ఏళ్ళకేళ్ళు గడుస్తాయి ఏ మార్పు లేకుండా ..<br />
ఏ ప్రత్యేకత లేకుండా. .<br />
ఆయువున్నంతకాలం నిరర్ధకంగా బతికి<br />
ఈ జీవులన్నీ చివరికి చేరేది చితికి..<br />
<br />
may </div>
Anonymoushttp://www.blogger.com/profile/04022717604315986029noreply@blogger.com0tag:blogger.com,1999:blog-4647961813969328457.post-15236568667145335972017-06-07T04:23:00.001-07:002017-06-07T04:23:06.389-07:00<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<div style="background-color: white; color: #1d2129; font-family: Helvetica, Arial, sans-serif; font-size: 14px; margin-bottom: 6px;">
లోకంలో ఎన్నో రకాల మనస్తత్వాలు ఉన్నవారు ఉంటారు... కానీ కొంతమందిని చూస్తే నవ్వొస్తుంది. . వాళ్ళు, వాళ్ళ పిల్లలు మాత్రమే చాలా అందంగా ఉన్నట్టు, రోడ్డు మీదకి రాగానే లోకం అంతా వాళ్ళనే చూస్తున్నట్టుగా, ఒక ఫీలింగ్. . మరి కొంతమంది ఆడవాళ్ళకి మగవాళ్ళందరూ వాళ్ళని చూడడానికి, వాళ్ళతో పరిచయం పెంచుకోవడానికే పుట్టారని ఓ భయంకరమైన అపోహ.. వయసులో ఉన్నవాళ్ళే కాకుండా. . నడివయసులో ఉన్న ఆడవారు కూడా ఇలా ఆలోచిస్తున్నారని ఈ మధ్యనే తెలిసింది. . వాస్తవం ఏంటంటే.. ఇల్లు వదిలి రోడ్డు మీదకి వచ్చాక.. ఎవడి ఆ<span class="text_exposed_show" style="display: inline; font-family: inherit;">లోచనలు వాడివి.. ఎవడి పని వాడిది.. రోడ్డు మీద పెరిగే ట్రాఫిక్, అడుగడుక్కీ పడే సిగ్నల్స్, పొల్యూషన్.. వీటన్నిటినీ తప్పించుకుని పని ముగించుకుని ఇంటికొచ్చి పడడం మీదనే అందరి దృష్టీను.. పక్కన ఎవరున్నారు, అందంగా ఉన్నారా లేదా, ఏ డ్రస్ వేసుకున్నారు అని ఆలోచించే తీరిక ఎవరికీ ఉండదనుకుంట.. మరీ అందంగా ఉంటే ఓసారి చూస్తారేమో.. అంతేకానీ ఇంటికెళ్లాక కూడా వాళ్ళ గురించే ఆలోచించే జనాలు ఉంటారని నేనయితే అనుకోను.. ఎవరెలా అనుకున్నా నాకేం బెంగ లేదు కానీ.. అటువంటి మాటలు వినేటప్పుడే.. ఎండాకాలం ఎడారిలో నడుస్తున్నట్టు ఉంటుంది. ..</span></div>
<div class="text_exposed_show" style="background-color: white; color: #1d2129; display: inline; font-family: Helvetica, Arial, sans-serif; font-size: 14px;">
<div style="font-family: inherit; margin-bottom: 6px;">
ఇదో రకం obsession అనుకోవాలో.. హిపోక్రసీ అనుకోవాలో...</div>
</div>
</div>
Anonymoushttp://www.blogger.com/profile/04022717604315986029noreply@blogger.com0tag:blogger.com,1999:blog-4647961813969328457.post-9722750898440243512017-06-07T04:21:00.001-07:002017-06-07T04:21:26.749-07:00<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<div style="background-color: white; color: #1d2129; font-family: Helvetica, Arial, sans-serif; font-size: 14px; margin-bottom: 6px;">
కృష్ణ వ్యధ</div>
<div style="background-color: white; color: #1d2129; font-family: Helvetica, Arial, sans-serif; font-size: 14px; margin-bottom: 6px; margin-top: 6px;">
జాబిల్లి వెన్నెల ని ఒంపేస్తోంది ధారాళంగా ..<br />చెట్టు పిట్ట నిశ్శబ్దంగా నిదురలోకి జారుకున్నాయి..<br />నిశి మౌనంగా వీక్షిస్తోంది నువ్వెప్పుడొస్తావా అని.. <span class="text_exposed_show" style="display: inline; font-family: inherit;"><br />యమున అలల్లాడకుండా నిలచి చూస్తోంది<br />మన సరాగాలు మొదలవ్వడం కోసం ..</span></div>
<div class="text_exposed_show" style="background-color: white; color: #1d2129; display: inline; font-family: Helvetica, Arial, sans-serif; font-size: 14px;">
<div style="font-family: inherit; margin-bottom: 6px;">
నీ అడుగుల సవ్వడి కోసం ఎద ఎదురుచూస్తోంది..<br />నీతో ఊసులు కలబోసుకోవాలని<br />నవ్వే నీ పెదవుల అరుణిమలు పంచుకోవాలని<br />హృదయం ఆరాటపడుతోంది...</div>
<div style="font-family: inherit; margin-bottom: 6px; margin-top: 6px;">
ఏడనున్నావు రాధా ..<br />ఏల జాగేల రాధా. ...</div>
<div style="font-family: inherit; margin-bottom: 6px; margin-top: 6px;">
నీవు అరుదెంచిన వేళ<br />గాలిలో నీ పరిమళం తేలివచ్చి<br />నను తాకుతుంది<br />నీ చిరుపాదాల అందెల సవ్వడి<br />నా మనో వేదికపై ఘల్లుమంటుంది..<br />జీరాడే కుచ్చిళ్ళ చిరు సందడి<br />సన్నని రవమై చెవులకు సోకుతుంది ..<br />నను చేరాలని తొందరపడే<br />నీ శ్వాసల బరువు<br />శబ్దమై నా హృదయానికి చేరుతుంది. .<br />పరిసరాలు నిన్ను చూసి పరవశమొందుతాయి..<br />ప్రకృతి నీకు పాదాక్రాంతమౌతుంది..</div>
<div style="font-family: inherit; margin-bottom: 6px; margin-top: 6px;">
నీ సుతిమెత్తని నడకలతో<br />నాదరికి రావా!!<br />జాము జారిపోయేలోగా<br />జతను చేరవా! !</div>
<div style="font-family: inherit; margin-bottom: 6px; margin-top: 6px;">
<br /></div>
<div style="font-family: inherit; margin-bottom: 6px; margin-top: 6px;">
2 june 2017</div>
</div>
</div>
Anonymoushttp://www.blogger.com/profile/04022717604315986029noreply@blogger.com0tag:blogger.com,1999:blog-4647961813969328457.post-77003033287584801562017-06-07T04:18:00.001-07:002017-06-07T04:18:21.478-07:00<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<div style="background-color: white; color: #1d2129; font-family: Helvetica, Arial, sans-serif; font-size: 14px; margin-bottom: 6px;">
అబ్బా..<br />అబ్బబ్బా...<br />ఎండలు..<br />అలసట..<br />తలనొప్పి ..<span class="text_exposed_show" style="display: inline; font-family: inherit;"><br />( ఏంటీ తల ఉన్న వాళ్ళకే కదా<br />తలనొప్పి, నీకెందుకొచ్చింది అంటారా!!<br />నాకూ ఎప్పట్నుంచో అదే డౌటు..<br />కానీ నాకూ అప్పుడప్పుడు తలనొప్పి వస్తుంటుంది.)</span></div>
<div class="text_exposed_show" style="background-color: white; color: #1d2129; display: inline; font-family: Helvetica, Arial, sans-serif; font-size: 14px;">
<div style="font-family: inherit; margin-bottom: 6px;">
నడుము నొప్పి..<br />మందుల్లేని బాధలు..<br />మందులేసుకోని మొండితనం..<br />అన్నట్టు ఇది కూడా ఓ రోగమే..<br />మందు లేని రోగం..<br />మా అమ్మమ్మ అనేది..<br />మొగుడు నాలుగు వడ్డిస్తే<br /> తగ్గే రోగం అని..<br />పాపం ఇప్పటి మొగుళ్ళకి అంతటి<br />ధైర్యం ఎక్కడిదీ..</div>
<div style="font-family: inherit; margin-bottom: 6px; margin-top: 6px;">
నడిస్తే ఆయాసం..<br />తినకపోతే నీరసం..<br />కాళ్ళు నొప్పులు..<br />ఒక్కోసారి వాపులు..<br />లేస్తే కూచోలేము..<br />కూచుంటే లేవలేము..<br />ఇదేం కేటగిరీ యో అర్ధం కాదు..</div>
<div style="font-family: inherit; margin-bottom: 6px; margin-top: 6px;">
డాక్టరు దగ్గరకెళ్తే<br />మందుల కన్నా ముందు<br />బరువు తగ్గమంటారు...<br />ఇంకా ఏవేవో చెప్తారు..<br />మనకి బొత్తిగా పడనివి..</div>
<div style="font-family: inherit; margin-bottom: 6px; margin-top: 6px;">
ఉదయపు నడకకు ఆమడ దూరం...<br />వ్యాయామం అంటే ఇంకా దూరం..<br />తిండి తగ్గిస్తే ఒకటే నీరసం..</div>
<div style="font-family: inherit; margin-bottom: 6px; margin-top: 6px;">
మిరియాలు తింటే,<br />పిప్పళ్ళు తింటే,<br />తాంబూలం వేసుకుంటే,<br />దాల్చిన చెక్క తింటే,<br />సబ్జాలు తాగితే,<br />నిమ్మరసం+తేనే తాగితే,<br />త్రిఫల చూర్ణం తాగితే...<br />బరువు తగ్గుతారట...<br />ఎన్ని సలహాలో..<br />ఎన్ని చిట్కాలో..</div>
<div style="font-family: inherit; margin-bottom: 6px; margin-top: 6px;">
హమ్మయ్య!! శ్రమలేని పని..<br />సులువుగా బరువు తగ్గచ్చు...<br />ఓ వారం గడిచినా<br />చటాకు బరువు తగ్గలేదు..<br />ఇది కాదు పని అని అన్నీ మానేసా..</div>
<div style="font-family: inherit; margin-bottom: 6px; margin-top: 6px;">
నూనెలో వేయించినవి..<br />స్వీట్లు..<br />పెరుగు..<br />ఇవన్నీ కూడా మానేసా..</div>
<div style="font-family: inherit; margin-bottom: 6px; margin-top: 6px;">
ఇంతలో ఇంట్లో పుట్టినరోజులు..<br />పండగలు..<br />మా పెళ్ళిరోజు..<br />ఒక్క స్వీటు ..<br />ఒక్కటే ఒక్కటి అనుకుంటూ..<br />నాలుగైదు .. లెక్కకి.. అంతే..</div>
<div style="font-family: inherit; margin-bottom: 6px; margin-top: 6px;">
చాన్నాళ్ళ క్రితం చూసిన ఫ్రెండు..<br />అప్పటికీ ఇప్పటికీ<br />నువ్వు ఏం మారలేదు అని కితాబిస్తే,<br />పొంగిపోయి, పర్వాలేదులే అనుకుని<br />తనతో పాటు ఒక ఐస్ క్రీం...</div>
<div style="font-family: inherit; margin-bottom: 6px; margin-top: 6px;">
ఏంటమ్మా అప్పటికన్నా చిక్కిపోయావు<br />అని ఆర్నెల్ల తర్వాత<br />ఇంటికొచ్చిన కొడుకు ఆరా తీస్తే,<br />వాడితో పాటు మంచూరియా, పనీర్ కుర్మా..<br />కాజూ బర్ఫీ.. మలయ్ కోఫ్తా..</div>
<div style="font-family: inherit; margin-bottom: 6px; margin-top: 6px;">
మధ్య మధ్యలో పిజ్జాలు, బర్గర్లు,<br />సమోసాలు, చాట్ లు,<br />రారమ్మని పిలిచే<br /> అమూల్ మరియు ఐబాకోలు..<br />ఏదో పిల్లల కోసం...</div>
<div style="font-family: inherit; margin-bottom: 6px; margin-top: 6px;">
ఆరోజుకి ప్రశాంతంగా పడుకున్నా..<br />తెల్లారే మళ్ళీ భయం మొదలు..<br />నిన్న తిన్న 100 గ్రాముల టిఫిన్,<br />యాభై గ్రాముల స్వీటుకి,<br />ఎన్ని గ్రాముల బరువు పెరిగానా అని..</div>
<div style="font-family: inherit; margin-bottom: 6px; margin-top: 6px;">
ఏదో ఓ మంచి రోజు చూసి<br />వాకింగ్ మొదలెట్టాల్సిందే..<br />దృఢ నిశ్చయం..<br />కేలండర్ చూస్తే ఏకాదశి<br />ఐదారు రోజుల తర్వాత..<br />ఎలాగూ అప్పట్నుంచి వాకింగ్ చేస్తాం కాబట్టి<br />ఈలోపు ఒక్క స్వీటు..<br />పర్వాలేదు..<br />ఒక్కదానికి పెద్ద బరువు పెరగరు..<br />నాకు నేనే చెప్పుకున్న ధైర్యం..</div>
<div style="font-family: inherit; margin-bottom: 6px; margin-top: 6px;">
ఈలోపు శ్రావణమాసం,<br />ఆ పై మాసం ఆశ్వయుజం..<br />నాకు కాకపోయినా<br />అమ్మవార్లకి పెట్టాలి నైవేద్యం..<br />అదే తలోకాస్తా ఫలహారం..</div>
<div style="font-family: inherit; margin-bottom: 6px; margin-top: 6px;">
అటుపై కార్తీకం..<br />ఉపవాసాల సమయం..<br />హమ్మయ్య..<br />ఇక అక్కర్లేదు..<br />ఏ వాకింగు, ఏ వ్యాయామం,<br />తెరిపిన పడే ప్రాణం..</div>
<div style="font-family: inherit; margin-bottom: 6px; margin-top: 6px;">
ఇలా ఒక ఏడాది గడుస్తుంది<br />హాయిగా..<br />జనవరి ఫస్టుకి<br />మళ్ళీ సరికొత్త నిర్ణయం..<br />ఈ ఏడాది ఎలాగైనా బరువు తగ్గాలి..</div>
<div style="font-family: inherit; margin-bottom: 6px; margin-top: 6px;">
( గమనిక : ఇది కవిత కాదు... కవిత అనుకుని పొరపడితే నా తప్పు కాదు... పేరాలో రాసేదాన్ని తీసుకొచ్చి, ముక్క ముక్కలుగా చేసి.. వెరైటీగా .. విరిచి... మీ ముందు ప్రదర్శించాను.. ( ప్రదర్శించినది కవిత కాదు, నా అతితెలివి అనుకుంటున్నారా?? అనుకోండి ..నేను మిమ్మల్ని ఆపలేను కదా.. అనుకోకుండా... )</div>
<div style="font-family: inherit; margin-bottom: 6px; margin-top: 6px;">
<br /></div>
<div style="font-family: inherit; margin-bottom: 6px; margin-top: 6px;">
6 june 2017</div>
</div>
</div>
Anonymoushttp://www.blogger.com/profile/04022717604315986029noreply@blogger.com0tag:blogger.com,1999:blog-4647961813969328457.post-48480715886753837792017-06-07T04:16:00.001-07:002017-06-07T04:16:39.245-07:00<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<div style="background-color: white; color: #1d2129; font-family: Helvetica, Arial, sans-serif; font-size: 14px; margin-bottom: 6px;">
ఈవారం కథా సమీక్ష:</div>
<div style="background-color: white; color: #1d2129; font-family: Helvetica, Arial, sans-serif; font-size: 14px; margin-bottom: 6px; margin-top: 6px;">
జులై నెల స్వాతి మాస పత్రిక లో ఈసారి "అత్తలూరి విజయలక్ష్మి" గారి కథ "కొడుకు" మనసుకు హత్తుకుంది.. చాలా మంది చదివే ఉంటారు ఈపాటికి.. చదవని వారి కోసం...</div>
<div style="background-color: white; color: #1d2129; font-family: Helvetica, Arial, sans-serif; font-size: 14px; margin-bottom: 6px; margin-top: 6px;">
ఇది ఓ అమ్మ కథ.. ఓ తల్లి వ్యథ..</div>
<div style="background-color: white; color: #1d2129; font-family: Helvetica, Arial, sans-serif; font-size: 14px; margin-bottom: 6px; margin-top: 6px;">
భర్త చనిపోయిన దగ్గర్నుండీ కంటికి రెప్పగా కాపాడుకుంటూ వచ్చిన తన ఇద్దరు కొడుకులూ, రెక్కలొచ్చాక, తన బాధ్యత తీసుకోవడానికి ఇష్టపడక, ఏవో సాకులతో, ఉన్నఊళ్ళోనే తనకు దూరంగా వెళ్ళిపోయాక, ఆ బాధ తట్టుకోలేక, ముందు మనోవేదన పడీ, తరువాత మంచాన పడీ... ఏనాటి ఋణమో పనిమనిషి లక్ష్మి సేవ-శుశ్రూషలతో కొద్దిగా కోలుకుని... జబ్బు పేరుతో నాలుగు గోడల మధ్య పడుకుని పడుకుని విసుగొచ్చి, ఒక్కసారి బయటిగాలి పీల్చుకోవాలనే ఆశతో, పనిమనిషి భయపడుతున్నా సరే, చేతికర్ర తీసుకుని, నడవగలనేమో చూస్తాను అని గుమ్మం దాటుతుంది నడివయసులో ఉన్న రమణి.. ఇన్నాళ్ళకి బయటకు వచ్చిన తనను ముందు ఓ చల్లని పిల్లగాలీ, తరువాత ఆ చుట్టుపక్కల ఉండే ఆత్మీయులు పరామర్శించగా, తాను ఆ చుట్టూ ఉన్న మొక్కా మోడును పలకరించి, ఎదురుగా ఉన్న పార్కులోకెళ్ళి చిన్నగా కొంత సేపు వాకింగ్ చేసి అక్కడె ఉన్న ఒక చెట్టు కింద చప్టా మీద కూర్చుని, పర్వాలేదు, నేను నడవగలను, నా కాళ్ళ మీద నేను నిలబడగలను అని ధైర్యం చెప్పుకుని , సేదదీరేంతలో-- పక్కనే తనకన్నా పెద్ద వయసు ఉన్న ఓ మహిళ ఒంటరిగా, కొంచెం బిడియంగా, కొత్తకొత్తగా ఉన్నట్టు గమనించి మాటలు కలుపుతుంది..</div>
<div style="background-color: white; color: #1d2129; font-family: Helvetica, Arial, sans-serif; font-size: 14px; margin-bottom: 6px; margin-top: 6px;">
ఆమె తీరు, తరహా ఓ మంచి కుటుంబానికి చెందిన మహిళే అని చెప్తున్నప్పటికీ ఇక్కడ ఒంటరిగా ఎందుకు ఉందీ అనే ఆలోచన మనసును తొలిచేస్తూ ఉండగా, ఆమెతో మాటలు కలుపుతుంది.. నాలుగు నెలల క్రితం తన భర్త పోయాక, అన్నదమ్ముడు ఈమధ్యనే తీసుకొచ్చి కొడుకు దగ్గర దింపిపోయాడని, ఆ కొడుకు తనను ఇక్కడ కూర్చోపెట్టి ఏదో పని మీద బయటకు వెళ్ళాడనీ, తిరిగి వచ్చి తనను ఇంటికి తీసుకెళ్తాడనీ ఆమె నోట విన్నప్పుడు, తన కొడుకులు ఇచ్చిన అనుభవాలతో ఆ మహిళ మాటలను నమ్మలేక, ఆమె కొడుకుపై నమ్మకం ఉంచలేక ఆవిడ స్థితికి జాలిపడుతుంది రమణి.. మెల్లగా పొద్దు వాటారుతుంది.. తనకూ కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి.. ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకోవాలి... పార్కులో అందరూ ఇళ్ళకి మళ్ళుతున్నారు.. ఓవైపు నీరసం, మరోవైపు ఒంటరిగా నగరానికి కొత్త అయి, తన కొడుకు ఉండే కాలనీ ఏదో తెలియక, కనీసం అతని ఫోన్ నంబర్ కూడా తెలియక అమాయకంగా కూర్చున్న ఈ మహిళ ను ఒంటరిగా వదిలి పోలేక, అసలు ఆమె కొడుకు వస్తాడా రాడా, లేక, ఈవిడను వదిలించుకోవడానికి ఇక్కడ వదిలి వెళ్ళాడా అనే అనేకానేక ఆలోచనలతో సతమతమవుతుంది.. తన ఇంటికి తీసుకెళ్ళచ్చు.. కానీ ఆవిడ ఎలాంటిదో.. లేదా ఏదో ఒక అనాధాశ్రమానికి పంపవచ్చు, ఎవరి సహాయమైనా తీసుకుని... ఇలాంటి ఎడతెగని సంశయాలతో, ఆఖరికి ఆమె కొడుకు రాడు అని తనకు తానే తీర్మానించుకుని ఆమె మీద ఎంతో జాలిపడుతుంది.. ఇక చేసేదేమీ లేక ఇంటికి వెళ్ళడానికి సిధ్ధం అవుతుంది.. ఆ మహిళ మాటల్లో తన కొడుకు పట్ల ప్రేమ, నమ్మకం స్థిరంగా ఉండడం చూసి, ఆమె అసహాయ స్థితికి బాధ పడుతుంది.. ఇంతలో పార్కు ముందు ఒక కారు ఆగడం , అందులోంచి ఒక వ్యక్తి దిగి వచ్చి, ఆమెను శ్రధ్ధగా, ప్రేమగా పొదివి పట్టుకుని నడిపిస్తూ,, "' రామ్మా !! ఇప్పటివరకూ ట్రాఫిక్ లో చిక్కుకున్నానమ్మా.. పాపం ఎంత టెన్షన్ పడి ఉంటావో!! ఆకలి కూడా వేస్తూ ఉండవచ్చు. నీకు ఇష్టమైన మిరపకాయ బజ్జీలు కార్లో ఉన్నాయి .. తిందువుగాని" అని ఎంతో అనురాగం తో తీసుకెళ్తున్న ఆమె కొడుకును చూసి అంతవరకు తన కొడుకులతో పోల్చుకుని అతనిని మోసగాడు అనుకుని ఆందోళన పడిన రమణికి... వీస్తున్న పిల్లగాలి కూడా వీపున ఛెళ్ళున చరచినట్లయింది"..</div>
<div style="background-color: white; color: #1d2129; font-family: Helvetica, Arial, sans-serif; font-size: 14px; margin-bottom: 6px; margin-top: 6px;">
ఇదీ కథ.. కథ, కథనం, శైలి అత్యద్భుతంగా ఉండి.. ఒకసారి మొదలు పెడితే, ఆపకుండా చదివించే బలం ఉన్న కథ ఇది... చదువుతున్న ప్రతివ్యక్తీ ఉన్న రెండు పాత్రలలో తనను తాను ఐడెంటిఫై చేసుకునే కథ... చాలా బాగుంది.. ఒక్కసారి చదివితే సరిపోదు.. ఎందుకంటే కథ ముగింపు ఏమైందా అని ఆత్రంగా చదివేస్తాం మొదటిసారి.. ఆ కథ లో లీనమవ్వాలంటే మరోసారి సావధానంగా చదవాలి... అలా రెండో సారో, మూడో సారో చదివిన ఈ కథ జీవితాంతం మన మనసుల్లో చెరగని ముద్ర వేస్తుంది..</div>
<div style="background-color: white; color: #1d2129; display: inline; font-family: Helvetica, Arial, sans-serif; font-size: 14px; margin-top: 6px;">
ఈ కథను అందించిన అత్తలూరి విజయలక్ష్మి గారికి ధన్యవాదాలు...</div>
<div>
<div style="background-color: white; color: #1d2129; display: inline; font-family: Helvetica, Arial, sans-serif; font-size: 14px; margin-top: 6px;">
<br /></div>
</div>
<div>
<div style="background-color: white; color: #1d2129; display: inline; font-family: Helvetica, Arial, sans-serif; font-size: 14px; margin-top: 6px;">
6 june 2017</div>
</div>
<div>
<div style="background-color: white; color: #1d2129; display: inline; font-family: Helvetica, Arial, sans-serif; font-size: 14px; margin-top: 6px;">
<br /></div>
</div>
</div>
Anonymoushttp://www.blogger.com/profile/04022717604315986029noreply@blogger.com1tag:blogger.com,1999:blog-4647961813969328457.post-79630825179786032172016-09-16T08:40:00.001-07:002016-09-16T08:40:30.495-07:00<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<div style="background-color: white; color: #1d2129; font-family: helvetica, arial, sans-serif; font-size: 14px; margin-bottom: 6px;">
శ్రీ రమణ గారు "మిథునం" కథ ద్వారా మనందరికీ పరిచయమే.... "నాకు నచ్చిన కథ" శీర్షికన ఆయన వ్రాసిన మరో ఆణిముత్యం "బంగారు మురుగు" కథ పరిచయం చేయబోతున్నాను...నేను ఎంతవరకూ న్యాయం చేయగలనో తెలియదు..ఎందుకంటే వారి కథలను క్లుప్తీకరించి వ్రాయడం సాహసమే...అచ్చతెలుగు కథలకు మరో ఉదాహరణ ఈ " బంగారు మురుగు"..</div>
<div style="background-color: white; color: #1d2129; font-family: helvetica, arial, sans-serif; font-size: 14px; margin-bottom: 6px; margin-top: 6px;">
ఈయన విద్యార్థి దశలో ఉన్నప్పుడు జాతీయస్థాయి వివేకానందా వ్యాస రచన పోటీలలో వరుసగా ఆరుసంవత్సరాలు ప్రథమ బహుమతి అందుకున్నారట..బాపు రమణలతో కలిసి చిత్రపరిశ్రమలో 20 ఏళ్ళు పనిచేసారట...ప్రస్తుత కథ 1993 సంవత్సరంలో ఆంధ్ర జ్యోతి వార పత్రిక కోసం వ్రాసినది..ఈ కథకు "జ్యేష్ట లిటరరీ" అవార్డు లభించింది....</div>
<div style="background-color: white; color: #1d2129; font-family: helvetica, arial, sans-serif; font-size: 14px; margin-bottom: 6px; margin-top: 6px;">
ఓ ఇంట్లో ఓ బామ్మకీ, మనవడికీ ఉన్న బంధం గురించి చెప్తుందీకథ. మడి, పూజ వంటివి లేకపోయినా, "మొక్కకు చెంబుడు నీళ్ళు పోయడం, పక్షికి గుప్పెడు గింజలు చల్లడం, పశువుకి నాలుగు పరకలు వెయ్యడం, ఆకొన్నవాడికి పట్టెడన్నం పెట్టడం...ఇవే బామ్మకు తెలిసిన బ్రహ్మసూత్రాలు...గుడినీ, గుడిలో లింగాన్నీ మింగేసే ఓ స్వాములారి సేవలో కొడుకుకు ఉన్న మడులూ, మాన్యాలూ అంతరించిపోగా, మనవడికి అంతా తానై పెంచుతుంది...పెరట్లో ఉన్న బాదం చెట్టు ఇద్దరికీ ఆవాసం..రాలిపడిన బాదం కాయలూ, అమ్మకి తెలియకుండా, చెట్టుతొర్రలో మిఠాయిలూ, జీళ్ళూ దాచే బామ్మే మనవడికి తోడూ, నీడా, దైవం అన్నీనూ...పరువు తక్కువగా... బయటి చిరుతిళ్ళు మనవడికోసం కొని పెడుతోందని తెలిసిన కొడుకూ కోడలూ బామ్మ చేతికి డబ్బులు అందకుండా చూస్తే,....... బియ్యం ఎదురిచ్చి జీళ్ళు కొంది బామ్మ....ఆ తరువాత బియ్యం డబ్బాకి కూడా తాళం పడితే, మనవడి పీచుమిఠాయి కోసం దేవుడిగదిలో కంచు గంటకి కాళ్ళొస్తాయి...మిఠాయిలూ, జీళ్ళూ, పీచుమిఠాయి ఆరోజుకి ఇచ్చేసి, మరుసటి వారం సంతరోజు వాడొచ్చి ఇంకా బాకీ ఉన్నానని మరిన్ని జీళ్ళూ, వగైరా ఇచాకగానీ ఇంట్లో కంచుగంట ఆచూకీ తెలియలేదు...పూజలూ, పునస్కారాలూ, స్వాములోర్లూ, సత్కారాలూ, జప తప హోమాదుల్లో మడులూ మాణ్యాలూ కరిగిపోవడం ఎలా తెలియలేదో, అంత దాకా ఒకటే కంచం, ఒకటే మంచంగా బామ్మతో బ్రతికిన మనవడికి కంచం , మంచం వేరయ్యాక గానీ, తనకి వయసొచ్చిందని తెలియలేదు...పెళ్ళీడు వచ్చాక, వరస అయిన మనవరాలు (కూతురి కూతురు) ఉన్నా కూడా ఆమే గుణం తెలిసి బయట సంబంధం చూస్తుంది బామ్మ..నాలుగు కాసుల బంగారం దగ్గర సంబంధం చేజారుతుందంటే, ఏదో మాయ చేసి, సంబంధం ఖాయం చేస్తుంది..పెళ్ళి సమయం లోనూ, మరణ శయ్య మీద ఉన్నప్పుడూ ...అసలు మనవడికి గ్రాహ్యకం వచ్చినదగ్గర్నుండీ ఎన్నో జీవిత సయ్తాలు చెప్తుంది బామ్మ....విచారించకు వెర్రి నాగన్నా....ఇప్పుడు వెళ్ళి, అటూ ఇటూ కాస్త పెత్తనం చేసి మళ్ళీ నీ ఇంటికే వస్తాగా అని మనవడికి భరోసా ఇచ్చి కన్ను మూస్తుంది...</div>
<div style="background-color: white; color: #1d2129; font-family: helvetica, arial, sans-serif; font-size: 14px; margin-bottom: 6px; margin-top: 6px;">
స్థూలంగా ఇదీ కథ...అయితే, కథ ఆద్యంతం, తెలుగు భాష తీయదనం ప్రవహిస్తూ ఉంటుంది...బామ్మల దగ్గర బాల్యాన్ని గడిపిన అదృష్టవంతులందరూ ఈ కథలో తమ బాల్యాన్ని పోల్చుకుంటారు.</div>
<div style="background-color: white; color: #1d2129; font-family: helvetica, arial, sans-serif; font-size: 14px; margin-bottom: 6px; margin-top: 6px;">
"పెద్దతనపు నస, అత్తగారి సాధింపులూ, వేధింపులూ బామ్మ దగ్గరలేవు"...</div>
<div style="background-color: white; color: #1d2129; font-family: helvetica, arial, sans-serif; font-size: 14px; margin-bottom: 6px; margin-top: 6px;">
ఎవరైనా ఈ ముసలమ్మకి భయం భక్తీ రెండూ లేవు అంటే " దయ కంటే పుణ్యం లేదు..నిర్దయ కంటే పాపం లేదు...చెట్టుకి చెంబెడు నీళ్ళు పోయడం, పక్షికి గుప్పెడు గింజలు చల్లడం, పశువుకి నాలుగు పరకలు వెయ్యడం, ఆకొన్నవాడికి పట్టెడు మెతుకులు పెట్టడం,....నాకు తెలిసిందివే" ...</div>
<div style="background-color: white; color: #1d2129; font-family: helvetica, arial, sans-serif; font-size: 14px; margin-bottom: 6px; margin-top: 6px;">
"మండువా లోగిలి పమిట కప్పుకు నిలబడ్డ పెద్ద ముత్తయిదువలా ఉండేది"...</div>
<div style="background-color: white; color: #1d2129; font-family: helvetica, arial, sans-serif; font-size: 14px; margin-bottom: 6px; margin-top: 6px;">
"పిచ్చి సన్నాసీ! దేవుళ్ళు నిద్దరోతార్రా! దేవుడు నిద్దరోతే ఇంకేవైనా ఉందీ!! మేలుకొలుపులూ మనకోసమే, చక్కెర పొంగలీ మనకోసమే!!"</div>
<div style="background-color: white; color: #1d2129; font-family: helvetica, arial, sans-serif; font-size: 14px; margin-bottom: 6px; margin-top: 6px;">
"బాదం చెట్టు భోషాణం"..</div>
<div style="background-color: white; color: #1d2129; font-family: helvetica, arial, sans-serif; font-size: 14px; margin-bottom: 6px; margin-top: 6px;">
"విచ్చిన గులాబీలు కుక్కినట్టు డబ్బా నిండా పీచుమిఠాయిలు"...</div>
<div style="background-color: white; color: #1d2129; font-family: helvetica, arial, sans-serif; font-size: 14px; margin-bottom: 6px; margin-top: 6px;">
"నాది అనుకుంటే దు:ఖం, కాదు అనుకుంటే సుఖం"...</div>
<div style="background-color: white; color: #1d2129; font-family: helvetica, arial, sans-serif; font-size: 14px; margin-bottom: 6px; margin-top: 6px;">
"దేవుడు ఏడుస్తుంటే ఎంత భయం వేస్తుంది---దిక్కులేని వాళ్ళకి"...</div>
<div style="background-color: white; color: #1d2129; font-family: helvetica, arial, sans-serif; font-size: 14px; margin-bottom: 6px; margin-top: 6px;">
"ఆ నవ్వు కొండంత ధైర్యమై నన్నావరించింది"..</div>
<div style="background-color: white; color: #1d2129; font-family: helvetica, arial, sans-serif; font-size: 14px; margin-bottom: 6px; margin-top: 6px;">
"ఉపోషం ఉంటే పిల్లాడి వాతలు పోతాయా?"..</div>
<div style="background-color: white; color: #1d2129; font-family: helvetica, arial, sans-serif; font-size: 14px; margin-bottom: 6px; margin-top: 6px;">
" పిల్ల పొందిగ్గా ఉంది...పచ్చగా దొరసానిలా ఉంది...కళ్ళు కజ్జికాయల్లా ఉన్నాయి...నాలుగు కాసుల బంగారం ఒక్క ముద్దుకి చెల్లు..."</div>
<div style="background-color: white; color: #1d2129; font-family: helvetica, arial, sans-serif; font-size: 14px; margin-bottom: 6px; margin-top: 6px;">
"అరటి దూట కూరకీ, ముగ్గులకీ బోలెడు ఓర్పూ, నైపుణ్యం కావాలి...అలాంటి అమ్మాయి సంసారాన్ని చక్కదిద్దుగోగలదు.."</div>
<div style="background-color: white; color: #1d2129; font-family: helvetica, arial, sans-serif; font-size: 14px; margin-bottom: 6px; margin-top: 6px;">
"ఆ పిల్ల గోరింటాకుతో పారాణి పెట్టుకుంటే నీ కాళ్ళు పండాలి.. నువ్వు ఆకు వక్క వేసుకుంటే ఆ అమ్మడి నోరు పండాలి...అదీ ఇదీ అయి ఆనక మీ కడుపు పండాలి"...</div>
<div style="background-color: white; color: #1d2129; font-family: helvetica, arial, sans-serif; font-size: 14px; margin-bottom: 6px; margin-top: 6px;">
ఇలాంటి మనసు నిండే వాక్యాలు ఇంకా ఎన్నో ఈ కథలో, అన్నీ చెప్పాలంటే మొత్తం కథ చెప్పాలి...ఈకథని ఈపాటికి మీరందరూ చదివే ఉంటారు. చదవకపోతే తప్పనిసరిగా ఒక్కసారైనా చదవండి....ఒక్క సారి చదివాక, ఆరోజే మరో నాలుగైదు సార్లు చదవకుండా ఉండలేరు...ఇంత మంచి కథను చదవడం మిస్ అయ్యరంటే మాత్రం జీవితంలో కొన్ని అనుభూతులను మిస్ అవుతున్నట్లే...</div>
<div style="background-color: white; color: #1d2129; display: inline; font-family: helvetica, arial, sans-serif; font-size: 14px; margin-top: 6px;">
మీ స్పందనని తెలియపర్చడం మర్చిపోవద్దు...</div>
</div>
Anonymoushttp://www.blogger.com/profile/04022717604315986029noreply@blogger.com0tag:blogger.com,1999:blog-4647961813969328457.post-73677753206438651962016-09-16T08:39:00.001-07:002016-09-16T08:39:04.975-07:00<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<div style="background-color: white; color: #1d2129; font-family: helvetica, arial, sans-serif; font-size: 14px; margin-bottom: 6px;">
చిన్నతనంలో మేము చదివిన స్కూల్ లో ప్రతిరోజూ మూడు భాషల్లోనూ, డిక్టేషన్ వ్రాయించేవారు....ఈ మూడు భాషల టీచర్లూ క్లాసులోకి రాగానే ముందు డిక్టేషన్ చెప్పవలసిందే..ఆ తరువాత హోం వర్కులు చూసి, అప్పుడు కొత్త పాఠం మొదలుపెట్టడం...మూడు భాషలోనూ డబల్ రూల్ పుస్తకాల్లో కాపీ రైటింగ్ వ్రాయాల్సిందే....అందువల్ల మాకు ఇప్పటికీ స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా వ్రాయడం వస్తుంది. మిగిలిన గ్రూప్ సబ్జెక్ట్స్ కి ఎంత విలువ ఇచ్చేవారో, తెలుగు, హిందీ, ఇంగ్లీషు కీ అంత ప్రాధాన్యత ఇచ్చేవారు...ప్రతి సబ్జెక్ట్ లోనూ పా<span class="text_exposed_show" style="display: inline; font-family: inherit;">ఠాలు వివరంగా చెప్పటం, పద్యాలు అయితే రాగయుక్తంగా పాడటం, పిల్లలచేత పాడించటం చేసేవారు మా టీచర్లు...మా హెడ్మిస్త్రెస్స్ పిల్లలతో ఎంత చనువుగా ఉండేవారో, తప్పు చేస్తే అంతగానూ శిక్షలు ఉండేవి...పిల్లల్తో చాల కలిసిమెలిసి ఉండేవారు ఆవిడ. ప్రతి విద్యార్థీ ఏ క్లాసు, ఏ సెక్షను అనేది ఆవిడకి ఎప్పుడూ గుర్తే...ప్రైవేటు స్కూల్ అయినా కూడా ఆవిడ మమ్మల్ని అన్ని పోటీలకూ పంపేవారు, అన్ని పరీక్షలూ వ్రాయించేవారు. ఏవో కేంద్ర ప్రభుత్వ పరీక్షలూ, తి.తి.దే. వారి పరీక్షలూ ..ఏమిటో చాలా చాలా వ్రాసేవాళ్ళం...ఒక్క చదువే కాకుండా చాలా ఇతర వ్యాపకాలలోనూ, ఆటల్లోనూ కూడా చాలా పోటీలకు వెళ్ళి, మా స్కూల్ పిల్లలు ఎన్నో బహుమతులు గెల్చుకునే వారు. ...మా హెడ్మిస్టెస్ టీచర్లను ఎలా సెలెక్ట్ చేసుకునేవారో కానీ, ఒక్కొక్కరూ ఒక్కో ఆణిముత్యం... పుస్తకాల్లో పాఠాలే కాక, ఎన్నో జీవిత పాఠాలు కూడా నేర్చుకున్నాం వారి దగ్గర...ఈరోజుకి, మేము ఉద్యోగాలు చేయకపోయినా, మా పిల్లలకు ట్యూషన్లు లేకుండా సొంతంగా ఇంట్లో చదువుచెప్పుకుని, వాళ్ళకు ఇంత క్రమశిక్షణ నేర్పగలిగాము అంటే అదంతా మా టీచర్లు, హెడ్మిస్ట్రెస్ చలవే...ఆ స్కూలు 1983 లో వదిలేసినా, ఈరోజుకి తలుచుకుంటే ఒళ్ళు పులకరించిపోతుంది నాకు...ఇప్పటికీ మా స్కూల్ మీద, మా టీచర్ల మీద గౌరవభావం , ప్రేమ అలాగే ఉన్నాయి నాకు..నాకే కాదు, మా స్కూల్ పిల్లలందరికీ అంతే బహుశా...</span></div>
<div class="text_exposed_show" style="background-color: white; color: #1d2129; display: inline; font-family: helvetica, arial, sans-serif; font-size: 14px;">
<div style="font-family: inherit; margin-bottom: 6px;">
ఇంతకీ మా స్కూల్ పేరు చెప్పలేదు కదూ..కాకినాడలో అప్పట్లో పేరెన్నిక గన్న స్కూల్....టాగూర్ కాన్వెంట్ హై స్కూల్...హెడ్ మిస్టెస్ పేరు శ్రీమతి సి.ఎం. ఇందిరా దేవి గారు. తెలుగుకి సుబ్బలక్ష్మి టీచర్, లెక్కలికి జోసెఫ్ మాస్టారు, సైన్స్ కి రాఘవలక్ష్మి టీచర్, పి.వి. శర్మ గారు, సోషల్ కి సావిత్రి మేడం, హిందీకి పద్మావతి టీచర్, పి.టి. సర్ సూర్యనారాయణ గారు, డ్రాయింగ్ కి సత్యనారాయణ సర్, ఇంగ్లీషుకి ఛార్లీ మాస్టారు...అబ్బబ్బ....అందరూ ఎంత బాగా చెప్పేవారో....</div>
<div style="font-family: inherit; margin-bottom: 6px; margin-top: 6px;">
ఇవీ మా స్కూల్ విశేషాలు...ఉపాద్యాయ దినోత్సవ సందర్భంగా మా జీవితాలను తీర్చిదిద్దిన ఆ గురువులందరికీ పాదాభివందనాలు...</div>
<div style="font-family: inherit; margin-bottom: 6px; margin-top: 6px;">
మీ అందరి స్కూల్ విశేషాలు కూడా పంచుకోండి మరి...</div>
</div>
</div>
Anonymoushttp://www.blogger.com/profile/04022717604315986029noreply@blogger.com0tag:blogger.com,1999:blog-4647961813969328457.post-77804935180517088782016-09-16T08:38:00.001-07:002016-09-16T08:38:15.985-07:00<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<div style="background-color: white; color: #1d2129; font-family: helvetica, arial, sans-serif; font-size: 14px; margin-bottom: 6px;">
శ్రీ గురుభ్యో నమ:</div>
<div style="background-color: white; color: #1d2129; font-family: helvetica, arial, sans-serif; font-size: 14px; margin-bottom: 6px; margin-top: 6px;">
ఈ సమూహం లో సభ్యులుగా ఉన్న ఉపాధ్యాయులకు నా మన:పూర్వక "ఉపాధ్యాయ దినోత్సవ "శుభాకాంక్షలు. పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దటం లో తల్లితండ్రుల తర్వాత మీ పాత్ర అమోఘమైనది. విద్యాబుద్ధులతో పాటు క్రమశిక్షణ, మంచి నడవడిక నేర్పి ఉన్నత సంస్కారాలను విద్యార్ధులలో పాదుకొల్పడం లో మీ కృషి శ్లాఘనీయం . ఒక దేశ భవిష్యత్తు ఆ దేశం లోని యువత మీదనే ఆధారపడి ఉంది. అటువంటి యువతను తయారు చేసేది మీరు. అంటే పరోక్షంగా ఒక దేశ భవిష్యత్తు ఉపాధ్యాయుల మీదనే ఆధారపడి ఉంది.<br />పురాణం కాలం నుంచి రామ లక్ష్<span class="text_exposed_show" style="display: inline; font-family: inherit;">మణులను, కౌరవ పాండవులను మరెంతో మంది శిష్యులను ప్రతి యుగం లోను ఉన్నతమైన వ్యక్తులుగా రూపొందించిన గురువులు కలిగిన వేదభూమి మనది. ఈ ఆధునిక కాలం లో కూడా శ్రీ రాధాకృష్ణన్ వంటి ఎంతో మంది గురువుల నీడలో పెరిగిన ఎంతో మంది నేడు ప్రముఖులై దేశమాత సేవలో తరిస్తున్నారు.</span></div>
<div class="text_exposed_show" style="background-color: white; color: #1d2129; display: inline; font-family: helvetica, arial, sans-serif; font-size: 14px;">
<div style="font-family: inherit; margin-bottom: 6px;">
. యువత మార్గనిర్దేశనం లో మీ పాత్ర ఎంతో విలువైనది. ఈ సమాజ నిర్మాణంలో మీ భాగస్వామ్యం విలువ కట్టలేనిది. మీ ఋణం తీర్చుకోలేనిది. దేశం లోని ప్రతి పౌరుడు మీకు సదా కృతజ్ఞులై ఉంటారు....</div>
<div style="font-family: inherit; margin-bottom: 6px; margin-top: 6px;">
గురుర్బ్రహ్మా, గురుర్విష్ణు: గురుర్దేవో మహేశ్వర:<br />గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురవే నమ:</div>
</div>
</div>
Anonymoushttp://www.blogger.com/profile/04022717604315986029noreply@blogger.com0tag:blogger.com,1999:blog-4647961813969328457.post-85646124723669632212016-09-16T08:37:00.001-07:002016-09-16T08:37:04.457-07:00<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<span style="background-color: white; color: #1d2129; font-family: helvetica, arial, sans-serif; font-size: 14px;">పిల్లలను ఎప్పుడూ మరొకరితో పోల్చే పొరపాటు చేయకండి..అది ఇంట్లో ఉండే మిగిలిన పిల్లలతో అయినా సరే, ఇతరుల పిల్లలతో అయినా సరే..ఒక్కొక్కరిలో ఒక్కో నైపుణ్యం ఉండచ్చు...దానిని కనుక్కొని వెలికితీసి ప్రోత్సహించడం తల్లితండ్రులుగా మన విధి...పెద్దవాడికి చదువులో ఆసక్తి ఉంటే, చిన్నవాడికి పాటల్లో ఉండచ్చు....చాలా ఇళ్ళల్లో సాధారణంగా వినబడే మాట ఏంటంటే, అన్న లాగా నువ్వు ఎందుకు ఉండవు?, అక్క లాగా ఎందుకు ఉండవు? ఇద్దరూ ఎందుకు ఒకలాగా ఉండాలి? ఉండరు కూడా....అలా పోల్చి తిట్టడం వలన వాళ్ళ మనసుల్లో ఏర్పడే న్య</span><span class="text_exposed_show" style="background-color: white; color: #1d2129; display: inline; font-family: helvetica, arial, sans-serif; font-size: 14px;">ూనతా భావం కొన్ని సంవత్సరాల వరకూ ఉండిపోవచ్చు...దాని పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి...ఇంట్లో పెద్దవాళ్ళు అలా అనడమే కాకుండా...ఎవరితో అయినా చెప్పేటప్పుడు కూడా, పెద్దవాడు చాలా బాగా చదువుతాడండీ, చిన్నవాడికి అంత శ్రధ్ధ లేదు, ఆటల్తోనూ, టీవీ తోనూ సరిపోతుంది ...ఇలా చెప్పడం వలన, పెద్దపిల్లలు చిన్నవాళ్ళను చులకన చేయడం, బయటి వాళ్ళు కూడా చులకనగా చూడడం జరుగుతాయి. దీని ప్రభావం చిన్న వాళ్ళ మీద చాలా ఎక్కువగా ఉంటుంది..ఇంట్లో ఎంతమంది సంతానం ఉంటే, వారందరి మధ్యన, ఒక బంధం, ఐకమత్యం ఉండేలా పెద్దవాళ్ళే జాగ్రత్తలు తీసుకోవాలి..ఇలా సంతానం మధ్యన పోల్చి చూడటం వల్ల, వాళ్ళ మధ్యన ఉండే ఐకమత్యం, ప్రేమ కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. ప్రతి బిడ్డా ప్రత్యేకమే..ఏ ఇద్దరూ ఒక్కలాగా ఉండరు. ..రేండో సంతానాన్ని కనేటప్పుడు తల్లి తండ్రులు గుర్తుంచుకోవలిసిన ముఖ్యమైన విషయం ఇది.</span></div>
Anonymoushttp://www.blogger.com/profile/04022717604315986029noreply@blogger.com0tag:blogger.com,1999:blog-4647961813969328457.post-85316250500778221292016-08-28T22:51:00.003-07:002016-08-28T22:51:42.772-07:00<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<span style="background-color: white; color: #1d2129; font-family: helvetica, arial, sans-serif; font-size: 14px; line-height: 19.32px;">నిజంగా ఈ స్త్రీవాదం అంటే ఏంటో అంతుపట్టదు నాకు....మగజాతినీ, మగపుట్టుకనీ, చెడతిట్టడమేనా స్త్రీవాదం అంటే....నిజమే..పురాణకాలం నుంచీ స్త్రీలు వివిధ రకాలుగా, పురుషుల చేతుల్లో సమాజం చేతుల్లో బాధలు పడ్డారు....అలా అని మొత్తం మగజాతిని ద్వేషించలేము కదా....కొంతమంది స్త్రీవాదులు పెళ్ళితో వచ్చే సౌభాగ్య చిహ్నాలు కూడా వద్దనుకుని, తెల్లచీర, (సుమంగళులైనప్పటికీ) బోసి నుదురు, మెడ, చేతుల్తో వెలిగిపోతున్నారు..వాళ్ళ ఆశయాలకు హేట్సాఫ్....కొంతమందికి భారతం, రామాయణం లాంటి పురాణాల్లో కూడా బూతులు కనబడతాయి</span><span class="text_exposed_show" style="background-color: white; color: #1d2129; display: inline; font-family: helvetica, arial, sans-serif; font-size: 14px; line-height: 19.32px;">...ఈనాడు ప్రపంచం అంతా ఆదర్శంగా తీసుకుంటున్న ఈ ఇతిహాసాల్లో వాళ్ళకు తప్పులు కనబడుతున్నాయంటే, వాళ్ళది ఎంత వంకర చూపు, ఎంత వంకర ఆలోచనలు? హవ్వా, వీళ్లకు చెప్పేవాళ్లే లేరో లేకపోతే చెప్పినా వినరో నాకు తెలియదు..ఎక్కడో ఏదో జరిగిందని, మగజాతిని, సమూలంగా ద్వేషించడం తప్ప వీళ్ల అజెండాలో ఇంకేమీ కనిపించదు...పోనీ ఇంత స్త్రీవాదులు ఆడవాళ్ళకు జరిగే అన్యాయాలకు న్యాయం ఏమైనా చేయగలుగుతున్నారా అంటే అదీ లేదు...స్త్రీల మీద రేపులు జరిగాక, రోడ్ల మీదకు రావడం తప్ప, బాధితులకు ఏ పిసరైనా సాయం, న్యాయం చేసారన్న దాఖలాలు ఉన్నాయా? వీళ్ళ చొరవ వల్ల, నేరస్థులకు తొందరగా శిక్ష పడిందా ఎక్కడైనా, ఎప్పుడైనా? పోనీ, వ్యభిచార కూపం లో ఉన్న, పెళ్ళి ముసుగులో, పనివాళ్ళ ముసుగులో దుబాయికి అమ్మేయబడుతున్న ఆడపిల్లల గురించి ఏమైనా చేసారా? వాళ్ళకు (ప్రభుత్వ సాయం లేకుండా) శాశ్వత జీవనోపాధిని కల్పించారా? ముంబాయిలో డాన్సు బార్లు మూసినప్పుడు, హర్షం వెలిబుచ్చిన వీరు క్రికెట్ మ్యాచుల్లో సగం సగం గుడ్డలేసుకొని ఎగిరే చీర్ గర్ల్స్ ని ఎందుకు నిషేధించమనరు? ఇంకా బార్ గర్ల్స్ వల్ల కొంతమందికి పరోక్షంగా ఉపాధి ఉంది...చీర్ గర్ల్స్ వల్ల ఎవరికి ఏం ఉపయోగం? వీరు అడిగే మరో ప్రశ్న, ....మగవాడు చేస్తే తప్పులేనిది మేము చేస్తే తప్పా? అమ్మా తల్లుల్లారా! మగవాడికి, ఆడదానికి ప్రకృతి పరంగా కొన్ని బేధాలు ఉన్నాయి. మానసికంగా కూడా స్త్రీ పురుషుని కన్నా బలవంతురాలు...అందుకే, అత్తింటి బాధ్యతలు, పిల్లల పెంపకం వంటివి ఆడదానికి కేటాయించాడు భగవంతుడూ, సమాజమూనూ...ఇది మనకు గర్వకారణం అనుకోవాలి....స్త్రీ మెదడు ఒకేసమయంలో రకరకాల విషయంలో గందరగోళం లేకుండా ఆలోచించగలదు..అందుకే స్త్రీ అన్ని విధులను ఏకకాలంలో సమర్ధించగల నిపుణురాలు...అందుకే అన్ని రకాల మనుషులను టాకిల్ చేయగలదు....స్త్రీకి గల ఇంత ఉన్నత వ్యక్తిత్వాన్ని వదిలేసి, మగవాళ్ళతో సమానంగా అర్ధరాత్రి తిరిగితే తప్పేమిటి, ప్యాంట్లు వేసుకుంటే తప్పేమిటి, చీరలే కట్టుకోవాలా?.......మా వస్త్రధారణ మా ఇష్టం, ...ఇదే అక్కర్లేని ఐడియాలజీ....అందర్నీ చెడగొట్టడం..... ఈ కాలం లో మగవాళ్ళు మరీ ఇదివరకటిలా కాకుండా కొంచెం మెరుగు....అయినా మగవాళ్ళు దుర్మార్గంగా ఉన్నారు అంటే వాళ్ళను పెంచిన తల్లులది కూడా కొంత బాధ్యత ఉంది కదా...మరి అది ఎవరూ మాట్లాడరేం? మగైనా , ఆడైనా పిల్లలు చెడిపోయారన్నా, నడత బాలేదు అనుకున్నా, పెంచిన తల్లుల బాధ్యత ఉంటుంది...అంటే ఇక్కడ తప్పు ఆడవాళ్ళది కూడా కదా.. ఇలా మాట్లాడుతూ పోతే చాలా విషయాలు ఉన్నాయి....ఇప్పటికివి చాలు..</span><br />
<div class="separator" style="clear: both; text-align: center;">
<a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiuaKJ92zoJXH0vygj5N8CfJ6CySvqZrRCE2UkCcFnTB5LrvN8no6wU4RoAF-YYfRH3HhEcCkxk3xkvHkJL2fbwz91HHbd0PVL1i1j3rcEJV443dk3pp3iHNlwKkX-3ELW_GPVrQ3zMDlRw/s1600/feminist.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiuaKJ92zoJXH0vygj5N8CfJ6CySvqZrRCE2UkCcFnTB5LrvN8no6wU4RoAF-YYfRH3HhEcCkxk3xkvHkJL2fbwz91HHbd0PVL1i1j3rcEJV443dk3pp3iHNlwKkX-3ELW_GPVrQ3zMDlRw/s1600/feminist.jpg" /></a></div>
</div>
Anonymoushttp://www.blogger.com/profile/04022717604315986029noreply@blogger.com0tag:blogger.com,1999:blog-4647961813969328457.post-89047431597808745792016-08-28T22:50:00.001-07:002016-08-28T22:50:19.122-07:00<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
"తెలుగు భాషా దినోత్సవం"...ప్రత్యేకంగా చెప్పడానికి ఏమీ లేదు. ఎందుకంటే మన భాషను మనమే చంపేసుకుంటున్నాం కనుక...ఓ పక్క భాషను పూర్తిగా కప్పెట్టెయ్యడానికి లోతైన గోతులు తీసేస్తూ, "దినోత్సవం" చేసుకోవడంలో అర్ధం లేదు. ఏడాదికి ఓసారి మన భాషను గుర్తు చేసుకొని వలవలా ఏడవడం మనకే చెల్లింది...ప్రతిరోజూ గుర్తున్నా లేకపోయినా......పక్క వాళ్ళతో అన్నిటికీ పోటీపడతాం...పనికొచ్చే వాటికి తప్ప.....కొంచెం చిత్తశుధ్ధి ఉంటే చాలు...మన భాషను మనం కాపాడుకోవచ్చు.<br />
<br />
1. ఎంత హోదాలో ఉన్నా ఇంట్లో మాతృభాషలో మాట్లాడడం.<br />
<br />
2. ముఖ్యంగా పెద్దవాళ్లతో పిల్లల సంభాషణ తెలుగులోనే ఉండేలా చూడడం.<br />
<br />
3. పిల్లలను ' గొ, తకె థిస్, స్లీప్ బబ్య్ , సిత్ ప్రొపెర్ల్య్ " అంటూ ఇంగ్లీష్ లో కాకుండా తెలుగులో పెంచడం..<br />
<br />
4. చిన్న పిల్లలకు కాలక్షేపానికి గాడ్జెట్స్ ని ఇవ్వకుండా..ఆడుతూ పాడుతూ వారికి తెలుగు భాష నేర్పించడం..<br />
<br />
5. కొంచెం ఎదిగిన పిల్లలకు రామాయణ భారతాల వంటి గ్రంధాలను తెలుగులో పరిచయం చేసి చదివించడం...<br />
<br />
6. పిల్లలకు ముఖ్యంగా "ణ, ళ, " వంటి అక్షరాలను ఉచ్చారణ దోషం లేకుండా పలకడం నేర్పించడం....<br />
<br />
7. ముఖ్యంగా ఇద్దరు తెలుగు వాళ్ళు కలిసినపుడు తెలుగులోనే మాట్లాడుకోవడం....మనకు ఉన్న ఈ జాడ్యం మీద ఎంతమంది ఎన్ని రకాలుగా జోక్స్ వేసినా, మనకు బుధ్ధిరాదు...<br />
<br />
ఇవన్ని మనం మన పిల్లల పట్ల ఆచరిస్తే, తెలుగు భాష ఇంకో తరం పాటు సజీవంగానే ఉంటుంది. మన పిల్లలు వాళ్ళ పిల్లలకు నేర్పిస్తే, మరో తరం వరకు భేషుగ్గా వెలిగిపోతుంది మన భాష...మన తెలుగు కే సొంతం అయిన పద్య రచన, అవధానాలు, రంగస్థల నాటకాలు ఇటువంటి వాటిని పిల్లలకు పరిచయం చేయాలి. మొదట్లో పిల్లలు వినకపోతే, ఓ పెద్ద బాలశిక్ష పుస్తకమో, తెలుగు లో బొమ్మల రామాయణాలో, కథల పుస్తకాలో వాళ్ళ కంటికి ఎదురుగా ఉండేటట్లు పెట్టండి. వాటినలా చూసి, చూసి, వాళ్ళకే ఆసక్తి కలుగుతుంది. చిన్న చిన్న నీతి కథలు, సామెతలు, ఇటువంటికి ఆసక్తిని పెంచేలా చెప్తే, పిల్లలకు భాష నేర్చుకోవాలనే జిజ్ఞాస పుడుతుంది. <br />
<br />
ఎవరైనా తల్లితండ్రులు మా పిల్లలకు తెలుగు మాట్లాడ్డం, చదవడం చేతకాదండీ అని బీరాలు పోయినపుడు రోతెక్కిపోతుంది..ఆ తప్పు ఎవరిది? పిల్లలది కాదు..ఖచ్చితంగా పెద్దవాళ్ళదే...<br />
<br />
<div class="separator" style="clear: both; text-align: center;">
<a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgvFZ51_II6tnlQNxT2OzXjnEmjx5_DrLAdLadS6FpClUPjrLosSGNFegqXJXb1lEJbA4-8lwzPDsndxAQmpy5YzxlmF5NHmbD8oJm3V_H0KOwfdseYPsun0MQCiPQAkgfknYRVAmIEAYXl/s1600/telugu+font.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" height="106" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgvFZ51_II6tnlQNxT2OzXjnEmjx5_DrLAdLadS6FpClUPjrLosSGNFegqXJXb1lEJbA4-8lwzPDsndxAQmpy5YzxlmF5NHmbD8oJm3V_H0KOwfdseYPsun0MQCiPQAkgfknYRVAmIEAYXl/s320/telugu+font.jpg" width="320" /></a></div>
<div>
<br /></div>
</div>
Anonymoushttp://www.blogger.com/profile/04022717604315986029noreply@blogger.com0tag:blogger.com,1999:blog-4647961813969328457.post-30550436470992667532016-08-25T04:30:00.002-07:002016-08-25T04:30:33.347-07:00<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
వర్ధనమ్మ ఇల్లు తాళం వేసి ఎక్కడికో బైల్దేరబోతోంది. ఇంతలో ఢిల్లీ నుంచి కాంఫరెన్సుకు ఊళ్ళోకొచ్చిన పెద్దకొడుకు ఆటో దిగుతూ కనబడ్డాడు. తాళం తీసి ఇంట్లోకి ఆహ్వానించింది...ఇంట్లో అతనికి పెట్టడానికి ఏమీ లేవు..కుశలప్రశ్నలు అయ్యాక భోజనానికి ఉండమంటుందని ఆశపడ్డాడు కొడుకు. తన భార్యకి ఒంట్లో బాగుండడంలేదు. అమ్మ ఒప్పుకుంటే నాలుగు రోజులు తీసుకెళ్ళచ్చు అనుకున్నాడు...తల్లిని చూడడానికి వట్టిచేతుల్తో వచ్చాడు తను. సంభాషణ ఎలా మొదలెట్టినా తల్లి క్లుప్తంగా జవాబులు చెప్పి మాట మధ్యలోనే తుంచేస్తోంది. ..అమ్మ బాగా మారింది అనుకున్నాడు...ఒక్కదానివి ఉండడం ఎందుకు? తమ్ముడు ఊళ్ళోనే ఉన్నాడు కదా, వాడి కుటుంబాన్ని దగ్గర పెట్టుకో....చేదోడువాదోడుగా ఉంటాడు అని సలహా ఇచ్చి, డబ్బులు ఇద్దామని తీయబోయిన పర్సు కూడా మళ్ళీ జేబులోనే పెట్టేసుకుని శెలవు తీసుకున్నాడు...<br />
<br />
నాలుగు రోజుల తర్వాత ఊళ్ళో ఉటున్న చిన్నకొడుకు వచ్చాడు తల్లిని చూడడానికి...పెళ్ళి అయిన మొదట్లో భార్య మాటలకు తందానా పాడి విడికాపురం వెళ్ళిపోయాడు....ఆదాయం పెరగక, ఖర్చులు ఎక్కువై, ఎదిగిన పిల్లల్తో రెండు గదుల ఇంటి కాపురం చేయడంలో కష్టం తండ్రి పోయాక, తల్లి ఒంటరిగా ఉంటున్నప్పుడు తెలిస్తోంది...తల్లి ఇంట్లోనే అందరూ కలిసి ఉంటే అద్దె ఉండదు. పిల్లల మీద తల్లి అజమాయిషీ ఉంటుంది. తల్లి ఎలాగూ పని చేయకుండా కూర్చునే రకం కాదు కాబట్టి భార్యకు పనిలో కాస్త వెసులుబాటు ఉంటుంది. భార్య మెదడులోని ఆలోచన , అతని మనసులో రూపుదిద్దుకుంటోంది.<br />
<br />
చిన్నకొడుకు ఎంత లౌక్యంగా మాట్లాడినా వర్ధనమ్మ తాను ఒంటరి జీవితానికే ఇష్టపడుతున్నాను అని అంతకన్నా గుంభనంగా చెప్పింది...అన్నయ్య డబ్బు పంపుతున్నాడు కాబట్టి, అమ్మ ఇలా మాట్లాడుతోంది..అనుకున్నాడు చిన్నకొడుకు కేశవ...అన్నగారు రెండుమూడు నెలలనుంఛీ డబ్బు పంపని విషయం తెలియక...తన మాట చెల్లకపోయేసరికి విసుక్కుంటూ ఇంటిదారిపట్టాడు...<br />
<br />
ఒంటరిగా మిగిలిన వర్ధనమ్మ మనసులో ఏవేవో ఆలోచనలు...పదహారేళ్ళకు పెళ్ళి అయ్యి కాపురానికి వచ్చినదగ్గర్నుంచీ ఒకటే పని....చేసి చేసి అలసిపోయింది...దానికి తోడు భార్యను అజమాయిషీ చేయడం తప్ప ప్రేమించడం పరువుతక్కువ అనుకునే భర్తతో ఆర్నెల్ల క్రితం వరకూ ఓ భార్యగా పక్కన కాకుండా, వెనకనే నడిచింది...తన మీదున్న బాధ్యతలన్నీ సంపూర్ణంగా తీర్చుకుంది...అందరికీ తలలొ నాలుకలా మెలుగుతూ....తండ్రి చనిపోయాక 12రోజుల కర్మలు చేసి అస్థి నిమజ్జనం తో సరిపెట్టుకున్నారు కొడుకులు. బతికున్నప్పుడు ప్రేమ చూపకపోయినా, భార్య పట్ల బాధ్యతగా తన పేరన ఒక ఇల్లు, కొంత బ్యాంకు బాలన్సూ ఉంచి వెళ్ళాడని ఆయన పోయినతర్వాతే తెలిసింది వర్ధనమ్మకు...లేని భర్తకీ, ఉన్నాడో లేడో తెలియని దేవుడికీ దణ్ణస్లుపెట్టుకుంది..ఆ పన్నెండు రోజుల్లోనే కొడుకుల, కోడళ్ళ అవకాశవాదాలు తెలిసొచ్చాయి...కాలం మహిమ అనుకుంది, కానీ ఎవరిని తప్పుగా అనుకోవడానికి మనస్కరించలేదు..<br />
<br />
ఆరునెలలౌ గడిచింది...ఇంట్లో ఓ మూడు గదులు అద్దెకిచ్చింది..ఆ అద్దె, బ్యాంకు వడ్డీ...రోజు గడుస్తోంది లోటు లేకుండా... ఇంట్లో పనులు బాగానే జరుగుతున్నాయి...మరి బయటవాటి సంగతి? ఎవరి చేస్తారు? గుళ్ళ పేరు పెరిగిపోయింది...అతుకు పెట్టించాలి..భర్త ఉంటే ఏంచేసేవాడో ఆలోచించింది..ఆయన ఉండగా ఎప్పుడూ బయటికి వెళ్ళిన మనిషి కాదు...తలుపు తాళం వేసి ఆచారి దుకాణం పేరు చెప్పి రిక్షా మాట్లాడుకుని వెళ్ళి పని పురమాయించింది...మొదట ఎవరేమనుకుంటారో అని బెరుకు అనిపించింది. పని పూర్తయ్యాక ధైర్యం వచ్చింది... కొన్ని రోజులయ్యాక ఆమేకు సినిమా చూడాలనిపించింది..సినిమా చూసి కొన్నేళ్ళు అయింది...తోడు వచ్చేవాళ్ళు ఎవరూ లేరు...అయినా తనలాంటి ముసలి, ఒంటరి దానితో వేచ్చేవారెవరు? ఒక్కతే చూసి వచ్చింది..అందులో హీరోయిన్ తీసుకున్న నిర్ణయం సమాజ విరుధ్ధం అయినా ఆమె తెగువకి ముచ్చటపడింది....<br />
<br />
ఈ పరిస్థితుల్లో తను కొడుకుల దగ్గరకు వెళ్తే జరుగుబాటు బాగానే ఉంటుంది? కానీ ఎణ్ణాళ్ళు? మళ్ళీ బాధ్యతల మడుగులో కూరుకుపోతుంది...కొంతకాలమైన తనకు దొరికిన ఈ స్వేచ్చ అనుభవించాలని ఉంది. ...సాయంత్రం పూట ఏమీ తోచలేదు...భర్త కాలక్షేపం ఏమిటో గుర్తు చేసుకుంది...దగ్గరగా ఉండే పార్కుకు వెళ్ళి కూర్చునేవాడు ఆయన...తను కూడా వెళ్ళింది..పిల్లలు, పెద్దలు, అందరితో సందడి సందడిగా ఉంది...వర్ధనమ్మకు ఊపిరాడినట్టయింది...మనసుకు రెక్కలు మొలిచినట్టు ఉంది....పిల్లల చేతుల్లో "పిడత కింద పప్పు" చూడగానే నోరూరింది...కాసేపు మడీ ఆచారం పక్కన పెట్టి, వాడు అడిగిన రూపాయిన్నర ఇచ్చి ఓ పొట్లం కొనుక్కుంది...బెంచి మీద కూర్చుని పొట్లం విప్పింది. ..పక్కనే ఉన్న ఏడెనిమిదేళ్ళ ముష్టి కుర్రాడు ఆశగా తనకేసి చూస్తుంటే సగం వాడి దోసిట్లో పోసి, మిగిలినది తాను తింది. నోరు చుర్రుమంది..కాని కొత్త రుచి నోటికి తగిలింది...తన జీవితం మీద తనకి ఓ స్పష్టత వచ్చింది...భర్త కొంత ఆస్తి తనపేర వ్రాసి, తనకు కర్తవ్య బోధ చేసినట్టు తోచింది. ...ఆమె మనసు కొత్త రెక్కలు తొడుక్కున్నట్లయింది..<br />
<br />
ఈ కథ ప్రముఖ రచయిత్రి అబ్బూరి చాయాదేవి గారు 1996 లో ఇండియా టుడే కోసం వ్రాసినది...ప్రత్యేకించి స్త్రీ స్వేచ్చ గురించి కాకపోయినా, భర్త, అత్తవారిల్లు, పిల్లలు, సంసారం వీటితోటే అలసిపోయిన స్త్రీలకు, కొంత వయసు తర్వాత బాధ్యతలు తీరిపోయాక, భర్త ఉన్నా, లేకపోయినా, తమకంటూ ఒక జీవితం ఉంది అని స్త్రీలకు స్పష్టంగా చెప్పిన కథ ఇది....ఇందులో మానవతా వాదం తప్ప స్త్రీవాదం లేదు...స్త్రీలు తమను తాము ఐడెంటిఫై చేసుకోవాలనే సందేశం తప్ప....<br />
<br />
మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. దయచేసి మీ స్పందన తెలపండి. </div>
Anonymoushttp://www.blogger.com/profile/04022717604315986029noreply@blogger.com0tag:blogger.com,1999:blog-4647961813969328457.post-62516404837664154912016-08-23T02:38:00.000-07:002016-08-23T02:38:08.338-07:00<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
మాతృశక్తి 26<br />
<br />
వ్యక్తి వ్యక్తిలో సంస్కార నిరమాణం చేసే కార్యం చేయటానికి భారతీయులు స్వయంగానే ముందుకు రవాలి. మాతృశక్తి విషయంలో ఆలోచనా ధోరణిలో వచ్చిన వికృతిని తొలగించడానికి స్వయంగా సంస్కృతి, మాతృశక్తి విషయాన్ని సమగ్రంగా తెలుసుకొని ఇతరులకు తెలియచేసే ప్రయత్నం చేయాలి. ఈ విషయంలో కేవలం స్త్రీలను జాగృతపరచటమే కాక సంపూర్ణ సమాజం యొక్క ఆలోచనా ధోరణిలో మార్పు రావటం అవసరం. ఏ సమాజంలోనైనా స్త్రీకి లభించే గౌరవాన్ని బట్టే ఆ సమాజం యొక్క శ్రేష్టత్వం ఆధారపడి ఉంటుంది. కాని కేవలం అధికారాల కోసం పోరాటం జరుపుతుంటేనే స్త్రీలకు సమాజంలో గౌరవస్థానం లభించదు. మాతృశక్తి పరిజ్ఞానం స్వయంగా పొంది కర్తవ్య నిష్టతో స్వంత ఆచరణ ద్వార స్త్రీ పురుషులతో సహా సంపూర్ణ సమాజాన్ని ఈ మార్గంలో జాగృతపరచాల్సిన అవసరం ఉంది. " నాకంటే శ్రేష్టురాలు ఇంకెవరూ లేరు...ఎందుకంటే నను సర్వశ్రేష్ట వ్యక్తులకు తల్ల్లిని. నేను నిష్కామ భావంతో ప్రతిఒక్కరికీ సేవ చేసే తల్లిని. " ఇలాంటి ఉత్తమభావనను తల్లి కలిగి ఉంటుంది. ఆమె హృదయ పవిత్రతకు ప్రబల నిదర్శనం ఇది. మాతృశక్తి యొక్క మూలతత్వం ఇదే. సృష్టి య్క్క శాశ్వత సత్యాలతో నిండిన భారతీయ సంస్కృతి సొంతం అవడం వల్ల మన దేశం స్థిరంగా ఉంది. ఇందులోని రహస్యం మాతృశక్తిని గౌరవించడం, దాన్ని సద్వినిఓగపరచడం లాంటి భావాలు ప్రజలందరి హృదయాలను స్పందింపచేసి మళ్ళి ఒకసారి మొత్తం సమాజం మాతృశక్తి భావనతో ఉవ్వెత్తున లేచి నిలబడినప్పుడే సమాజంలో స్త్రీకి మళ్ళి పూర్వపుగౌరవం లభిస్తుంది. భారతాజాతి కూడా కోల్పోయిన తన స్వాభిమానాన్ని తిరిగి పొంది శక్తివంతమైన, సుదృఢమైన జతిగా అవతరించి ఈ క్రింది విధంగా మాతృభూమికి వందనం చేస్తుంది.<br />
<br />
"పూజనీయే ఆధారభూతే మాతృశక్తే<br />
నమోస్తుతే, నమోస్తుతే, నమోస్తుతే."<br />
<br />
<br />
******************************సమాప్తం********************************<br />
<br />
<br />
<div class="separator" style="clear: both; text-align: center;">
<a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhexFT4GU6ffOnmLNB0GVoPX8QlcOdAf9EIXj07b-GQhZD7TcOz_bLIir6vuc6NRf3TFry5RApDFRcVpRRkdO8q-XvUgMTOc3MCs8mC_WfgJvUpwNtTfInlS96dLqd1g2gfSE9JPU94yKt2/s1600/matrusakti.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" height="320" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhexFT4GU6ffOnmLNB0GVoPX8QlcOdAf9EIXj07b-GQhZD7TcOz_bLIir6vuc6NRf3TFry5RApDFRcVpRRkdO8q-XvUgMTOc3MCs8mC_WfgJvUpwNtTfInlS96dLqd1g2gfSE9JPU94yKt2/s320/matrusakti.jpg" width="256" /></a></div>
<br />
<div>
<br /></div>
</div>
Anonymoushttp://www.blogger.com/profile/04022717604315986029noreply@blogger.com0tag:blogger.com,1999:blog-4647961813969328457.post-69574838903971038452016-08-23T02:04:00.001-07:002016-08-23T02:04:27.919-07:00<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
మాతృశక్తి 25<br />
<br />
రెండువేల సంవత్సరాల విదేశీ దురాక్రమణ కాలంలో తమ సంస్కృతిపై భారతీయులకున్న శ్రధ్ధాసక్తులను నిలిపి ఉంచటానికి ఈ దేశంలో భక్తి సాంప్రదాయం ముందుకొచ్చింది. అనేక మతాలకు చెందిన భక్తులు శ్రద్ధతో, త్యాగభావంతో భారతీయ సంస్కృతీ ప్రచారం చేసారు. దానివల్ల కూడా భారతీయులకు చాలా మేలు కల్గింది. తమ సంస్కృతిమీద భారతీయులకున్న దృఢవిశ్వాసం కారణంగా భారతీయరాజులు శతృవులతో వీరోచింతంగా పోరాడారు. క్రీ. శ. 17, 18 శతాబ్దాలలో వచ్చిన ముస్లింలు , మొగలులు భారతీయ రాజుల ముందు నిలబడలేకపోయారు. భక్తి సాంప్రదాయం వల్ల ఆ కాలంలో కల్గిన పెద్ద మేలు ఇది.<br />
<br />
18వ శతాబ్ది ప్రారంభంలో భారతదేశంలో చాలా భాగాలనుండి విదేశీయుల రాజ్యాలు తొలగిపోయి వాళ్ళ అత్యాచారాలు కూడా తగ్గిపోయాయి. వివిధ ప్రాంతాల్లో భారతీయ రాజ్యాలేర్పడ్డాయి. రెండువేల సంవత్సరాలుగా జరిగిన విదేశీ దురాక్రమణ ప్రముఖంగా రాజకీయానికి సంబంధించిందే.చివరి వేయి సంవత్సరాల్లో మాత్రం రాజకీయాలతో పాటు మత సంబంధం కూడా ఉంది. దురాక్రమణదారులు భారతీయుల అనేక మందిరాలను, విద్యాలయాలను గ్రంధాలయాలను దోచుకోవటం, నాశనం చేయట చేసారు. స్త్రీలను దోచుకోవడంతో పాటు మానభంగాలు చేశారు. కాని వీళ్ళ ప్రయత్నాల ద్వారా భారతీయౌలకు తమ సంస్కృతి పట్ల ఉన్న శ్రధ్ధ ఏమాత్రం తగ్గలెదు. 18వ శతాబ్ది ప్రధమార్ధంలో సంపూర్ణ భారతాన్ని రాజకీయింగా స్వతంత్రం చేయాలనే భారతీయప్రయత్నాలు ఇంకా పూర్తి సఫలం కాకముందే సముద్రమార్గం ద్వారా వ్యాపారం చేసుకోవడానికి భారతదేశం వచ్చిన ఆంగ్లేయులు సంపూర్ణ భారతాన్ని ఆక్రమించుకోవడానికి తీవ్రంగా కృషి చేసారు. క్రీ.శ. 1757 లో జరిగిన ప్లాసీ యుధ్ధంలో విజయం సాధించిన వాళ్ళు 70,80 సంవత్సరాల్లో మొత్తం భారతదేశంలో తమ రాజ్యాన్ని స్థాపించారు. ముస్లిం దురాక్రమణ దారులవలెనే ఆంగ్లేయులు కూడ స్త్రీల మీద అత్యాచారాలు జరిపి భయకంపితులను చేయటానికి ప్రయత్నించారు. దాంతోపాటే భారతీయులకు సుదీర్ఘకాలం నుండి తమ సంస్కృతి పట్ల తమ పూర్వజుల పట్ల ఉండే భక్తి శ్రధ్ధ, విశ్వాసాలను దూరం చేసే ప్రయత్నం కూడా చేసారు. ఈ పనిని వాళ్ళు ప్రముఖంగా 19 వ శతబ్దం మధ్య కాలం నుండి తాము స్వయంగా స్థాపించిన విద్యాలయాల ద్వారా చేసారు. అంతకు పూర్వం జరిగిన అత్యాచారాల కారణంగా భారతీయులు ఇదివరకే ధర్యం కోల్పోయి ఉన్నారు. ఆంగ్లేయుల సామ్రాజ్య నిర్మాణ శక్తిని, వాళ్ల సాధన సంపత్తిని చూసి ఇంకా వాళ్ళ ప్రభావానికి లోనైనారు. ఉద్యోగాల దృష్టి తో లాభదాయకంగా ఉన్న వాళ్ళ విద్యా విధానం కూడా భారతీయులను మానసికంగా వాళ్ళకు బానిసలుగా అయ్యేట్లు చేసింది. ఆంగ్ల విద్యాభ్యాసం ద్వారా భారతీయుల సాంస్కృతిక నిష్ట క్రమంగా తగ్గిపోయింది. వాళ్ళలో భోగలాలస పెరిగింది. "వివాహోన విలాసార్ధం, సంతానార్ధం చ కేవలం ' అన్న పూర్వపు భావన క్రమంగా మారిపోయి ససంభోగ సుఖ వాంచయే వివాహ లక్ష్యమైంది. ఆర్యత్వ లక్షణాలు తగ్గిపోయాయి. ఈ భోగ సంస్కృతి ప్రభావానికి గురైన ఈనాటి యువకులు నా తల్లి నాకు జన్మనిచ్చింది అని కాక, "నేను పుట్టాను, నా తల్లితండ్రుల భోగవాంచకు ఫలితమే నా పుట్టుక" అని అంటున్నారు. స్వతంత్ర భారతదేశంలో మాతృశక్తి మహత్వం తెలియని కారణం గానే ఇలాంటి వాతావరణం నిర్మాణమైంది. ఇది పూర్తిగా వికృతి లక్షణం.<br />
<br />
(ఇంకా ఉంది )<br />
<div class="separator" style="clear: both; text-align: center;">
<a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjRJubqh56amFkoc55YavPk7h39qHGTNjQhpeU7yEI-tz3xsvL0jq3aNBnMo5NLOqvTJAfUXLKYaIi1noFFkE010gP9oER8gYRkgEyrgTE5zSEio2lKuSyIlLP7qDweeDPjdeO2u6nqbPpp/s1600/matrusakti.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" height="320" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjRJubqh56amFkoc55YavPk7h39qHGTNjQhpeU7yEI-tz3xsvL0jq3aNBnMo5NLOqvTJAfUXLKYaIi1noFFkE010gP9oER8gYRkgEyrgTE5zSEio2lKuSyIlLP7qDweeDPjdeO2u6nqbPpp/s320/matrusakti.jpg" width="256" /></a></div>
<br /></div>
Anonymoushttp://www.blogger.com/profile/04022717604315986029noreply@blogger.com0tag:blogger.com,1999:blog-4647961813969328457.post-17801446472088411822016-08-23T01:17:00.001-07:002016-08-23T01:17:27.624-07:00<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
మాతృశక్తి 24<br />
<br />
ఆంగ్లేయులకు ముందు రెండున్నరవేల సంవత్సరాల నుండి భారతదేశం మీదికి దండెత్తివచ్చిన విదేశీయులు భారతదేశ వాయవ్య, పడమటి దిక్కుల నుండి వచ్చారు. అప్పటివరకు ఆ దేశాలకు భారతీయ సంస్కృతి ప్రచారకులు చాలా కొద్ది సంఖ్యలోనే వెళ్ళారు. అందువల్ల సృష్టిలో మాతృశక్తి యొక్క మహత్వాన్ని గురించి అక్కడి ప్రజలు చాలా కొద్దిమందే తెల్సుకోగలిగారు. మాతృశక్తి మహత్యం తెలియని విదేశీ ఆక్రమణకారులు స్త్రీని కేవలం భోగవస్తువుగానే చూడసాగారు. ధన సంపదను దోచుకున్నట్లే వాళ్ళు స్త్రీలన్ దోచుకుని మానభంగాలు చేసి ఎత్తుకుపోయేవారు. క్రీ. శ. ఇస్లాం మత స్థాపన జరిగిన తర్వాత ఇక్కడికి వచ్చిన మహమ్మద్ద్య దురాక్రమణదారులు ఇక్కడి స్త్రీలను ఒక భోగవస్తువుగా చూడటమే కాక, స్త్రీలలో సంతానోత్పాదన శక్తిని తమ సంఖ్యాబలం పెంచుకోవడానికి సాధనంగా వాడుకోవాలని నిశ్చయించారు. ఈ ఉద్దేశ్యంతో ఒక్కొక్క పురుష దురాక్రమణ దారుడు అనేకమంది స్త్రీలను బలాత్కరించి వివాహం చేసుకున్నాడు. వాళ్ళ ద్వారా అధిక సంఖ్యలో సంతానొత్పత్తి చేసి ఇస్లాం మతస్థుల జనాభా వృధ్ధికి కారకులైనారు. వాళ్ళు ఈ పని ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. తమ ఈ లక్ష్య పూర్తికి వాళ్ళు భారతీయ స్త్రీ పురుషుల మీద అనేక అత్యాచారాలు జరిపారు. స్త్రీలతో ఇలాంటి వ్యవహారం భారతీయులకు పూర్తిగా కొత్త. అందువల్ల ఈ అత్యాచారాలు చూసి స్త్రీలు భయకంపితులైపోయారు. దైర్యం కోల్పోయిన పురుష సమాజం కూడా వాళ్ళకు పూర్తి రక్షణ ఈయలేకపోయింది. స్వయంగా స్త్రీయే ఈ అత్యాచారులతో పోరాడి పోరాడి అలసిపోయి, చివరకు పోరాడే శక్తిని కోల్పోయి అబలగా మారింది. తండ్రి కొడుకులు మొదలైనవాళ్ళు ఇక తన్ను రక్షించలేరని తెలుసుకున్న స్త్రీలు వాళ్ళకు ఇబ్బంది కలుగకుండా ఉండలని తమ వ్యవహారాలను ఇంటివరకే పరిమితం చేసుకుని ఇంటికే బందీలైపోయారు. నీతిమంతమైన, పవిత్రపూర్ణమైన తమ సమాజమనే ఆకాశంలో స్వేచ్చగా విహరించే స్త్రీ ప్రంజరంలో పక్షి వలె పూర్తిగా స్వేచ్చను కోల్పోయి తనకు తానే కృంగి కృశించిపోయింది.<br />
<br />
భారతీయ సంస్కృతి విషయంలో భారతీయుల శ్రధ్ధాసక్తులు ఎప్పటివలెనే దృఢంగా ఉన్నాయి. మాతృశక్తిని గురించిన అవగాహన, ఆచరణ విషయంలో వాళ్ళలో మార్పులేదు. దురాక్రమణదారులతో జరిగిన యుద్ధాల్లో భారతీయులు విజయం పొందినా వాళ్ళు ఆక్రమణదారుల స్త్రీలను దోచుకోవటంగాని, బలాత్కరించి వివాహం చేసుకోవడం కాని చేయలేదు. కళ్యాణ్ సుబేదారుతో జరిగిన యుద్ధంలో శివాజీ సైనికులు అనేకమందితో పాటు సుబేదారు కోడలును కొడ బంధించి శివాజీ ముందుకు తీసుకువచ్చారు. అప్పుడు శివాజీ ఆమెను ఎంతో గౌరవ పూర్వకంగా సుబేదారు దగ్గరికి తిరిగి పంపించి ఇలాంటి చెడుపనులు ఇక ముందెప్పొడూ చేయవద్దని తన సైనికులను హెచ్చరించాడు.<br />
<br />
(ఇంకా ఉంది )<br />
<div class="separator" style="clear: both; text-align: center;">
<a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhmyBVuXZHM10pxwpBaHLFxhixUJbdCAalN_iKMMBKCPSg_2_64ox-pMkUdf2XBMl2oDqDcNAibmF0fq4uy32j4xub6-v_zXVlCEhhipyNUOsUE-40QhObMOM82RNs1y1a3yJCpSCcb4PiK/s1600/matrusakti.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" height="320" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhmyBVuXZHM10pxwpBaHLFxhixUJbdCAalN_iKMMBKCPSg_2_64ox-pMkUdf2XBMl2oDqDcNAibmF0fq4uy32j4xub6-v_zXVlCEhhipyNUOsUE-40QhObMOM82RNs1y1a3yJCpSCcb4PiK/s320/matrusakti.jpg" width="256" /></a></div>
<div>
<br /></div>
</div>
Anonymoushttp://www.blogger.com/profile/04022717604315986029noreply@blogger.com0tag:blogger.com,1999:blog-4647961813969328457.post-59827163523857821352016-08-23T00:58:00.000-07:002016-08-23T00:58:07.921-07:00<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
మాతృసక్తి 23<br />
<br />
తల్లిని పూజిస్తే మోక్షం లభించటం అసంభవమేమీ కాదు. భగవంతుని పూజలలో కెల్లా శ్రేష్టమైనది తల్లి పూజయే.. మాధుర్య సాగరం, ఊవులలో ఉండే కోమలత్వం, గంగా జల నిర్మలత్వం, చంద్రుని సౌందర్యం, సముద్రుని అనంతత్వం, భూమి సహనశీలత, తల్లి అనే రెండు అక్షరాలలో ఇమిడి ఉన్నాయి. ఇదే ఉత్తమ దైవం. ఆమె నాగురువు. అన్ని కోరికలు నెరవేర్చే కల్పవృక్షం..అని సోనే గురుజీ అన్నారు.<br />
<br />
"ఒక వేళ తూచినట్లయితే మొత్తం ప్రపంచం కంటే తల్లే ఎక్కువ బరువు తూగుతుంది. నాలో ఏమేమి మంచి గుణాలున్నాయో అవన్ని నాకు నా తల్లి నుంచే లభించాయి." అని ప్రపంచ ప్రఖ్యాతుడైన నిపోలియన్ బోనాపార్ట్ అనాడు.<br />
<br />
అలెగ్జాండర్ అయితే తన తల్లి కళ్ల నుండి ఏమాత్రం దు:ఖాశ్రువులు కారినా సహించేవాడు కాదు. వాటిని తుడవడానికి అతడు ఎంతకైనా సిధ్ధపడేవాడు.<br />
<br />
మొత్తం ప్రపంచ భారాన్ని మోయగల ఓర్పు తల్లులలో ఉంది. జాతి అభివృధ్ధి తల్లులపైనే ఆధారపడి ఉంది. జాతి పతనోన్నతులు తల్లి కోరికపైననే ఆధారపడి ఉంటాయి. పతనాన్ని ఆమె ఎప్పుడూ కోరుకోదు.<br />
<br />
ఈనాడు వ్వతావరణ కాలుస్యం గురించి చాలా చర్చ జరుగుతున్నది. కాని మతృశక్తి యొక్క దురుపయోగంతో ఏర్పడుతున్న సంస్కార కాలుష్యం గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం ఉంది.<br />
<br />
భారతీయ ఋషులు అతి ప్రాచీన కాలంలోనే మాతృశక్తిలోనే సృష్టి నిర్మాత యొక్క సృజనశక్తి కలదని తెలుసుకొన్నారు. మాతృశక్తి గొప్పతనాన్ని వాళ్ళు భారతీయులకు తెలియచేసి దాన్ని ఎల గౌరవించాలో కూడా వాళ్ళకు నేర్పారు. ఆ కారణంగానే రాక్షస రాజైన రావణుడు సీతతో అలా మర్యాదగా వ్యవహరించడం సాధ్యమైంది.<br />
<br />
మాతృశక్తి గురించిన సంపూర్న పరిజ్ఞానం కలిగి దాన్ని ఆచరణలో పెడుతూ వస్తున్న భారతీయుల సామాజిక జీవనం వేదకాలం నుండి అంటే 8, 10 వేల సంవత్సరాల నుండి ఈనాటికీ నిన్రంతరాయంగా కొనసాగుతూ వస్తున్నది. గత రెండున్నర వేలసంవత్సరాల నుండి భారతీయ రాక్షసులకంటే అతి క్రూఉలైన విదేశీయ దురాక్రమణలకు అది గురి అయింది.<br />
<br />
(ఇంకా ఉంది )<br />
<div class="separator" style="clear: both; text-align: center;">
<a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEheG2UtDKsBu-_5dgPpH_ALpXlPGfu5iNqrVMoDBowN3zuQwq7Ll3heA8gDYOdnag3EmwCFL1H-ltWArS74CiAOiR8CinUwz-7KI8NSJz_XJwRTRucDIEdjAjW9s4CtPY9YC-m6F6POza1J/s1600/matrusakti.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" height="320" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEheG2UtDKsBu-_5dgPpH_ALpXlPGfu5iNqrVMoDBowN3zuQwq7Ll3heA8gDYOdnag3EmwCFL1H-ltWArS74CiAOiR8CinUwz-7KI8NSJz_XJwRTRucDIEdjAjW9s4CtPY9YC-m6F6POza1J/s320/matrusakti.jpg" width="256" /></a></div>
</div>
Anonymoushttp://www.blogger.com/profile/04022717604315986029noreply@blogger.com0tag:blogger.com,1999:blog-4647961813969328457.post-46848661411327488142016-08-23T00:00:00.001-07:002016-08-23T00:00:20.201-07:00<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<div style="background-color: white; color: #1d2129; font-family: helvetica, arial, sans-serif; font-size: 14px; line-height: 19.32px; margin-bottom: 6px;">
రాధాకృష్ణుల ప్రేమ అజరామరం...అమలినం...వారిరువురి బంధం మనసుకే పరిమితం.....కృష్ణుడు రాధ యొక్క ప్రేమతత్వం అయితే, కృష్ణుని యొక్క సర్వగత చైతన్యం రాధ....రాధా కృష్ణుల రాసలీలలు మోక్షానికి ఉద్దేశించినవే... ఆమె హృదయ స్పందనలోనూ, ఆమే మనసంతా నిండిన నందబాలుడే గోచరమవుతాడు...విరహం వేధిస్తున్నా రాధమ్మ తన కృష్ణుణ్ణి బాధించదు.....ఆమెకు తెలుసు, కన్నయ్య తనకే కాక, ఈ సర్వ జగత్తుకూ నాథుడని, జగన్నాధుడని...ఒకరిలో ఒకరు లీనమైన ఆ జంటకు విరహమనేదే లేదు....ఎందుకంటే, వారిరువురిదీ ఒకటే తత్వం...ఏకత్వం..... కృ<span class="text_exposed_show" style="display: inline; font-family: inherit;">ష్ణుని స్మృతుల్లో రాధకు మనసు పులకాంకితమైతే, రాధను తలచుకున్న వెన్నదొంగకు మేను రోమాంచితమవుతుంది.....పొన్నలు నిండిన బృందావనం , వెన్నెల రాత్రులు, మురళీ నాదం, యమునా తీరం.....వారి నిర్మలమైన ప్రేమకు సాక్ష్యాలు..</span></div>
<div class="text_exposed_show" style="background-color: white; color: #1d2129; display: inline; font-family: helvetica, arial, sans-serif; font-size: 14px; line-height: 19.32px;">
<div style="font-family: inherit; margin-bottom: 6px;">
కృష్ణుని యశోదా తనయునిగా, వ్రేపల్లే ముద్దుబిడ్డగా, పాండవోద్ధారకునిగా, రాయబారిగా, అర్జునుని మార్గదర్శకునిగా, రథసారధిగా, మహామహిమాన్వితమైన గీతోపదేశకునిగా ,,, ఎన్ని తీరుల్లో మనం ఆరాధించినా, కృష్ణ ప్రేమ అనగానే మనకు గుర్తొచ్చే ప్రేమిక "రాధ." వారి ప్రేమ తత్వం జగతికి ఆదర్శం....తరతరాలకూ మరువలేని కావ్యం...</div>
<div style="font-family: inherit; margin-bottom: 6px; margin-top: 6px;">
శ్రీకృష్ణ శ్శరణం మమ</div>
<div class="separator" style="clear: both; text-align: center;">
<a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjfJ7k94pNKuFK2D39SN3io_VgjvS2F_e-99OczNqcnPFEyxzF907fb_3jzywzX8nJNi8esXEboEKKgd7tcfzwCZYJ8RnSH6GubkjSgRQlaaCyy7khZJWwJH4S9xWKMSBC1XhsEeqgXFUia/s1600/radha+krishna+14.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjfJ7k94pNKuFK2D39SN3io_VgjvS2F_e-99OczNqcnPFEyxzF907fb_3jzywzX8nJNi8esXEboEKKgd7tcfzwCZYJ8RnSH6GubkjSgRQlaaCyy7khZJWwJH4S9xWKMSBC1XhsEeqgXFUia/s1600/radha+krishna+14.jpg" /></a></div>
</div>
</div>
Anonymoushttp://www.blogger.com/profile/04022717604315986029noreply@blogger.com0tag:blogger.com,1999:blog-4647961813969328457.post-59987527676743503432016-08-22T23:59:00.000-07:002016-08-22T23:59:25.477-07:00<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
మాతృశక్తి 22<br />
<br />
సర్వే భద్రాణి పశ్యంతు:<br />
<br />
అందరి శ్రేయస్సు కావాలనే కోరిక మాతృహృదయంలో ఉన్నతగా స్త్రీ యొక్క ఇతర రూపాలలో ఉండదు. ఎందుకంటే భద్రతా భావం ఆమెకెంతో ప్రియమైనది. తన పుత్రుడు ఎవరితోనైనా చెడుగా ప్రవర్తిస్తే ఆమె సహించలేదు. మొత్తం ప్రపంచం శుభ్రంగా ఉండాలనే ఉదాతా ఆశయమామెది. అందరి శ్రేయస్సు కోసం ఆమె ఎంత కష్టాన్నైనా సహించటానికి సిధ్ధపడుతుంది. ఆపదలో ఉన్న రాక్షస రాజ్యాన్ని రక్షించడానికి శర్మిష్ట దేవయాని దాస్యత్వానికి సిధ్ధపడింది. సావిత్రీ బాయి ఫూలే స్త్రీలలో విద్యావ్యాప్తి చేసే ప్రయతంలో ఆమె వ్యతిరేకులు విసిరిన రాళ్ళ దెబ్బలు, పేడ దెబ్బలు సహించింది. ఎందుకంటే స్వయంగా కష్టపడినా సమాజ కళ్యాణం జరిగినట్లయితే జీవితం ధన్యమని ఆమె భావించంది.<br />
<br />
మనువు--తండ్రి, కొదుకు, భర్త, అన్న--వీళ్ళందరూ స్త్రీకి రక్షకులుగా ఉంటారని చెప్పాడు కాని, పురుషులకు సన్మార్గ ప్రవర్తకులుగా నిర్మించే బాధ్యత స్త్రీదే..తన సోదరులను, భర్తను, పుత్రులను ఎన్నోరకాలుగా కర్తవ్యోన్ముఖులను చేసి, వారి విజయానికి, కీర్తి పొందుటకు దోహదపడిన స్త్రీమూర్తులు ఎందరో మనకు చరిత్రలో కనిపిస్తారు. మాతృత్వం యొక్క ఈ అనేక గుణాల కారణం గానే స్త్రీ పూజ్యురాలైంది. ఆబాలగోపాలానికి ఆమె యందు గౌరవభావం ఏర్పడింది.<br />
<br />
సమర్థ రామదాసు ఇలా అన్నారు..." తన సంతానం యొక్క పోషణలో తల్లి ఎప్పుడూ అలసిపాదు. ఆమెకు సోమరితనం లేదు. ఆమె ఎప్పుడూ చికాకుపడదు. తలిలాంటి ప్రముఖ వస్తువు ఈ ప్రపంచంలో ఎక్కడా దొరకదు."<br />
<br />
తల్లి ప్రేమ మరియు ఆమె ఆశీర్వాదం లోనే లోక కళ్యాణం ఉంది. భగవంతుడు, తల్లి ఇద్దరూ సమానమే. మంచి తల్లియే మహాపురుషులకు అన్మనిస్తుంది. " అని స్వామీ వివేకానంద. అన్నారు. రూపుదాల్చిన భగవంతుని వాత్సల్యమే తల్లి అని వినోబా భావే వచించారు.<br />
<br />
(ఇంకా ఉంది )<br />
<br />
<br />
<br />
<br />
<div class="separator" style="clear: both; text-align: center;">
<a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgWAT-Pk6tJui83pv5K8XQSLj-sYOTwpfydDvSCUFSx10_vHNNHS3-KOTBaQKjtbDWJVC5AagUBTuArifijQol28t1ZO9ebWbdRVNmVloOPhx870ONaAEaZxbW__K3ebSFkNQsO1oeKnRVk/s1600/matrusakti.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" height="320" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgWAT-Pk6tJui83pv5K8XQSLj-sYOTwpfydDvSCUFSx10_vHNNHS3-KOTBaQKjtbDWJVC5AagUBTuArifijQol28t1ZO9ebWbdRVNmVloOPhx870ONaAEaZxbW__K3ebSFkNQsO1oeKnRVk/s320/matrusakti.jpg" width="256" /></a></div>
<br /></div>
Anonymoushttp://www.blogger.com/profile/04022717604315986029noreply@blogger.com0tag:blogger.com,1999:blog-4647961813969328457.post-79493997949142796962016-08-18T05:24:00.002-07:002016-08-18T05:24:03.415-07:00<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
విదురనీతి 71<br />
<br />
"ప్రయత్నించకపోతే తప్పుకదా! అది నేను చెయ్యకూడదు కదా " అన్ని తెలిసి ఈ ప్రయత్నానికి సిధ్ధమయ్యానటాడు...<br />
<br />
"వీరి మన్స్తత్వాలు తెలుసు. జరుగబోయే యుధ్ధము తెలుసు. ఇది అనివార్యము. ఈ మహాయుధ్ధము జరగాలి. జననాశనం జరగాలి. దురాత్ములు సమూలంగా నశించాలి. భూమి చల్లబడాలి. అంటే తన భారం తీరిందని సంతోషించాలి. ఇప్పుడు నేను కనుక రాయబారిగా రాకపోతే..<br />
<br />
కృష్ణుడు కవాలని ఈ మారణకాండ దగ్గరుండి జరిపించాడని అనవసరంగా ముందు నన్ను ఆ తదుపరి పాండవులను నిరసిస్తారు. ఇప్పుడు జరుగబోయేది సర్వం గ్రహించినట్లు "విధి విపరీతం" అని సర్దుకుపోయే ప్రయత్నం చేస్తారు. కనుక, ఇది పొసగదు అని తెలిసి కూడా తప్పక వచ్చాను అని విదురునికి వివరించాడు.<br />
<br />
రాయబారం విఫలమౌతుంది.<br />
<br />
మూర్ఖులు, మందులైన దుర్యోధనులు కృష్ణుని బంధిస్తే పాండవుల ఆట కడుతుందని, అవివేకంతో ఆ మహనీయుని బంధింపతలచి చేసిన ప్రయత్నం వారికే బెడిసికొడుతుంది. కనీసం కృష్ణుని సంపూర్ణంగా కళ్ళతో చూదలేకపోతారు. చచ్చినట్టు బ్రతికి బయటపడతారు. పాండవుల ప్రతీకార, శపధాలు నెరవేర్చుకోవడానికి అన్నట్లు జీవచ్చవాలై మిగులుతారు.<br />
<br />
ఆ తరువాత, ఉభయులు యుధ్ధ సమ్రంభాలు ప్రారంభిస్తారు. కురుక్షేత్రం చేరి ఉభయులు, సైన్యాలతో మిత్ర, ప్రియ, ఆశ్రిత రాజులతో, ధనుష్టంకారం చెయ్యడానికి వీలుగా శంఖధ్వానాలు చేస్తుంటే..<br />
<br />
<br />
అర్జునుదు జావగారిపోతాడు. అతన్ని ఉత్సాహపరచడానికి,నీతి-ధర్మశాస్త్రమనే మహాభారతంలో శ్రీకృష్ణుడు జగదాచార్యుడై దర్శనమిస్తాడు. ధర్మ బోధ చేస్తాడు. అదే భగవద్గీత. <br />
<br />
యుద్ధభూమి లో ఏం జరుగుతోందో చూసి చెప్తున్న సంజయుని మాటలకు ధృతరాష్ట్రుడు కుంగిపోతాడు. అధర్మవర్తనులైన తమ కొడుకులు ఎక్కడ విజయం సాధించరో అని దిగులుపడతాడు. మనసు వికలమైన ధృతరాష్ట్రుడు మనశ్శాంతి కోసం విదురుని రప్పించి మనసుకు సాంత్వన కలిగేటట్లు మంచి మాటలు చెప్పమని కోరుతాడు...ఆ సందర్భంలో విదురుడు పలికిన మాటలే విదుర నీతి.<br />
<br />
శ్రీకృష్ణ శ్శరణం మమ ....<br />
<br />
***************************(సమాప్తం) ******************************** <br />
<br />
<br />
<br /></div>
Anonymoushttp://www.blogger.com/profile/04022717604315986029noreply@blogger.com1tag:blogger.com,1999:blog-4647961813969328457.post-34922579159890306972016-08-18T05:06:00.001-07:002016-08-18T05:06:47.975-07:00<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
విదురనీతి 70<br />
<br />
అనురాగ హృదయం గల ప్రభువు ప్రజల ఆదరానికి పాత్రుడౌతాడు. ప్రభువు పుష్పిత వృక్షం వలే ప్రసన్నుడై ఉండాలే కానీ, అధిక ఫలాలనందివ్వకూడదు. మనఒవాక్కాయ కర్మలతో ప్రజలకు సంతోషం కలిగించే ప్రభువు ప్రఖ్యాతుడౌతాడు. రజుచేసే దుష్కర్మలు రాజ్యాన్ని చిన్నాభిన్నం చేస్తాయి. పరంపరాగతంగా సజ్జనులాచరించే మార్గాన నడిచే మహీపాలునిక్కీ సిరిసంపదలతో రాజ్యం వృధ్ధిపొందుతుంది.<br />
<br />
దరిద్రునకు ఆకలి ఎక్కువ . ధనికుడికి జీర్ణ శక్తి తక్కువ. అధముడు జీవితానికీ, మధ్యముడు మృత్యువుకూ, ఉత్తముడు అవమానానికీ భయపడతారు. సురాపాన మదం, ఐశ్వర్యం కలిగించే మదం కంటే ఎక్కువేమీ కాదు. ఐశ్వర్యమత్తుడు సంపదలు నశిస్తేనే కానీ ఆ మత్తును వదలలేడు . జితేంద్రియుడు శుక్లపక్ష చంద్రునివలే వృధ్ధిపొందుతాడు.<br />
<br />
***********************************************************************<br />
<br />
ధర్మప్రభోధం<br />
<br />
భారతంలో లేనిది ఈ ప్రపంచంలో లేదు. ప్రపంచంలో లేనిదేదీ భారతం లేదు. ఒకసారి చెప్పినది మరల మరల చెప్పను అన్నాడు. నిధిల ధర్మశాస్త్రము, సర్వసక్షణ సారము, నీతివంతమైన ఈ భారతం పంచమవేదం అని ప్రశస్తి పొందినది ఇందుకే... జ్ఞాభిలాషులు, ధర్మతత్పరులు, నీతికోవిదులు, ఇంకా ఇంకా తెలుసుకోవాల్ని ఆశిస్తారు. "వ్యాసో, నారాయణో హరి:" అన్న ఆ పరమాత్మ వ్యాసుని రూపంలో మనకందించిన మహాద్భుత మధురానందకర దివ్యప్రబంధము "మహాభారతం".<br />
<br />
ధర్మాత్ముడైన విదురునికి జరుగుతున్న ప్రతి సంఘటన బాధించసాగింది. చేసుకున్న పాపకర్మకు దుర్యోధనుడు, తమను అభిమానించి, ఆశ్రయించిన రాజులు, సేవకులతో పద్దెనిమిది అక్షౌహిణుల సేన తో సహా నాశనమయ్యారు. ఇప్పుడు అధర్మం నశించింది. ధర్మం జయించింది అని చెప్పాల్సి ఉంటుంది.<br />
<br />
సంజయుని రాయబారం ధృతరాష్ట్రునికి నీతిబోధ అవుతుంది. ఆ విచారంలో ఉన్న మహారాజు మహామంత్రి విదురుని పిలిపించుకుని నాలుగు మంచి మాటలు చెప్పమంటే ధర్మప్రియుడైన విదురుడు ధర్మబధ్ధంగా చేయవలసిన విధివిధానాలను నీతిదాయకంగా చెప్తాడు.<br />
<br />
తదుపరి శ్రీకృష్ణుడు పాండవుల తరఫున రాయబారిగా వస్తాడు. ఆయనకు సాదరస్వాగతం లభిస్తుంది. దుర్యోధనుడు విడిది ఏర్పాటు చేస్తానంటే "అవసరంలేదు ! అయినా రాయబారులు రాజభవనాలలో ఉండకూడదు అని, విదురుని ఇంటికి వెళతాడు..అప్పుడు విదురుడు శ్రీకృష్ణునితో<br />
<br />
"దేవదేవా! నీ ప్రయత్నం ఫలిస్తుందనే వచ్చావా?" అని అడుగుతాడు. <br />
<br />
(ఇంకా ఉంది ) </div>
Anonymoushttp://www.blogger.com/profile/04022717604315986029noreply@blogger.com0tag:blogger.com,1999:blog-4647961813969328457.post-55974093038474415462016-08-18T04:29:00.001-07:002016-08-18T04:29:49.057-07:00<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
విదురనీతి 69<br />
<br />
క్రోధము, లజ్జ, గర్వము, హర్షము, ఆత్మస్తుతి ఎవని చేరువలో ఉండవో వాడే విద్వాంసుడు. ప్రజలు ఎవని సలహాలను గ్రహిస్తారో వాడే విద్వాంసుడు. ధర్మార్ధాలననుసరిస్తూ లోకవ్యవహారం గ్రహిస్తూ భోగచింతలేక పుర్షార్ధాన్ని సాధిస్తూ సక్త్యనుసారం కృషి చేస్తూ విషయాలను స్వల్ప కాలంలో గ్రహిస్తూ అప్రస్తుత ప్రసంగాలు చెయ్యకుండాఅ దుర్లభవస్తువులను కోరకుండా పోయినవాటికోసం శోకించకుండా విపత్తులలో ధర్యం పోగొట్టుకొనకుండా ఆరంభించిన కార్యాలను మధ్యలో అప్పకుండా, సోమరియై కూర్చోకుండా , మనసును వశపరుచుకొని చరించువారు నిజమైన పండితులు. ఇంకా చెప్పాలంటే బుధ్ధిమంతులు.<br />
<br />
ప్రభూ! ఏకాకిగా ఆహారం భుజించకూడదు. తనకు తానై విషమ సమస్య్లలో నిశ్చయాలు చసిఉకోకూడదు. ఒంటరిగా ప్రయాణం చెయ్యకూడదు. అందరూ నిద్రిస్తూండగా ఒక్కడు మేల్కొని ఉండకూడదు. ఇది విద్వాంసుల మార్గము. సాగర తరణానికి నౌక ఏకైక సాధనమైనట్లు స్వర్గం చేరడానికి సత్యమే ఏకైక సాధనం.<br />
<br />
అల్పబుధ్ధినీ, దీర్ఘసూత్రునీ, త్వరపడేవానినీ, స్తోత్రపాఠకునీ, రహస్య సమాలోచనలకు పిలువకూడదు. కుటుంబవృధ్ధజనులనూ, విపతులలో పడిన ఉన్నత కుటుంబీకులనూ, దరిద్రులైన మిత్రులనూ, సంతాన విహీనయైన సోదరినీ ఆశ్రయమిచ్చి పోషించాలి.<br />
<br />
విద్య పరిపూర్తి అయిన అనంతరం శిష్యుడు గురువునూ, వివాహానంతరం తల్లిని కుమారుడూ, భోగఫలానంతరం పురుషుడు స్త్రీని, పని జరిగిన మీదట సహకరించినవారిని నదిని దాటాక నావనూ, రోగవిముక్తానంతరం వైద్యునీ విస్మరించడం సహజం...అది తగదు.<br />
<br />
వృధాగా విదేశాలలో తిరిగేవాడూ, పాపులతో మైత్రి చేసేవాడూ, పరస్త్రీగామీ, పాషండుడూ, చోరుడూ, కుటిలుడూ, మధుపానం చేసేవాడూ దు:ఖాలలో పడతారు. క్రోధమూ, తొందరపాటూ, పురుషార్ధరాహిత్యమూ, అనృతవాదిత్వమూ దు:ఖ హేతువులు.<br />
<br />
(ఇంకా ఉంది ) </div>
Anonymoushttp://www.blogger.com/profile/04022717604315986029noreply@blogger.com0tag:blogger.com,1999:blog-4647961813969328457.post-72502359806154431212016-08-18T04:02:00.001-07:002016-08-18T04:02:23.178-07:00<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
విదురనీతి 68<br />
<br />
మహాభారతంలో కర్ణుదు "నేనొక సూతపుత్రుణ్ణీ...హీనకులజుణ్ణి" అని తలపోతూ వ్యతిరేక దృక్స్పథంతో అన్వయిస్తూ మహాభారతం పొడుగునా విచార భారంతోనే గడిపాడు. మరి.. అదే కథలోని మరో పాత్ర విదురుడు. అతను ధృతరాష్ట్రుడికి తమ్ముడే అయినా దాసి పుత్రుడు. అయిదూళ్ళు కాదుకదా అయిదంగుళాల రాజ్యభాగానికి కూడ అర్హతలేని వాడు. కానీ ఇవేవీ విదురుడి సహజస్థితికి విఘ్నం కలిగించలేదు. కారణం అతను వేతినీ వ్యతిరేక దృష్టితో చూడలేదు. ఆత్మన్యూనతతో బాధపడుతూ, దాసీపుత్రుణ్ణని దండోరా వేసుకోలేదు. ధర్మ నిరతితో మెలిగాడు. దయాగుణంతో ఎదిగాడు. <br />
<br />
తోటివారితో, సమస్త జీవరాసులతో ప్రకృతితో అనుసంధానం కావాలి. పవిత్ర సహజీవనాన్ని అలవరచుకోవాలి. అప్పుడు ఎవరో మంత్రించి మాయం చేసినట్లు "మనో మాయా భూతం" క్షణంలో అదృశ్యమైపోతుంది.<br />
<br />
ఇళ్ళకు నిప్పుపెట్టేవాడూ, విషం త్రాగించేవాడూ, జారులవల్ల కలిగిన సంతాన ధనం తినేవాడూ, సోమరసం విక్రయించేవాడూ, శస్త్రాలు నిర్మించేవాడూ, మొసగాడూ, మిత్రద్రోహీ, పరస్త్రీలంపటుడూ, భ్రూణ హత్యలు చేసేవాడూ,గురుపత్నిగామీ, సురాపానం చేసే విప్రుడూ, కర్కశ స్వభావం గలవాడూ, వేదనిందకుడూ, గ్రామ పురోహితుడూ, కాకివలే అరచేవాడూ శరణార్థులను వధించేవాడూ, బ్రహ్మహత్యా పాతకుడూ...సమానులే...<br />
<br />
ఇతరుల విషయంలో పరుషప్రసంగాలు చెయ్యనివాడు, చేయించనివాడు ఇతరులచేత అవమానితుడై కూడా ప్రతీకారాన్ని తలపెట్టనివాడూ, అవమానమూ పొందికూడా ఇతరులపై ప్రతీకార చర్యలకు సాహసించని వాడూ, మరణించిన తర్వాత స్వర్గానికి వెళతారు ..ఆ సమయంలో అతనికి దేవతలు స్వాగతం పలుకుతారు. వాక్కు ఎప్పుడు ఉత్తమైనదీ? మౌనం కంటే ప్రియంగా ఉన్నప్పుడూ, ధర్మ సమ్మతం కూడా అయినప్పుడు వాక్కు ఉత్తమమైనది. మానవుడు తాను ఎవరిని సేవిస్తాడో ఏ పరిసరాలలో మెలగుతుంటాడో ఎటువంటి పరిణామం వాంచిస్తాడో అది తప్పక పొందుతారు.<br />
<br />
కొందరు మూర్ఖులు తాము చెప్పేది తప్పైనా ఒప్పుకోక అడ్డదిడ్డంగా వాదిస్తుంటారు. అటువంటి సమయంలో మౌనం వల్లనే భద్రత, రక్షణ, శుభం కలుగుతాయి.<br />
<br />
ఒక కార్యం చేయబోయే ముందు దాని వల్ల సిధ్ధించే ప్రయోజన అప్రయోజనాలను ముందుగానే నిర్ణయించుకోవాలి. అసాధ్యాల్ కోసం కృషి చెయ్యడం అనవసరం...అది తెలిసి కూడా కృషి చేస్తే అది వ్యర్థమే కదా.. అనవసరంగా కోపించే వాడిని, అకారణంగా సంతోషించే వానిని ప్రజలు రాజుగా గ్రహించరు.<br />
<br />
(ఇంకా ఉంది )<br />
<div>
<br /></div>
</div>
Anonymoushttp://www.blogger.com/profile/04022717604315986029noreply@blogger.com0tag:blogger.com,1999:blog-4647961813969328457.post-46035474473844842212016-08-18T01:10:00.001-07:002016-08-18T01:10:56.983-07:00<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
విదురనీతి 67<br />
<br />
విదురుడెరిగించిన కొన్ని నీతులను. ధృతరాష్త్రునికి ఆ నీతుల ద్వారా చెప్పిన కొన్ని ఆచరణలు.<br />
<br />
** మాతృభూమిని సేవించాలి.<br />
<br />
** ధర్మపరాయణుణ్ణి సత్యమనే నావపై దాటిస్తారు.<br />
<br />
** భగవాన్!! మాకందరికీ జ్ఞానాన్ని కలిగించు. సత్సంకల్పాలు కలిగించు.<br />
<br />
** దేవతలు యజ్ఞయాగాలు చేసేవారిని, పురుషార్ధానికి పాటుపడే వారిని కోరుతారు కాని, సోమరిని ఎప్పటికిని ప్రేమించరు.<br />
<br />
** మనమెప్పుడూ మంగళాన్ని కలిగించే వాక్కులనే విందాం.<br />
<br />
** పరమేశ్వరా!! మా సంతానానికి సుఖం కలిగించు.<br />
<br />
** ఎవరి ధనానికీ, సంపదకూ ఆస్తికి ఆశపడవద్దు.<br />
<br />
<br />
<br />
విద్వాంసులను నిందిస్తూ మూర్ఖులు సంతోషిస్తారు. ఎదుటివానిని నింధించడమే స్వభావంగా కలవాడు మహాపాపి. నిందలను సహిస్తూ వారిని క్షమించేవాడు పుణ్యాత్ముడు. హింస ధుష్టులకు బలం...దండనీతి రాజులకు బనక్. సేవ స్త్రీలకు బలం. క్షమ గుణశీలికి బలం.<br />
<br />
వాక్కును స్వాధీనంలో ఉంచుకోవడం మహాకష్టమైన పని...చమత్కార యుక్తులతో, విశేషార్ధాలను ప్రతిపాదించగల వాని వాక్కు మితంగానే ఉంటుంది. మధుర శబ్దయుతమైన విషయం కళ్యాణప్రదమే అవుతుంది. అదే విషయం కటూక్టులతో నిండితే అనర్ధదాయకమవుతుంది. గొడ్డలి దెబ్బలుతిన్న అరణ్యం లోని వృక్షాలు చిగురించవచ్చు. కానీ కటువచనాలతో దెబ్బతిన్న హృదయం కోలుకోదు.<br />
<br />
ప్రబూ! వృధ్ధులూ, గురువులూ లేనిది సభ కాదు. ధర్మం చెప్పలేనివాడు గుర్వూ, వృధ్ధుడూ కాదు. సత్యబధ్ధం కానిది ధర్మం కాదు. కపటమైనది సత్యం కాదు. సత్య., వినయశాస్త్రజ్ఞానము, కులీన, శీల, బల, ధన, శూరత్వ, విద్యా, మృదుభాషితాలు స్వర్గహేతువులు. నిందితుడెప్పుడూ పాపకర్మలే చేస్తూ తత్ఫలమే పొందుతారు. పుణ్యాత్ములు సత్కర్మలే చేస్తూ స్వర్గం చేరుతాడు. పాపకర్మలు బుధ్ధిని నశింపచేస్తాయి. ధీమంతుడు సత్కర్మలే ఆచరిస్తూ ఏకాగ్ర చిత్తుడై పుణ్యకర్మ రతుడౌతాడు. <br />
<br /></div>
Anonymoushttp://www.blogger.com/profile/04022717604315986029noreply@blogger.com0tag:blogger.com,1999:blog-4647961813969328457.post-8513637731922975012016-08-17T23:59:00.001-07:002016-08-17T23:59:13.042-07:00<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
విదురనీతి 66<br />
<br />
ఈ మానవశరీరమొక రథం. దానికి సారధి--బుధ్ధి...ఇంద్రియాలు అశ్వాలు. వీనిని వశం లో ఉంచుకొనే వాడు మహా రధికుని వలె సంసార సంగ్రామం లో జయం పొందుతాడు. వశంతప్పి పట్టుతప్పిన గుర్రాలు మధ్యే మార్ఘంలో సారథిని పడగొట్టినట్లు వశంలో లేని ఇంద్రియాలు పురుషుని అర్ధానర్ధ జ్ఞానాన్ని నశింపచేసి దు:ఖభాగుని చేస్తాయి...ధర్మార్ధాలను విడిచి విషయలోలుడై చరించేవాడు అచిరకాలంలో ఐశ్వర్య,ప్రాణ, స్త్రీ, ధనాలను పోగొట్టుకొంటాడు. ఆత్మజ్ఞానాన్ని గ్రహించడానికి నిరంతరం కృషిచెయ్యాలి. ఆత్మకు మించిన మిత్రుడూ,శత్రువూ లేరు. దాన్ని జయించిన వానికి అదే మిత్రము. లేకపోతే అదే పరమ శత్రువు. సూక్ష్మ రంధ్రాలు కల వలలో పడ్డ చేపలు దానిని కొరికివేసినట్లు, కామక్రోధాలనే మీనాలు వివేకాన్ని నశింపచేస్తాయి. ధర్మార్ధాలన్ పరిశీలించుకొని విజయం కోసం కృషి చేసేవాడు సులభంగా వానిని సాధిస్తాడు. చిత్త వికారానికి హేతుభూతాలైన పంచేంద్రియాలను శత్రువులుగా భావించి వానిని జయిస్తేనే శతృ విజయం సాధ్యమవుతుంది.<br />
<br />
విదురనీతిలో ముఖ్యాంశాలు...<br />
<br />
** జీవితం పాదరసం ...దానిని పట్టుకొనుట కష్టం.<br />
<br />
** డబ్బు ప్రతిమనిషిని కలుపుతుంది. విడదీస్తుంది.<br />
<br />
** ఉన్న సంపాదనలో కొంత దానం చేయాలి...అదే చివరకు మిగిలేది.<br />
<br />
** మానవుని జీవితం క్షణభంగురం ...అది ఎప్పుడు ఎక్కడ ఆగిపోతుందో తెలియదు.<br />
<br />
** నీవు చేసే ప్రతి పని పదిమందికి ఉపయోగపడాలి.<br />
<br />
(ఇంకా ఉంది ) </div>
Anonymoushttp://www.blogger.com/profile/04022717604315986029noreply@blogger.com0tag:blogger.com,1999:blog-4647961813969328457.post-70165351367206209602016-08-17T23:38:00.001-07:002016-08-17T23:38:00.182-07:00<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
విదురనీతి 65<br />
<br />
స్వేచ్చానుసారం చరిస్తూ పరేచ్చను పరిగ్రహించకుండా తన ఆలోచనాల్ను గుప్తంగా ఉంచుకుంటూ సీయకార్యాలను సక్రమంగా నిర్వహించుకోవాలి. సత్యవాదీ, కోమలస్వభావుడూ, ఉన్నతాభిప్రాయుడూ, ఆదరశీలీ, అయినవాడు శ్రేష్ఠ రత్నంలా జాతివారిలో ప్రసిద్ధుడౌతాడు. లజ్జాశీలిని సర్వప్రజలూ గౌరవిస్తారు. ఏకాగ్ర చిత్తంతో శుధ్ధ హృదయంతో అనంతతేజస్సుతో ఆ పురుషుడు సూర్యునివలే భాసిస్తాడు.<br />
<br />
అనురాగహృదయం గల ప్రభువుప్రజల ఆదరానికి పాత్రుడౌతాడు. ప్రభువు ఫలభరిత పుష్పవృక్షం లాగ ప్రసన్నుడై ఉండాలేగాని అధిక ఫలాలనందివ్వగూడదు. మనోవాక్కాయ కర్మలతో ప్రజలకు సంతోషం కలిగించే ప్రబువు ప్రఖ్యాతుడౌతాడు. భయంకరుడైన ప్రభువును ప్రజలు పరిత్యజిస్తారు. ప్రభంజనం కారుమేఘాలు చిన్నాభిన్నం చేసినట్లు దుష్కర్మలు రాజ్యాన్ని పాడు చేస్తాయి. ప్రంపరాగతంగా సజ్జనులాచరించే మార్గాన నడిచే మహీపాలునికి సిరిసంపదలతో రాజ్యం వృధ్ధిపొందుతుంది. ధర్మమార్గం విడిచి అధర్మంగా పోయే ప్రభువు ఏలుబడిలోని రాజ్యం నిప్పుమీద పడ్డ చర్మంలా ముడుచుకుపోతుంది.<br />
<br />
పరరాజ్య సాధనార్ధం చేసే ప్రయత్లానతో పాటు స్వీయరాజ్య సంరక్షణానికి కూడా కృషి అవసరం. ధర్మంతోనే రాజ్యాన్ని సంరక్షించాలి. ధర్మబద్ధుడైన రాజును రాజ్యలక్ష్మి విడువదు. రాజు, అధికప్రసంగుల నుండీ , ఉన్మత్తులనుండీ, వ్యర్ధప్రేలాపకులనుండీ, బాలురనిండీ అవసరమైన విషయాలను, శిలల నుంచి బంగారం గ్రహిచినట్లు గ్రహించాలి. వేదాల వల్ల విప్రులూ, గంధంవల్ల గోవులూ, గూఢచారుల వల్ల రాజులూ వాస్తవాలను గ్రహిస్తారు.<br />
<br />
పశురక్షకుడు మేఘుడు .ప్రభువుకు సహాయకుడు మంత్రి. స్త్రీకి ఆప్తుడు భర్త. బ్రాహ్మణులకు వేదాలే బంధువులు. సత్యం చేత ధర్మం రక్షింపబడుతుంది. విద్య యోగ రక్షితము. సౌందర్యానికి శుభ్రత రక్షణాధారము. నీచకులజుడైనా సదాచారం వల్ల శ్రేష్టుడౌతాడు.<br />
<br />
సజ్జనులకు విద్యా, ధన, కుల మదాలనుండకూడదు. ఉత్తములకు సహాయం చేసేవారు సత్పురుషులు. ఉత్తమ శీల స్వభావాలు కలవారు సర్వులనూ జయిస్తారు. వ్యక్తికి ప్రధానమైన శీలం నశిస్తే వాని జీవితం వ్యర్ధమే..<br />
<br />
దరిద్రునికి ఆకలి ఎక్కువ. ధనికుడికి జీర్ణశక్తి తక్కువ. అధముడు జీవితానికీ, మధ్యముడు మృత్యువుకూ, ఉత్తముడు అవమానానికి భయపడతారు.<br />
<br />
ఐశ్వర్యం కలిగించే పదం కంటే సురాపానమదం అధికమైనది కాదు. ఐశ్వర్యమత్తుడు సంపదలు నశిస్తే కానీ ఆ మత్తును వదలలేడు. ఇంద్రియాలు వశంలో పెట్టుకోని వానికి కష్టాలే....జితేంద్రియుడు శుక్లపక్ష చంద్రునివలె వృధ్ధిపొందుతాడు. అంత:స్సత్రువులను జయించకుండా బాహ్య శత్రువులను జయించలేము.<br />
<br />
(ఇంకా ఉంది ) <br />
<br /></div>
Anonymoushttp://www.blogger.com/profile/04022717604315986029noreply@blogger.com0