Wednesday 18 February 2015

తెలుగు చిత్రసీమ లో తిరుగులేని నిర్మాతగా, మూవీ మొఘల్ గా పేరొందిన డా. డి. రామానాయుడు గారు కాన్సర్ వ్యాధి తో ఈ రోజు మరణించారు. పట్టినది బంగారం అనే నానుడికి చక్కని ఉదాహరణ రామానాయుడు గారు. ప్రముఖ భారతీయ భాషలు అన్నిటిలో చిత్రాలు నిర్మించిన ఘనత ఆయనది. ఒకే ఒక వ్యక్తీ శతాధిక చిత్రాలను నిర్మించి ప్రపంచ రికార్డును కూడా స్థాపించారు. అందులో అధిక శాతం విజయ వంతం అయ్యాయి. నంది అవార్డు. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు, ఫిలిం ఫేర్ అవార్డు, జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్ర నిర్మాత అవార్డు లతో పాటు, పద్మ భూషణ్ అవార్డు ను కూడా పొందిన గొప్ప నిర్మాత మన తెలుగు వాడు కావటం మన అందరికీ గర్వకారణం. బాపట్ల నుండి లోక్ సభకు ఎన్నికై రాజకీయాలలో కూడా సేవ చేసారు. చలన చిత్ర పరిశ్రమలో మంచి నిర్మాతగా నే కాకుండా, కార్మికుల మంచి చెడ్డలు చూసే వ్యక్తిగా, వారి సంక్షేమం కోసం పనిచేసిన మంచి వ్యక్తీ గా ఆయనకు మంచి పేరు ఉంది. అయన ఆత్మ కు శాంతి కలగాలని ప్రార్ధిస్తూ..

No comments:

Post a Comment