Wednesday 16 July 2014

ప్రతి గర్భిణి స్త్రీ కి ఒక మొబైల్ ఫోన్ ఉచితం: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ యోచన.

గర్భిణి స్త్రీలకూ ఉచితంగా ఒక మొబైల్ ఫోన్ అందజేసి, సంక్షిప్త సందేశాల ద్వారా, ఆమె తీసుకోవలసిన టీకాలు, బలవర్ధక మైన ఆహారం వంటి వివరాలు అందజేయాలి , తద్వారా దక్షిణ భారతం లోనే మాతా శిశు మరణాలు ఎక్కువగా నమోదు అయిన రాష్ట్రం గా ఉన్న ఆంధ్ర ప్రదేశ్ లో గర్భిణి స్త్రీల ఆరోగ్యం విషయం మిద శ్రద్ధ పెట్టి, మాతా శిశు మరణాల రేటు తగ్గించాలి అని ప్రభుత్వ యోచన. ఇది ఈనాడు దినపత్రిక లో నిన్న అనగా 16 జూలై నాడు ప్రచురింపబడిన వార్త.

1.ఈరోజున గ్రామీణ ప్రాంతాలలో కూడా 90 శాతం ప్రజలు మొబైల్స్ వాడుతున్నారు. స్త్రీలకూ కూడా మొబైల్స్ ఉంటున్నాయి.
2. గర్భిణి లకు సూచనలు , సలహాలు అందజేయాలి అంటే, ఇంట్లో ఎవరో ఒకరికి మొబైల్ ఉంటె చాలదా? ప్రత్యేకించి ఆ స్త్రీకి ఉండాలా?
3.ఒక మాదిరి ఆర్ధిక పరిస్థితి, చదువు, ఆరోగ్యం మీద శ్రద్ధ ఉన్నవారికి వైద్యులు ఇచ్చే సూచనలు సరిపోతాయి, ప్రత్యేకించి వారికీ మొబైల్ కొత్తగా ఈ విషయమై ఇవ్వవలసిన పనిలేదు.
4. అంతగా చదువు లేకుండా, మారుమూల పల్లెటూళ్ళలో ఉన్న స్త్రీలకూ మొబైల్ ఇచ్చినా కూడా అది వారి దగ్గర నిలుస్తుంది అని నమ్మకం లేదు. అది ఇతర అవసరాలకు పనికి రావచ్చు. (పేదల సంక్షేమం కోసం ప్రవేశ పెట్టిన రేషన్ కార్డులు 90 శాతం తాకట్టు లోనే ఉంటాయి ఎప్పుడూ).
5. బాగా విద్యాధికుల దగ్గరే కొండొకచో, మొబైల్స్ వల్ల ఎన్నో అనర్ధాలు జరుగుతున్నాయి. ఇంకా నిరక్షరాస్యులైన వారికీ ప్రత్యెక మొబైల్స్ అవసరమా?
6.  నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటె, ఈ పధకం కింద ఖర్చు పెట్టె కోట్ల రూపాయలను, గర్భిణి స్త్రీల పోషకాహారానికి నేరుగా ఖర్చు పెట్టవచ్చు.
7. ప్రతి గ్రామం లో ఉన్న గ్రామా సేవికలు, అంగన్వాడి కార్యకర్తల ద్వారా, గర్భిణి స్త్రీల పేర్లు, నమోదు చేసి, ప్రతి వారం , లేదా ప్రతి రోజు వారికీ పోషకాహారం నేరుగా అందివ్వవచ్చు. ప్రతినెలా వారి యొక్క ఆరోగ్యం పరీక్షించడానికి పరీక్షలు చేసి, టీకాలు ఉచితంగా ఇవ్వవచ్చు.
8. మన రాష్ట్రం లో ఎన్నో చోట్ల, ఎన్నో కుటుంబాలు స్వచ్చందంగా వేసవి కాలంలో అంబలి సెంటర్లు తెరిచి బీదలకు అంబలి పంచి పెడుతున్నారు. ఆ విధంగా ప్రభుత్వం తలచుకుంటే ప్రతి గ్రామం లోను, ప్రజా వైద్య శాలల్లో గాని, అంగన్వాడి సెంటర్లలో కాని, ప్రతి రోజు గర్భినులకు ఆహారం అందజేసే కార్యక్రమం చేపట్టవచ్చు.
9. దీనికి కావలసినది అధికారులలో, చిత్తశుద్ది. ప్రజల ఆరోగ్యం పట్ల శ్రద్ధ. వారి వారి కర్తవ్యమ్ పట్ల నిబద్ధత.
10, అసలు చెప్పుకోవాలంటే, మారుమూల గ్రామాలనుంచి గర్భినులకు ప్రసవ సమయం లో ఆసుపత్రికి చేరటానికి సరిఅయిన రహదారులు లేవు. ఏజెన్సీ ప్రాంతాలలో అయితే, వారి పరిస్థితి మరీ దుర్భరం. అక్కడ గర్భిణి స్త్రీ ప్రాణాలకు ఏ విధమైన గారంటీ లేదు.
11. ముందు గ్రామాలలో ఉన్న ప్రభుత్వ వైద్య శాలల్లో సౌకర్యాలు మెరుగు పరచండి. వైద్యులు అక్కడే ఉండి, ఏ సమయం లో నైనా వైద్యం అందించే పరిస్థితి కల్పించండి.
12. ఉచిత మందులు, ఉచిత టీకాలు ప్రజలకు అందే ఏర్పాట్లు చేయండి.
13. ఇవి అన్నీ లేనపుడు మీరు మొబైల్స్ ఉచితం గా ఇవ్వడం ఎంతవరకు సబబు?
14. మొబైల్స్ ఉచితంగా ఇస్తే పై సమస్యలు అన్నీ తీరిపోతాయ?
15.మాతా శిశు మరణాలు రేటు తగ్గడానికి ముందు గ్రామీణ ప్రాంతాలలో ప్రజలను educate  చేయండి. వారు తీసుకోవలసిన జాగ్రత్తలు, పోషకాహారం వీటి పట్ల అవగాహనా కల్పించండి.
16. పల్స్ పోలియో కార్యక్రమం లాగా ఈ అవగాహనా కార్యక్రమం కూడా ఏళ్ళ తరబడి నిరంతరాయంగా సాగేలా చుడండి.
17, ప్రజలు educate  అవనంత వరకు మీరు ఎన్ని మొబైల్స్ ఉచితంగా ఇచ్చినా ప్రయోజనం ఉండదు.
18. పైగా, మొబైల్స్ ఉచితంగా ఇవ్వడం వల్ల ఇంకా అనర్ధాలకు దారి తీసిన వారు అవుతారు. ఎందుకంటే టెక్నాలజీ రెండు వైపులా పదును ఉన్న కత్తి కాబట్టి. దాని విలువ తెలుసుకోలేని వారి దగ్గర అది ఎప్పుడూ దుర్వినియోగం అవుతుంది.

**************ఈ పోస్ట్ చుసిన రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, జర్నలిస్టులు, లేక ప్రభుత్వం తో ప్రత్యక్ష సంబంధం ఉన్న అధికారులు ఈ అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తే సంతోషిస్తాను. ఎందుకంటే ప్రభుత్వం వరకు ఈ పోస్ట్ చేరవేయాలి అంటే దాని process  నాకు తెలియదు.

No comments:

Post a Comment