Saturday 26 July 2014

ఎక్కడైనా ప్రమాదం జరిగితే ప్రభుత్వం రెండు మూడు రోజులు తెగ హడావిడి చేస్తుంది. స్కూల్ బస్సు ప్రమాదం జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా రెండు మూడు రోజులు బస్సులను తనిఖీ చేసి సీజ్ చేస్తారు.  కానీ సమస్య మూలాలలోకి వెళ్లి అసలు స్కూల్ బస్సులకు ఫిట్నెస్ ఉందా లేదా? డ్రైవర్ కు కానీ , క్లీనర్ కి కానీ మద్యపానం అలవాటు ఉందా? వారు ఫిట్ గా ఉన్నారా లేదా? వారి డ్రైవింగ్ సరిగా ఉందా లేదా అనే విషయాలు అటు స్కూల్స్ కానీ, ప్రభుత్వం కానీ పట్టించుకోవు. బస్సులు సంగతి అటు ఉంచితే, స్కూల్ ఆటో ల మాట ఏంటి? అందులో అసలు ఎంత మందిని ఎక్కించుకోవాలి? ఎంత మంది పిల్లలు ఎక్కుతున్నారు? వాళ్ళ పుస్తకాల సంచులు, క్యారేజిల సంచులు కలిపి ఎంత బరువు ఉన్నాయి అనే విషయం ఎవరూ పట్టించుకోరు. అసలు తల్లి తండ్రులు కూడా తమ అబ్బాయి/అమ్మాయి ఆటో లో ఎంత క్షేమంగా వెళ్తున్నారు? వాళ్ళ పిల్లలు ఆటో లో ఎక్కడ కూర్చుంటున్నారు? ఆటో లో మొత్తం ట్రిప్పు కి ఎంత మందిని తీసుకెళ్తున్నారు? అనే విషయాలు అసలు పట్టించుకోరు. దానికి తోడూ, మన రాష్ట్రం లోని రహదారుల సంగతి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. రాజధాని నగరం లో కూడా చిన్న వర్షం వస్తే, దారి ఎక్కడ ఉందొ, manhole ఎక్కడ ఉందొ కనిపెట్టలేము. నాలాలు నిండి దారి మీదే పారుతూ ఉంటాయి. వీటన్నిటిని వర్షాకాలం రాకముందే మరమ్మతులు చేసే ఉద్దేశం ఏ ప్రభుత్వానికి ఉండదు. వర్షాకాలం వచ్చాక మరమ్మతులు మొదలుపెడితే, పాపం పనిచేసే కార్మికుల ప్రాణాలకు కూడా హామీ ఉండడం లేదు.  కనీసం ప్రమాదం జరిగాక ప్రభుత్వం లోని ఏ శాఖా వారూ కూడా ఈ ప్రమాదానికి మేము ఎంత వరకు బాధ్యులము అని ఆలోచించారు. ఎంత సేపూ ఒకరి మీద ఒకరు నేరం నేట్టేసుకుని, ఒకవేళ జరిగిన ప్రమాదములో ఎవరైనా ప్రాణాలు కోల్పోతే వారి మిద నేరం నెట్టేసి చేతులు దులిపెసు కుంటున్నారు. ఒక వారం తరువాత మళ్లీ అంతా మాములే. అసలు తీర్చవలసిన ప్రజా సమస్యలు ఎన్నో ఉండగా, నేతలు అందరూ ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం, ఈ రాష్ట్రం యొక్క దుస్థితికి మీరు కారణం అంటే మీరు కారణం అనుకుంటూ వీధులకు, పేపర్లకు ఎక్కడం తప్ప పరిపాలన మీద, ప్రజా సంక్షేమం మిద దృష్టి పెడుతున్నట్టు కనబడడం లేదు. ఇకనైనా ప్రభుత్వాలు, అధికారులు మేల్కొని ప్రతి సమస్యను మూలం నుంచి పరిష్కరించ ప్రార్ధన.

No comments:

Post a Comment