Saturday 6 August 2016

విదురనీతి 55
"ప్రభూ! బలవంతులతో విరోధం దుర్బలులకు ఉచితం కాదు. అటువంటి వారికి రాత్రి వేళల లిద్ర రాదు. ఇటువంటి దోషాలు మీలో లేనప్పుడు మీకెందుకు నిద్ర రావడం లేదు? పరధనాన్ని మీరు ఆశించడం లేదు కదా? అని విదురుడు ప్రశ్నించగా ధృతరాష్ట్రుడు--నేను నీ ముఖం నుంచి ధర్మప్రవచనం కోరుతున్నాను.." అని దీనంగా అంటాడు.
పాలకుడు ప్రజలను రక్షించకుండా, న్యాయాన్ని విడిచి ప్రవర్తించకూడదు. అలా ప్రవర్తించే పాలకుడు, వరికుప్పకు నిప్పుపెట్టి, వడ్లు పేలాలైతే వానిని ఏరుకుని తెనేవానితో సమానము. కుప్ప నూరిస్తే ఎన్నో బస్తాల వడ్లు వస్తాయి. ఆ వడ్లు ఎందరి ఆకలినో తీరుస్తాయి..సంపదనందిస్తాయి. అవ వడ్లు మళ్ళి విత్తనాలుగా ఉపయోగిస్తాయి. మళ్ళి పంటనిస్తాయి. ఆ కుప్పకు నిప్పు పెడితే గడ్డి కూడా కాలిపోతుంది. పశుగ్రాసం కూడా లభించదు.
కొన్ని వడ్లు పేలాలౌతాయి. అవి ఏరుకొని తినే వాడెంత అవివేకి? కుప్ప నూర్చిన తర్వాత కొద్ది ధన్యాన్ని వేయించుకొంటే కావల్సినన్ని పేలాలు లభిస్తాయి. అంటే స్వల్పలాభం కోసం అధిక నష్టాన్ని కొని తెచ్చ్చుకోవడమంటే ఇదే...ప్రజలు వరి కుప్పలాంటివారు. వారిని సక్రమంగా పాలిస్తే వారు సంపనులౌతారు. ప్రభుత్వానికండగా ఉంటారు పన్నులు చెల్లిస్తారు. దేశాభివృధ్ధికెంతగానూ తొడ్పడతాడు. ఆ పాలకులు కూడా శాశ్వతంగా ప్రజానురాగాన్ని చూరగొంటారు.
(ఇంకా ఉంది )

No comments:

Post a Comment