Thursday 18 August 2016

విదురనీతి 69

క్రోధము, లజ్జ, గర్వము, హర్షము, ఆత్మస్తుతి ఎవని చేరువలో ఉండవో వాడే విద్వాంసుడు. ప్రజలు ఎవని సలహాలను గ్రహిస్తారో వాడే విద్వాంసుడు. ధర్మార్ధాలననుసరిస్తూ లోకవ్యవహారం గ్రహిస్తూ భోగచింతలేక పుర్షార్ధాన్ని సాధిస్తూ సక్త్యనుసారం కృషి చేస్తూ విషయాలను స్వల్ప కాలంలో గ్రహిస్తూ అప్రస్తుత ప్రసంగాలు చెయ్యకుండాఅ దుర్లభవస్తువులను కోరకుండా పోయినవాటికోసం శోకించకుండా విపత్తులలో ధర్యం పోగొట్టుకొనకుండా ఆరంభించిన కార్యాలను మధ్యలో అప్పకుండా, సోమరియై కూర్చోకుండా , మనసును వశపరుచుకొని చరించువారు నిజమైన పండితులు. ఇంకా చెప్పాలంటే బుధ్ధిమంతులు.

ప్రభూ! ఏకాకిగా ఆహారం భుజించకూడదు. తనకు తానై విషమ సమస్య్లలో నిశ్చయాలు చసిఉకోకూడదు. ఒంటరిగా ప్రయాణం చెయ్యకూడదు. అందరూ నిద్రిస్తూండగా ఒక్కడు మేల్కొని ఉండకూడదు. ఇది విద్వాంసుల మార్గము. సాగర తరణానికి నౌక ఏకైక సాధనమైనట్లు స్వర్గం చేరడానికి సత్యమే ఏకైక సాధనం.

అల్పబుధ్ధినీ, దీర్ఘసూత్రునీ, త్వరపడేవానినీ, స్తోత్రపాఠకునీ, రహస్య సమాలోచనలకు పిలువకూడదు. కుటుంబవృధ్ధజనులనూ, విపతులలో పడిన ఉన్నత కుటుంబీకులనూ, దరిద్రులైన మిత్రులనూ, సంతాన విహీనయైన సోదరినీ ఆశ్రయమిచ్చి పోషించాలి.

విద్య పరిపూర్తి అయిన అనంతరం శిష్యుడు గురువునూ, వివాహానంతరం తల్లిని కుమారుడూ, భోగఫలానంతరం పురుషుడు స్త్రీని, పని జరిగిన మీదట సహకరించినవారిని నదిని దాటాక నావనూ, రోగవిముక్తానంతరం వైద్యునీ విస్మరించడం సహజం...అది తగదు.

వృధాగా విదేశాలలో తిరిగేవాడూ, పాపులతో మైత్రి చేసేవాడూ, పరస్త్రీగామీ, పాషండుడూ, చోరుడూ, కుటిలుడూ, మధుపానం చేసేవాడూ దు:ఖాలలో పడతారు. క్రోధమూ, తొందరపాటూ, పురుషార్ధరాహిత్యమూ, అనృతవాదిత్వమూ దు:ఖ హేతువులు.

(ఇంకా ఉంది )  

No comments:

Post a Comment