Wednesday 23 December 2015

లక్ష్మిదేవి అనుగ్రహం పొందడానికి మనం ఎన్నెన్నో పూజలు, నోములు, వ్రతాలు చేస్తూ ఉంటాం. అష్టలక్ష్మి రూపాల్లో పూజలు అందుకునే లక్ష్మీదేవి ధనం, ధాన్యం, పాడి, పంట, విద్య, విజ్ఞానం, సద్బుధ్ధి, చల్లని సంసారం, అన్యోన్య దాంపత్యం, సత్సంతానం, కడుపునిండా తిన్నదాన్ని జీర్ణం చేసుకోగల ఆరోగ్యం --=ఈ అన్నిటి రూపాల్లోనూ విలసిల్లుతోంది. కేవలం, డబ్బు, బంగారమే కాక, వీటిలో ఏ కొన్ని మనకు లభించినా ఆ లక్ష్మీదేవి కటాక్షం మనకు లభించినట్టే. అన్నిటినీ మించి "నాకు భగవంతుడు అన్నీ ఇచ్చాడు. నేను సుఖమైన, సౌకర్యవంతమైన జీవితాన్ని గడుపుతున్నాను, అందుకు భగవంతుడికి సర్వదా నేను కృతజ్ఞుడను." అని ఎవరు సంతృప్తిగా ఉంటారో వారికి లక్ష్మీ కటాక్షం మిక్కిలిగా లభించినట్టు అర్ధం. ఈ ఆత్మతృప్తి ఉన్నచోటును లక్ష్మీదేవి వదిలిపోదుట. ఆమే అనుగ్రహం పొందాలంటే కొన్ని అర్హతలు సంపాదించవలసి ఉంటుంది. ప్రియభాషణం, కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత, ప్రేమాభిమానాలు, వాత్సల్యం, అతిథుల పట్ల ఆదరణ, మితభోజనం, మితనిద్ర, ఇవన్నీ ...గట్టి గట్టిగా అరచుకోవడం, అందరితో పోట్లాటలు పెట్టుకోవడం, ఇతరులను చులకనగా చూడడం, ఆత్మస్తుతి, పరనింద ఇవన్ని మన గౌరవాన్ని దెబ్బతీస్తాయి. అటువంటి చోట లక్ష్మి నివసించదు అని పెద్దలు చెపుతారు. పూజలు,  నోములు చేయలేకపోయినా, పై మంచి లక్షణాలను అలవరచుకుంటే, కావలసినంత మన:తృప్తి, అఖండమైన లక్ష్మీకటాక్షం లభిస్తాయి.

No comments:

Post a Comment