Friday 8 January 2016

హిందు ధర్మ పరిరక్షణ 2.

మన పూర్వులు మనకు అందించిన ప్రతి సంప్రదాయం వెనుక శాస్త్రీయ కోణం దాగి ఉంది. స్త్రీలు కాళ్ళకు పసుపు పూసుకోవాలని, ఇంటి గడపకు పసుపు పూయాలని, వాకిట్లో ఆవుపేడ కలిపిన కళ్ళాపి చల్లాలని చెప్పిన ప్రతి ఆచారం వెనుక చెడు బ్యాక్టీరియా నుంచి, విషపురుగులనుంచి మనలను రక్షించే ప్రయత్నం జరిగింది. ప్రతి పండుగకు మనం దేవునికి నివేదించే ఆహారపదార్ధాల వెనుక మారే ఆయా కాలలను బట్టి మన శారీరిక ఆరొగ్యాన్ని కాపాడడమే వారి ముఖ్యోద్దేశం. శ్రావణమాసం సెనగలు, వినాయక చవితికి ఉండ్రాళ్ళు, సంక్రాంతి పండుగకు అరిసెలు, కార్తీక మాసం ఉపవాసాలు, శ్రీరామనవమికి వడపప్పు, పానకం ఇవన్నీ నివేదించడం వెనుక ఎంతో శాస్త్రీయత ఉంది. అలాగే రామాయణం, భారతం, భగవద్గీత మొదలైన పురాణ గ్రంధాలు, అనేక శతాబ్దాల క్రితం రచించబడిన నీతి చంద్రిక వంటి గ్రంధాలు పిల్లల్లో మానసిక స్థైర్యాన్ని, పెంపొందిస్తాయి. ఏ ఇతర భాషా గ్రంధాలు ఇవ్వలేని వ్యక్తిత్వ వికాసం మన ఈ గ్రంధాలు ఇస్తాయండంలో సందేహం లేదు. చెట్లను, నదులను, సముద్రాలను, పశుపక్ష్యాదులను పూజించడం ద్వారా ప్రకృతికి మనం ఋణం తీర్చుకుంటున్నాం. రాముడు, కృష్ణుడు, పరిపూర్ణ అవతారాలు, జన్మనెత్తినది మొదలు, మరణాన్ని కూడా పొంది, మొత్తం జీవితకాలం, తమ ఆచరణ, ఆలోచనల ద్వారా లోకానికి ఆదర్శం గా ఉన్నవారే ఇరువురూ...ఇవన్నీ మనం సంపూర్ణం గా  అర్ధం చేసుకోగలిగితేనే, ధర్మ పరిరక్షన చేయగలము. ఇతరమతాలలోకి వలస వెళుతున్న వారిని సరి అయిన మార్గానికి మళ్ళించగలము.  మొదటి అడుగు మన ఇంటి నుంచే మొదలు కావాలి. మనం ధర్మాన్ని ఆచరించి మన పిల్లలకు కూడా నేరిపిద్దాం...హిందు ధర్మ విశిష్టతను చాటి చెబుదాం.

No comments:

Post a Comment