Friday 8 January 2016

హిందు ధర్మ పరిరక్షణకు నేతలు, సామాన్యులు, భక్తులు ఎంతో సేవ చేస్తున్నారు. అయితే ప్రతి ఒక్క హిందువు తన వంతుగా ఏం చేస్తున్నాడు అని మనలను మనమే ప్రశ్నించుకోవాలి. హిందుధర్మ పరిరక్షణకు మనం ముందుగా మూడు పనులు చేయాలి. 1. వీలైనంతగా ధర్మాన్ని స్వయంగా ఆచరించడం 2. చిన్నతనం నుంచే పిల్లలకు అలవాటు చేయడం 3. ఇతరమతస్థులు మనలను విమర్శిస్తున్నపుడు మనదారిని మనం వచ్చేయకుండా వారికి తగిన సమాధానం చెప్పడం. అయితే మొదటి రేండూ ఆచరించడానికి తేలికైనవే అయినప్పటికీ, మూడవ అంశం మాట్రం ఆచరణలో చాలా కష్టం. ఎందుకంటే, ఎదుటివారికి సంతృప్తికరంగా సమాధానం చెప్పగలగాలి అంటే ముందు మన ధర్మం గురించి మనం కూలంకషంగా తెలుసుకోవాలి. మన పురాణాల్లోని ధర్మసూక్ష్మాలు అర్ధం చేసుకోవాలి. అప్పుడే మనలను విమర్శించే ఇతర మతస్థులకు మనం దీటైన జవాబులు ఇవ్వగలుగుతాము.


1. మన ధర్మం స్త్రీ పురుషులను కుంకుమ/తిలక/విభూతి ధారణ చేయమని చెప్తోంది. కనీ స్త్రీలే తిలక ధారణను మానివేస్తున్న ఈ కాలంలో ఎంతమంది పురుషులు ఈ అలవాటును కొనసాగిస్తున్నారు? తిలకధారణ కేవలం అందం కోసం కాదు. భ్రూమధ్యం లో పెట్టుకునే తిలకం వలన కొన్ని నాడులు ఉత్తేజితం అవుతాయని, కుంకుమ దృష్టి నివారిణి గా పనిచేస్తుందని ఆధారాలు ఉన్నాయి.

2. బ్రాహ్మీ ముహూర్తంలో లేవడం చాలా అరోగ్యకరం అని చెపుతారు. ఆ సమయంలో దేవతలు భూమి మిదకు వస్తరు అని చెపుతారు. శాస్త్రరీత్యా కూడా ఆ సమయంలో మనసు, పరిసరాలు ప్రశాంతంగా ఉండి చదివినది మనసుకు హత్తుకోవడానికి ఉపయోగపడుతుంది. అందుకే సాధకులు బ్రాహ్మీముహూర్తం లో పూజలు చేయాలి అని చెపుతారు. ఈనాడు మారుతున్న జీవనశైలి వల్ల రాత్రి పొద్దుపోయి పడుకొని, ఉదయం పొద్దెక్కాక లేస్తున్నారు. దానితో మన జీవ గడియారం దెబ్బతిని, రకరకాల అనారోగ్యాలు చోటు చేసుకుంటున్నాయి.

3. సూర్యోదయాత్పూర్వమే స్నాన సంధ్యాదులు, దేవాలయ దర్శనం పూర్తి చేసుకోవాలని శాస్త్రం. ఈ అలవాట్లు పోవడానికి కూడా మారిన జీవన శైలులే కారణం. మన పూర్వులు అందించిన స్తోత్రాలు కొన్ని నిర్దిష్ట రాగాలలో కూర్చినవి. వాటిని ఉదయం సమయంలో పఠించినట్లైతే, మనసుకు ప్రశాంతత, మెదడుకు ఆరొగ్యం కలిగి, చదివే చదువు మీద, చేసే పనుల మీద ఏకాగ్రత కుదురుతుంది. ముఖ్యంగా శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం రోజూ ఉదయాన్నే వినడం వలన ఏకాగ్రత కుదిరి, బుధ్ధి కుశలత ప్రాప్తిస్తుంది అంటారు.

4. (ఇంకా ఉంది )

No comments:

Post a Comment