Wednesday 18 February 2015

కొంత నడివయసు వాళ్ళు, కొంతమంది నాలాంటి చాదస్తులు, మారుతున్నా సమాజ పోకడలు చూసి సహించలేక, వీటన్నిటికీ మన సంస్కృతిని , నాగరికతను, ధర్మ గ్రంధాలను మర్చిపోవడం ఒక కారణం అని గ్రహించుకుని, మన సమాజం బాగుపడాలంటే ఇప్పటి పిల్లలకు, యువతకు మార్గనిర్దేశనం చెయ్యాలి అని భావించి, ఆ దిశగా కృషి చేస్తుంటే, అప్పుడప్పుడు మేము కూడా ఉన్నాము అంటూ కొంతమంది భ్రష్టులు వక్ర బుద్ధితో వాటిని చదివి, ఈ పురాణాలు అన్నీ పుక్కిటి పురాణాలు అని, సమాజం లో విషం చిమ్మాలి అని ప్రయత్నిస్తున్నారు. అంటే, మన ఇంటికి అగ్గి పెట్టేవాళ్ళు మన ఇంట్లోనే ఉన్నట్టు. ఉగ్రవాదుల కన్నా మహామ్మరులు వీళ్ళు. మన పురాణాలు అన్నీ మాయలు, మంత్రాలూ కావు. అవి అన్నీ వాస్తవంగా జరిగినట్టు ఆధారాలు ఉన్నాయి. మన గ్రంధాలలోని సారాంశాలను విదేశీయులు కూడా నేర్చుకుంటుంటే, మన తెలుగు వాళ్ళకే వస్తోంది పోయేకాలం. ఇతర మతాల వాళ్ళు వారి వారి మతం మిద ఇంత రచ్చ చేసుకోవడం ఎప్పుడూ వినం మనము. ఏ ధర్మం అయినా సమాజం లో మంచిని పెంచడానికి, వ్యక్తులకు హితం చేకూర్చడానికే పాటుపడింది. అందునా ప్రత్యేకించి మన భారత దేశం లో హిందూ ధర్మం అందరూ ఒక్కటే, అని బోధించి, సమసమాజ నిర్మాణానికి ఎంత కృషి చేసిందో, చెట్టు-పుట్ట, నీరు-నిప్పు, గాలి-వాయువు, ఇవన్ని సురక్షితం గా ఉంటేనే, మనవ జాతి మనగలదు అని ఎంత చక్కగా బోధించిందో, మన " శాంతి మంత్రములు" చదివి అర్ధం చేసుకుంటే తెలుస్తుంది. అటువంటి ధర్మం మీద, ధర్మ గ్రందాల మీద, ఇన్నన్ని అభాండాలా? ఒకవేళ వాటిలో తప్పుడ్లు ఉన్నా, ఈ సంధికాలం లో వీటన్నిటి మిద చర్చ జరగటం అంత అవసరమా? భారతీయులన్దరిలోను ఐక్యత సాధించడం తక్షణ కర్తవ్యమ్ అయిన ఈ సమయం లో ఇటువంటి చర్చలు ఎంత అశాంతికి దారి తీస్తాయి? చానల్స్ కి ఏముంది-వాటి trp రేటింగ్ పెంచుకోవడానికి ఏ గడ్డి అయినా తింటాయి. దయచేసి ఇటువంటి చానల్స్ ని బాన్ చెయ్యండి. ఇటువంటి చర్చలకు ప్రోత్సాహం ఇవ్వకండి. ఇటువంటి వాటికీ వ్యతిరేకంగా తెలుగు వారు ఐక్యంగా పోరాడవలసిన సమయం వచ్చింది. దయచేసి, మీ పోస్ట్ ల ద్వారా, భరతీయ సంస్కృతిని యువతకు తెలిపి, వారిని మంచి మార్గం లో నడిపించండి. భారతీయ సంస్కృతీ వ్యాప్తికి ఇతోధికం గా కృషి చేయండి. సెలవు. నమస్కారం. _

No comments:

Post a Comment