Monday 12 October 2015

విదురనీతి 50
మనిషికి తాను పరిష్కరించుకోలేని సమస్యలు ఎదురయ్యే పరిస్థితులు రావచ్చు. తనలోని అన్ని శక్తి యుక్తులు ఉపయోగించినా ఆ క్లిష్ట సమస్య పర్ష్కారం కాకపోవచ్చు. అలాంటి స్థితిలో దైన్యం ఆవహిస్తుంది. నడిసముద్రం మధ్య చిక్కుకుని తీర కనిపించని రీతిలో కుంగిపోయే పర్స్థితులు ఎదురవుతుంటాయి. సరిగ్గా ఇలాంటి దీనస్థితిలో దైవం ఆధారమవుతాడు.
శరణాగతి అంటే అహంకార నాశనం. అది భగవత్ కృపతోనే సాధ్యం. సకల కార్యాలను ఒక భగవత్ శక్తి నడుపుతోంది. అందువల్ల మనం దనికి లోబడి ఉండట ఉత్తమం. ఎంతెంత వినయంగా ఉంటామో అంతంత శుభం కలుగుతుంది.
చేసిన మేలు మరిచిపోవడం మహాపాపం. పాపకార్యాలైన గోహత్యకు, సురాపానానికి, దొగతనానికి, వ్రభంగానికి సత్పురుషులు ప్రాయశ్చిత్తం చేప్పారు కాని, కృతఘ్నతకు ప్రాయశ్చ్చిత్తం లేదని బ్రహ్మ శాసనం. కృతఘ్నుడి మాంసాన్ని కుక్కలు కూడా ముట్టుకోవని భారతం చెప్తుంది.
త్రికరణ శుధ్ధి:
మనం మనస్సుతో ఏమి ఆలోచిస్తున్నామో వాక్కుతో అదే మాట్లాడాలి. వాక్కుతో ఏం మాట్లాడుతున్నామో కర్మ ద్వారా అదే చేసి చూపించాలి. ఆ శుభకర్మ ఫలితాలను సర్వత్రా దర్శించాలని సనాతనులు ప్రబోధించారు. త్రికరణ శుధ్ధిగా మనోవాక్కాయ కర్మలతో పవిత్రంగా ఉండాలని ఋషులు ఉపదేశించారు.
ఆచరణ చాలా ముఖ్యం. ఏది మనం ఇతరులకు ఉపదేశిస్తున్నామో అదే మనం నిశ్చయంగా ఆచరించి ఇతరులకు చూపించాలి. అప్పుడే పరులకు మనమీద విశ్వాసం, గౌరవం ఏర్పడతాయి. సమాజంలో అధికులు చెప్పడమే కాని, ఆచరించడం లేదు. లోకంలోకి మన ప్రవేశం, నిష్క్రమణం రెండూ మధురంగా ఉండాలి అంటే జీవనం, మరణం దేనికదే ఇతరులకు మార్గదర్శనం చేసేవిధంగా ఉండాలి. జీవన విలువలు తెలిసి సన్మార్గంలో నడిచేవారికి అద్ ఒక అద్భుత వరంలా కనిపిస్తుంది. జీవితంలో సత్యాన్ని, ధర్మాన్ని ప్రేమించని వారికి ఈ జీవితం ఒక నరకంగా కనిపిస్తుంది.
కన్ను, ముక్కు, జిహ్వ, చెవి, చర్మము ఈ అయిదు ఇంద్రియముల సముదాము తలతో పుట్టినదగు మనస్సును లాగుచుండును. అట్టి దీనికి లోబడినవానికి, శుక్ల పక్షమున చంద్రుడు వృధ్ధినొందిన విధముగా ఆపదలు వృధ్ధినొందును.
జీవితకాలము అతిస్వల్పము. తెలిసికొనవలసిన ధర్మములు పెక్కు కలవు. ఆచరించవలసిన సాధనలు అనేములు ఉన్నవి. విఘ్నములు లెక్కలేనన్ని వచ్చి పడుచున్నవి. ఇట్టి స్థితిలో జీవుడు ఎంత త్వరితముగ తన లక్స్యమును సాధింపగలడో అంత శ్రేయస్కరం.
మృత్యువు ప్రతినిముషము జీవుని కబళీంచుటకై పక్కనే వేచియున్నది. వార్ధక్య, రోగము మొదలయినవి హుంకరించుచు మీదపడబోతున్నవి. కావున వాని వలన అపకారము కలుగకపూర్వమే, మృత్యువు దాపురించకమునుపే ఇంద్రియముల శక్తి ఉడుగకమునుపే వైరాగ్య శమదమాది సాధనలను అబ్యసించి స్వస్వరూపానుభవమును పొందవలసియున్నది.
(ఇంకా ఉంది )

No comments:

Post a Comment