Monday 12 October 2015

విదురనీతి 51
జీవిత పరమార్ధం:
తాను చనిపోయిన తరువాత కాలగర్భంలో కలిసిపోకుండా తన గురించిన జ్ఞాపకాలు,జనం మధయలో మరపురాని గుర్తులుగా ఉండిపోతాయనీ చరిత్రలో తాను కీర్తిశేషుడిగా మిగిలిపోతాననీ ప్రగాఢమైన నమ్మకం కలిగిన మనిషి మరణ సమయంలోనూ ఆనందంగానే ఉంటాడు. జీవితం శాశ్వతం కాదు. యౌవనమూ అంతే. ధనం ఎప్పుడూ అస్థిరమే. భార్య, బిడ్డలు శాశ్వతంగా ఉండిపోరు. ఈలోకంలో శాశ్వతంగా నిలిచేవి తాను చేసిన ధర్మం, సంపాదించినా కీర్తి మాత్రమే...
చందనం, తగరం, మల్లిక వంటి పుష్పాల సువాసన గాలివాటంగా వస్తుంది. పరిసరాలను పరిమళభరితం చేస్తుండి. గొప్పవారూ, సుగుణవంతుల కీర్తి ప్రచండవయువుల్ని సైతం చీల్చుకుని సర్వవ్యాప్తి అవుతుంది. వారి కీర్తి విశ్వమంతటా వ్యాపించి కలకాలం నిలచిఉంటుంది.
నరజన్మ లభించడమే ఎంతో అదృష్టం అనుముంటే ఆ జన్మను సార్ధకం చేసుకోవాలంటే, కొన్నిఉత్తమ లక్షణాలను కలిగి ఉండవలసిందేనని ఘంటాపథంగా చెప్పుకోవచ్చు. మానవ జన్మా ఆత్మ, బుధ్ధి, శరీరం అనే మూడు ప్రధాన అంశాలను కలిగి ఉంటుంది. శరీరం జంతువులకు కూడా ఉంటుంది. కానీ బుధ్ధి కలిగిఉన్న ప్రాణి మానవుడు మాత్రమే. అందువలన బుధ్ధితో ఆలోచించి, ఆత్మావలోకనం చేసుకుంటూ మానవుడు జీవనం సాగించాలి.
(ఇంకా ఉంది )

No comments:

Post a Comment