Monday 12 October 2015

విదురనీతి 54

ఒకవ్యక్తి దీనావస్థలోను, దయనీయమైన స్థితిలోను ఉంటే , ఆ దు:ఖాన్ని తనదిగా భావించి, ఊహించుకొని ఆవహించుకొని అనుభవించి పడే తపనే 'సానుభూతి"  అవుతుంది. అటువంటి సానుభూతి కోసం కష్టాల్లో ఉన్నవారు, దు:ఖంలో పరితపించేవారు దీనాతిదీనావస్థలో ఉన్నవారు ఎదురుచూస్తుంటారు. కనీసం ఓ సానుభూతి వచనం కోసం ఎదురుతెన్నులు చూస్తారు.

తన కు:హాన్ని పంచుకునేవారు పదిమంది ఉన్నారని తెలిసినప్పుడు ఆ బాధితునికి ఊరట కలుగుతుందట. ఓదార్పు వలన అతనికి దైన్యం తరుగుతుంది. ధైర్యం పెరుగుతుంది. మనోబలం చేకూర్చుతుంది. ఆత్మవిశ్వాసం, ఆతంస్థైర్యం రెట్టింపవుతుంది. సానుభూతి, సత్వప్రవృత్తి, పరగతమై సుఖ దు:ఖాదె భావనలచే కరుణ్త్వం పెరుగుతుందని పెద్దలు చెబుతారు. ధృతరాష్ట్రుడు ఆశిస్తున్నదీ ఇదే!

పండితుల సంగమము వలన విద్య లభిస్తుంది. విద్య వలన వినయము లభిస్తుంది. వినయమువలన లోకానురాగము లభిస్తుంది. లోకులు తనను అభిమానించుచున్నప్పుడు సర్వము సిధ్ధిస్తుంది. అధర్మ మార్గమున పొందిన ధనముతో ఏ లొసుగు కప్పిపుచ్చినా అది దాగనే దాగదు. దానివలన తక్కినది కూడా చేల్లాచెదరగును. నీకొడుకులు సధ్ధర్మమగు పనిని చేయటంలేదు. న్యాయము తప్పిన మార్గమున సుఖము పొందగోరుచున్నారు. కనుక ఇది విపరీతము, ప్రమాదకారి అని విదురుడు స్పష్టంగా చెబుతున్నాడు.

అసూయకలవాడు, ఆయువుపట్టులందు హింసించువాడు, అప్రియములు పలుకువాడు, పగపెట్టువాడు, మోసకాడు--అగు వీరు పాపము చేసిన వెనువెంటనే తగుఫలితమును పొందుతారు. అసూయ లేనివాడు, ప్రజ్ఞను పెంపొందించగోరు వాడు, మంచి పనులను ఎల్లవేళల చక్కగా చేయువాడు గొప్ప సుఖమును పొందుదురు. అందరకు ఇష్టులగుదురు.

రాత్రి సుఖముగా ఉండు ఏర్పాటును పగటియందే చేసికొనవలయును. నావాకాలమున సుఖముగానుండు ప్రయత్నమును తక్కిన యెనిమిది నెలల ముందు చేయవలయును. ముసలితనమునందు సుఖమునకై పడుచుదనముననే ప్రయత్నించవలయును. చనిపోయిన తరువాత సుఖమును, కీర్తిని బొందుటకై జీవితమంతయు ప్రయత్నించవలయును.

(ఇంకా ఉంది )

No comments:

Post a Comment