Sunday 10 July 2016

జ్ఞానానందమయం దేవం
నిర్మల స్ఫటికాకృతిం
ఆధారం సర్వ విద్యానాం
హయగ్రీవముపాస్మహే!!

సదాశివ సమారంభాం
శంకరాచార్య మధ్యమాం.
అస్మదాచార్య పర్యంతాం
వందే గురు పరంపరాం !!

వ్యాసాయ విష్ణురూపాయ
వ్యాసరూపాయ విష్ణవే
నమో వై బ్రహ్మనిధయే
వాసిష్టాయ నమోనమ:!!

గురుర్బ్రహ్మ గురుర్విష్ణు:
గురూదేవో మహేశ్వర
గుర్స్సక్షాట్ పరబ్రహ్మ:
తస్మైశ్రీ గురవే నమ:

గురుపూర్ణిమ అనగానే వ్యాసుమహర్షి గుర్తొస్తాడు....మన సౌలభ్యం కోసం వేదాలను విభజించడంతో పాటు, మానవులకు ఉత్తమ ధర్మాలను బోధించి, వారి జీవనాన్ని సుఖమయంగా చేసుకునేందుకు తగిన సూత్రాలతో కూడిన మహాభారతాన్నీ, మానవులను సరి అయిన ఆధ్యాత్మిక మార్గంలొ నడిపి సద్గతి వైపుగా మరల్చేందుకు ఆ పరమాత్మ లీలావిశేషాలతో కూడిన  శ్రీమద్భాగవతాన్ని మనకు అందించిన మహాగురువు వ్యాసులవారు....లౌకికంగా, ఆధ్యాత్మికంగా కూడా మానవుల శ్రేయస్సును కోరిన ఉత్తమగురువు ఆయన...ఈ గురుపూర్ణీమ నాడు ఆయనను స్మరించుకుని పూజించుకోవడం మన కర్తవ్యం...

పూర్వకాలం లో పిల్లలను చిన్నవయసులోనే తగిన గురువు వద్ద వదిలి గురుకుల పధ్ధతిలో విద్య నేర్పించేవారు తల్లితండ్రులు...గురువు, శిష్యుల మధ్య గొప్ప అనుబంధం ఉండేది...తల్లి తండ్రుల తరువాత పిల్లలకు తమ గురువుతోనే ఎక్కువ అనుబంధం ఉండేది..అందుకే మాతృదేవోభవ, పితృదేవోభవ తరువాత, పూజించడానికి అర్హునిగా గురువునే చెబుతారు...శిష్యులకు వారికి తగిన చదువు నేర్పి, సమర్ధులుగా రూపొందించడం, వారిలోని చెడు గుణాలను తొలగించి, మంచి మార్గంలో నడిపించడం ఇవన్నీ ఒక సద్గురువు యొక్క బాధ్యతలు.....ఇప్పుడు అటువంటి గురుకులాలు లేకపోయినప్పటికీ మన భవిష్తత్తును తీర్చి దిద్దుతున్న గురువులను పూజించుకోవటానికి ఈ గురుపూర్ణిమ ఒక మంచి అవకాశం....

ఈసందర్భంగా అపర శంకర అవతారమై వెలిసి, జగద్గురువు అని పిలువబడిన శ్రీ ఆదిశంకరాచార్యుల వారిని తప్పకుండా స్మరించుకోవాలి..దుష్టాచారములను నశింపచేసి, శ్రౌత, స్మార్త క్రియలను సుసంపన్నం చేసి, వైదిక మార్గాన్ని పున:ప్రతిష్టించడానికి ఆ నీలలోహితుడే (శంకరుడు--ఈశ్వరుడు) శంకరాచార్యుల వారి రూపంలో అవతరించారని కూర్మ పురాణం చెప్తుంది. సాక్షాత్తూ వ్యాసులవారే శంకరులు వ్రాసిన భాష్యాలన్నీ ఉత్తమమైనవి అని, బ్రహ్మసూత్రాలను కేవలం శంకరులే సరి అయిన మార్గంలో అర్ధం చేసుకోగలిగారని ప్రశంసించారు.... అంతటి ఉత్తమ గురువులను గురుపూర్ణిమ నాడు పూజించి వారి ఆశీ:బలం పొందడం మన అదృష్టం.

వీరే కాక, సమర్ధ సద్గురువుగా శ్రీ సాయిబాబాను నమ్మేవారు కూడా ఈరోజు ఆయనను తమ జీవితాలను సరి అయిన మార్గంలో నడిపిస్తున్న గురువుగా భావించి ఆరాధిస్తారు.....ఆయనను మనస్పూర్తిగా విశ్వసించే భక్తులకు ఆయన ముస్లిమా, హిందువా అనే సంకోచం ఉండదు...

గురువుకు భారతీయ సంస్కృతిలో ప్రముఖ స్థానం ఇవ్వబడింది... వ్యాస మహర్షి జన్మించిన  ఆషాఢ పూర్ణిమ ను " గురు పూర్ణీమ" గా జరుపుకోవడం మన సంప్రదాయం....అందరికీ "గురుపూర్ణీమ "  శుభాకాంక్షలు....

No comments:

Post a Comment