Wednesday 6 July 2016

అన్ని మతాల లాగే ఇస్లాం కూడా తోటివారిని ప్రేమించమని చెప్తుంది..మన చుట్టూ ఉన్న దీనుల, బీదసాదల బాధలలో పాలు పంచుకోమంటుంది..హింసను ప్రేరేపించే పనులు, కనీసం ఆలోచనలు కూడా చెయ్యద్దంటుంది....దేవుడు ఇచ్చిన సంపద అంతా అందరిదీను, కాబట్టి, దు:ఖాలలో ఉన్న పేదలను ఆదుకునేందుకు, వారి జీవితాలలో సంతోషం నింపేందుకు పండుగ రోజులలో విధిగా "జకాత్" ఇవ్వమని ఇస్లాం చెప్తుంది. ఆస్తిలో, ఆదాయంలో తప్పనిసరిగా కొంత భాగాన్ని పేదలకు దానం చేయటమే "జకాత్"..అలా అని, అదేదో ఎదుటివాళ్ళను ఉద్ధరిస్తున్నట్టు కాక, సమాజం పట్ల మన విధిని నిర్వర్తించడమే అని బోధిస్తుంది...ఆఖరికి మనం ఏదైనా తింటున్నప్పుడు ఎవరైనా వస్తే, వారికి కూడా పంచాలి కాని, దాచుకుని తినడం పాపం అని చెప్తుంది...మనం ఈ లోకంలో చేసిన పాపపుణ్యాల లెక్క ఏదో ఒకరోజు భగవంతుని ఎదుట చెప్పుకునే రోజు ప్రతివారికీ వస్తుంది కాబట్టి మనం ఇక్కడ చేసే కర్మలలో జాగురూకులై ఉండమని హెచ్చరిస్తుంది. ...మరి ఇంత మంచిని బోధించిన మతంలోంచి ఇంతమంది ఉగ్రవాదులు పుట్టి, ప్రపంచంలో ఇంత హింసను నింపుతున్నారే!! ప్రతిరోజూ ఏదో ఒక చోట హింస...బాంబులు, ఉన్మాదం, మారణహోమం, అదికూడా అత్యంత పవిత్రంగా భావించే రంజాన్ మాసంలో.... ఇవన్నీ ఎందుకు చేస్తున్నారో, వారికైన ఒక స్పష్టత ఉందా? ఎంతమంది యువత ఈ ఉగ్రవాదానికి ఆకర్షితులై ఆ మార్గంలో పయనిస్తున్నారో...ఇది వ్యవస్థలో లోపమా? పెంపకంలో లొపమా? ప్రకృతి లోని వనరులు అన్నీ, అందరికీ సమానంగా అందకపోవటం వలన తలెత్తిన అసంతృప్తా?

No comments:

Post a Comment