Wednesday 6 July 2016

నలుగురితో పరిచయం చేసుకోవడానికి, స్నేహం లేదా బంధం పెరగడానికి కావలసిన మొట్టమొదటి లక్షణం మంచి మాట, మంచి పలకరింపు...మాట మంచితనం లేకపోతే ఏ బంధమైనా ఎక్కువకాలం నిలవదు, అది స్నేహమైనా, బంధుత్వమైనా....ఒక్కోసారి కొంతమంది మాటలు వింటుంటే, దేవుడు మనుష జాతికి మాటలు ఎందుకిచ్చాడా అనిపిస్తుంది. మాటలతో మనసులని గాయపరచడంలో ఒక్కోక్కరిది ఒక్కో పధ్ధతి...నలుగురికీ మన గురించి చెడుగా చెప్పడం కొంతమంది నైజం అయితే, ఏదో అనుమానం మనసులో పెట్టుకుని సాధించేవాళ్ళు మరో రకం...ఆయుధం కన్నా పదునైన మాటలు వాడి మనిషిని నిలువునా చంపేసే వారు ఇంకో రకం...ఇందులో ఎవరి స్టైల్ వాళ్ళది. అలాంటి మాటలకి బాధపడి జవాబు ఇచ్చేకన్నా, మౌనంగా ఊరుకోవడం ఉత్తమం...తమలపాకుతో నువ్వొకటంటే, తలుపు చెక్కతో నేను రెండిస్తా అన్నట్టు కాకుండా ఎవరి నైజం వాళ్ళది అని ఊరుకున్నంత మంచి పని ఇంకోటి లేదు. కానీ చాలా మందికి తెలియంది ఏంటంటే, ఈరోజు ఒకరిని మాటలనగానే సరికాదు, ఆ మాటల వల్ల, మన సంస్కారం ఏంటో మనమే బైటపెట్టుకున్నట్టు అవుతుంది. "కేయూరాణి న భూషయంతి పురుషం......వాగ్భూషణం భూషణం" అని భర్తృహరి ఏనాడో చెప్పాడు....కనీసం ఆ మాటలనైనా గౌరవిద్దాం.....మెదడులో, మనసులో మంచి ఆలోచనలు కలిగి మంచి మాటలతో ప్రశాంతంగా జీవిద్దాం.

No comments:

Post a Comment