Wednesday 23 July 2014

మనలో చాల మందికి ఆరోగ్యం మీద కనీస అవగాహనా ఉండదు.  జ్వరం, తలనొప్పి, వాంతులు , కడుపు నొప్ప్పి, లేదా అజీర్ణం ఇలా సాధారణంగా వచ్చే రుగ్మతలకు ఇంట్లో ఉన్న, తెలిసిన మందులు వేసుకుంటాం. అలాగే కొన్ని చిట్కాలు, గృహ వైద్యాలు పాటిస్తాము. కానీ కొన్ని కొన్ని అనారోగ్య లక్షణాలు మనకు తెలియని జబ్బులకు దారి తీస్తాయి. వీటిలో ఒకటి కాల్షియం లోపం, విటమిన్ డి లోపం. ఎముకలు నొప్పిగా ఉండడం, తీవ్రమైన అలసట, నీరసం, మెట్లు ఎక్కడం, దిగడం లో ఇబ్బంది పడడం. నడుస్తుంటే ఆయాసం రావటం, మోకాళ్ళ నొప్పి కాకపోయినా, ఎముకల మిద ఒత్తిడి పడినపుడు నొప్పి రావడం ఇటువంటివి విటమిన్ డి లోపం ఉంటె వచ్చే రుగ్మతలు.

స్త్రీలకూ ఎక్కువగా కాల్షియం అవసరం అవుతూ ఉంటుంది. నడివయసు వారికీ, మెనోపాజ్ వచ్చిన వారికీ ఇంకా అదనపు కాల్షియం అవసరం. ప్రతిరోజూ పాలు మరియు, పాల ఉత్పత్తులు తీసుకోవడం, కాల్షియం ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం ఒక్కటే చాలదు. అదనంగా వైద్యుల సలహాతో కాల్షియం సప్లిమెంట్లు కూడా తీసుకోవాలి. అలాగే, పైన చెప్పిన లక్షణాలు ఉన్నపుడు సాధారణంగా మనం వైద్యుల వద్దకు వెళ్ళకుండా ఇంట్లో ఏవో మందులు వేసేసుకుంటాం. కానీ విటమిన్ డి లోపం వల్ల మనం తీసుకునే కాల్షియమ్ పూర్తిగా వంట పట్టదు.

ఈ విటమిన్ డి ఆహార పదార్ధాల ద్వారా ఎక్కువ లభించదు. ఇది లభించే ప్రముఖ వనరు సూర్య రశ్మి మాత్రమే. ఇదివరకు ఇంట్లో పెరడు, వాకిలి అన్ని వేరు వేరు గా ఉండేవి. ఉదయం కానీ, సాయంత్రం కానీ ఇంట్లోకి ధారాళంగా ఎండ పడేది. పిల్లలకు కూడా బయలు ప్రదేశాలలో ఆడుకొనే సమయం, వీలు ఉండేది, అందువల్ల విటమిన్ డి లోపం ఉండేది కాదు. కానీ ఇపుడు అపార్ట్ మెంట్ కల్చర్ వచ్చింది. ఇంటి లోపలికి  ఎండ రావటం తక్కువే. మనం ఎండలోకి వెళ్ళటం కూడా తక్కువ అయిపొయింది. పిల్లలకు కూడా ఆడుకునే సమయం లేదు. ఒకవేళ ఆడుకున్నా, ఇంట్లో కంప్యూటర్, ఫోన్ ల లోనే ఆడుతున్నారు కాబట్టి ఎండ వారికీ తగిలే అవకాసం ఉండడం లేదు. అందువల్ల ప్రతివారి లోను ఈ లోపం ఎక్కువగా ఉంటోంది. పూర్వపు రోజుల్లో నెలల పసికందులను కూడా ఉదయం లేత ఎండలో కాసేపు ఉంచి లోపలి తీసుకెళ్ళేవారు.

ఇప్పుడైనాస్త్రీలు, పిల్లలు ఉదయం, సాయంత్రం కొంత సేపు ఎండలో నిలబడడం మంచిది. విటమిన్ డి లోపం వల్ల తలెత్తే సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే పై లక్షణాలు  కనపడినపుడు వెంటనే వైద్యున్ని సంప్రదించడం మంచిది. పిల్లల్లో విటమిన్ డి లోపం నిర్లక్ష్యం చేస్తే రికెట్స్ అనే వ్యాధి వస్తుంది. ఇందులో ఎముకలు పటుత్వం కోల్పోయి, కాళ్ళు వనకరగా అవుతాయి. ఈ విటమిన్ లోపం వల్ల స్త్రీలలో ఎముకలు ద్రుధత్వం కోల్పోయి, బోలుగా తయారవుతాయి. అప్పుడు ప్రతి చిన్న దెబ్బకి ఎముకలు విరిగె ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ముందరే మనం జాగ్రత్త తీసుకొని, స్త్రీలలో, పిల్లలలో కాల్షియమ్, విటమిన్ డి లోపం తలెత్తకుండా చూద్దాం.

No comments:

Post a Comment