Sunday 27 July 2014

పిల్లలు అందరూ తరచుగా చదివినవి అన్నీ మర్చిపోతున్నాను, ఎంత చదివినా గుర్తు ఉండడం లేదు అని కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఆమాట వినగానే తల్లులు చాలా గాబరా పడిపోతారు, అయ్యో, పరీక్షల సమయంలో ఇలా ఉంటె ఎలా? మార్కులు, రాంకులు తక్కువ వచ్చేస్తే ఎలా, అని. కానీ, పిల్లలలో మతిమరుపు అనేది చాల  ఒక మానసిక భావన. చదువులో పిల్లలకు జ్ఞాపక శక్తి ని పెంచాలి అంటే, పాఠం వినేటప్పుడు అది దృశ్య రూపం లో గుర్తు ఉంచుకోవాలి. పాఠం చదివేటప్పుడు ఒక వరుసలో చిన్న చిన్న పాయింట్స్ గా రాసుకోవాలి. జవాబులు గుర్తు ఉండడం లేదు అనుకున్నపుడు ఆ జవాబును 2,3 సార్లు పుస్తకం లో బైటికి అనుకుంటూ వ్రాయాలి. ముఖ్యంగా దృశ్య రూపం లో గుర్తు ఉంచుకున్న పాఠాలు చాల త్వరగా మనసుకు హత్తుకుంటాయి. వెంటనే మర్చిపోవటానికి అవకాసం ఉండదు. అలాగే దేశాల రాజధానులు, కరెన్సీ, ఇటువంటివి నిరంతర సాధన వల్ల గుర్తు ఉంటాయి. టీవీ, కంప్యూటర్, ఇతర ఎలక్ట్రానిక్ gadgets వాడకం తగ్గిస్తే, అక్కర్లేని విషయాలు చాల మటుకు మన మెదడునుంచి తొలగి పోతాయి.

పెద్దవాళ్ళలో మతిమరుపు కూడా తేలికగా అధిగమించవచ్చు. వస్తువులు ఎక్కడ పెట్టామో జ్ఞాపకం ఉండదు చాలా మందికి. ప్రతి వస్తువుకూ ఒక స్థానం నిర్ణయించి ప్రతి రోజూ అక్కడే పెట్టడం ద్వారా గుర్తు ఉంచుకోవచ్చు. ఉదాహరణకు, బీరువా తాళాలు, కొవ్వొత్తులు, బ్యాంకు పుస్తకాలు, మొదలైనవి. చేయవలసిన పనులు ఎక్కువగా ఉన్నపుడు అవి అన్నీ కాగితం మిద వ్రాసుకొని ప్రాధాన్యత క్రమం లో చేసుకోవడం వల్ల చేసే పనులు గుర్తు ఉంటాయి, తొందరగా కూడా పనులు ముగించుకోవచ్చు. అలాగే షాపింగ్ కి వెళ్ళేటప్పుడు కూడా ఏమేమి వస్తువులు కొనుక్కోవాలో ముందుగానే ఒక లిస్టు తయారు చేసుకోవటం వల్ల అన్ని వస్తువులు మర్చిపోకుండా కొనుక్కొగలుగుతాము. అన్నిటికన్నా ముఖ్యం, మన వరకు చేరే విషయాలలో ఏది గుర్తు ఉంచుకోవాలి, ఏది అక్కరలేదు అనే విచక్షణ మనలో ఉండాలి. అక్కర్లేని విషయాలు గుర్తు ఉంచుకోవడం వల్ల, అవసరమైన విషయాలు స్మృతి లో ఉండవు.

వైద్య పరంగా మతిమరుపు ఒక వ్యాధి కానేకాదు. కానీ ముసలివాళ్ళలో వచ్చే అల్జీమర్స్ ఒక వ్యాధి. వారు తమ బందువులనే ఒక్కోసారి గుర్తుపట్టలేరు. ఇటువంటి వాటికీ వైద్య సహాయం అవసరం. మతిమరుపును తగ్గించేందుకు ఆహారం లో గింజలు (బాదాం, అఖ్రోట్ ) బాగా పనిచేస్తాయి. విద్యార్ధులకు తప్పనిసరిగా బాదాం , ఆఖ్రోట్ గింజలు ఇవ్వాలి.  అలాగే ఆకుకూరలు కూడా ఎక్కువ తీసుకోవాలి. పిల్లలు పెద్దలు కూడా పత్రికలలో వచ్చే crossword puzzles , సుడోకు, వంటివి ఎక్కువ చేస్తూ ఉంటె మెదడు పదును దేరుతుంది. వీరికి పెద్ద వయసులో కూడా అల్జీమర్స్ వ్యాధి రావడానికి అవకాశం తక్కువ. అరటిపండు ను ఆహారంలో తప్పనిసరిగా తీసుకోవాలి.

No comments:

Post a Comment