Wednesday 23 July 2014

కాకినాడ లో అంధ విద్యార్ధులను చితకబాదిన గురువు.....
నిన్న రాత్రి న్యూస్ చానల్స్ నిండా ఈ వార్తే..... ఆ మాస్టారిని చుస్తే అసలు మనిషేనా అనిపించింది. చిన్న పిల్లలను.... అందునా అంధులను అలా గొడ్డును బాదినట్లు బాదడానికి అతనికి చేతులు ఎలా వచ్చాయో.... టీవీ లో చూస్తుంటేనే కళ్ళ నీళ్ళు తిరిగాయి. అతనికి మనసు అనేది ఉందా అనిపించింది. పిల్లలు తప్పు చేస్తే, ఒకటి రెండు దెబ్బలు వేయటం ఎవరికైనా సహజం... కానీ మరీ ఇంత రాక్షసత్వమా? అవే దెబ్బలు ఆయనను కొడితే అయన తట్టుకోగలడా?
ఉపాధ్యాయులను ఎంపిక చేసేటప్పుడు, సబ్జెక్టు, మార్కులే కాకుండా మానవత్వం ఆధారంగా కూడా వారిని ఎంపిక చేయాలేమో! వారికీ మనస్తత్వ పరీక్ష పెట్టి కనీస మానవత్వం ఉన్న వారికే ఉపాద్యాయ పదవి ఇవ్వాలెమో...

No comments:

Post a Comment