Thursday 24 July 2014

ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం
ఉర్వారుక మివ బంధనాత్ మ్రుత్యోర్ము క్షీయమామ్రుతాత్

ఈ మహా మ్రుత్యునజయ మంత్రం విశిష్టత అందరికీ తెలుసు. ఇది జీవన ప్రదాత వంటిది. దీర్ఘాయువు, శాంతిసౌఖ్యలు, ధన ధాన్యాలు, సంపద, సంతోషం, ప్రసాదించే పరమ పవిత్రమైన మంత్రరాజం. పాము కాటు, నిప్పు, నీరు, పిడుగుపాటు వంటి ఆకస్మిక దుర్ఘటనల నుంచి రక్షించ గలిగి నటువంటి కవచం ఇది. భక్తీ విశ్వాసాలతో ఈ మంత్రం జపిస్తే అపర ధన్వంతరి వంటి వైద్యులు కూడా నయం కావు అని చెప్పిన మొండి రోగాలు సైతం నయం అయి మృత్యు ముఖానికి చేరువ అవుతున్నవారు కూడా ఆయుష్ మంద్తులవుతారు అని ప్రాచీన శాస్త్రాలు చెబుతున్నాయి. స్నానం చేస్తూ ఈ మంత్రాన్ని జ్జపిస్తే రోగ విముక్తులవుతారు. భోజనం చేస్తూ జపిస్తే తిన్న ఆహారం చక్కగా జీర్ణం అవడమే కాకా, ఆహారం లోని విష తుల్యమైన పదార్ధాలు హరించా బడతాయి. పాలు, పానీయాలు తాగేటప్పుడు వాటినే తదేకంగా చూస్తూ జపిస్తే యవ్వనం సిద్ధిస్తుంది. రోగుల చెవిలోను, వారి సన్నిధి లోను ప్రతిదినమూ నిర్ణీత సంఖ్యలో ఈ మంత్రం జపం చేస్తే వ్యాధి బాధల నుండి విముక్తి కలిగి, ఆయుర్దాయం పెరుగుతుంది. ఇంటిలో చిక్కు సమస్యలు, చికాకులు ఉంది మానసిక ప్రశాంతత లోపించిన వారు వేదవిదులైన పండితుల చేత మృత్యుంజయ హోమం కానీ, జపం కానీ చేయిస్తే చిక్కులు తొలగి ప్రశాంతత చేకూరుతుంది.

గాయత్రీ మంత్రం జపం, చంద్రసేఖరాష్టకం, విశ్వనాధ అష్టకం, సౌందర్య లహరి వంటివి కూడా మృత్యువును దూరం చేస్తాయి.

ఆహారపు అలవాట్లు కూడా ఆయుర్దాయాన్ని పెంచడంలో ఎంతో ఉపకరిస్తాయి. రాత్రి పూట పెరుగును వర్జించి, పాలు అన్నం కలుపుకుని తీసుకుంటే ఆయుర్దాయం పెరుగుతుంది. మనసను ప్రశాంతంగా ఉంచుకోవడం, తలస్నానానికి చన్నీతిని, మాములు స్నానానికి గోరువెచ్చటి నీటిని, వాడటం, వారానికో సారి నువ్వుల నూనెను ఒంటికి మర్దనా చేసుకుని అభ్యంగన స్నానం చేయడం, బాగా వేడిగా, లేదా చల్లగా ఉండే పదార్ధాలను తినక పోవడం, పంచ గావ్యలను సేవించడం, ఎడమ చేతి వైపు తిరిగి పడుకోవడం, సప్త వ్యసనాలకు దూరంగా ఉండడం, భోజనం చేసిన వెంటనే వంద అడుగులు నడవడం వంటివి ఆయుర్దాయాన్ని పెంచడానికి దోహద పడతాయి.

మానవుడు ఏ కారణం చేత పూర్ణాయుర్దాయం పొందలేకపోతున్నాడు అనే ద్రుత రాష్ట్రుని ప్రశ్నకు సమాధానంగా విదురుడు మహాభారతం లో " గర్వము, హద్దుమీరి మాట్లాడడం, మహాపరాధాలు చేయడం, క్రోధం, తన సుఖమే చూసుకోవడం, నమ్మిన వారిని మోసం చేయడం, అనే ఈ ఆరు లక్షణాలు పదునైన కత్తుల లాంటివి. దేహుల ఆయువును ఇవి నశింప చేస్తాయి. కాబట్టి ఇటువంటి వాటికీ దూరంగా ఉంటూ పైన చెప్పిన విధి విధానాలు పాటిస్తూ ఉంటె అయుస్శును పొడిగించు కోవడం అసాధ్యం ఏమి కాదు " అని చెప్తాడు.

ఆయుష్య సూక్త, వేద పారాయణ, యోగ, ప్రనాయామములు, ఆహార నియమాలు, నిరంతర భగవాన్ నామస్మరణ, శౌచ పాలనా, ఉపవసనియమలు, మహా మృత్యుంజయ ఉపాసన ఇవన్ని మానవుని ఆయు: ప్రమాణాన్ని పెంచడంలో ఉపకరిస్తాయి.

వర్ష వృద్ది కర్మ:

సంవత్సరం పైబడ్డ పిల్లలు అందరకు ప్రతి ఏటా జన్మ తిథి నాడు ఆచరించే ఈ ప్రక్రియ వారి ఆయుష్షును పెంచడంలో సహాయ పడుతుంది. పిల్లల జన్మ తిథి నాడు. అక్షతలతో కూడిన మంటపంలో కులదేవత, జన్మ నక్షత్ర దేవత, మాతా పితరులు, ప్రజాపతి, సూర్యుడు, గణపతి, మార్కండేయుడు, వ్యాసుడు, పరశురాముడు, అశ్వత్థామ, కృపాచార్యుడు, బాలి, ప్రహ్లాదుడు, హనుమంతుడు, విభీషణుడు, షష్టీ దేవత అనే 16 మంది దేవతలను ఆరాధించాలి. షష్టీ దేవికి పెరుగన్నం నైవేద్యం పెట్టాలి . ఈ కర్మ చేసుకునే రోజున క్షవరం , గోళ్ళు కత్తిరించుకోవడం, మిథునం, మాంసా హార భక్షణం చేయరాదు.

No comments:

Post a Comment