Wednesday 30 July 2014

మహిళలకు ప్రత్యేకం అయిన టూర్లు..

నిజమే. మహిళలు ఎక్కడికైనా పర్యాటక ప్రదేశాలు తిరిగి రావాలి అని అనుకున్నపుడు ఇంట్లో మగవాళ్ళకు తీరిక లేకపోతే ఎలా?  వివిధ కారణాల వలన మగవారి తోడూ లేకుండా మహిళలు బయటికి వెళ్ళాలంటే ఎలా? ఇలా అలోచించి 2005 లో ఢిల్లీ కి చెందినా సుమిత్రా సేనాపతి అనే మహిళ కేవలం మహిళల కోసం టూర్లు ఏర్పాటు చేసారు. అంటే వీటిని నిర్వహించేదీ, అందులో పాల్గొనేదీ కేవలం మహిళలే అన్నమాట. ఆ తరువాత పియా బోస్ అనే ఆవిడ దీనికి ప్రాచుర్యం తెచ్చారు. పేస్ బుక్ లో girlsonthegoclub  అనే కమ్యూనిటీ ప్రారంభించి ఈ రకమైన విహార యాత్రల ప్రాముఖ్యత ను చాటి చెప్తున్నారు. కార్పొరేట్ లాయర్ గా చేస్తున్న పియ బోస్, లక్షలు ఆర్జించే తన వృత్తిని వదిలి, ఆత్మసంతృప్తి కోసం ఈ పనిని చేపట్టినట్టు చెప్తున్నారు. ఈరోజున ఆ కమ్యూనిటీ కి 10 వేల మందికి పైగా సభ్యులు ఉన్నారు.

గ్రూప్ లో మహిళలు అందరూ ముందు పేస్ బుక్ లో మాట్లాడుకుని టూర్లు ప్లాన్ చేసుకుంటారు. ఒకవేళ సభ్యుల్లో ఎక్కువమంది ఒకచోటికి వెళ్ళాలి అని కోరుకుంటే, ఆ ట్రిప్ కు ఎంత ఖర్చు అవుతుంది, ఏ సమయాలు అనుకూలం, అక్కడ చూడాల్సిన ప్రదేశాలు అన్ని వివరాలూ పియా బోస్ అందరికీ తెలియ చేస్తారు. వీరు ఇప్పటివరకు కెన్యా, కాశ్మీర్, ఈజిప్ట్, తో సహా దాదాపు భారత దేశం అంతా చుట్టి వచ్చారు.

ఈ గ్రూప్ లో అన్ని వర్గాల మహిళలు, అన్ని వయసుల వాళ్ళు అందరూ సభ్యులుగా ఉన్నారు. ఈ గ్రూప్ కు రోజు రోజుకూ ఆదరణ పెరుగుతోంది అని అందులోని సభ్యులు అందరూ ఉత్సాహంగా చెప్తున్నారు.

No comments:

Post a Comment