Wednesday 29 July 2015

పుష్కరాలకు మేము వెళ్ళలేకపోయినా హైదరాబాదు నుంచి మా అక్కా వాళ్ళు వెళ్ళారు. పుష్కరాలకు ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు, రాజమండ్రి వాసుల ఆదరణ, ఆప్యాయత గురించి చాలా బాగా చెప్పారు.మొదటి రోజు జరిగిన విషాదానికి అందరూ బాధపడుతున్నా, అక్కడ ఉన్న సౌకర్యాల గురించి అందరూ చాలా బాగా చెప్పుకుంటున్నారు. నదీజలాల్లో భక్తులు వేస్తున్న పూలు, దొప్పలు ఇవన్నీ వెంటవెంటనే జల్లించి, తీసేస్తున్నారుట. మా ఇంట్లొ ఒక కోడలు రాజమండ్రి అమ్మాయే....నిజంగా వారి ఇంట్లో మర్యాదలు చాలా బాగా చేస్తారు. ఇక వివిధ స్వచ్చంద సంస్థలు కూడా యాత్రికులకు ఆహారం విషయం లో ఏ రకమైన ఇబ్బంది కలుగకుండా చూసుకుంటున్నాయట. రాజమండ్రి కుర్రాళ్ళు కూడా యాత్రికులకు దారి చెప్తూ, ఇంకా ఎన్నో రకాల సహాయం చేస్తున్నారుట. పుష్కరాలకు వెళ్ళలేకపోయామే అనే బాధ కన్నా, అటువంటి ఆదరణ ప్రత్యక్షంగా చూడలేకపోయామే అని ఎక్కువ బాధ కలిగింది. మా ఊరుకు వచ్చిన వారు మాకు అతిధులే కదండీ అని వారు చేస్తున్న సేవల్లో భాగం పంచుకోలేకపోయామే అనుకున్నాం. దేనికైనా పెట్టి పుట్టాలి అంటారు....ఇందుకే...

No comments:

Post a Comment