Tuesday 28 January 2014

పంచతంత్రము అనే గ్రంథం గురించి మనకు అందరికి తెలిసినదే. అందులో విష్ణుశర్మ తన శిష్యులైన రాజకుమారులకు ధనం గురించి చెప్పిన మాటలు ఆలకించండి.

ధనము లేకపోతే ఆర్జించాలి.
ఆర్జించిన ధనమును జాగ్రత్తగా రక్షించుకోవాలి.
రక్షించుకున్న సంపదను వృద్ధి చేయాలి.
వృద్ది చేసిన ధనమును సద్వినియోగం చేయాలి.

ఇలా చేయని వాణి ఇంట్లో ధనము నిలువదు.
సంరక్షణ చేయని ధనము వెంటనే నశిస్తుంది.
వృద్ది చేయని సంపద కొంచెం ఆలస్యంగా--కాటుకలా--కరిగిపోతుంది.

అనుభవానికి రాని డబ్బు ఉన్నా లేనట్లే.... సుఖమునివ్వదు.
ఒకరికి ఇచ్చుట, తను అనుభవించుట, దొంగిలించుట-- ఈ మూడు డబ్బు పోయే మార్గాలు.
కనుక , తన ధనమును ఒకరికి ఈయక, తానూ అనుభవించని వాని ధనము ఎవరైనా దొంగిలించుకు పోతారు.

మూర్ఖులు ఈ విషయము తెలుసుకోలేరు.

No comments:

Post a Comment