Thursday 30 January 2014

మాఘ మాసంలో సముద్ర స్నానానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది. మాఘ పూర్ణిమ నాడు అందరు తప్పనిసరిగా సముద్ర స్నానం చేస్తారు. సముద్ర స్నానమే కాకుండా, ఏదైనా నదిలో కానీ, జలాశయం లో కానీ, మనకు ఎక్క్కడ వీలుంటే అక్కడ పుణ్యస్నానాలు చేసేటప్పుడు ఆ జలములో గంగాదేవి వసించి ఉన్నది, గంగా స్నానం పాపాలను తొలగిస్తుంది ,  విష్ణు లోక ప్రాప్తిని కలిగిస్తుంది అని భావించి స్నానం చేస్తాము. అటువంటి సందర్భాలలో చదువుకోవలసిన శ్లోకాలు:

1. గంగా గంగే తి యో బ్రుయాత్ యోజనానాం శతైరపి, 
    ముచ్యతే సర్వ పాపెభ్యో, విష్ణు లోకం సగచ్చతి.

2. అంబ: త్వ ద్దర్శన్నాన్ముక్తి: న జానే స్నానజం ఫలం
    స్వర్గారోహణ సౌపానౌ మహా పుణ్య తరంగినే

3. యౌ సౌ సర్వగతో విష్ణు: చితస్వరుపే నిరంజన:
    న ఏవ ద్రవ రూపేణ గంగాంభో నాత్ర సంశయ:

4.నందిని, నళినీ, సీతా, మాలిని, చ మహాపగా
   విష్ణు పాదాబ్జ సంభూత, గంగా, త్రిపథ గామినీ,
   భాగిరథి, భోగవతి, గంగా త్రిదశేశ్వరి,
   ద్వాదశైతాని నామాని, యత్ర యత్ర జలాశయే,
   స్నానకాలే పఠెన్నిత్యమ్, మహా పాతక నాశనం.



No comments:

Post a Comment