Monday 13 January 2014

ఈరోజు ఒక మంచి పుస్తకం గురించి తెల్సుకుందాం. నేను చదివిన పుస్తకాలలో నాకు నచ్చిన పుస్తకం.. సత్యం శంకరమంచి గారు వ్రాసిన అమరావతి కథలు. ఇందులో దాదాపు 100 కథలు ఉన్నాయ్. అన్ని చాల సరళమైన భాషలో పిల్లలకు కూడా సులభంగా అర్ధం అయ్యేలా ఉంటై.

బ్రాహ్మణ అగ్రహారం లో అప్పటివరకు కులాలు పట్టింపు ఉన్నా, అమాంతం వరద వచ్చేసరికి ఊరి జనం అందరు కుల భేదం లేకుండా ఊరి అవసరాలు ఎలా తీర్చారు అనేది 'వరద' కథ.

బాగా తిండి పుష్టి ఉన్న అప్పంభోట్లు ఊరిలో ఉన్న మామ్మగారికి మనవడు పుట్టినట్లు శుభవార్త మోసుకేల్తే, అంత వయసులోనూ, ఆవిడ అప్పంభోట్లు కి ఎలా వండి వడ్డించింది అనేది 'అప్పంభోట్లు' కథ. చాల సొగసుగా మునివేళ్ళతో రెండు మెతుకులు తీసుకోని నోట్లో వేసుకొని భోజనం ఐపోయింది అనుకునే ఈతరానికి సుష్టు గ భోజనం చేసే అప్పంభోట్లుని చుస్తే ఆశ్చర్యమే మరి.

కార్తీకమాసం వనభోజనాలకి వెళ్ళినపుడు అందరికి కొసరి కొసరి వడ్డించిన వంటవాడు ఆఖరున మిగిలిన కొద్ది పదార్థాల్ని విస్తర్లో వడ్డించుకుని తిని బ్రేవ్ మని త్రేన్చి, అందరు తృప్తి గ తింటే చాలు నా ఆకలి తీరినట్లే అనుకొన్న కథ ఒకటి. ఇందులో ఈకాలం పిల్లలకి తెలియని అచ్చ తెలుగు వంటల పేర్లు తెలుసుకోవచ్చు.

ఆస్తికుడు, నాస్తికుడు, వారి వారి ద్రుక్పథములు వివరించిన కథ మరొకటి. గుడిలో పూజారి ఇచ్చిన తీర్థం భగవత్ప్రసాదం అని ఆస్తికుడు అనుకుంటే, నోరు తడిపి దాహం తీర్చింది అని నాస్తికుడు అనుకుంటాడు. ఎవరి భావాలు వాళ్ళవి....

ఇవే కాక మరెన్నో కథలు, మనసులు స్ప్రుశించేవి, మనని ఆలోచింప చేసేవి, దాదాపు అన్ని కథలు ఆణిముత్యాలు.... ఎన్ని సార్లు చదివినా మళ్లీ మళ్లీ చదవాలి అనిపించేవి..

ఇప్పటికే ఈపుస్తకం చదివిన వాళ్లకి ధన్యవాదములు. ఇంకా చదవని వారు తప్పక ఒకసారి చదవండి. వీలైతే పిల్లల చేత కూడా చదివించండి.. సిటీ బ్రతుకులు, ఇంగ్లీష్ చదువులు అలవాటైన పిల్లలు ఒకసారి తెలుగు గురించి, తెలుగులో ఉన్న మంచి సాహిత్యం గురించి తెలుసుకుంటారు.

No comments:

Post a Comment