Wednesday 8 January 2014

మండల దీక్ష:

మండల దీక్ష ఎందుకు చేస్తారు? భక్తులు అందరు తమ తమ ఇష్ట దైవాల ప్రీతి కొరకు దీక్షలు చేపడతారు. ఈ దీక్షలు ఏ వారమో, నెలో కాకుండా  మండలం రోజులే ఎందుకు చేస్తారు? మండలం అంటే 41 రోజులు.

ఆయుర్వేదంలో కూడా కొన్ని రకాల మందులు తయారు చేయడానికి , కొన్ని రకాల చికిత్సలకు మండల రోజులే కాల పరిమితి ఉంటుంది. అసలు ఈ 41 రోజుల పరిమితి ఏమిటి?

మన శరీరం మనం తినే ఆహార పదార్థాలను బట్టి పని చేస్తుంది. మన మనస్తత్వం కూడా మనం తినే ఆహార పదార్థాలపై ఆధారపడి ఉంటుంది. శరీరం రోగ గ్రస్తం అయినపుడు శరీరంలో నుంచి  అనారోగ్యానికి కారణమైన toxins  తొలగించి, శరీరాన్ని మాములు స్థితికి తేవడానికి కనీసం 40 రోజులు పడుతుంది. అప్పుడే రోగం మూలం నుంచి తొలగించబడి శరీరం ఆరోగ్యవంతం ఔతున్ది.

అలాగే మన మనసు కూడా నానా వికారాలకు లోను అవుతుంటుంది. మనసు, బుద్ది, సరిగా ఉండాలి అంటే అరిషడ్వర్గాలను జయించాలి. ఎవరో యోగులకు తప్ప మాములు మానవులకు , మన లాంటి వాళ్లకి అది సాధ్యం కానీ పని.  మనలోని వికారాలు, అహంకారం తొలగిపోయి అందరిలోనూ భగవంతుడే ఉన్నాడు అనే భావన నిలుపుకోవటం సాధన ద్వారానే సాధ్యం అవుతుంది. ఈ సాధనకు కనీసం  41 రోజులు అవసరం. ఈ దీక్షలను అందుకే 40 రోజుల కాల  పరిమితి తో పాటిస్తారు.

దీక్ష చేసేవారు మగవారిని స్వామి అని, ఆడవారిని మాతా అని పిలవడం కూడా అందరిలోనూ భగవంతుడిని చూసే ప్రయత్నమే. అలాగే, భూ శయనం, ఒంటి పుట భోజనం కూడా మనలో రాజసాన్ని అరికట్టి సాత్వికులుగా  చేసే ప్రక్రియ. అలాగే చెప్పులు లేకుండా నడవడం, క్షవరం, లేకుండా , గోళ్ళు తీసుకోకుండా ఉండడం మన దేహంపై మనకు ఉన్న ప్రేమని తొలగించి రెండు పూటలా భజన, దైవ పూజ ద్వారా దైవానికి సన్నిహితంగా ఉండడం కొరకే. అలాగే పరుష వాక్యాలు మాట్లాడక పోవడం అనే నియమం అందరి తోను సద్భావనతో  ఉండడానికే.  అలాగే చన్నీటి స్నానం, మనలో కోరికలను నశింప చేయడానికే. మొత్తం ఒకే రంగు దుస్తులు ధరించడం కూడా మన దేహం మిద, అలంకరణ మిద మనకు ఉన్న ప్రీతిని తగ్గించడానికే. మరి సాత్వికమైన భోజనం, మద్య మంసాలకు దూరంగా ఉండడం జీవితాన్ని ఒక క్రమ పద్ధతిలో జీవించడానికే.

ఈ అన్ని నియమాలు 40 రోజులు పాటించడం వల్లమనలోని అహంకారం, వికారాలు నశించి,  అరిషడ్వర్గాలను జయించి, సాత్వికులుగా మారతాం. అందరు ఇలా మారటం వల్ల సమాజం లో శాంతి , సమభావనలు వెల్లి విరుస్తాయి.

కానీ, ఈ దీక్షల వెనుక ఉన్న ఉద్దేశ్యం ఈ రోజుల్లో ఎంతవరకు fulfil  అవుతోంది? ఎంతమంది దీక్ష పూర్తీ అయిన తర్వాత తమ అహంకారాన్ని వదులుకుంటున్నారు? ఎంత మంది సమ భావాన్ని అలవరచు కొంటున్నారు? దీక్ష పూర్తీ అయిన కూడా, ఎంత మంది మద్య మాంసాలకు  దూరంగా ఉంటున్నారు? దీక్ష అయిపోయి మాల తీసిన తరువాత అంత షరా మాములే.  ఈ పధ్ధతి మారనంత వరకు ఎన్ని దీక్షలు చేసిన ప్రయోజనం లేదు . ఆలోచించండి.

No comments:

Post a Comment