Monday 13 January 2014

మిత్రులారా... మన రాష్ట్రం లోనే ఉన్న విహార యాత్రా స్థలాల గురించి చెప్పుకుంటున్నాం కదా. ఈరోజు 'అరకులోయ' గురించి తెలుసుకుందాం.

అరకు లోయ విశాఖకు దగ్గరలో సుమారు 120 కి.మీ. దూరంలో ఉన్న ఒక hillstation . ఇక్కడికి రైలు, రోడ్ మార్గం ద్వారా చేరుకోవచ్చు. రైలు అయితే, విశాఖ రైల్వే స్టేషన్ నుంచి ప్రతి రోజు ఉదయం 8 గంటలకు కిరండొల్ పాసెంజర్ ఉంది. అరకు చేరడానికి ఇది ఒక్కటే రైల్. అయితే అరకు వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఈ రైలు ప్రయాణం మాత్రం మిస్ కావద్దు. ఎందుకంటే కొండల మిద వేసిన రైల్వే ట్రాక్ కారణంగా ఈ రైలు సుమారు 58 సొరంగాలు, 84 వంతెనల మిద సాగుతుంది. ఇది ఒక అద్భుతమైన అనుభవం. జీవితంలో మర్చిపోలేము. మళ్లీ రాత్రికి ఇదే రైలు తిరుగు ప్రయాణం ఔతున్ది.

ఇక రోడ్ ద్వార వెళ్ళాలి అనుకునే వాళ్ళకి విశాఖ నుంచి, విజయనగరం నుంచి ఎన్నో బస్సు సర్వీసులు ఉన్నాయి. విశాఖ నుంచి ఐతే 3 గంటలు, విజయనగరం నుంచి అయితే సుమారు గంటన్నరలో అరకు చేరుకోవచ్చు. విజయనగరం నుంచి వెళ్ళే వాళ్ళు దారిలో తాటిపూడి జలాశయం కూడా చూడవచ్చు.

రోడ్ ద్వారా వెళ్ళే వాళ్ళు ఉదయం సుమారు 9 గంటలకు tyada రోడ్ చేరుకుంటే, రోడ్ ప్రక్కనుంచి టన్నెల్ లోంచి వెళ్ళే కిరండొల్ express ను చూడవచ్చు. తరువాత అనంతగిరి వెళ్ళే దారిలో కాఫీ ప్లాంటేషన్స్ రోడ్ కు ఇరువైపులా మనం చూడవచ్చు. స్థానిక గిరిజనులు పండించే అనంతగిరి కాఫీ అంతర్జాతీయం గ ప్రసిద్ధి పొందినది. ఇక్కడి 'గాలికొండ వ్యూపాయింట్ ' దగ్గర స్థానిక గిరిజనులు కాఫీ గింజలు, కాఫీ పొడి, మిరియాలు, మసాలా దినుసులు అమ్ముతారు. పచ్చి మిరియాలు కూడా చూడవచ్చు. ఒక్క పచ్చి మిరియం గింజ నోట్లో వేసుకొని కొరికి నమలండి. ఆ చలి వాతావరణం లో పచ్చి మిరియం ఘాటు అనుభవించండి. కాఫీ ప్రియులు ఇక్కడి కాఫీ పొడి కొనుక్కోండి. ఆ కాఫీ రుచి చాల బాగుంటుంది.

ఇక అరకు లో పద్మాపురం గార్డెన్స్, చాపరాయి జలపాతం, ట్రైబల్ museum , బొర్రా గుహలు చూడదగిన ప్రదేశాలు. పద్మాపురం గార్డెన్స్ లో వివిధ రకాల, వివిధ సైజుల గులాబీలు చూడవచ్చు. అలాగే ఎన్నో రకాల పుష్ప జాతులు చూడవచ్చు. ఇక్కడ bamboo tree houses ఉన్నాయ్. రాత్రి బస చేసేవాళ్ళు అద్దెకు తీసుకోవచు.

చాపరాయి దగ్గర కొండ ఎత్తుగా ఉండకుండా చాప లాగా సమతలంగా ఉంటుంది. అందుకే దీనికి ఆ పేరు వచ్చింది.

APTDC వాళ్ళు ఇక్కడి గిరిజన జాతులకు సంబంధించిన చరిత్ర, వారి ఆచార వ్యవహారాలూ తెలియ చేసేందుకు వీలుగా ఫైబరు తో చేసిన బొమ్మలతో ఒక museum నెలకొల్పారు. ఇక్కడ షాపింగ్ కూడా చేయవచు.

ఇక అరకుకు కొద్ది దూరంలో ఉన్న బొర్రా గుహలు చూడడం ఒక మంచి అనుభవం. ఈ గుహలను విలియం కింగ్ అనే ఆంగ్లేయుడు 1807 లో కనిపెట్టాడు. ఇవి ఒక మిలియన్ సంవత్సరాల క్రితం భూమిలో ఉండే లోహాలు, రసాయనాల వల్ల సహజంగా రూపు దిద్దుకున్న గుహలు. వీటిలో APTDC లైటింగ్ ఏర్పాటు చేసి ఇంకా అందంగా తయారు చేసారు.

ఇక్కడ బస చేయడానికి APTDC హరిత హోటల్స్ నడుపుతోంది. బయట మన అదృష్టం కొద్ది ఒకే ఒక శాకాహార భోజన హోటల్ ఉంది. హరిత హోటల్స్ లో శాకాహార భోజనం దొరుకుతుంది.

అరకు దర్శించడానికి అనువైన కాలం వర్షాకాలం అయిపోయిన తర్వాత అక్టోబర్ నుంచి january మధ్య కాలం. ఇక్కడ ఈకాలం లో వలిసే పూవులు పూస్తాయి. లోయ అంతా ఈ పూవుల పచ్చ రంగుతో పసుపు పచ్చ తివాచి పరిచినట్లు ఉంటుంది. ఆ అందం తప్పనిసరిగా చూడవలసినదే.

ఈకాలం లో అరకు లోని landscapes మనలను కట్టిపడేస్తాయి. వానాకాలంలో అరకు రైలు లో వెళ్ళే సాహసం చేయకండి. కొండచరియలు విరిగి పడుతుంటాయి. ప్రమాదం కూడా.

No comments:

Post a Comment