Monday 13 January 2014

దేశ సంస్కృతీ సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను పాలకులనుప్రజలందరూ గౌరవించలి. ప్రజల బలం, బలహీనతలను అంచనా వేసి దేశ సర్వతోముఖ వికాసానికి పాలకులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి.

కేకయ దేశాధిపతి ఆశ్వపతి మహారాజును కొందరు దర్శించారు. రాజును రాజ్యం గురించి అడుగగా తన రాజ్యం గురించి ఆయన ఇలా చెప్పారు.

నమస్తేనో జనపదే,
నకదర్యో నమద్యపః
నన హితగ్నిర్
నా విద్వాన్న స్వైరో స్వైరినీ కుతః:

నమేస్తేనో--- నా రాజ్యంలో ధర్మం నాలుగు పాదాల వర్ధిల్లుతోంది. ఈ దేశంలో దొంగలు లేరు. ప్రజలందరూ కష్టపడి పనిచేసి దనం సంపాదించి, అన్న వస్త్రాలకు లోటు లేకుండా జీవిస్తున్నారు.వారికీ అధికమైన కోరికలు లేవు. కనుక దుఃఖాలు లేవు. ఆశలు, అధికమైన ఆపేక్షలు లేవు. పరుల వస్తువుకు ఆశపడరు. ఉన్నంతలో తృప్తిగా జీవిస్తారు.

నకదర్యో--- నా రాజ్యంలో లోభులు లేరు. ప్రజలు ధార్మిక జివనులు. ఉన్నంతలో పదిమందికి పెట్టి తినే భాగ్యవంతులు. వంద చేతులతో సంపాదించి, వేయి చేతులతో దానం చేయాలి అని శాస్త్ర వాక్యం. దీనిని నా ప్రజలు విశ్వసిస్తారు.

నమద్యపః --నా దేశ ప్రజలు మద్యపానం చేయరు. జూదం ఆడరు. వ్యసనపరులు కారు. సత్ప్రవర్తనులు, నితిమంతులు, త్యాగధనులు, నిరాడంబరులు. నా ప్రజలు శీలసంపదకు వ్యక్తిత్వానికి ప్రాధాన్యత ఇస్తారు.

నానా హితగ్ని-- నా రాజ్యంలో వేదాది కర్మలు, హోమాలు నిరంతరం జరుగుతాయి. చేయని వాళ్ళు ఎవరు లేరు. ధూమపానం చేసేవారు, దుష్టులు లేరు.

నా విద్వాన్-- ఈ దేశంలో అందరు విద్యావంతులే. మూర్ఖులు,మూధులు లేరు. ప్రజలు విద్యావినయ

సంపన్నులు. సంస్కారులు.

నస్వైరీ-- ఈ దేశంలో వ్యభిచారులు లేరు. ప్రజలు సర్వగుణ సంపన్నులు. జితెన్ద్రియులు, నీతికోవిడులు. పురుషులు పరస్త్రీలను తల్లితో సమానంగా గౌరవిస్తారు. . స్త్రీలు పరపురుషులను రక్షకులుగా భావిస్తారు.

తన దేశ ప్రజలు ధర్మజ్నులనీ, వ్యసనాలకు బానిసలూ కారు అని గర్వంగా చెప్పుకున్నాడు అశ్వపతి మహారాజు.

ప్రస్తుతం మనదేశ పరిస్తితి పూర్తీ వ్యతిరేకంగా ఉంది. దేశంలో దొంగలు యదేచ్చగా సంచరిస్తున్నారు. పాలకులే దొంగలు ఔతున్నరు. ప్రజలకు ఏమి సౌకర్యలు లేవు. నీళ్లు దొరకకపోయినా, మద్యం యదేచ్చగా ప్రవహిస్తోంది. నీతినియమాలు లేని జీవనం, సర్వత్ర అవినీతి, దుర్వ్యసనాలు, విచ్చలవిడి వ్యభివ్చారం, మానభంగాలు, దేశాని పట్టి పీడిస్తున్నాయి. అశ్వపతి మహారాజుల మనం మన దేశాన్ని గురించి గర్వంగా చెప్పుకునే రోజు ఎప్పుడు వస్తుందో ఏమో!

No comments:

Post a Comment