Monday 13 January 2014

తపస్సు అంటే ఏమిటి అనే ప్రశ్నకు 'స్వధర్మ వర్తనమే తపస్సు, స్వధర్మాన్ని చిత్తశుద్ధితో, భగవదర్పణ భావంతో, అహంకార మమకారాలకు అతీతంగా ఆచరించడమే తపస్సు' అని మహాభారతం సమాధానం ఇచ్చింది.

కౌశికుడనే బ్రహ్మచారి నిరంతరం అధ్యయనం, జపధ్యానాల వంటివి చేస్తూ అరణ్యాలలో సంచరించేవాడు. ఒకసారి ఒక వృక్షం కింద కూర్చొనే వేదాలను గుణిస్తున్దగా, , పై కొమ్మల నుంచి ఒక పక్షి రెట్ట వేసింది. ఆగ్రహంతో పైకి చూసాడు. అతని నేత్ర దృష్టి వల్ల ఆపక్షి ప్రాణాలు కోల్పోయింది. కౌశికుడు హింసాత్మకమైన తన చర్యకు సిగ్గుపడ్డాడు.

మధ్యాహ్నవేళ ఒక గృహస్తు ఇంటికి వెళ్లి భిక్ష అడిగాడు. భిక్షను సిద్ధం చేస్తున్న గృహిణి, అప్పుడే ఇంటికి చేరిన గృహస్తును చూసి, భిక్ష వేసే పనిని పక్కన పెట్టి భర్తకు కావలసిన ఏర్పాట్లు చేసి, తర్వాత భిక్ష తీసుకువచ్చి వేసింది. ఆకలి, అహంకారం కలిసిన కౌశికుడు, తపస్సులమైన మా కన్నా, ని భర్త , ని పనులే ఎక్కువ అయ్యాయా నీకు అని కోపంగా అడిగాడు.

నేను ప్రధానంగా గృహిణిని. గృహకార్యం, భర్తకు వలసినవి సమకూర్చడం నా ప్రధాన ధర్మాలు, అతిథులను సేవించడం నా పనే. కానీ ప్రధాన బాధ్యతల్ని నిర్వహించిన తరువాతే అవన్నీ. ఐన నువ్వు కోపంగా చూస్తె మాదిపోవడానికి నేను పక్షిని కాదు అని చెప్పింది ఆ గృహిణి.

ఎక్కడో అరణ్యంలో జరిగిన సామగ్రి ఆమెకు ఎలా తెలిసిందో అని ఆశ్చర్యపడ్డాడు కౌశికుడు. అదే ప్రశ్న ఆమెని అడిగాడు. "నాయన! నా స్వధర్మ నిర్వహణ అనే తపస్సు వల్ల లభించిన శక్తీ చేత దీనిని గ్రహించాను. క్రోధం, మొహం, ఈ రెండూ సాధనకు, ధర్మానికి, శత్రువులు, మిథిలా నగరంలో ధర్మవ్యదుడనే మహాత్ముడు ఉన్నాడు. ఆయనను దర్శించి ధర్మాలు తెలుసుకో అని బోధించింది ఆ ఇల్లాలు.

కౌశికుడు మిథిల చేరాడు. ఆ ధర్మవ్యాదుడిని చూడ బోయాడు. అతడు ఒక మాంస విక్రేత అని తెలిసి ఆశ్చర్యపోయాడు.

మహానుభావ! సాధ్వీమణి పంపగా వచ్చావు కదూ! అన్నాడు ధర్మ వ్యాధుడు. తీరిక దొరికాక, కౌశికునికి తగిన మర్యాదలు చేసి ధర్మాలను వివరించాడు.

నేను మాంస విక్రేతను. వంశధర్మంగా ఈ వృత్తిని చేపట్టినా, నేను జంతువులను వాదించాను. మాంసాన్ని కొని అమ్ముతాను. నేను మాంసం తినను. అమ్మకాలలో, కొనుగోళ్లలో మోసం చేయను. నా తల్లిదండ్రులను ఇసుమంత కూడా కష్టపెట్టను. నన్ను నమ్ముకున్న వారిని వంచించను. బాధ పెట్టను. పెద్దలను, జ్ఞానులను గౌరవిస్తాను. ఆహార నియమాలు, వ్రతాలూ, పాటిస్తాను. భార్యను తప్ప పర స్త్రీలను కోరను. నిందాస్తుతులకు సముడను. కరకుదనం, అసత్యం, అప్రియం, అహితం, పలకను.ఈర్ష్య, ఆశ అసూయలను మనసులోకి రానీయను. స్వద్ర్మాలను విడువను. ఇదే నా సాధన. అని వివరించాడు.

ఆ సాధ్వి పంపిన కారణంగా నీతో మాట్లాడను. కానీ, నివు మాట్లాడడానికి తగిన వాడవు కావు. ఎన్ని జపధ్యానాలు చేసిన, నువ్వు స్వధర్మాన్ని వదిలేసావు. తల్లిదండ్రుల మాట వినకుండా వారిని విడిచి పెట్టావు. నువ్వొక్కడివే సంతానమని, నీకోసం శ్రమించిన పెద్దలు వారు. వారు వ్రుద్దులై ఉండగా, వారిని విడిచి నువ్ అధ్యయనం కొనసాగిస్తున్నావు. వారిని కొలుచుకో, అదే తపస్సు. స్వధర్మ నిర్వహణె, నాకు దివ్య శక్తులను ఇచ్చింది. అని బోధించాడు.

ఈ కథ భారతంలో అరణ్య పర్వంలో మార్కండేయుడు ధర్మరాజుకు చెప్పినది. దిని తాత్పర్యం జప తపాది సాధనాలు కూడదు అని కాదు. స్వధర్మ వర్తనను విడకుండా చేసే సాధనలకే సత్ఫలం ఉంటుంది అని దిని అంతర్యం...

No comments:

Post a Comment