Monday 22 August 2016

మాతృశక్తి 22

సర్వే భద్రాణి పశ్యంతు:

అందరి శ్రేయస్సు కావాలనే కోరిక మాతృహృదయంలో ఉన్నతగా స్త్రీ యొక్క ఇతర రూపాలలో ఉండదు. ఎందుకంటే భద్రతా భావం ఆమెకెంతో ప్రియమైనది. తన పుత్రుడు ఎవరితోనైనా చెడుగా ప్రవర్తిస్తే ఆమె సహించలేదు. మొత్తం ప్రపంచం శుభ్రంగా ఉండాలనే ఉదాతా ఆశయమామెది. అందరి శ్రేయస్సు కోసం ఆమె ఎంత కష్టాన్నైనా సహించటానికి సిధ్ధపడుతుంది. ఆపదలో ఉన్న రాక్షస రాజ్యాన్ని రక్షించడానికి శర్మిష్ట దేవయాని దాస్యత్వానికి సిధ్ధపడింది. సావిత్రీ బాయి ఫూలే స్త్రీలలో విద్యావ్యాప్తి చేసే ప్రయతంలో ఆమె వ్యతిరేకులు విసిరిన రాళ్ళ దెబ్బలు, పేడ దెబ్బలు సహించింది. ఎందుకంటే స్వయంగా కష్టపడినా సమాజ కళ్యాణం జరిగినట్లయితే జీవితం ధన్యమని ఆమె భావించంది.

మనువు--తండ్రి, కొదుకు, భర్త, అన్న--వీళ్ళందరూ స్త్రీకి రక్షకులుగా ఉంటారని చెప్పాడు కాని, పురుషులకు సన్మార్గ ప్రవర్తకులుగా నిర్మించే బాధ్యత స్త్రీదే..తన సోదరులను, భర్తను, పుత్రులను ఎన్నోరకాలుగా కర్తవ్యోన్ముఖులను చేసి, వారి విజయానికి, కీర్తి పొందుటకు  దోహదపడిన స్త్రీమూర్తులు ఎందరో మనకు చరిత్రలో కనిపిస్తారు. మాతృత్వం యొక్క ఈ అనేక గుణాల కారణం గానే స్త్రీ పూజ్యురాలైంది. ఆబాలగోపాలానికి ఆమె యందు గౌరవభావం ఏర్పడింది.

సమర్థ రామదాసు ఇలా అన్నారు..." తన సంతానం యొక్క పోషణలో తల్లి ఎప్పుడూ అలసిపాదు. ఆమెకు సోమరితనం లేదు. ఆమె ఎప్పుడూ చికాకుపడదు. తలిలాంటి ప్రముఖ వస్తువు ఈ ప్రపంచంలో ఎక్కడా దొరకదు."

తల్లి ప్రేమ మరియు ఆమె ఆశీర్వాదం లోనే లోక కళ్యాణం ఉంది. భగవంతుడు, తల్లి ఇద్దరూ సమానమే. మంచి తల్లియే మహాపురుషులకు అన్మనిస్తుంది. " అని స్వామీ వివేకానంద. అన్నారు. రూపుదాల్చిన భగవంతుని వాత్సల్యమే తల్లి  అని వినోబా భావే వచించారు.

(ఇంకా ఉంది )





No comments:

Post a Comment