Wednesday 17 August 2016

విదురనీతి 66

ఈ మానవశరీరమొక రథం. దానికి సారధి--బుధ్ధి...ఇంద్రియాలు అశ్వాలు. వీనిని వశం లో ఉంచుకొనే వాడు మహా రధికుని వలె సంసార సంగ్రామం లో జయం పొందుతాడు. వశంతప్పి పట్టుతప్పిన గుర్రాలు మధ్యే మార్ఘంలో సారథిని పడగొట్టినట్లు వశంలో లేని ఇంద్రియాలు పురుషుని అర్ధానర్ధ జ్ఞానాన్ని నశింపచేసి దు:ఖభాగుని చేస్తాయి...ధర్మార్ధాలను విడిచి విషయలోలుడై చరించేవాడు అచిరకాలంలో ఐశ్వర్య,ప్రాణ, స్త్రీ, ధనాలను పోగొట్టుకొంటాడు. ఆత్మజ్ఞానాన్ని గ్రహించడానికి నిరంతరం కృషిచెయ్యాలి. ఆత్మకు మించిన మిత్రుడూ,శత్రువూ లేరు. దాన్ని జయించిన వానికి అదే మిత్రము. లేకపోతే అదే పరమ శత్రువు. సూక్ష్మ రంధ్రాలు కల వలలో పడ్డ చేపలు దానిని కొరికివేసినట్లు, కామక్రోధాలనే మీనాలు వివేకాన్ని నశింపచేస్తాయి. ధర్మార్ధాలన్ పరిశీలించుకొని విజయం కోసం కృషి చేసేవాడు సులభంగా వానిని సాధిస్తాడు. చిత్త వికారానికి హేతుభూతాలైన పంచేంద్రియాలను శత్రువులుగా భావించి వానిని జయిస్తేనే శతృ విజయం సాధ్యమవుతుంది.

విదురనీతిలో ముఖ్యాంశాలు...

** జీవితం పాదరసం ...దానిని పట్టుకొనుట కష్టం.

** డబ్బు ప్రతిమనిషిని కలుపుతుంది. విడదీస్తుంది.

** ఉన్న సంపాదనలో కొంత దానం చేయాలి...అదే  చివరకు మిగిలేది.

** మానవుని జీవితం క్షణభంగురం ...అది ఎప్పుడు ఎక్కడ ఆగిపోతుందో తెలియదు.

** నీవు చేసే ప్రతి పని పదిమందికి ఉపయోగపడాలి.

(ఇంకా ఉంది ) 

No comments:

Post a Comment