Thursday 18 August 2016

విదురనీతి 71

"ప్రయత్నించకపోతే తప్పుకదా! అది నేను చెయ్యకూడదు కదా " అన్ని తెలిసి ఈ ప్రయత్నానికి సిధ్ధమయ్యానటాడు...

"వీరి మన్స్తత్వాలు తెలుసు. జరుగబోయే యుధ్ధము తెలుసు. ఇది అనివార్యము. ఈ మహాయుధ్ధము జరగాలి. జననాశనం జరగాలి. దురాత్ములు సమూలంగా నశించాలి. భూమి చల్లబడాలి. అంటే తన భారం తీరిందని సంతోషించాలి. ఇప్పుడు నేను కనుక రాయబారిగా రాకపోతే..

కృష్ణుడు కవాలని ఈ మారణకాండ దగ్గరుండి జరిపించాడని అనవసరంగా ముందు నన్ను ఆ తదుపరి పాండవులను నిరసిస్తారు. ఇప్పుడు జరుగబోయేది సర్వం గ్రహించినట్లు "విధి విపరీతం" అని సర్దుకుపోయే ప్రయత్నం చేస్తారు. కనుక, ఇది పొసగదు అని తెలిసి కూడా తప్పక వచ్చాను అని విదురునికి వివరించాడు.

రాయబారం విఫలమౌతుంది.

మూర్ఖులు, మందులైన దుర్యోధనులు కృష్ణుని బంధిస్తే పాండవుల ఆట కడుతుందని, అవివేకంతో ఆ మహనీయుని బంధింపతలచి చేసిన ప్రయత్నం వారికే బెడిసికొడుతుంది. కనీసం కృష్ణుని సంపూర్ణంగా కళ్ళతో చూదలేకపోతారు. చచ్చినట్టు బ్రతికి బయటపడతారు. పాండవుల ప్రతీకార, శపధాలు నెరవేర్చుకోవడానికి అన్నట్లు జీవచ్చవాలై మిగులుతారు.

ఆ తరువాత, ఉభయులు యుధ్ధ సమ్రంభాలు ప్రారంభిస్తారు. కురుక్షేత్రం చేరి ఉభయులు, సైన్యాలతో మిత్ర, ప్రియ, ఆశ్రిత రాజులతో, ధనుష్టంకారం చెయ్యడానికి వీలుగా శంఖధ్వానాలు చేస్తుంటే..


అర్జునుదు జావగారిపోతాడు. అతన్ని ఉత్సాహపరచడానికి,నీతి-ధర్మశాస్త్రమనే మహాభారతంలో శ్రీకృష్ణుడు జగదాచార్యుడై దర్శనమిస్తాడు. ధర్మ బోధ చేస్తాడు. అదే భగవద్గీత.

యుద్ధభూమి లో ఏం జరుగుతోందో చూసి చెప్తున్న సంజయుని మాటలకు ధృతరాష్ట్రుడు కుంగిపోతాడు. అధర్మవర్తనులైన తమ కొడుకులు ఎక్కడ విజయం సాధించరో అని దిగులుపడతాడు. మనసు వికలమైన ధృతరాష్ట్రుడు మనశ్శాంతి కోసం విదురుని రప్పించి మనసుకు సాంత్వన కలిగేటట్లు మంచి మాటలు చెప్పమని కోరుతాడు...ఆ సందర్భంలో విదురుడు పలికిన మాటలే విదుర నీతి.

శ్రీకృష్ణ శ్శరణం మమ ....

***************************(సమాప్తం) ********************************



1 comment:

  1. పద్మ గారు శుభోదయం
    మీ వీదుర నీతి సరళంగా హృద్యంగా చాలా బాగుంది మంచి విషయాలు అందిస్తున్నందులకు ధన్యవాదాలు.
    నిరంజన్ బొబ్బిలిపాటి

    ReplyDelete