Monday 8 August 2016

విదురనీతి 56

 దేశలాభం కోసం తన కుటుంబ లాబాన్ని, కుటుంబ లాభం కోసం తన సొంతలాభన్ని రాజు పరిత్యజించాలి. అలాగే దేశ సౌభాగ్య్మ కోసం తన గ్రామ లాభాన్ని విడిచిపెట్టాలి. అలాగే పాలకులు ప్రజాహితాన్ని పట్తించుకోకుండా, స్వార్ధపరులైతే తాత్కాలిక సుఖాలు పొందుతారు. కాని ప్రజల నిరాదరణకు గురి ఔతారు. కాని అదే ప్రజల క్షేమంకోసం పాటుపడిన పాలకులను ప్రజలభిమానిస్తారు. శాశ్వతంగా వారే పాలకులుగా ఉండాలని కోరుకుంటారు. అవసరమైతే అటువంటి వారి కోసం, ఎన్ని త్యాగాలకైనా సిధ్ధంగా ఉంటారు. చరిత్రలో ఉత్తమ పరిపాలకులను ప్రజలెన్ని విధాలుగా ఆదుకొన్నారో, తెలుసుకొంటే ఎన్నో ఉదాహరణలున్నాయి.

పాండురాజు శాపగ్రస్తుడైనా పాండవులైదుగురూ జన్మించారు. ఇంద్ర సదృసులైన వారిని చిన్ననాటినుండి మీరే పెంచి పోషించి విద్యాబుధ్ధులు నేర్పారు. వారూ మీ ఆదేశాలను అంజలి ఘటించి అనుసరిస్తున్నారు. ఈనాడు వారి రాజ్యభాగం వారికిచ్హి మీ బిడ్డలతో మీరు సుఖంగా ఉండండి. ఇలా చేసినట్లయితే దేవతలు సంతోషిస్తారు. ఈ ప్రజానీకం మిమ్మల్ని వేలెత్తి చూపదు అని విదురుడు ముగించాడు.

నా మనస్సులోని చింత నాకు నిద్రపట్టనివ్వడంలేదు. ఇప్పుడు నేను చెయ్యవలసిన పనేమిటో నిర్ణయించి చెప్పు! ధర్మార్ధవిదుడవైన నువ్వు బాహా వివేచనం చేసి సత్యపథం నిర్దేశించు. కురుపాండవులకు ఏది హితమైనదో దానినే చెప్పు. నా హృదయం అరిష్టాలనే శంకిస్తోంది. కనుక నా కవే గోచరిస్తూ వేధిస్తున్నాయి. ధర్మరాజు ఏం కోరుతాడో ఆలోచించి చెప్పు-- అని ధృతరాష్ట్రుడు ప్రస్నించగా విదురుడు ఇలా చెప్పడం మొదలెట్టాడు.

(ఇంకా ఉంది )

No comments:

Post a Comment