Tuesday 23 August 2016

మాతృసక్తి 23

తల్లిని పూజిస్తే మోక్షం లభించటం అసంభవమేమీ కాదు. భగవంతుని పూజలలో కెల్లా శ్రేష్టమైనది తల్లి పూజయే.. మాధుర్య సాగరం, ఊవులలో ఉండే కోమలత్వం, గంగా జల నిర్మలత్వం, చంద్రుని సౌందర్యం, సముద్రుని అనంతత్వం, భూమి సహనశీలత, తల్లి అనే రెండు అక్షరాలలో ఇమిడి ఉన్నాయి. ఇదే ఉత్తమ దైవం. ఆమె నాగురువు. అన్ని కోరికలు నెరవేర్చే కల్పవృక్షం..అని సోనే గురుజీ అన్నారు.

"ఒక వేళ తూచినట్లయితే మొత్తం ప్రపంచం కంటే తల్లే ఎక్కువ బరువు తూగుతుంది. నాలో ఏమేమి మంచి గుణాలున్నాయో అవన్ని నాకు నా తల్లి నుంచే లభించాయి." అని ప్రపంచ ప్రఖ్యాతుడైన నిపోలియన్ బోనాపార్ట్ అనాడు.

అలెగ్జాండర్ అయితే తన తల్లి కళ్ల నుండి ఏమాత్రం దు:ఖాశ్రువులు కారినా సహించేవాడు కాదు. వాటిని తుడవడానికి అతడు ఎంతకైనా సిధ్ధపడేవాడు.

మొత్తం ప్రపంచ భారాన్ని మోయగల ఓర్పు తల్లులలో ఉంది. జాతి అభివృధ్ధి తల్లులపైనే ఆధారపడి ఉంది. జాతి పతనోన్నతులు తల్లి కోరికపైననే ఆధారపడి ఉంటాయి. పతనాన్ని ఆమె ఎప్పుడూ కోరుకోదు.

ఈనాడు వ్వతావరణ కాలుస్యం గురించి చాలా చర్చ జరుగుతున్నది. కాని మతృశక్తి యొక్క దురుపయోగంతో ఏర్పడుతున్న సంస్కార కాలుష్యం గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం ఉంది.

భారతీయ ఋషులు అతి ప్రాచీన కాలంలోనే మాతృశక్తిలోనే సృష్టి నిర్మాత యొక్క సృజనశక్తి కలదని తెలుసుకొన్నారు. మాతృశక్తి గొప్పతనాన్ని వాళ్ళు భారతీయులకు తెలియచేసి దాన్ని ఎల గౌరవించాలో కూడా వాళ్ళకు నేర్పారు. ఆ కారణంగానే రాక్షస రాజైన రావణుడు సీతతో అలా మర్యాదగా వ్యవహరించడం సాధ్యమైంది.

మాతృశక్తి గురించిన సంపూర్న పరిజ్ఞానం కలిగి దాన్ని ఆచరణలో పెడుతూ వస్తున్న భారతీయుల సామాజిక జీవనం వేదకాలం నుండి అంటే 8, 10 వేల సంవత్సరాల నుండి ఈనాటికీ నిన్రంతరాయంగా కొనసాగుతూ వస్తున్నది. గత రెండున్నర వేలసంవత్సరాల నుండి భారతీయ రాక్షసులకంటే అతి క్రూఉలైన విదేశీయ దురాక్రమణలకు అది గురి అయింది.

(ఇంకా ఉంది  )

No comments:

Post a Comment