Thursday 11 August 2016

విదురనీతి 62

సత్య, దాన, క్షమ, అనసూయ (అసూయ లేకుండుట) కర్మపరతంత్రాది సద్గుణాలను సావధానంతో అలవరచుకోవాలి. ధనప్రాప్తీ, ఆరోగ్య దేహమూ, అంకూలవతి,ప్రియభాషిణీ అయిన అర్ధాంగీ, చెప్పుచేతల్లో ఉంటే కుమారులూ, ధనార్జనకు ఉపయుక్తమైన విద్యా ఈలోకంలో పరమసుఖదాయకలు. కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాది అరిషడ్వర్గాలనూ జయించి జితేంద్రియుడై చరించాలి. దొంగలు ప్రమత్తులవల్ల, వైద్యులు రోగివల్ల, కామినీ జనము కాముకుల వల్ల, పురోహితులు యజమానుని వల్ల, స్పర్ధను వాంచించె విద్వాంసుడు మూర్ఖుని వల్ల జీవితం గడపాల్సి ఉంటుంది.

సంరక్షణ లేకపోతే  గోవూ, వ్యవసాయమూ, స్త్రీ, విద్యా నశిస్తాయి. అప్రమత్తతతో చరించకపోతే శూద్రస్ఖ్యమూ, సేవా వినాశనానికి దారితీస్తాయి. విద్యా పరిపూర్తి అయిన అనంతరం శిష్యుడు గురువునూ, వివాహానంతరం తల్లిని కుమారుడూ, భోగఫలానంతరం పురుషుడు స్త్రీనీ, పని జరిగినమీదట సహకరించిన వార్నీ, నదిని తరించాక నావనూ, రోగవిముక్తానంతరం వైద్యుని విస్మరించడం తగదు.

(ఇంకా ఉంది ) 

No comments:

Post a Comment