Wednesday 10 August 2016

విదురనీతి 60

ఈ భూమండలంలో ఇద్దరే ఇద్దరు అధములు. ఒకరు కర్మను విడిచిపెట్టిన గృహస్తూ, రెండు కర్మబధ్ధుడైన సన్యాసీ... శత్రువులను అలక్ష్యం చేసే ప్రభువునూ, పరదేశాలు తిరుగని విప్రునీ ఈ పృథివి కబళిస్తుంది.  దరిద్రుడై అమూల్యవస్తువులను అభిలషించేవాడూ, అసమర్ధుడై క్రోధంతో ఉండేవాడూ, తమకుతామే శత్రువులు. శక్తి కలిగి క్షమతో ఉండేవాడూ, నిర్ధనుడైనా ఉన్నంతలో దానం చేసేవాడూ స్వర్గంలో ఉన్నతస్థానం పొందుతారు.

న్యాయోపార్జిత ధనం రెండు విధాల దురుపయోగమవుతుంది. సత్పాత్రునకు దానం చెయ్యకపోవడం, అపాత్రునకు దానం ఇవ్వడం...ధనికుడై దానం చేయనివాడూ, దరిద్రుడై కష్టాలు సహించలేని వాడూ, ఉంతే వారి మెడకొక బండరాయి కట్టి మడుగులో పడేయాలి... సక్రమంగా సన్యాసం సాగించిన్ వాడూ, సంగ్రామ రంగంలో శత్రుహస్తాలలో మరణీంచినవాడూ సూర్య మండలాన్ని చేదించుకుని ఉత్తమలోకాలకు పోతారు.

ప్రభూ! కార్యసాధనకు ఉత్తం మధ్యమ అధమ రీతులు మూడున్నాయి. ఆ మూడుదారులూ శృతిప్రోక్తములే..వీటిని యథాప్రకారంగా ఆచరించే వారు సంపదలకధికారులు అవుతారు. దారా, పుత్ర, దాసులకు సంపదలపై అధికారం లేదు. ఈ ముగ్గురూ ఎవరి ఆధీనంలో ఉంటే వారి సంపదలు కూడా వారి ఆధీనంలోనే ఉంటాయి. పరధనాపహరణ, పరనారీసాంగత్యమూ, సుహృజ్జన పరిత్యాగమూ అనే కూడు దోషాలూ మానవుని ధర్మ ఆయుర్దాయ కీర్తులను క్షీణింపచేస్తాయి. కామ, క్రోధ, లోభాలు నరకానికి తెరచిన మూడు దారులు..

(ఇంకా ఉంది )

No comments:

Post a Comment