Tuesday 23 August 2016

మాతృశక్తి 24

ఆంగ్లేయులకు ముందు రెండున్నరవేల సంవత్సరాల నుండి భారతదేశం మీదికి దండెత్తివచ్చిన విదేశీయులు భారతదేశ వాయవ్య, పడమటి దిక్కుల నుండి వచ్చారు. అప్పటివరకు ఆ దేశాలకు భారతీయ సంస్కృతి ప్రచారకులు చాలా కొద్ది సంఖ్యలోనే వెళ్ళారు. అందువల్ల సృష్టిలో మాతృశక్తి యొక్క మహత్వాన్ని గురించి అక్కడి ప్రజలు చాలా కొద్దిమందే తెల్సుకోగలిగారు. మాతృశక్తి మహత్యం తెలియని విదేశీ ఆక్రమణకారులు స్త్రీని కేవలం భోగవస్తువుగానే చూడసాగారు. ధన సంపదను దోచుకున్నట్లే వాళ్ళు స్త్రీలన్ దోచుకుని మానభంగాలు చేసి ఎత్తుకుపోయేవారు. క్రీ. శ. ఇస్లాం మత స్థాపన జరిగిన తర్వాత ఇక్కడికి వచ్చిన మహమ్మద్ద్య దురాక్రమణదారులు ఇక్కడి స్త్రీలను ఒక భోగవస్తువుగా చూడటమే కాక, స్త్రీలలో సంతానోత్పాదన శక్తిని తమ సంఖ్యాబలం పెంచుకోవడానికి సాధనంగా వాడుకోవాలని నిశ్చయించారు. ఈ ఉద్దేశ్యంతో ఒక్కొక్క పురుష దురాక్రమణ దారుడు అనేకమంది స్త్రీలను బలాత్కరించి వివాహం చేసుకున్నాడు. వాళ్ళ ద్వారా అధిక సంఖ్యలో సంతానొత్పత్తి చేసి ఇస్లాం మతస్థుల జనాభా వృధ్ధికి కారకులైనారు. వాళ్ళు ఈ పని ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. తమ ఈ లక్ష్య పూర్తికి వాళ్ళు భారతీయ స్త్రీ పురుషుల మీద అనేక అత్యాచారాలు జరిపారు. స్త్రీలతో ఇలాంటి వ్యవహారం భారతీయులకు పూర్తిగా కొత్త. అందువల్ల ఈ అత్యాచారాలు చూసి స్త్రీలు భయకంపితులైపోయారు. దైర్యం కోల్పోయిన పురుష సమాజం కూడా వాళ్ళకు పూర్తి రక్షణ ఈయలేకపోయింది. స్వయంగా స్త్రీయే ఈ అత్యాచారులతో పోరాడి పోరాడి అలసిపోయి, చివరకు పోరాడే శక్తిని కోల్పోయి అబలగా మారింది. తండ్రి కొడుకులు మొదలైనవాళ్ళు ఇక తన్ను రక్షించలేరని తెలుసుకున్న స్త్రీలు వాళ్ళకు ఇబ్బంది కలుగకుండా ఉండలని తమ వ్యవహారాలను ఇంటివరకే పరిమితం చేసుకుని ఇంటికే బందీలైపోయారు. నీతిమంతమైన, పవిత్రపూర్ణమైన తమ సమాజమనే ఆకాశంలో స్వేచ్చగా విహరించే స్త్రీ ప్రంజరంలో పక్షి వలె పూర్తిగా స్వేచ్చను కోల్పోయి తనకు తానే కృంగి కృశించిపోయింది.

భారతీయ సంస్కృతి విషయంలో భారతీయుల శ్రధ్ధాసక్తులు ఎప్పటివలెనే దృఢంగా ఉన్నాయి. మాతృశక్తిని గురించిన అవగాహన, ఆచరణ విషయంలో వాళ్ళలో మార్పులేదు. దురాక్రమణదారులతో జరిగిన యుద్ధాల్లో భారతీయులు విజయం పొందినా వాళ్ళు ఆక్రమణదారుల స్త్రీలను దోచుకోవటంగాని, బలాత్కరించి వివాహం చేసుకోవడం కాని చేయలేదు. కళ్యాణ్ సుబేదారుతో జరిగిన యుద్ధంలో శివాజీ సైనికులు అనేకమందితో పాటు సుబేదారు కోడలును కొడ బంధించి శివాజీ ముందుకు తీసుకువచ్చారు. అప్పుడు శివాజీ ఆమెను ఎంతో గౌరవ పూర్వకంగా సుబేదారు దగ్గరికి తిరిగి పంపించి ఇలాంటి చెడుపనులు ఇక ముందెప్పొడూ చేయవద్దని తన సైనికులను హెచ్చరించాడు.

(ఇంకా ఉంది )

No comments:

Post a Comment