Tuesday 23 August 2016

మాతృశక్తి 25

రెండువేల సంవత్సరాల విదేశీ దురాక్రమణ కాలంలో తమ సంస్కృతిపై భారతీయులకున్న శ్రధ్ధాసక్తులను నిలిపి ఉంచటానికి ఈ దేశంలో భక్తి సాంప్రదాయం ముందుకొచ్చింది. అనేక మతాలకు చెందిన భక్తులు శ్రద్ధతో, త్యాగభావంతో భారతీయ సంస్కృతీ ప్రచారం చేసారు. దానివల్ల కూడా భారతీయులకు చాలా మేలు కల్గింది. తమ సంస్కృతిమీద భారతీయులకున్న దృఢవిశ్వాసం కారణంగా భారతీయరాజులు శతృవులతో వీరోచింతంగా పోరాడారు. క్రీ. శ. 17, 18 శతాబ్దాలలో వచ్చిన ముస్లింలు , మొగలులు భారతీయ రాజుల ముందు నిలబడలేకపోయారు. భక్తి సాంప్రదాయం వల్ల ఆ కాలంలో కల్గిన పెద్ద మేలు ఇది.

18వ శతాబ్ది ప్రారంభంలో భారతదేశంలో చాలా భాగాలనుండి విదేశీయుల రాజ్యాలు తొలగిపోయి వాళ్ళ అత్యాచారాలు కూడా తగ్గిపోయాయి. వివిధ ప్రాంతాల్లో భారతీయ రాజ్యాలేర్పడ్డాయి. రెండువేల సంవత్సరాలుగా జరిగిన విదేశీ దురాక్రమణ ప్రముఖంగా రాజకీయానికి సంబంధించిందే.చివరి వేయి సంవత్సరాల్లో మాత్రం రాజకీయాలతో పాటు మత సంబంధం కూడా ఉంది. దురాక్రమణదారులు భారతీయుల అనేక మందిరాలను, విద్యాలయాలను గ్రంధాలయాలను దోచుకోవటం, నాశనం చేయట చేసారు. స్త్రీలను దోచుకోవడంతో పాటు మానభంగాలు చేశారు. కాని వీళ్ళ ప్రయత్నాల ద్వారా భారతీయౌలకు తమ సంస్కృతి పట్ల ఉన్న శ్రధ్ధ ఏమాత్రం తగ్గలెదు. 18వ శతాబ్ది ప్రధమార్ధంలో సంపూర్ణ భారతాన్ని రాజకీయింగా స్వతంత్రం చేయాలనే భారతీయప్రయత్నాలు ఇంకా పూర్తి సఫలం కాకముందే సముద్రమార్గం ద్వారా వ్యాపారం చేసుకోవడానికి భారతదేశం వచ్చిన ఆంగ్లేయులు సంపూర్ణ భారతాన్ని ఆక్రమించుకోవడానికి తీవ్రంగా కృషి చేసారు. క్రీ.శ. 1757 లో జరిగిన ప్లాసీ యుధ్ధంలో విజయం సాధించిన వాళ్ళు 70,80 సంవత్సరాల్లో మొత్తం భారతదేశంలో తమ రాజ్యాన్ని స్థాపించారు. ముస్లిం దురాక్రమణ దారులవలెనే ఆంగ్లేయులు కూడ స్త్రీల మీద అత్యాచారాలు జరిపి భయకంపితులను చేయటానికి ప్రయత్నించారు. దాంతోపాటే భారతీయులకు సుదీర్ఘకాలం నుండి తమ సంస్కృతి పట్ల తమ పూర్వజుల పట్ల ఉండే భక్తి శ్రధ్ధ, విశ్వాసాలను దూరం చేసే ప్రయత్నం కూడా చేసారు. ఈ పనిని వాళ్ళు ప్రముఖంగా 19 వ శతబ్దం మధ్య కాలం నుండి తాము స్వయంగా స్థాపించిన విద్యాలయాల ద్వారా చేసారు. అంతకు పూర్వం జరిగిన అత్యాచారాల కారణంగా భారతీయులు ఇదివరకే ధర్యం కోల్పోయి ఉన్నారు. ఆంగ్లేయుల సామ్రాజ్య నిర్మాణ శక్తిని, వాళ్ల సాధన సంపత్తిని చూసి ఇంకా వాళ్ళ ప్రభావానికి లోనైనారు. ఉద్యోగాల దృష్టి తో లాభదాయకంగా ఉన్న వాళ్ళ విద్యా విధానం కూడా భారతీయులను మానసికంగా వాళ్ళకు బానిసలుగా అయ్యేట్లు చేసింది. ఆంగ్ల విద్యాభ్యాసం ద్వారా భారతీయుల సాంస్కృతిక నిష్ట క్రమంగా తగ్గిపోయింది. వాళ్ళలో భోగలాలస పెరిగింది. "వివాహోన విలాసార్ధం, సంతానార్ధం చ కేవలం ' అన్న పూర్వపు భావన క్రమంగా మారిపోయి ససంభోగ సుఖ వాంచయే వివాహ లక్ష్యమైంది. ఆర్యత్వ లక్షణాలు తగ్గిపోయాయి. ఈ భోగ సంస్కృతి ప్రభావానికి గురైన ఈనాటి యువకులు నా తల్లి నాకు జన్మనిచ్చింది అని కాక, "నేను పుట్టాను, నా తల్లితండ్రుల భోగవాంచకు ఫలితమే నా పుట్టుక" అని అంటున్నారు. స్వతంత్ర భారతదేశంలో మాతృశక్తి మహత్వం తెలియని కారణం గానే ఇలాంటి వాతావరణం నిర్మాణమైంది. ఇది పూర్తిగా వికృతి లక్షణం.

(ఇంకా ఉంది )

No comments:

Post a Comment