Tuesday 23 August 2016

మాతృశక్తి 26

వ్యక్తి వ్యక్తిలో సంస్కార నిరమాణం చేసే కార్యం చేయటానికి భారతీయులు స్వయంగానే ముందుకు రవాలి. మాతృశక్తి విషయంలో ఆలోచనా ధోరణిలో వచ్చిన వికృతిని తొలగించడానికి స్వయంగా సంస్కృతి, మాతృశక్తి విషయాన్ని సమగ్రంగా తెలుసుకొని ఇతరులకు తెలియచేసే ప్రయత్నం చేయాలి. ఈ విషయంలో కేవలం స్త్రీలను జాగృతపరచటమే కాక సంపూర్ణ సమాజం యొక్క ఆలోచనా ధోరణిలో మార్పు రావటం అవసరం. ఏ సమాజంలోనైనా స్త్రీకి లభించే గౌరవాన్ని బట్టే ఆ సమాజం యొక్క శ్రేష్టత్వం ఆధారపడి ఉంటుంది. కాని కేవలం అధికారాల కోసం పోరాటం జరుపుతుంటేనే స్త్రీలకు సమాజంలో గౌరవస్థానం లభించదు. మాతృశక్తి పరిజ్ఞానం స్వయంగా పొంది కర్తవ్య నిష్టతో స్వంత ఆచరణ ద్వార స్త్రీ పురుషులతో సహా సంపూర్ణ సమాజాన్ని ఈ మార్గంలో జాగృతపరచాల్సిన అవసరం ఉంది. " నాకంటే శ్రేష్టురాలు ఇంకెవరూ లేరు...ఎందుకంటే నను సర్వశ్రేష్ట వ్యక్తులకు తల్ల్లిని. నేను నిష్కామ భావంతో ప్రతిఒక్కరికీ సేవ చేసే తల్లిని. " ఇలాంటి ఉత్తమభావనను  తల్లి కలిగి ఉంటుంది. ఆమె హృదయ పవిత్రతకు ప్రబల నిదర్శనం ఇది. మాతృశక్తి యొక్క మూలతత్వం ఇదే. సృష్టి య్క్క శాశ్వత సత్యాలతో నిండిన భారతీయ సంస్కృతి సొంతం అవడం వల్ల మన దేశం స్థిరంగా ఉంది. ఇందులోని రహస్యం మాతృశక్తిని గౌరవించడం, దాన్ని సద్వినిఓగపరచడం లాంటి భావాలు ప్రజలందరి హృదయాలను స్పందింపచేసి మళ్ళి ఒకసారి మొత్తం సమాజం మాతృశక్తి భావనతో ఉవ్వెత్తున లేచి నిలబడినప్పుడే సమాజంలో స్త్రీకి మళ్ళి పూర్వపుగౌరవం లభిస్తుంది. భారతాజాతి కూడా కోల్పోయిన తన స్వాభిమానాన్ని తిరిగి పొంది శక్తివంతమైన, సుదృఢమైన జతిగా అవతరించి ఈ క్రింది విధంగా మాతృభూమికి వందనం చేస్తుంది.

"పూజనీయే ఆధారభూతే మాతృశక్తే
నమోస్తుతే, నమోస్తుతే, నమోస్తుతే."


******************************సమాప్తం********************************




No comments:

Post a Comment