Thursday 18 August 2016

విదురనీతి 70

అనురాగ హృదయం గల ప్రభువు ప్రజల ఆదరానికి పాత్రుడౌతాడు. ప్రభువు పుష్పిత వృక్షం వలే ప్రసన్నుడై ఉండాలే కానీ, అధిక ఫలాలనందివ్వకూడదు. మనఒవాక్కాయ కర్మలతో ప్రజలకు సంతోషం కలిగించే ప్రభువు ప్రఖ్యాతుడౌతాడు. రజుచేసే దుష్కర్మలు రాజ్యాన్ని చిన్నాభిన్నం చేస్తాయి. పరంపరాగతంగా సజ్జనులాచరించే మార్గాన నడిచే మహీపాలునిక్కీ సిరిసంపదలతో రాజ్యం వృధ్ధిపొందుతుంది.

దరిద్రునకు ఆకలి ఎక్కువ .  ధనికుడికి జీర్ణ శక్తి తక్కువ. అధముడు జీవితానికీ, మధ్యముడు మృత్యువుకూ, ఉత్తముడు అవమానానికీ భయపడతారు. సురాపాన మదం, ఐశ్వర్యం కలిగించే మదం కంటే ఎక్కువేమీ కాదు. ఐశ్వర్యమత్తుడు సంపదలు నశిస్తేనే కానీ ఆ మత్తును వదలలేడు . జితేంద్రియుడు శుక్లపక్ష చంద్రునివలే వృధ్ధిపొందుతాడు.

***********************************************************************

ధర్మప్రభోధం

భారతంలో లేనిది ఈ ప్రపంచంలో లేదు. ప్రపంచంలో లేనిదేదీ భారతం లేదు. ఒకసారి చెప్పినది మరల మరల చెప్పను అన్నాడు. నిధిల ధర్మశాస్త్రము, సర్వసక్షణ సారము, నీతివంతమైన ఈ భారతం పంచమవేదం అని ప్రశస్తి పొందినది ఇందుకే... జ్ఞాభిలాషులు, ధర్మతత్పరులు, నీతికోవిదులు, ఇంకా ఇంకా తెలుసుకోవాల్ని ఆశిస్తారు. "వ్యాసో, నారాయణో హరి:" అన్న ఆ పరమాత్మ వ్యాసుని రూపంలో మనకందించిన మహాద్భుత మధురానందకర దివ్యప్రబంధము "మహాభారతం".

ధర్మాత్ముడైన విదురునికి జరుగుతున్న ప్రతి సంఘటన బాధించసాగింది. చేసుకున్న పాపకర్మకు దుర్యోధనుడు, తమను అభిమానించి, ఆశ్రయించిన రాజులు, సేవకులతో పద్దెనిమిది అక్షౌహిణుల సేన తో సహా నాశనమయ్యారు. ఇప్పుడు అధర్మం నశించింది. ధర్మం జయించింది అని చెప్పాల్సి ఉంటుంది.

సంజయుని రాయబారం ధృతరాష్ట్రునికి నీతిబోధ అవుతుంది. ఆ విచారంలో ఉన్న మహారాజు మహామంత్రి విదురుని పిలిపించుకుని నాలుగు మంచి మాటలు చెప్పమంటే ధర్మప్రియుడైన విదురుడు ధర్మబధ్ధంగా చేయవలసిన విధివిధానాలను నీతిదాయకంగా చెప్తాడు.

తదుపరి శ్రీకృష్ణుడు పాండవుల తరఫున రాయబారిగా వస్తాడు. ఆయనకు సాదరస్వాగతం లభిస్తుంది. దుర్యోధనుడు విడిది ఏర్పాటు చేస్తానంటే "అవసరంలేదు ! అయినా రాయబారులు రాజభవనాలలో ఉండకూడదు అని, విదురుని ఇంటికి వెళతాడు..అప్పుడు విదురుడు శ్రీకృష్ణునితో

"దేవదేవా! నీ ప్రయత్నం ఫలిస్తుందనే వచ్చావా?" అని అడుగుతాడు.

(ఇంకా ఉంది ) 

No comments:

Post a Comment