Thursday 18 August 2016

విదురనీతి 68

మహాభారతంలో కర్ణుదు "నేనొక సూతపుత్రుణ్ణీ...హీనకులజుణ్ణి" అని తలపోతూ వ్యతిరేక దృక్స్పథంతో అన్వయిస్తూ మహాభారతం పొడుగునా విచార భారంతోనే గడిపాడు. మరి.. అదే కథలోని మరో పాత్ర విదురుడు. అతను ధృతరాష్ట్రుడికి తమ్ముడే అయినా దాసి పుత్రుడు. అయిదూళ్ళు కాదుకదా అయిదంగుళాల రాజ్యభాగానికి కూడ అర్హతలేని వాడు. కానీ ఇవేవీ విదురుడి సహజస్థితికి విఘ్నం కలిగించలేదు. కారణం అతను వేతినీ వ్యతిరేక దృష్టితో చూడలేదు. ఆత్మన్యూనతతో బాధపడుతూ, దాసీపుత్రుణ్ణని దండోరా వేసుకోలేదు. ధర్మ నిరతితో మెలిగాడు. దయాగుణంతో ఎదిగాడు.

తోటివారితో, సమస్త జీవరాసులతో ప్రకృతితో అనుసంధానం కావాలి. పవిత్ర సహజీవనాన్ని అలవరచుకోవాలి. అప్పుడు ఎవరో మంత్రించి మాయం చేసినట్లు "మనో మాయా భూతం" క్షణంలో అదృశ్యమైపోతుంది.

ఇళ్ళకు నిప్పుపెట్టేవాడూ, విషం త్రాగించేవాడూ, జారులవల్ల కలిగిన సంతాన ధనం తినేవాడూ, సోమరసం విక్రయించేవాడూ, శస్త్రాలు నిర్మించేవాడూ, మొసగాడూ, మిత్రద్రోహీ, పరస్త్రీలంపటుడూ, భ్రూణ హత్యలు చేసేవాడూ,గురుపత్నిగామీ, సురాపానం చేసే విప్రుడూ, కర్కశ స్వభావం గలవాడూ, వేదనిందకుడూ, గ్రామ పురోహితుడూ, కాకివలే అరచేవాడూ శరణార్థులను వధించేవాడూ, బ్రహ్మహత్యా పాతకుడూ...సమానులే...

ఇతరుల విషయంలో పరుషప్రసంగాలు చెయ్యనివాడు, చేయించనివాడు ఇతరులచేత అవమానితుడై కూడా ప్రతీకారాన్ని తలపెట్టనివాడూ, అవమానమూ పొందికూడా ఇతరులపై ప్రతీకార చర్యలకు సాహసించని వాడూ, మరణించిన తర్వాత స్వర్గానికి వెళతారు ..ఆ సమయంలో అతనికి దేవతలు స్వాగతం పలుకుతారు. వాక్కు ఎప్పుడు ఉత్తమైనదీ? మౌనం కంటే ప్రియంగా ఉన్నప్పుడూ, ధర్మ సమ్మతం కూడా అయినప్పుడు వాక్కు ఉత్తమమైనది. మానవుడు తాను ఎవరిని సేవిస్తాడో ఏ పరిసరాలలో మెలగుతుంటాడో ఎటువంటి పరిణామం వాంచిస్తాడో అది తప్పక పొందుతారు.

కొందరు మూర్ఖులు తాము చెప్పేది తప్పైనా ఒప్పుకోక అడ్డదిడ్డంగా వాదిస్తుంటారు. అటువంటి సమయంలో మౌనం వల్లనే భద్రత, రక్షణ, శుభం కలుగుతాయి.

ఒక కార్యం చేయబోయే ముందు దాని వల్ల సిధ్ధించే ప్రయోజన అప్రయోజనాలను ముందుగానే నిర్ణయించుకోవాలి. అసాధ్యాల్ కోసం కృషి చెయ్యడం అనవసరం...అది తెలిసి కూడా కృషి చేస్తే అది వ్యర్థమే కదా.. అనవసరంగా కోపించే వాడిని, అకారణంగా సంతోషించే వానిని ప్రజలు రాజుగా గ్రహించరు.

(ఇంకా ఉంది )

No comments:

Post a Comment