Sunday 1 March 2015

పూర్వం నీతి పద్యాలూ, శతకాలు, పురాణాలు-ప్రబంధాలలోని పద్యాలు పిల్లల చదువులలో భాగం గా ఉండేవి. పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు కూడా పాఠం మధ్యలో ప్రహ్లాదుడు, ధ్రువుడు వంటి వారి గురించి పిల్లలకు చెప్పేవారు. చరిత్ర పాఠాలలొ, మన దేశ సంస్కృతీ, ఔన్నత్యాల గురించి చెప్పేవారు. ముఖ్యంగా మహిళల గొప్పదనాన్ని గురించిన పాఠాలు ఉండేవి. ఇక ఇంటికి వస్తే, తాతలు, అమ్మమ్మలు రాత్రిపూట పక్కన పడుకోబెట్టుకుని, మంచి మంచి నీతి కధలు, కబుర్లు చెప్పేవారు.... ఇవన్ని పిల్లలను మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులుగా తీర్చి దిద్దడానికి దోహదం చేసేవి. ఇప్పుడు మరి మనం ఎం చేస్తున్నాం? పసి పిల్లలకు అన్నం పెట్టడం కూడా టీవీ ముందే. వాళ్ళ కాలక్షేపం బొమ్మలు, బొమ్మల పుస్తకాలతో కాకుండా, ఆండ్రాయిడ్ ఫోన్స్ ఇచ్చేసి, మన పనులకు అడ్డం రాకుండా చేస్తున్నాం. ఇక కాస్త పెద్ద పిల్లలు ఇంట్లో వాళ్ళ వాళ్ళ గదుల్లో కూర్చుని, ఇంటర్నెట్ చూస్తున్నారో, చదువుకుంటున్నారో, అడుకుంతున్నారో చూసే తీరిక మనకు లేదు. వాళ్ళ మిద ఒక కంట్రోల్ లేదు. ఏదన్న అంటే, వాళ్ళ ప్రైవసీ కి మనం అడ్డు రాకూడదు అని పాఠాలు. ప్రైవసీ ఎవరికీ ఇస్తారు? మన ఇంట్లో మన చెప్పుచేతల్లో పెరగ వలసిన పిల్లలకు ప్రైవసీ ఏంటి? మన పెంపకం ఎలా ఉంటె, వాళ్ళ పెరుగుదల అలాగే ఉంటుంది. ఇప్పుడు వస్తున్నా టెక్నాలజీ ని మనం ఎలాగు ఆపలేము. కానీ వీలు ఉన్నప్పుడల్లా, మన పురాణాలూ, పురాణ పురుషుల గురించి, నీతి కధలు, బాలల కధల గురించి, మీ పిల్లలకు చెప్తూ ఉండండి... వారి మనసులు చిన్నతనం లోనే కలుషితం కాకుండా చూసే బాధ్యత తల్లి తండ్రుల పైననే ఉంది. ఇది వంద శాతం నిజం. ఇప్పుడు మనం చూస్తున్న ఈ భయంకరమైన సమాజం ఇంకా భ్రష్టు పట్టకుండా వుండాలంటే, మన విద్య విధానం తప్పనిసరిగా మారాలి. అది మన చేతులలో లేదు. ప్రభుత్వానికి ఇవన్ని చూసే తీరిక లేదు. అందుకే దయచేసి, తల్లితండ్రులారా! ముందు మీరు మారండి. మీ సంతానానికి మంచి మార్గదర్శకులు అవ్వండి. ఒక మంచి సమాజాన్ని నిర్మించడానికి సహకరించండి.

No comments:

Post a Comment