Sunday 1 March 2015

ప్రపంచానికి కృష్ణ భగవానుడు స్వయంగా అందించిన ఒక గొప్ప సందేశం భగవద్గిత. ప్రతి కాలానికి, ప్రతి వర్గానికి సరిపడే సందేశాలు, ప్రతి సమస్యకు పరిష్కారాలు దొరికే అత్యుత్తమ గ్రంధం ఇది. భారతీయులే కాకుండా ఎంతోమంది విదేశీయులు ఈ గీత ను చదివి ఉత్తమ సంస్కారాన్ని పొందుతున్నారు. అనేక ఇంటర్వ్యూ లలో వారికి దిశానిర్దేశం చేసినది భగవద్గిత యే నని ఎంతో మంది మేధావులు చెప్పారు. ఎన్ని సార్లు చదివితే, అంత మన:శాంతిని ఈయగల ఏకైక గ్రంధం ఇది. చిన్నతనం నుంచి నేరుచుకొనే అవకాశం ఎలాగు ఉండటం లేదు. కనీసం కొంత వయసు వచ్చాక అయినా ఈ భగవద్గీత ను చదివి అర్ధం చేసుకునే ప్రయత్నం అందరూ చేయాలి. ఈ పరమోత్క్రుష్టమైన గ్రంధాన్ని చదవడం ఎప్పుడో మానేసిందే కాక, ఇంట్లో ఎవరైనా మరణించినపుడు ఈ భగవద్గిత రికార్డు పెడుతున్నారు. ఎవరైనా ప్రముఖులు మరణించి నపుడు కూడా టీవీ లలోను కూడా ఇదే రికార్డు వేస్తున్నారు. ఫలితంగా భగవద్గిత చావు ఇంట్లో చదివేది అనే ఒక ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఈ తరం పిల్లలు, ఏ గుడిలోనో, అమ్మవారి, వినాయకుడి మండపల్లోనో, భగవద్గిత రికార్డు వేసినపుడు, ఇదేంటి, ఇక్కడ ఎవరు పోయారు, ఇప్పుడు భగవద్గిత ఎందుకు వినిపిస్తున్నారు అని అడిగే పరస్థితి వచ్చింది. ఇది ఎంతో విచారించవలసిన విషయం. పూర్వం ఎప్పుడో, ఎక్కడో, ఎవరో మరణించినపుడు, ప్రశాంతత కోసమో, లేక వేరే ఇంకే ఉద్దేశ్యంతోనో భగవద్గిత రికార్డు వేసి ఉంటారు. ఇప్పుడు అది ఎవరూ చెప్పని ఆచారం గా మారిపోయింది. దయచేసి, ఈ పవిత్ర గీతకు అటువంటి హోదాను అంటకట్టకండి. ఇకమీదట ఎవరైనా అలా చేసినా దయచేసి విజ్ఞులు ఖండించండి. మానవ మానసిక ఉన్నతికి తోడ్పడే ఇటువంటి గ్రంధ పారాయణ మీరు చేయండి. చేయించండి. మన:శాంతిని పొందడానికి ఉత్తమమైన మార్గం గీతను చదివి అర్ధం చేసుకొని, అందులో విషయాలను పాటించడమే.
****"భగవద్గీత కేవలం మరణము ఆసన్నమయినపుడో, మరణించిన తరువాతో వినిపించవలసిన గ్రంధం కాదు. దయచేసి గమనించండి. మీ దృష్టికి ఇటువంటి విషయం వచ్చినపుడు ఖండించండి. "****

No comments:

Post a Comment