Sunday 1 March 2015

ఈరోజు మార్గశిర శుద్ధ ఏకాదశి. ... గీతా జయంతి. పవిత్ర భారత దేశం లో పుట్టే భావి తరాల ప్రజల ఉద్ధరణ కోసమై భగవానుడు అర్జునుడి వంక పెట్టి మనకు అందించిన అత్యద్భుత సందేశం. భారతీయులమైన మనం దీని గొప్పతనాన్ని మర్చిపోయినా, విదేశాల వారు గుర్తించి, చదివి, ఆచరించి ఎన్నో లాభాలు పొందుతున్నారు. ప్రతి యుగం లోనూ, ప్రతి వయసుకూ, ప్రతి వ్రుత్తి, వ్యాపారా ఉద్యోగాలలో, నిత్య జీవితం లో ఎదురయ్యే సమస్యలకు, విషమ పరీక్షలను తట్టుకునే మనోస్తైర్యం ఇచ్చే బృహత్తర గ్రంధం ఈ భగవద్గిత. ఇది మన భూమిపై పుట్టినందుకు మనం గర్వించాలి. చిన్నప్పటి నుంచి చదివి అర్ధం చేసుకుంటే, మన భావి జీవితం ఎంతో సుఖమయం ఔతున్ది. అరిషడ్వర్గాలను జయిచే సాధన అలవడుతుంది. అయితే, ఇటువంటి బృహత్ గ్రంధాలను ఒకసారి చదివితే ఏమాత్రం అర్ధం కావు. పదే పదే చదవడం వలన, ఎన్ని సార్లు చదివితే అన్ని కొత్త అర్ధాలు గోచరిస్తాయి. దయచేసి, ఈ గ్రంధాన్ని, చిన్న వయసు నుంచి చదవటం అలవాటు చేసుకుని, అర్ధం చేసుకుని ఆచరించ ప్రార్ధన. ఇప్పటికిప్పుడు చదవాలని మనసు లేకపోతే, ఈ గ్రంధాన్ని ఎల్లవేళలా కంటికి కనపడేటట్లు ఎదురుగా పెట్టుకోండి. కొన్నాళ్ళకు చదవాలని జిజ్ఞాసా పెరుగుతుంది.
ఓం నమో భగవతే వాసుదేవాయ...

1 comment: