Sunday 1 March 2015

గమనిక..... ఈ పోస్ట్ నా సొంతం కాదు. ఒక కరపత్రం లోని సారాంశం. బాగుంది అని పోస్ట్ చేస్తున్నాను. ఇది వ్రాసిన వారికీ నమస్కారాలు.
ప్రపంచం లో ఒక్క తేనెటీగ కూడా లేకుండా పోతే, ఈ భూమి మిద మనుషులందరూ కేవలం నాలుగేళ్ళలో మరణిస్తారు. ఈ మాటలన్నది ఎవరో కాదు. ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్ స్టీన్. తేనెటీగల అవసరం మనకు అలాంటిది. తేనెటీగల కారణంగా ప్రపంచం మొత్తం మిద ఉత్పత్తి అవుతున్న ఆహారం విలువ ఎంతో తెలుసా? 215 బిలియన్ డాలర్లు. అదేంటి? తేనెటీగల వలన వచ్చేది తేనే ఒక్కటే కదా అంటారా? వీటి వల్ల రకరకాల ఆహార పదార్ధాలలో మూడో వంతు లభిస్తోంది. ఈ వంతు ఆహారాన్ని సమకూర్చడానికి వెనుక కనీసం 6 లక్షల తేనెటీగల శ్రమ ఉంది.
తెనేతీగాలకీ, పంత్గాలకీ సంబంధం ఏమిటనే సందేహమా? పుప్పొడి వ్యాప్తి చెందితేనే, పుష్పాలు ఫలదీకరణం చెందుతాయి అని తెలిసినదే. మన ఆహారం లో ఆపిల్స్, పైనపిల్స్, పుచ్చకాయలు, స్త్రబెర్రీలు, మామిడి పళ్ళు, వాటితో తయారు చేసే జం లు, జెల్లీలు, అలాగే, గోధుమలు, రాగులు, సోయాబీన్స్, బఠానీలు, బాదాం పప్పులు, మొక్కజొన్న, చెర్రీలు లేకుండా మనం ఉండగలమా? తేనెటీగలు ఉండకపోతే ఇవన్ని ఉండవు మరి. తేనెటీగలు తేనే సేకరణ లో భాగంగా ఒక పువ్వు పై నుండి, మరొక పువ్వు పై వాలి పుష్పాలు ఫలదీకరణ చెందటం లో సహాయం చేస్తాయి.
అయితే, ఇప్పుడు తేనెటీగలు తప్పిపోతున్నాయి. ప్రపంచం అంతా కంగారు పడుతున్న విషయం ఇది. పట్టు వదిలి తేనే కోసం బయటికి వెళ్ళిన చాలా తేనెటీగలు తిరిగి వెనక్కి రావడం లేదట. దాంతో తేనెపట్టులో ఉండే వాటి పిల్లలకు ఆహారం అందక చనిపోతున్నాయి. ప్రప్రంచ వ్యాప్తంగా కోట్లాది తెనేపత్తులు ఇలా ఖాళీ అయిపోతున్నాయి. అమెరికా, యూరప్ దేశాలలో మరీ ఎక్కువగా ఉంది.
(ఇంకా ఉంది)

No comments:

Post a Comment