Sunday 1 March 2015

ఈరోజు కన్ను మూస్తే రేపటికి రెండు. ఈ లోకం లో పుట్టిన వాడెవ్వడూ శాశ్వతం గా ఇక్కడ ఉండిపోయి భోగాలు అనుభవించలేదు. పుట్టిన ప్రతివాడూ చావవలసిందే. స్వర్గం నరకం మాట తరువాత. మనం ఎలా జివిస్తామో, దాన్ని బట్టే మనకు ఈ భూమి మిద గౌరవ ఆదరాలు దొరుకుతాయి. మన మనసు, మాట స్వచ్చం గా ఉంటేనే, మనను ముందు వెనుక కూడా గౌరవిస్తారు. లేదంటే, ముందు మెచ్చుకున్నా, వెనుక తిట్టుకుంటారు. ఈ విషయం అందరికీ తెలుసు. మాట కు ఖరీదు ఏమి చెల్లించక్కరలెదు. హృదయం లోనుంచి వచ్చే మాట ఎదుటివారికి సంతోషాన్ని ఇస్తుంది. జీవితం లో ఏమాత్రం పనికిరాని విషయాలలో అబద్ధాలు ఆడి, అవాకులు, చెవాకులు మాట్లాడడం వల్ల ఈరోజు బాగానే గడిచిపోవచ్చు, కానీ, మీ హృదయానికే తెలుస్తుంది తప్పు ఎక్కడ ఉందొ! పక్క వాళ్ళకు కూడా మీ మీద గౌరవం పోతుంది. అశాశ్వతమైన విషయాల కోసం, శాశ్వతమైన గౌరవాన్ని పోగొట్టుకోకండి. మనం పోయినా, మన మాట ముందు తరాలు మంచిగా చెప్పుకోవాలి. అది జీవితానికి సార్ధకత. అబద్ధాలతో, ఒకరి మిద చాడిలతో, ఇతరుల మనసు గెల్చుకోలేరు. గుర్తుంచుకోండి.

No comments:

Post a Comment