Sunday 1 March 2015

శ్రీ మోడీ గారిని ఒక మహిళా అడిగిన ప్రశ్న , దానికి మోదిజీ ఇచ్చిన జవాబుకు తెలుగు అనువాదం. మిత్రుల కోరిక మిద పోస్ట్ చేయడమైనది.
ప్రశ్న:
మీరు భవిష్యత్ భారతాన్ని దర్శిస్తున్నారు కాదా? మీరు భారత దేశాన్ని పూర్తీ స్థాయి హిందూ దేశం గా ఊహిస్తారా? లేక అందులో ముస్లిములకుకూడా స్థానం ఉందా?
మోడీ గారి జవాబు.
ఈ ప్రశ్న హిందూ మరియు హిందుత్వ ను అర్ధం చేసుకోలేని వాళ్ళు వేసే ప్రశ్న. హిందుత్వ ఏమి చెప్తుంది" "ఏకం సత్ విప్రం బహుధా వదంతి". సత్యం ఒక్కటే, దానిని తెలుసుకొనే, తెలియపరిచే మార్గాలు వేరు వేరు. ప్రపంచం లో ఒక్క హిందూ మాత్రమె భగవంతుడు ఒక్కడే అని చెప్తాడు. హిందువుగా పుట్టిన వాడు ఎవ్వడూ,క్రిస్టియన్ ల దేవుడు, ముస్లిముల దేవుడు, సిక్కుల దేవుడు అని చెప్పదు. భగవంతుడు ఒక్కడే అని చెప్తాడు. భక్తుడు ఎలా ఊహిస్తే, భగవంతుడు అలా కనిపిస్తాడు. ఒక పహిల్వానుకు హనుమంతుడు దేవుడు. ఎక్కడైతే భగవంతుడు ఒక్కడే అనే సిద్ధాంతం పుట్టిందో, ఈరోజు ఇక్కడ ఇటువంటి ప్రశ్నలు ఉదయించడానికి కారణం, మనం హిందుత్వను అర్ధం చేసుకోలేక పోవడమే. ఇజ్రాయెల్ యొక్క అధికారిక గ్రంధం లో ఇలా వ్రాయబడి ఉంది. " మా మీద ఒక్క జర్మనీ ఏ కాదు, ఈ 2500 సంవత్సరాలలో, ప్రపంచం లో ఎ మూల కు వెళ్ళినా, మా మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఒక్క భారత దేశం లోనే గత 2500 సంవత్సరాలలో మా మీద దాడులు, అత్యాచారాలు జరగలేదు. "
పార్శీలు మన దేశానికి వచ్చినపుడు గుజరాత్ తీరానికి వచినపుడు , గుజరాత్ లో రాజుల పాలన ఉండేది. వారు తమతో తీసుకువచ్చిన అగ్ని ని ఒకచోట స్థాపించి, మా సంప్రదాయం ప్రకారం, ఈ అగ్నిని స్థాపించిన చోటుకు 50 కిలోమీటర్ల పరిధిలో ఇరానియన్ కాని వారు ప్రవేశించడానికి వీలు లేదు అని చెప్పారు. అప్పుడు ఉన్న రాజులూ హిందువులు. అప్పుడు ఉన్న సమాజం హిందూ సమాజం. కానీ వారు చేసిన డిమాండ్ మాత్రం హిందూ వ్యతిరేక డిమాండ్. కాని మన రాజులూ దానిని వ్యతిరేకించలేదు. మీ సంప్రదాయాన్ని, మీ విశ్వాసాలను గౌరవిస్తాము అని భరోసా ఇచ్చి, వారి కోరికను మన్నించి, అందుకు తగిన ఏర్పాట్లు చేసారు. అటువంటి దేశం ఈనాడు, తీవ్రవాదం అనే కోరల్లో చిక్కుకుంది. ఈ అంశంలో ఎమోషనల్ సపోర్ట్ ఉందొ లేదో తెలియదు కానీ, ఎమోషనల్ బ్లాకు మెయిలింగ్ మాత్రం బాగా జరుగుతోంది. ఇక్కడ మతం అనేది బాగా ఉపయోగపడుతోంది. దానికి కారణం మీ మతం కన్నా, మా మతం గొప్పది అనే బావన. ఎక్కడ ఈ భావన జనిస్తుందో, అక్కడ సంఘర్షణ మొదలవుతుంది. ఈ సంఘర్షణ తీవ్రవాదం వరకు వెళుతుంది. హిదువులు సర్వమత సహనం కలవారు. అన్ని మతాలను గౌరవించే వాళ్ళు. ఎవరైనా, మీరు పూజించేది ఎ దేవుదినైనా, విశ్వాసం తో పూజించండి, మీకు పరమాత్మ సాక్షాత్కారం అవుతుంది అని కానీ, మీరు ఎ మత గ్రంధాన్ని చదివినా, పాటించినా విశ్వాసం తో చేయండి అని చెపితే, వాడు ఖచ్చితంగా హిందువే. ఎందుకంటే మౌలికంగా ఇది హిందుత్వ సిద్ధాంతం. కానీ, ఎవరైతే ఈ సిద్ధాంతాన్ని అర్ధం చేసుకోలేదో, ఈ విషయంపై సందేహాలు లేవనేత్తుతారో, వారి వల్లే సమస్య ఉత్పన్నం అవుతుంది అని నేను భావిస్తున్నాను.

No comments:

Post a Comment